అన్వేషించండి

Asha Workers Agitation: రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్ల ఆందోళనలు, కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్

పాదయాత్ర సమయంలో సీఎం జగన్ ఇచ్చిన హామీలు విస్మరించారని ఆశా వర్కర్లు ఆరోపించారు. కొత్త పీఆర్సీ ప్రకారం కనీస వేతనం రూ.15 వేలు చేయాలని విశాఖలో ఆందోళనకు దిగారు.

 రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు(Asha Workers) కదంతొక్కారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆందోళనలు చేపట్టారు. విశాఖ(Visakha) జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి వినతి పత్రం అందించేందుకు ప్రయత్నించిన ఆశా కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. విశాఖ జగదాంబ వద్ద సీఐటీయూ కార్యాలయంలో ఆశా వర్కర్స్ నగర గౌరవ అధ్యక్షురాలు మణితో సహా పలువురు కార్యకర్తలను పోలీసులు నిర్బంధించారు. సీఐటీయూ(CITU) కార్యాలయం బయట భారీగా పోలీసులను మోహరించారు. ఆశా వర్కర్లను డీఎంహెచ్ఓ(DMHO) కార్యాలయానికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పరిస్థితిని అదుపు చేసేందుకు ఆశా వర్కర్లను పోలీసులు అరెస్టు చేశారు. ఆశా వర్కర్ల నగర అధ్యక్షురాలు మణి మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లే కార్యకర్తలను అరెస్టులు చేయడం దారుణం అన్నారు. పాదయాత్ర సమయంలో సీఎం జగన్(CM Jagan) ఇచ్చిన హామీలను విస్మరించారన్నారు. చంద్రబాబుకు మించి వైసీపీ ప్రభుత్వం(Ysrcp Govt) తమను నిర్భదిస్తోందని అన్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని అణచివేసే చర్య అని అన్నారు 

సీఐటీయూ నిరసన 

ఆశా వర్కర్లను రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికక్కడ అరెస్టులు చేయడాన్ని సీఐటీయూ తీవ్రంగా ఖండించింది. ఇందులో భాగంగా సీతంపేట బీవీకే కళాశాల వద్ద నిరసన ప్రదర్శన, మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు సీహెచ్ నర్సింగ్ రావు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు జీతాలు పెంచాలని, అలెవెన్సులు ఇవ్వాలని కోరుతున్న ఆశా వర్కర్లను అరెస్టు చేయడం దారుణమని నర్సింగ్ రావు అన్నారు. సీఐటీయూ కార్యాలయానికి సైతం పోలీసులను పంపి అరెస్టు చేయించడం గతంలో ఎన్నడూ జరగలేదన్నారు. యావత్ కార్మికవర్గం ఆశా వర్కర్లకు మద్దతు తెలియజేస్తున్నారన్నారు.  ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం(State Govt) ఆశావర్కర్లతో చర్చించి వారి డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ముందస్తు అరెస్టులు

కనీస వేతనాలకై రాష్ట్ర వ్యాప్తంగా ఆశా కార్యకర్తలు చేస్తోన్న ఆందోళనలో భాగంగా విశాఖ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ముట్టడి నేపథ్యంలో ఆయా మండలాల్లో పనిచేస్తున్న ఆశా కార్యకర్తలను పోలీసులు(Police) ముందస్తు అరెస్ట్ లు చేశారు. పెదగంట్యాడ నుంచి బయలుదేరిన ఆశా కార్యకర్తలను న్యూ పోర్ట్ పోలీసులు స్టేషన్ కి తరలించారు. సీఐటీయూ నాయకుడు కొవిరి అప్పలరాజు, ఆశా కార్యకర్తలు ఎన్ హేమలత, జి. కుమారి, పి.సోమేశ్వరి మాట్లాడుతూ నూతన పీఆర్సీ(PRC) విధానాన్ని అనుసరించి కనీస వేతనం రూ.15 వేలు చేయాలని డిమాండ్ చేశారు. నెలనెలా ఇచ్చిన జీతాన్ని రెండు దఫాలుగా చెల్లించడం కరెక్ట్ కాదన్నారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా చూస్తూ సంక్షేమ పథకాలను అందకుండా చేశారని దీని వలన అన్ని విధాలా నష్టపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ఆశా కార్యకర్తలకు వారాంతపు సెలవు అమలుచేయాలని కోరారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Duvvada Vani: టెక్కలిలో దువ్వాడకు లైన్ క్లియర్ - పోటీ నుంచి తప్పుకొన్న దువ్వాడ వాణి!
టెక్కలిలో దువ్వాడకు లైన్ క్లియర్ - పోటీ నుంచి తప్పుకొన్న దువ్వాడ వాణి!
Malaysia: గాలిలో హెలికాప్టర్లు ఢీ - 10 మంది నేవీ సిబ్బంది దుర్మరణం, మలేషియాలో ఘోర ప్రమాదం
గాలిలో హెలికాప్టర్లు ఢీ - 10 మంది నేవీ సిబ్బంది దుర్మరణం, మలేషియాలో ఘోర ప్రమాదం
Bridge Collapsed: మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన - తప్పిన ప్రమాదం
మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన - తప్పిన ప్రమాదం
Prabhas: ప్రభాస్ విరాళం... అప్పుడు ఏపీకి కోటి, ఇప్పుడు దర్శకుల సంఘానికి - రెబల్ స్టార్ ఎంత ఇచ్చారంటే?
ప్రభాస్ విరాళం... అప్పుడు ఏపీకి కోటి, ఇప్పుడు దర్శకుల సంఘానికి - రెబల్ స్టార్ ఎంత ఇచ్చారంటే?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Hardik Pandya poor Form IPL 2024 | మరోసారి కెప్టెన్ గా, ఆటగాడిగా విఫలమైన హార్దిక్ పాండ్యా | ABPSandeep Sharma 5Wickets | RR vs MI మ్యాచ్ లో ఐదువికెట్లతో అదరగొట్టిన సందీప్ శర్మ | ABP DesamSanju Samson | RR vs MI | సౌండ్ లేకుండా మ్యాచ్ లు గెలవటమే కాదు..పరుగులు చేయటమూ తెలుసు | IPL 2024Yashasvi Jaiswal Century | RR vs MI మ్యాచ్ లో అద్భుత శతకంతో మెరిసిన యశస్వి | IPL 2024

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Duvvada Vani: టెక్కలిలో దువ్వాడకు లైన్ క్లియర్ - పోటీ నుంచి తప్పుకొన్న దువ్వాడ వాణి!
టెక్కలిలో దువ్వాడకు లైన్ క్లియర్ - పోటీ నుంచి తప్పుకొన్న దువ్వాడ వాణి!
Malaysia: గాలిలో హెలికాప్టర్లు ఢీ - 10 మంది నేవీ సిబ్బంది దుర్మరణం, మలేషియాలో ఘోర ప్రమాదం
గాలిలో హెలికాప్టర్లు ఢీ - 10 మంది నేవీ సిబ్బంది దుర్మరణం, మలేషియాలో ఘోర ప్రమాదం
Bridge Collapsed: మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన - తప్పిన ప్రమాదం
మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన - తప్పిన ప్రమాదం
Prabhas: ప్రభాస్ విరాళం... అప్పుడు ఏపీకి కోటి, ఇప్పుడు దర్శకుల సంఘానికి - రెబల్ స్టార్ ఎంత ఇచ్చారంటే?
ప్రభాస్ విరాళం... అప్పుడు ఏపీకి కోటి, ఇప్పుడు దర్శకుల సంఘానికి - రెబల్ స్టార్ ఎంత ఇచ్చారంటే?
Telangana SSC Results: ఈ నెల 30న తెలంగాణ టెన్త్ ఫలితాలు - రేపు ఇంటర్ ఫలితాలు, అధికారిక ప్రకటన
ఈ నెల 30న తెలంగాణ టెన్త్ ఫలితాలు - రేపు ఇంటర్ ఫలితాలు, అధికారిక ప్రకటన
Hanuman Jayanti Wishes In Telugu 2024 : పవర్ ఫుల్ హనుమాన్ శ్లోకాలతో హనుమాన్ జయంతి (విజయోత్సవం) శుభాకాంక్షలు తెలియజేయండి!
Hanuman Jayanti Wishes In Telugu 2024 : పవర్ ఫుల్ హనుమాన్ శ్లోకాలతో హనుమాన్ జయంతి (విజయోత్సవం) శుభాకాంక్షలు తెలియజేయండి!
Money Rules: మే నెల నుంచి మారే మనీ రూల్స్‌, మీకు బ్యాంక్‌ అకౌంట్‌ ఉంటే తప్పక తెలుసుకోవాలి
మే నెల నుంచి మారే మనీ రూల్స్‌, మీకు బ్యాంక్‌ అకౌంట్‌ ఉంటే తప్పక తెలుసుకోవాలి
Allari Naresh: అల్లరి నరేశ్ రైటర్‌గా సూపర్ హిట్ సీక్వెల్ - వచ్చే ఏడాది థియేటర్లలోకి సినిమా
అల్లరి నరేశ్ రైటర్‌గా సూపర్ హిట్ సీక్వెల్ - వచ్చే ఏడాది థియేటర్లలోకి సినిమా
Embed widget