అన్వేషించండి

AP High Court: జగన్ సర్కార్ డేంజర్ జోన్‌లో ఉందన్న ఏపీ హైకోర్టు, ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు

AP High Court: ప్రజాప్రతినిధులపై కేసుల ఉపసంహరణ విషయంలో జీవోలు జారీ చేసిన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డేంజర్ జోన్ లో ఉందంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని తెలిపింది.

AP High Court: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డేంజర్ జోన్ లో ఉందని ఆ రాష్ట్ర హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి ప్రజా ప్రతినిధులపై కేసులు ఉపసంహరించేందుకు జీవోలు జారీ చేసిన అంశంపై హైకోర్టు ఇలా స్పందించింది. ప్రభుత్వం ఇలా జీవోలు జారీ చేయడం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. 2020 సెప్టెంబర్ 16న సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం.. ప్రజా ప్రతినిధులపై కేసులను ప్రభుత్వాలు ఉపసంహరించడానికి వీల్లేదని అన్నట్లు ఈ సందర్భంగా హైకోర్టు గుర్తు చేసింది.

తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా..

కేసులు ఉపసంహిరించుకోవచ్చంటూ న్యాయస్థానాలు ఆదేశాలు ఇచ్చిన తర్వాతే.. ప్రభుత్వాలు జీవోలు జారీ చేయాలని తెలిపింది. అంతే కానీ ముందు జీవోలు ఇచ్చి.. తర్వాత హైకోర్టు అనుమతి అడగడం ఏమిటని ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. జీవోల విషయంలో ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకపోతే... తామే ఆయా జీవోలను కొట్టి వేస్తామని హైకోర్టు తెలిపింది. హైకోర్టు  ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార మిశ్ర, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. 

ఉపసంహరించుకోవడానికి వీల్లేదు..!

దేశవ్యాప్తంగా ప్రజా ప్రతినిధులపై కేసుల విచారణను వేగవంతం చేసి, తీర్పులు ఇవ్వాలని కోరుతూ బీజేపీ లీడర్ అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ సుప్రీం కోర్టులో పిల్ వేశారు. దానిపై విచారణ చేపట్టిన అత్యున్నత ధర్మాసనం.. రాష్ట్ర హైకోర్టుల అనుమతి లేకుండా ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసులను రాష్ట్ర ప్రభుత్వాలు ఉపసంహరించుకోవడానికి వీల్లేదని తేల్చి చెప్పింది సుప్రీం కోర్టు. 2020 సెప్టెంబర్ 16 నుండి 2021 ఆగస్టు 25 లోపు రాష్ట్రంలో ప్రజా ప్రతినిధులపై ఎన్ని కేసుల ఉపసంహరణకు ప్రభుత్వం జీవోలు ఇచ్చిందనేది పరిశీలించేందుకు హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. అధికార వైసీపీ ప్రజా ప్రతినిధులపై కేసుల ఉపసంహరణకు ప్రభుత్వం మొత్తం తొమ్మిది జీవోలను ఇచ్చినట్లు విచారణలో హైకోర్టు ప్రస్తావించింది. 

10 కేసులు ఉపసంహరించుకునేందుకు సర్కారు జీవోలు..

మరోవైపు జగ్గయ్య పేట నియోజకవర్గ శాసన సభ్యుడు సామినేని ఉదయ భానుపై 10 కేసులు ఉపసంహరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది. అయితే ఈ జీవోను ఏపీ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడు చెవుల కృష్ణాంజనేయులు సవాల్ చేశారు. దీనిపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం వేశారు. దీనిపై విచారణ చేపట్టింది హైకోర్టు. సుప్రీం కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ప్రతినిధులపై కేసుల్ని ఉపసంహరించేలా జీవోలు జారీ చేసిందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.

ఉపసంహరణ ప్రతిపాదనలు సంబంధిత కోర్టుల పబ్లిక్ ప్రాసిక్యూటర్ నుండి రావాలని పిటిషన్ కృష్ణాంజనేయులు తరఫు న్యాయవాది వెంకటేశ్ వాదనలు వినిపించారు. అయితే అందుకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వమే జీవోలు ఇచ్చి కేసుల్ని ఉపసంహరించాలని పీపీలను కోరిందని వెంకటేశ్ అన్నారు. దీనిపై ప్రభుత్వం తరఫు వాదనలు వినిపించిన హోం శాఖ ప్రభుత్వ న్యాయవాది వి. మహేశ్వర రెడ్డి... జీవోలు  ఇచ్చినప్పటికీ ఆయా కేసులను ఉపసంహరించలేదని వెల్లడించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

KTR Slams Revanth Reddy: రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?

వీడియోలు

Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్
Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Slams Revanth Reddy: రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
Bondi Beach Shooting: బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
Draupathi 2 Movie : 'ద్రౌపది 2'లో ముగ్గురు విలన్స్ - మహ్మద్ బిన్ తుగ్లక్‌‌గా చిరాగ్... ఫస్ట్ లుక్ రిలీజ్
'ద్రౌపది 2'లో ముగ్గురు విలన్స్ - మహ్మద్ బిన్ తుగ్లక్‌‌గా చిరాగ్... ఫస్ట్ లుక్ రిలీజ్
Mana Shankara Vara Prasad Garu Trailer: ట్రైలర్ లాంచ్‌కు చిరు & నయన్ వెళ్లట్లేదు... మరి చీఫ్ గెస్ట్ ఎవరు? MSG Trailer ఈవెంట్ డీటెయిల్స్‌ తెలుసుకోండి
ట్రైలర్ లాంచ్‌కు చిరు & నయన్ వెళ్లట్లేదు... మరి చీఫ్ గెస్ట్ ఎవరు? MSG Trailer ఈవెంట్ డీటెయిల్స్‌ తెలుసుకోండి
Soldier Suicide: కూల్‌గా కూర్చున్నాడు, రైలు రాగానే పట్టాలపై తలపెట్టి జవాను ఆత్మహత్య
కూల్‌గా కూర్చున్నాడు, రైలు రాగానే పట్టాలపై తలపెట్టి జవాను ఆత్మహత్య
Embed widget