అన్వేషించండి

AP Assmebly Sessions: ఈ నెల 26 వరకూ ఏపీ అసెంబ్లీ సమావేశాలు - బీఏసీ సమావేశంలో కీలక నిర్ణయం

Andhrapradesh News: స్పీకర్ అయ్యన్నపాత్రుడి అధ్యక్షతన ఏపీ అసెంబ్లీలో బీఏసీ సమావేశం జరిగింది. ఈ నెల 26 వరకూ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు స్పీకర్ తెలిపారు.

BAC Meeting On AP Assembly Sessions: ఈ నెల 26 వరకూ ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు (Ayyannapatrudu) తెలిపారు. ఈ మేరకు సోమవారం బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై స్పీకర్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి.. టీడీపీ తరఫున సీఎం చంద్రబాబు (CM Chandrababu), మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav), జనసేన తరఫున మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ తరఫున ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు. వైసీపీ నేతలు మాత్రం గైర్హాజరయ్యారు. గవర్నర్ ప్రసంగంపై మంగళవారం చర్చ జరగనుండగా.. వైసీపీ హయాంలో తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ ఉప సంహరణ బిల్లును ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. అనంతరం గత ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు, ఎక్సైజ్ విధానం, రాష్ట్ర అప్పులు - ఆర్థిక స్థితికి సంబంధించి శ్వేతపత్రాలు విడుదల చేయనుంది. వీటిపై సభలో చర్చ జరిగే అవకాశం ఉంది.

'నలుగురు ప్యానెల్ స్పీకర్లు'

నలుగురు ప్యానెల్ స్పీకర్లను పెట్టుకోవాలని సీఎం చంద్రబాబు సూచించినట్లు స్పీకర్ తెలిపారు. బీఏసీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, ఆరోగ్య వర్శిటీ పేరు మార్పు బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. వీటితో పాటు కొన్ని శ్వేతపత్రాలు సైతం ప్రవేశ పెట్టనుందని వెల్లడించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల భవనాలు 80 శాతం పూర్తయ్యాయని.. అవి 9 నెలల్లో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. వచ్చే సమావేశాల్లోపు కొత్త ఎమ్మెల్యేలకు శిక్షణ ఇస్తామని అన్నారు. గత అసెంబ్లీ సమావేశాల వరకూ గవర్నర్‌ను అసెంబ్లీకి చుట్టూ తిప్పి వెనుక నుంచి తీసుకొచ్చేవారని.. ఈ సమావేశాలకు గవర్నర్‌ను రాచమార్గంలో ముందువైపు నుంచి తీసుకొచ్చినట్లు చెప్పారు. అసెంబ్లీకి రాచమార్గం ఉండాలనే గోడ కూల్చి గేట్ - 2 తలుపులు తీశామని వెల్లడించారు.

గవర్నర్ ప్రసంగం

ఏపీ అసెంబ్లీ సమావేశాల తొలి రోజు గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని అన్నారు. సీఎం చంద్రబాబు విజనరీ నాయకుడని.. అభివృద్ధి, రాజధాని నిర్మాణానికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. 'గత ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధిని పట్టించుకోలేదు. రాష్ట్ర మూలధన వ్యయం 60 శాతం మేరకు తగ్గింది. జల వనరులు, రవాణా, రోడ్లు, భవనాలు వంటి శాఖలను నిధుల కొరత వెంటాడుతోంది. అమరావతి రాజధాని ప్రాంతం పూర్తిగా నాశనమైంది. విధ్వంసకర నిర్ణయాలు, వాటి పర్యవసానాలను పట్టించుకోకపోవడం యువతలో, ఉద్యోగార్థులలో అశాంతికి దారి తీసింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్ని రంగాలు నష్టాలు చవిచూశాయి. ఎన్నికల ప్రక్రియలో చురుగ్గా పాల్గొన్న ప్రజలు మార్పు కావాలని ఆకాంక్షించారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే బాధ్యత సభ్యులపై ఉంది. ఉన్న అవకాశాలను వినియోగించుకొని ప్రజలకు న్యాయం చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే ప్రభుత్వం ముందు ఉన్న కర్తవ్యం' అని గవర్నర్ పేర్కొన్నారు.

కాగా, అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ అధినేత జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల కండువాలు ధరించి హాజరయ్యారు. ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకోగా.. జగన్ వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం నల్ల కండువాలతోనే అసెంబ్లీకి హాజరయ్యారు. అనంతరం గవర్నర్ ప్రసంగం సందర్భంగా నిరసనలు తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు.

Also Read: AP Assembly Session: ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర ఘటన - వైఎస్ జగన్, రఘురామ మధ్య సంభాషణ, ఏం మాట్లాడుకున్నారంటే?

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Anant Ambani: తిరుమల శ్రీవారికి అనంత్ అంబానీ 27.5 కోట్ల విలువైన భారీ విరాళం, గోశాల ఆధునీకరణకు నిర్ణయం
తిరుమల శ్రీవారికి అనంత్ అంబానీ 27.5 కోట్ల విలువైన భారీ విరాళం, గోశాల ఆధునీకరణకు నిర్ణయం
YS Jagan: రైతుల కోసం వెళ్లిన వైసీపీ నేతలపై దాడులు దారుణం, పోలీసులు సైతం కోఆర్డినేట్: వైఎస్ జగన్
రైతుల కోసం వెళ్లిన వైసీపీ నేతలపై దాడులు దారుణం, పోలీసులు సైతం కోఆర్డినేట్: వైఎస్ జగన్
Breaking News: రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
Made in Jonnagiri Gold Biscuits: బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!

వీడియోలు

IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?
India vs Ireland 2nd T20 Series decider | ఇండియా కంబ్యాక్ ఇస్తుందా?
Abhishek Sharma’s 50 Cancelled Ind vs Ire | అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ రద్దు
Ronaldo's Special Gold Scorpion Shoes | రొనాల్డో సరికొత్త గోల్డ్ స్కార్పియన్ షూస్
Ashwin About Vaibhav Bench Controversy | వైభవ్ ను క్కనపెట్టడంపై అశ్విన్ కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nitin Nabin: 2028లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం.. బెంగాల్ తరహాలో పోరాడాలి: నితిన్ నబిన్
2028లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం.. బెంగాల్ తరహాలో పోరాడాలి: నితిన్ నబిన్
CM Revanth Reddy: ఎవడు అడ్డొచ్చినా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ లేసి తొక్కుతా, ప్రక్షాళన చేసితీరుతా: నల్గొండలో రేవంత్ రెడ్డి
ఎవడు అడ్డొచ్చినా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ లేసి తొక్కుతా, ప్రక్షాళన చేసితీరుతా: నల్గొండలో రేవంత్ రెడ్డి
T20 World Cup - IND W VS AUS W Result Update:  టీమిండియా ఔట్.. ఆసీస్ చేతిలో ఓట‌మితో సెమీస్ బెర్తు దూరం.. కంగారుల‌తోపాటు నాకౌట్ చేరిన ప్రొటీస్.. 
టీమిండియా ఔట్.. ఆసీస్ చేతిలో ఓట‌మితో సెమీస్ బెర్తు దూరం.. కంగారుల‌తోపాటు నాకౌట్ చేరిన ప్రొటీస్.. 
Kavitha On Idupu Kayitham: ఇడుపు కాయితం టైటిల్ వివాదంలోకి పవన్ కళ్యాణ్‌ను లాగిన కల్వకుంట్ల కవిత! ఫ్యాన్స్ ఊరుకుంటారా?
ఇడుపు కాయితం టైటిల్ వివాదంలోకి పవన్ కళ్యాణ్‌ను లాగిన కల్వకుంట్ల కవిత! ఫ్యాన్స్ ఊరుకుంటారా?
PM Modi Mann Ki Baat: సంక్షోభ సమయంలో నా మాట విని పాటించారు, దేశ ప్రజలకు ధన్యవాదాలు: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
సంక్షోభ సమయంలో నా మాట విని పాటించారు, దేశ ప్రజలకు ధన్యవాదాలు: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
PV Narasimha Rao Birth Anniversary Tributes 2026: మహనీయులకు ప్రాంతాలు ఉండవు - విశాఖలోనూ పీవీకి ఘనగా నివాళులు - టీఆర్ఎస్ కవిత వర్సెస్ బీజేపీ విష్ణు
మహనీయులకు ప్రాంతాలు ఉండవు - విశాఖలోనూ పీవీకి ఘనగా నివాళులు - టీఆర్ఎస్ కవిత వర్సెస్ బీజేపీ విష్ణు
Ayodhya Ram Mandir Donation Row: సిట్ దర్యాప్తులో కీలక విషయాలు.. అయోధ్య కానుకల డబ్బు పంపకాల గొడవతోనే బయటపడ్డ కుట్ర!
సిట్ దర్యాప్తులో కీలక విషయాలు.. అయోధ్య కానుకల డబ్బు పంపకాల గొడవతోనే బయటపడ్డ కుట్ర!
Hang Man OTT : ఆరేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి బ్రహ్మాజీ మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఆరేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి బ్రహ్మాజీ మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Embed widget