అన్వేషించండి

PM SETU Scheme: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు

Andhra Pradesh News | దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలవుతోంది. ఆర్సెల్లార్ మిత్తల్, నామ్ టెక్ భాగస్వామ్యంతో విశాఖ ఐటీఐని హబ్ అండ్ స్పోక్ విధానంలో ఆధునీకరించనున్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఏపీలో పారిశ్రామిక, సాంకేతిక అభివృద్ధికి పీఎం సేతు పథకం ప్రారంభం.
  • విశాఖ ఐటీఐ ఆధునీకరణకు ఆర్సెల్లార్ మిత్తల్, నామ్ టెక్ భాగస్వామ్యం.
  • కోర్సు పూర్తయ్యాక ఉద్యోగాల లక్ష్యంతో ఐటీఐ విద్యార్థులకు శిక్షణ.
  • హబ్ అండ్ స్పోక్ విధానంతో అత్యాధునిక సాంకేతిక విద్య అందుబాటులోకి.

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా, సాంకేతికంగా మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా పీఎం సేతు (PM SETU Scheme) పథకాన్ని ఏపీలో అమలు చేసేందుకు కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ ఆమోదం తెలిపింది. వికసిత్ భారత్-2047 లక్ష్య సాధనలో భాగంగా దేశవ్యాప్తంగా ఐటీఐ (ITI) లను బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే ఏపీకి ఈ సరికొత్త ప్రతిష్టాత్మక పథకం అమలు చేసే తొలి అవకాశాన్ని కల్పించింది.

ఈ పథకం కింద విశాఖపట్నం ఐటీఐ అభివృద్ధికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖ ఐటీఐ క్లస్టర్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆర్సెల్లార్ మిత్తల్ (Arcelor Mittal) భాగస్వామ్యంతో విశాఖ ఐటీఐ రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. ఈ ఆధునికీకరణ ప్రక్రియకు ప్రముఖ విద్యా సంస్థ నామ్ టెక్ (NAMTECH) అకడమిక్ భాగస్వామిగా వ్యవహరించనుంది. దీని ద్వారా విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలు లభించనున్నాయి.

Also Read: JEE Advanced Answer Key: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఆన్సర్ కీ విడుదల, అభ్యంతరాలకు విద్యార్థులకు ఛాన్స్ 

కోర్సు పూర్తి కాగానే ఉద్యోగాలే లక్ష్యం
దేశవ్యాప్తంగా ఉన్న ఐటీఐల ఆధునీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం ఏకంగా రూ. 60 వేల కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ పీఎం సేతు (PM SETU) పథకాన్ని రూపొందించింది. ఈ పథకం ప్రధాన లక్ష్యం ఐటీఐ విద్యార్థులకు కేవలం చదువు మాత్రమే కాకుండా, కోర్సు పూర్తికాగానే తక్షణమే ఉద్యోగ అవకాశాలు కల్పించడం. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడం కోసం దీనిని డిజైన్ చేశారు.

ఈ పథకంలో భాగంగా హబ్ అండ్ స్పోక్ విధానాన్ని తీసుకురానున్నారు. ఈ సరికొత్త మోడల్ ద్వారా ఐటీఐ విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక శిక్షణ (Technical Training) అందిస్తారు. పరిశ్రమలకు నేరుగా ఉపయోగపడే అత్యాధునిక కోర్సులు, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈ విధానం ద్వారా విద్యార్థులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ చొరవతో ఏపీలోని నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. కేంద్ర ప్రభుత్వం పీఎం సేతు పథకాన్ని దేశంలో తొలిసారిగా ఏపీలోనే అమలు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. 

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

Frequently Asked Questions

పీఎం సేతు పథకం అంటే ఏమిటి?

పీఎం సేతు పథకం అనేది ఐటీఐ (ITI) లను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం. దీని ద్వారా విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలు అందించి, కోర్సు పూర్తి కాగానే ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యం.

పీఎం సేతు పథకం దేశంలో తొలిసారిగా ఎక్కడ అమలు చేయబడుతోంది?

పీఎం సేతు పథకం దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేయబడుతోంది. విశాఖపట్నంలోని ఐటీఐ అభివృద్ధికి కేంద్రం ఆమోదం తెలిపింది.

పీఎం సేతు పథకం ద్వారా విద్యార్థులకు ఎలాంటి శిక్షణ లభిస్తుంది?

ఈ పథకం ద్వారా విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక శిక్షణ (Technical Training) అందిస్తారు. పరిశ్రమలకు నేరుగా ఉపయోగపడే అత్యాధునిక కోర్సులు, ప్రాక్టికల్ నాలెడ్జ్ అందుబాటులోకి రానున్నాయి.

పీఎం సేతు పథకానికి ఎంత బడ్జెట్ కేటాయించారు?

దేశవ్యాప్తంగా ఉన్న ఐటీఐల ఆధునీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 60 వేల కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ పీఎం సేతు పథకాన్ని రూపొందించింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PM SETU Scheme: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
Kurnool Tragedy: కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
Satyasai district NH Tenders: సత్యసాయి జిల్లా హైవే టెండర్లలో రిగ్గింగ్ కలకలం - ఢిల్లీకి చేరిన అధికారుల అక్రమాల చిట్టా!
సత్యసాయి జిల్లా హైవే టెండర్లలో రిగ్గింగ్ కలకలం - ఢిల్లీకి చేరిన అధికారుల అక్రమాల చిట్టా!
Pawan Kalyan Jindal Plant Visit: చెత్త నుంచి విద్యుత్తు.. డంపింగ్ యార్డ్ లేని ఏపీ - పల్నాడులో పవన్ కళ్యాణ్ పర్యావరణ మంత్రం!
చెత్త నుంచి విద్యుత్తు.. డంపింగ్ యార్డ్ లేని ఏపీ - పల్నాడులో పవన్ కళ్యాణ్ పర్యావరణ మంత్రం!
Advertisement

వీడియోలు

GT vs RR Qualifier 2 Highlights IPL 2026 | ఐపీఎల్ ఫైనల్‌కు గుజరాత్ టైటాన్స్
Vaibhav Sooryavanshi 96 Runs Highlights IPL 2026 | వైభవ్ సూర్యవంశీని వెంటాడిన దురదృష్టం
Riyan Parag about Vaibhav IPL 2026 | రాజస్థాన్‌కు రెండో టైటిల్ తెచ్చేది వైభవే
Hardik Pandya Leaves Mumbai Indians | ముంబైని వీడి CSKలోకి హార్దిక్ ఎంట్రీ?
Sai Sudharsan Hit Wicket In IPL 2026 | వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హిట్ వికెట్ అయిన సాయి సుదర్శన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karnataka New CM DK Shivakumar: సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక ఏకగ్రీవం.. జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణం
సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక ఏకగ్రీవం.. జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణం
PM SETU Scheme: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
Kurnool Tragedy: కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
Deputy CM Pawan Kalyan: డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలి.. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు పరిశీలించిన పవన్ కళ్యాణ్
డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలి.. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు పరిశీలించిన పవన్ కళ్యాణ్
AP Telangana regional politics: ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
IPL 2026 Final GT vs RCB: ఆర్‌సీబీతో ఫైన‌ల్లో మాకు ఆ అడ్వాంటేజ్.. ప్రెజర్ అస్సలు లేదు - ఫైనల్ కు ముందు జీటీ కెప్టెన్ గిల్
ఆర్‌సీబీతో ఫైన‌ల్లో మాకు ఆ అడ్వాంటేజ్.. ప్రెజర్ అస్సలు లేదు - ఫైనల్ కు ముందు జీటీ కెప్టెన్ గిల్
Ram Charan : సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
Vaibhav Sooryavanshi News: ఏషియన్ గేమ్స్ ప్రాబబుల్స్ లిస్టులో వైభవ్ సూర్యవంశీ: సూర్య, గిల్‌కు దక్కని చోటు.. 
ఏషియన్ గేమ్స్ ప్రాబబుల్స్ లిస్టులో వైభవ్ సూర్యవంశీ: సూర్య, గిల్‌కు దక్కని చోటు.. 
Embed widget