అన్వేషించండి

AP High Court: జగన్ సర్కార్ డేంజర్ జోన్‌లో ఉందన్న ఏపీ హైకోర్టు, ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు

AP High Court: ప్రజాప్రతినిధులపై కేసుల ఉపసంహరణ విషయంలో జీవోలు జారీ చేసిన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డేంజర్ జోన్ లో ఉందంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని తెలిపింది.

AP High Court: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డేంజర్ జోన్ లో ఉందని ఆ రాష్ట్ర హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి ప్రజా ప్రతినిధులపై కేసులు ఉపసంహరించేందుకు జీవోలు జారీ చేసిన అంశంపై హైకోర్టు ఇలా స్పందించింది. ప్రభుత్వం ఇలా జీవోలు జారీ చేయడం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. 2020 సెప్టెంబర్ 16న సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం.. ప్రజా ప్రతినిధులపై కేసులను ప్రభుత్వాలు ఉపసంహరించడానికి వీల్లేదని అన్నట్లు ఈ సందర్భంగా హైకోర్టు గుర్తు చేసింది.

తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా..

కేసులు ఉపసంహిరించుకోవచ్చంటూ న్యాయస్థానాలు ఆదేశాలు ఇచ్చిన తర్వాతే.. ప్రభుత్వాలు జీవోలు జారీ చేయాలని తెలిపింది. అంతే కానీ ముందు జీవోలు ఇచ్చి.. తర్వాత హైకోర్టు అనుమతి అడగడం ఏమిటని ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. జీవోల విషయంలో ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకపోతే... తామే ఆయా జీవోలను కొట్టి వేస్తామని హైకోర్టు తెలిపింది. హైకోర్టు  ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార మిశ్ర, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. 

ఉపసంహరించుకోవడానికి వీల్లేదు..!

దేశవ్యాప్తంగా ప్రజా ప్రతినిధులపై కేసుల విచారణను వేగవంతం చేసి, తీర్పులు ఇవ్వాలని కోరుతూ బీజేపీ లీడర్ అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ సుప్రీం కోర్టులో పిల్ వేశారు. దానిపై విచారణ చేపట్టిన అత్యున్నత ధర్మాసనం.. రాష్ట్ర హైకోర్టుల అనుమతి లేకుండా ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసులను రాష్ట్ర ప్రభుత్వాలు ఉపసంహరించుకోవడానికి వీల్లేదని తేల్చి చెప్పింది సుప్రీం కోర్టు. 2020 సెప్టెంబర్ 16 నుండి 2021 ఆగస్టు 25 లోపు రాష్ట్రంలో ప్రజా ప్రతినిధులపై ఎన్ని కేసుల ఉపసంహరణకు ప్రభుత్వం జీవోలు ఇచ్చిందనేది పరిశీలించేందుకు హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. అధికార వైసీపీ ప్రజా ప్రతినిధులపై కేసుల ఉపసంహరణకు ప్రభుత్వం మొత్తం తొమ్మిది జీవోలను ఇచ్చినట్లు విచారణలో హైకోర్టు ప్రస్తావించింది. 

10 కేసులు ఉపసంహరించుకునేందుకు సర్కారు జీవోలు..

మరోవైపు జగ్గయ్య పేట నియోజకవర్గ శాసన సభ్యుడు సామినేని ఉదయ భానుపై 10 కేసులు ఉపసంహరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది. అయితే ఈ జీవోను ఏపీ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడు చెవుల కృష్ణాంజనేయులు సవాల్ చేశారు. దీనిపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం వేశారు. దీనిపై విచారణ చేపట్టింది హైకోర్టు. సుప్రీం కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ప్రతినిధులపై కేసుల్ని ఉపసంహరించేలా జీవోలు జారీ చేసిందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.

ఉపసంహరణ ప్రతిపాదనలు సంబంధిత కోర్టుల పబ్లిక్ ప్రాసిక్యూటర్ నుండి రావాలని పిటిషన్ కృష్ణాంజనేయులు తరఫు న్యాయవాది వెంకటేశ్ వాదనలు వినిపించారు. అయితే అందుకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వమే జీవోలు ఇచ్చి కేసుల్ని ఉపసంహరించాలని పీపీలను కోరిందని వెంకటేశ్ అన్నారు. దీనిపై ప్రభుత్వం తరఫు వాదనలు వినిపించిన హోం శాఖ ప్రభుత్వ న్యాయవాది వి. మహేశ్వర రెడ్డి... జీవోలు  ఇచ్చినప్పటికీ ఆయా కేసులను ఉపసంహరించలేదని వెల్లడించారు.

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
YS Jagan: శాసన మండలిలో నిలదీద్దాం! అసెంబ్లీపై ప్రెస్‌మీట్‌లు పెడదాం! ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్!
శాసన మండలిలో నిలదీద్దాం! అసెంబ్లీపై ప్రెస్‌మీట్‌లు పెడదాం! ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్!
Amaravati: అమరావతి సీడ్ యాక్సెస్‌ రోడ్‌ మరింత స్పీడ్‌! హైకోర్టు తీర్పు రాగానే పనులు వేగవంతం!
అమరావతి సీడ్ యాక్సెస్‌ రోడ్‌ మరింత స్పీడ్‌! హైకోర్టు తీర్పు రాగానే పనులు వేగవంతం!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget