By: ABP Desam | Updated at : 17 Feb 2022 06:38 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
కరోనా కేసులు(ప్రతీకాత్మక చిత్రం)
ఏపీలో కరోనా కేసులు(Corona Cases) క్రమంగా తగ్గుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 22,339 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 528 మందికి కోవిడ్ పాజిటివ్(Covid Positive) నిర్ధారణ అయింది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ తో ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో కోవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,707కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 1,864 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 22,90,853 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీ(AP)లో 9,470 యాక్టివ్ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,15,030కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ మొత్తం 3,29,16,247 నిర్థారణ పరీక్షలు చేశారు.
#COVIDUpdates: 17/02/2022, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) February 17, 2022
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 23,15,030 పాజిటివ్ కేసు లకు గాను
*22,90,853 మంది డిశ్చార్జ్ కాగా
*14,707 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 9,470#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/sBhzT3e8Wl
#COVIDUpdates: As on 17th February, 2022 10:00AM
COVID Positives: 23,15,030
Discharged: 22,90,853
Deceased: 14,707
Active Cases: 9,470#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/fUKkoyhImV— ArogyaAndhra (@ArogyaAndhra) February 17, 2022
దేశంలో కరోనా కేసులు
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి అదుపులోనే ఉంది. రోజువారీ కేసుల్లో స్వల్ప హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలో 30,757 కరోనా కేసులు నమోదు కాగా, 541 మరణాలు సంభవించాయి. గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 11 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 30 వేలకు పైగా పాజిటివ్ కేసులు వచ్చాయి. పాజిటివిటీ రేటు 2.61 శాతం నమోదైంది. గత రెండు రోజులుగా పాజిటివిటీ రేటులో స్వలంగా పెరిగింది. 2020 నుంచి 4.27 కోట్ల మందికి ఇప్పటి వరకూ కరోనా సోకింది. అందులో 4.19 కోట్ల మంది వైరస్ను నుంచి పూర్తిగా కోలుకున్నారు. బుధవారం ఒక్కరోజే 67 వేల మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు 98.03 శాతానికి పెరిగింది. యాక్టివ్ కేసులు 3.3 లక్షలకు తగ్గాయి. కరోనాతో ఇప్పటి వరకూ 5,10,413 మంది మరణించారు. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా జరుగుతోంది. నిన్న 34.7 లక్షల మందికి వ్యాక్సిన్ వేశారు. ఇప్పటివరకూ 174 కోట్లకు పైగా డోసులు పంపిణీ చేశారు.
Tirumala News : తిరుమలకు పోటెత్తిన భక్తులు, శ్రీవారి దర్శనానికి 48 గంటలు పట్టే అవకాశం!
Ysrcp Bus Yatra : సామాజిక న్యాయమే సీఎం జగన్ ఫిలాసఫీ, నరసరావుపేట సభలో మంత్రులు
TDP Mahanadu 2022 : టీడీపీ మహానాడుకు భారీ స్పందన, అటు చంద్రబాబు ఇటు బాలయ్య ప్రసంగాలతో దద్దరిల్లిన స్టేజ్
Mahanadu 2022 : జిల్లా విభజనను పునః సమీక్షిస్తా, బుల్లెట్లా దూసుకెళ్తా- మహానాడులో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Mahanadu Chandrababu : నేను వస్తా.. దోచినదంతా కక్కిస్తా - మహానాడులో చంద్రబాబు హెచ్చరిక !
Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?
Dhaakad box office collection: కంగనా సినిమాకి దారుణమైన కలెక్షన్స్ - 20 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి!
3 Years of YSR Congress Party Rule : జగన్ మూడేళ్ల పాలనలో టాప్ టెన్ హైలెట్స్ ఇవే !
TSRTC Water Bottle : టీఎస్ఆర్టీసీ వాటర్ బాటిల్స్ కు పేరు, డిజైన్ సూచించండి, ప్రైజ్ మనీ గెలుచుకోండి