అన్వేషించండి

KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం

Telangana News: తెలంగాణ తల్లి విగ్రహ మార్పు ప్రభుత్వ మూర్ఖపు చర్య అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. అంశాల వారీగా ప్రభుత్వాన్ని నిలదీయాలని ఆ పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు.

KCR Responds On Telangana Thalli New Statue: తెలంగాణ తల్లి రూపం మార్చడంపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) స్పందించారు. 'కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్య.. ఇది ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఇవేనా.?' అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో ఆయన మాట్లాడారు.  ప్రభుత్వం సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశాలకు హాజరవ్వాలని.. అంశాల వారీగా ప్రభుత్వాన్ని నిలదీయాలని దిశానిర్దేశం చేశారు.

'మార్చుకుంటూ పోతే ఎలా.?'

ప్రభుత్వాలు సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని.. విగ్రహాలను మార్చుకుంటూ పోతే ఎలా అంటూ గులాబీ బాస్ ప్రశ్నించారు. 'బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ సమావేశాలకు రావాలి. అంశాల వారీగా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలి. రైతుబంధు తెచ్చిన ఉద్దేశం, ప్రయోజనాలు వివరించాలి. ఉద్యమంలో తెలంగాణ తల్లి అందించిన స్ఫూర్తిని వివరించాలి. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైంది. మూసీ, హైడ్రా విషయంలో ప్రభుత్వ వైఖరి, గురుకులాలు, విద్యా రంగంలో వైఫల్యాలను ఎండగట్టాలి. నిర్బంధ పాలన గురించి అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించాలి. కాంగ్రెస్ మేనిఫెస్టో ఆధారంగా వైఫల్యాలను ఎత్తిచూపాలి. ఫిబ్రవరి బహిరంగ సభలో సర్కారు వైఖరిని ఎండగడతాం. ఫిబ్రవరి తర్వాత పార్టీలో అన్ని కమిటీలు ఏర్పాటు చేస్తాం. కమిటీల ఏర్పాటు తర్వాత సభ్యత్వ నమోదు ప్రక్రియ చేపడతాం.' అని కేసీఆర్ పేర్కొన్నారు.

కాగా, ఇటీవల తెలంగాణ తల్లి కొత్త విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించింది. కుడి చేతిలో తెలంగాణ ప్రజలు అభయహస్తం చూపుతూ.. ఎడమ చేతిలో తెలంగాణలో పండించే ముఖ్యమైన పంటలను ధరించి.. తెలంగాణ ఆడబిడ్డల కట్టు, బొట్టు ఉట్టిపడేలా.. ప్రసన్న వదనంతో నిండైన రూపంలో విగ్రహాన్ని కొలువుదీర్చినట్లు ప్రభుత్వం చెబుతోంది. దీనిపై బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. చేతిలో బతుకమ్మ ఉంటే బీఆర్ఎస్‌కు క్రెడిట్ ఉంటుందని.. కాంగ్రెస్ వాళ్లు కావాలనే తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ తీసేశారు. హస్తం గుర్తు కనిపించేలా తెలంగాణ తల్లి అభయహస్తం ఇస్తున్నట్లు కొత్త రూపం తీసుకొచ్చారని ఆరోపిస్తున్నారు. ఈ విగ్రహం సవతి తల్లి వంటిదని.. అసలైన తెలంగాణ విగ్రహం తమదే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలుగు తల్లి విగ్రహం.. నగలు, కిరీటంతో ఉంటే తెలంగాణ తల్లి విగ్రహం మాత్రం పేదరికంలో కనబడాలా.? అని ప్రశ్నిస్తున్నారు. 

పోటాపోటీగా విగ్రహావిష్కరణలు 

సోమవారం అటు అధికార కాంగ్రెస్, ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు రెండూ పోటాపోటీగా విగ్రహాలను ఆవిష్కరించనున్నాయి. సోనియాగాంధీ పుట్టినరోజు, ఏడాది ప్రజాపాలన ముగింపు సంబురాలను ఘనంగా నిర్వహించేలా సర్కారు ఏర్పాట్లు చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి.. సచివాలయంలో కొత్త విగ్రహాన్ని ఆవిష్కరించనుండగా.. మేడ్చల్ జిల్లా పాత కార్యాలయంలో తెలంగాణ తల్లి పాత విగ్రహాన్ని కేటీఆర్ పునరావిష్కరించనున్నారు. మరోవైపు, కేసీఆర్‌కు సైతం ప్రభుత్వం విగ్రహావిష్కరణకు రావాలని ఆహ్వానం పంపింది.

Also Read: Telangana Thalli Statue: తెలంగాణ తల్లి అభయ 'హస్తం' - కొత్త రూపంపై బీఆర్ఎస్ నిరసన, కేసీఆర్ ఏం చేయబోతున్నారు?

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: మహిళల్ని రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు చేసి గౌరవించిన పార్టీ కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి
మహిళల్ని రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు చేసి గౌరవించిన పార్టీ కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి
Kamareddy crime News: కామారెడ్డిలో తీవ్ర విషాదం.. చెరువులో తోసేసి ముగ్గురు కూతుళ్ల హత్య.. ఆపై 30 నిమిషాలపాటు అక్కడే
కామారెడ్డిలో తీవ్ర విషాదం.. చెరువులో తోసేసి ముగ్గురు కూతుళ్ల హత్య.. ఆపై 30 నిమిషాలపాటు అక్కడే
Secunderabad Railway Stations: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఎయిర్‌పోర్ట్ తరహా రూల్స్‌! టికెట్ ఉన్న వాళ్లకు మాత్రమే ఎంట్రీ!
సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఎయిర్‌పోర్ట్ తరహా రూల్స్‌! టికెట్ ఉన్న వాళ్లకు మాత్రమే ఎంట్రీ!
Hyderabad to Kanyakumari Amrit Bharat Express : హైదరాబాద్‌ టూ కన్యాకుమారి; పట్టాలెక్కనున్న మరో అమృత్‌ భారత్‌, పుణ్యక్షేత్రాల దర్శనానికి సరికొత్త మార్గం!
హైదరాబాద్‌ టూ కన్యాకుమారి; పట్టాలెక్కనున్న మరో అమృత్‌ భారత్‌, పుణ్యక్షేత్రాల దర్శనానికి సరికొత్త మార్గం!

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Strait Of Hormuz Conflict: హర్ముజ్ జలసంధిపై నియంత్రణ ఎందుకంత కష్టం.. యూరోప్ దేశాలు వెనక్కి తగ్గేందుకు కారణాలివే
హర్ముజ్ జలసంధిపై నియంత్రణ ఎందుకంత కష్టం.. యూరోప్ దేశాలు వెనక్కి తగ్గేందుకు కారణాలివే
IND vs NZ T20 World Cup 2026 Final: భారత్, న్యూజిలాండ్ పోరులో అత్యధిక పరుగులు చేసింది వీరే.. టాప్ లేపిన సూర్యకుమార్ యాదవ్
భారత్, న్యూజిలాండ్ పోరులో అత్యధిక పరుగులు చేసింది వీరే.. టాప్ లేపిన SKY
CM Revanth Reddy: మహిళల్ని రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు చేసి గౌరవించిన పార్టీ కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి
మహిళల్ని రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు చేసి గౌరవించిన పార్టీ కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి
Kakinada Fireworks Explosion: వేట్లపాలెం బాణసంచా పేలుడు.. ముడిసరకు అమ్మిన వ్యాపారిపై కేసు నమోదు
వేట్లపాలెం బాణసంచా పేలుడు.. ముడిసరకు అమ్మిన వ్యాపారిపై కేసు నమోదు
Iran-Israel Conflict: కేవలం పెట్రోల్ మాత్రమే కాదు, త్వరలో ఇంటర్నెట్‌పై పశ్చిమాసియా వార్ ప్రభావం !
కేవలం పెట్రోల్ మాత్రమే కాదు, త్వరలో ఇంటర్నెట్‌పై పశ్చిమాసియా వార్ ప్రభావం !
Kamareddy crime News: కామారెడ్డిలో తీవ్ర విషాదం.. చెరువులో తోసేసి ముగ్గురు కూతుళ్ల హత్య.. ఆపై 30 నిమిషాలపాటు అక్కడే
కామారెడ్డిలో తీవ్ర విషాదం.. చెరువులో తోసేసి ముగ్గురు కూతుళ్ల హత్య.. ఆపై 30 నిమిషాలపాటు అక్కడే
Investment Tips: ఈ గవర్నమెంట్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే FD ల కంటే ఎక్కువ బెనిఫిట్స్..
ఈ గవర్నమెంట్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే FD ల కంటే ఎక్కువ బెనిఫిట్స్..
The Taj Story OTT : ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ 'ది తాజ్ స్టోరీ' - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ 'ది తాజ్ స్టోరీ' - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Embed widget