అన్వేషించండి

Andhra News : చంద్రబాబు సీఎం అయినా జగన్ బొమ్మతోనే విద్యా కానుక కిట్లు - ఏపీలో అంతా మారిపోయిందా ?

Chandrababu : జగన్ బొమ్మతో సిద్ధం అయిన విద్యా కానుక కిట్లను పంపిణీ చేయాలని చంద్రబాబు ఆదేసించారు. వాటిని వృధా చేయవద్దని స్పష్టం చేశారు.

Andhra Vidya kanuka kits :  ఆంధ్రాలో రాజకీయం అంతా మారిపోయింది. రాజకీయ ప్రత్యర్థుల నీడ కూడా పడకూడదని భావించే పరిస్థితి నుంచి..  ఫోటోలు ఉన్నా పర్వాలేదు ప్రజాధనం వృధా కాకూడదనే నిర్ణయాలు తీసుకుంటున్నారు.  జగన్ ప్రభుత్వం ప్రతి  ఏడాది విద్యాకానుక పేరుతో విద్యార్థులకు కిట్లను పంపిణీ చేస్తుంది. ఇవన్నీ జగన్ బొమ్మలతో నిండి ఉంటాయి. ఎన్నికలు జరిగే నాటికే టెండర్లు ఇచ్చి రెడీ చేయించారు. లఇప్పుడు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే ప్రభుత్వం మరింది.అందుకే కొత్త సీఎం ఏమంటారో అని అధికారులు విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.                                      

వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లరా ? వైఎస్ జగన్ వ్యూహం ఏమిటి ?

కిట్లు మొత్తం పంపిణీ చేయాలని చంద్రబాబు ఆదేశం                         

చంద్రబాబు ఏ మాత్రం ఆలోచించకుండా  విద్యా కానుక కిట్లను త్వరితగతిన పంపిణీ చేయాలని ఆదేశించారు. స్కూల్ బ్యాగులపై పార్టీ గుర్తులు ఉన్నప్పటికీ వాటిని సైతం పంపిణీ చేయాలని ప్రజాధనం వృధా కాకూడదని స్పష్టం చేశారు.  ప్రభుత్వం స్కూల్ బ్యాగులను పార్టీ రంగులతో ముద్రించినా వృథా చేయకుండా విద్యార్థులకు అందజేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.  స్కల్స్ ప్రారంభం కావడంతో  విద్యా కానుక ద్వారా అందాంచే కిట్లను ఎప్పటిలాగే విద్యా సంవత్సరం ప్రారంభం రోజే అందజేస్తున్నారు.

విద్యా కాను కిట్లలో అవినీతిపై విచారణ చేయించే అవకాశం                          

ప్రభుత్వం విద్యా కానుక కిట్ల కోసం రూ.700 కోట్లు ఖర్చు చేస్తోంది.  ప్రభుత్వ పాఠశాలలో చదివే 36 లక్షల మంది విద్యార్థులకు విద్యా కానుక కిట్లు పంపిణీ చేయనున్నారు. కొంతకాలంగా కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం రోజే విద్యా కానుక కిట్లు అందజేస్తుండడంతో కొత్త ప్రభుత్వం కూడా అలానే పంపిణీ చేస్తుంది. ఈ టెండర్లలో అక్రమాలు జరిగాయని టీడీపీ తరచూ ఆరోపణలు చేస్తూ వస్తోంది. క్వాలిటీ లేనివి పంపిణీ చేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. వీటిపై టీడీపీ సర్కార్ విచారణకు ఆదేశించే అవకాశం ఉంది. 

పవన్ కల్యాణ్‌ చదివింది పదో తరగతి- పుట్టింది చీరాలలో - ఇదిగో క్లారిటీ!

టీడీపీ హయాంలో రెడీ చేియంచిన ఆదరణ కిట్లు, ఆడపిల్లల సైకిళ్లను పంపిణీ చేయని జగన్ ప్రభుత్వం 

మరో వైపు గతంలో టీడీపీ ఓడిపోయిన అధికారం చేపట్టిన జగన్మోహన్ రెడ్డి..  ఆదరణ పథకం కింద బీసీలకు ఇచ్చే పని ముట్లు, విద్యార్థినులకు ఇచ్చే సైకిళ్లు ఇలా అన్నింటినీ మూలనపడేశారు. ప్రజా వేదిక వంటివి కూలగొట్టిన  సంగతి చెప్పాల్సిన పని లేదు. దీనికి భిన్నంగా చంద్రబాబు ఒక్క రూపాయి కూడా ప్రజాదనం  వృధా కాకూడదని పంపిణీ చేయాలని సూచిస్తున్నారు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

MP Mithun Reddy: లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
MP Mithun Reddy: లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
Telangana Cabinet Decisions: మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Mithun Reddy: లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
MP Mithun Reddy: లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
Telangana Cabinet Decisions: మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
Revanth Reddy: హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక వర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
Champion OTT : ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Railway Guidelines For Ghee : రైలులో నెయ్యి తీసుకెళ్లొచ్చా? భారతీయ రైల్వే నిబంధనలు ఇవే
రైలులో నెయ్యి తీసుకెళ్లొచ్చా? భారతీయ రైల్వే నిబంధనలు ఇవే
Embed widget