అన్వేషించండి

Khammam Bhudan Lands Dispute:వినోబా ఆశయం-సామాన్యుడి ఆశను రియల్ భూమ్‌ చంపేస్తోందా? ఖమ్మం నిర్వాసితుల కథ ఏం చెబుతోంది?

Khammam Bhudan Lands Dispute:కొందరిది మహోన్నత ఆశయం, మరికొందరిది జీవిత కల, ఇంకొందరిది వ్యాపార బుద్ధి, ఇలా రకరకాల ఆలోచనలో ఖమ్మం రగిలిపోతోంది. ఇందులో రాజకీయం జోక్యం చేసుకోవడంతో వివాదం మరింత ముదురుతోంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల వివాదం, పేదల ఇళ్లను కూల్చివేత.
  • వినోబా భావే ఆశయంతో పేదలకిచ్చిన భూమి, రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మారింది.
  • కోర్టు ఆదేశాలతో, భూముల విలువ పెరగడంతో ప్రభుత్వం స్వాధీన చర్యలు చేపట్టింది.
  • ప్రతిపక్షాలు బాధితులకు అండగా నిలబడ్డాయి, ప్రభుత్వ చర్యలను విమర్శించాయి.

Khammam Bhudan Lands Dispute: గత  కొన్ని రోజులుగా ఖమ్మం శివారు వెలుగుమట్లలోని వినోభా నవోదయ కాలనీ వార్తల్లో మార్మోగుతోంది. పదిహేను సంవత్సరాలకుపైగా నివాసం ఉంటున్న పేదల ఇళ్లు, గుడిసెలను ప్రభుత్వం భారీగా పోలీసులను మోహరించి రాత్రికి రాత్రే ఖాళీ చేయించడం సంచలనంగా మారుతోంది. అడ్డుకునేందుకు బాధితులు చేసిన నిరసన సైతం ఎలాంటి ప్రయోజనం ఇవ్వలేదు. ఈ చర్యపై అన్ని వర్గాల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.  ఇప్పుడా బాధితులకు తాము అండగా ఉన్నామని ప్రతిపక్షాలు ముందుకొస్తున్నాయి. నేడు(గురువారం) బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా బాధితుల పరామర్శకు వెళ్తున్నారు. ఇంతకీ అసలేంటీ భూదాన్ భూముల వివాదం, ఇంత దుమారం రేగడానికి కారణమేంటో చూద్దాం.

వినోబా భావే ఆశయంతో మొదలై...రియల్ భూంకి బలై!

దశాబ్దాల క్రితం ఆచార్య వినోబాభావే దేశవ్యాప్తంగా చేపట్టిన భూదాన్ ఉద్యమంతో స్పూర్తి పొందిన కొందరు దాతలు వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలోని సుమారు 31 నుంచి 60 ఎకరాల తమ భూమిని పేదలకు పంపిణీ చేయమని ప్రభుత్వానికి ఇచ్చారు. భూమి లేని నిరుపేదలకు ఒక గూడు దొరుకుతుందన్నది వారి ఆశయం. అయితే భూదాన్ బోర్డు పేరుతో స్థలం ఉన్నప్పటికీ అధికారికంగా ఎవరికీ ఈ స్థలంలో పట్టాలు కేటాయించలేదు. కాలక్రమేణా ఖమ్మం పట్టణం విస్తరించడం, నగరంలో కొత్త కలెక్టరేట్ కూడా ఈ ప్రాంతానికి అత్యంత సమీపంలోనే నిర్మాణమవడంతో ఇక్కడి భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఏళ్ల క్రితం ‘దానం’గా వచ్చిన భూమి ఇప్పుడు కోట్ల రూపాయల 'బిజినెస్‌'గా మారిపోయింది.

వివాదం ఎక్కడ మొదలైంది? ఇప్పుడెందుకు రగులుతోంది?

గత 10 ఏళ్లకుపైగా 'వినోబా నవోదయ కాలనీ'పేరుతో సుమారు 600 నుంచి 1,000 కుటుంబాలు అక్కడ గుడిసెలు, రేకుల ఇళ్లు వేసుకుని నివసిస్తున్నాయి. వీరికి మున్సిపల్ అధికారులు నల్లా కనెక్షన్లు ఇచ్చారు, విద్యుత్ శాఖ మీటర్లు బిగించారు. అంతేకాదు, గత ఎన్నికల సందర్భంగా ఇక్కడ ఓట్లు కోరిన రాజకీయ నాయకులు వారికి పట్టాలు ఇస్తామనే హామీలు కూడా ఇచ్చారు. కానీ భూదాన్ బోర్డు నుంచి ఈ భూమి ఎవరికీ అధికారికంగా కేటాయించలేదనీ, కొందరు దళారులు నకిలీ పత్రాలతో ఇక్కడ పేదలను చేర్పించి లక్షల రూపాయలు వసూలు చేశారని ప్రభుత్వం, రెవెన్యూ అధికారుల వాదన.

ప్రస్తుత ఉద్రిక్తతలకు రెండు ప్రధాన కారణాలు.. భూదాన్ బోర్డు ఆస్తులను రక్షించడంలో విఫలమైతే అధికారులదే బాధ్యత అని హైకోర్టు ఘాటుగా స్పందించింది. దీంతో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగి స్థలం స్వాధీనం చేసుకోవాలనే చర్యలు చేపట్టింది. ఇది ఒకవైపు నుంచి వినిపిస్తున్న వాదన. ఈ భూమికి కేవలం 500 మీటర్ల దూరంలోనే కొత్త కలెక్టరేట్ నిర్మాణం జరగడంతో, ఇక్కడి భూమి విలువ ఎకరాకు ₹10 కోట్లకుపైగా పెరిగింది. మొత్తం భూమి విలువ సుమారు రూ 250 నుంచి 300 కోట్లు కావడంతో అధికార యంత్రాంగం దీనిపై కన్నేసిందన్న విమర్శ రెండోది.

ఈ వాదనలు ఇలా సాగుతున్న టైంలోనే ఈనెల 24న పెద్ద ఎత్తున ఆక్రమణల కూల్చివేత కార్యక్రమం జరిగింది. మూడు జిల్లాల నుంచి సుమారు 1,000 మందికి పైగా పోలీసుల పహారాలో, ఎస్.డి.ఆర్.ఎఫ్ (SDRF) బృందాల సమక్షంలో డజన్ల కొద్దీ జెసిబిలతో ఇళ్లను నేలమట్టం చేశారు. మహిళలు అడ్డుకోవడానికి ప్రయత్నించినా, కొందరు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడినా యంత్రాంగం వెనకడుగు వేయలేదు. "మా ఓట్లు తీసుకునేటప్పుడు ఈ భూమి ప్రభుత్వానిదని తెలీదా?" అని బాధితులు ప్రశ్నించారు.

ఇప్పుడు పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంటోందా.. ఎన్నికలకు ముందు అన్నిపార్టీల వాళ్లూ తమకు పట్టాలిస్తామని చెప్పారు. ఇప్పుడు అధికార పార్టీ నేతలు కానీ జిల్లా నుంచే మంత్రులైన ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎందుకు మొహంచాటేస్తున్నారంటూ బాధితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.  

కేవలం ప్రభుత్వ భూమిని కాపాడుతున్నామని కాంగ్రెస్ చెబుతోంది. భూమాఫియా నుంచి భూదాన్ భూములను విడిపించడమే లక్ష్యంగా పేర్కొంటున్నారు. తమ హయాంలో ప్రభుత్వం కనీస వసతులు కల్పించగా, రేవంత్ సర్కారు ప్రత్యామ్నాయం చూపకుండా ఇళ్లు కూల్చడం అమానుషమని బీఆరెస్, వామపక్షాలు విమర్శిస్తున్నాయి. 

కారణాలేమైనా దశాబ్దాలుగా అక్కడ బతుకుతున్న పేదల జీవితాలు ఒక్కరోజులో రోడ్డున పడ్డాయి. ఉన్నట్టుండి నివాసాలు కూల్చేసి తాత్కాలికంగా ఫంక్షన్ హాళ్లలో వసతి కల్పించిన ప్రభుత్వం వారికి శాశ్వత ప్రత్యామ్నాయం మాత్రం చూపలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. నేటి రియల్ ఏస్టేట్ భూమ్‌లో పెరుగుతున్న భూముల ధరలకూ, సొంత గూడు కలకు మధ్య నలుగుతున్న పేదవాడికి పరిష్కారం చూపకపోతే ఈ వేడి ఖమ్మం నగరాన్ని మరింత రగిలించే అవకాశం కనిపిస్తోంది.

Frequently Asked Questions

ఖమ్మం భూదాన్ భూముల వివాదం ఏమిటి?

వినోభా భావే ఆశయంతో పేదలకు దానం చేసిన భూమి, రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మారి, ప్రస్తుతం వివాదానికి దారితీసింది.

ఈ వివాదం ఇప్పుడెందుకు రగులుతోంది?

హైకోర్టు ఆదేశాలు, కొత్త కలెక్టరేట్ సమీపంలో భూమి విలువ పెరగడం, ప్రభుత్వ చర్యలతో వివాదం తీవ్రమైంది.

ప్రభుత్వం ఎందుకు ఇళ్లు కూల్చివేసింది?

భూదాన్ బోర్డు భూమిని స్వాధీనం చేసుకోవాలని, దళారులు నకిలీ పత్రాలతో పేదలను చేర్పించారని ప్రభుత్వం వాదిస్తోంది.

ప్రతిపక్షాలు ఈ విషయంలో ఏమంటున్నాయి?

ప్రభుత్వం నివాసాలు కూల్చడం అమానుషమని, ప్రత్యామ్నాయం చూపకుండా ఇళ్లు కూల్చివేయడం తప్పు అని బీఆరెస్, వామపక్షాలు విమర్శిస్తున్నాయి.

టాప్ హెడ్ లైన్స్

Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Breaking News: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
Breaking News: హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
కొత్త టయోటా హైలక్స్‌ వచ్చేసింది.. 360 డిగ్రీ కెమెరా, 204hp డీజిల్‌ ఇంజిన్‌తో అదిరిపోయే పికప్‌
2026 టయోటా హైలక్స్‌ లాంచ్‌.. కొత్త లుక్‌, కొత్త ఫీచర్లతో మీ ఆదాయానికి మరింత ఊపు
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
Embed widget