అన్వేషించండి

AP Govt Vs Employees : హెచ్చరికలు - కౌంటర్లు ...ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల మధ్య పెరిగిపోతున్న గ్యాప్ !

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య ఘర్షణ వాతారవణం ఏర్పడుతోంది. ప్రభుత్వ హెచ్చరికలకు ధీటుగా ఉద్యోగ నేతలు ప్రకటనలు చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య దూరం అంతకంతకూ పెరుగుతోంది. ఘర్షణ వాతావరణం వద్దని రెండు వర్గాలు ప్రకటనలు చేస్తున్నప్పటికీ క్రమంగా ఒకరి తర్వాత ఒకరు తీవ్రమైన విమర్శలు చేసుకోవడం ప్రారంభించారు.  ప్రభుత్వం వైపు నుంచి మంత్రులు  హెచ్చరికలు జారీ చేయడం.. ఊరూ పేరూ లేని సంఘాలతో చర్చలు జరపడం ఉద్యోగ సంఘాలను ఆగ్రహానికి గురి చేస్తోంది. వారు కూడా మంత్రులకు ధీటుగా స్పందిస్తున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య దూరం అంతకంతకూ పెరిగిపోతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. 

ఉద్యోగుల విషయంలో మంత్రుల హెచ్చరిక ప్రకటనలు !

ఉద్యోగులు సమ్మె నోటీసు ఇచ్చిన తర్వాత ప్రభుత్వం నచ్చ చెప్పేందుకు ఓ కమిటీని నియమించింది. ఆ కమిటీ ప్రతి రోజూ సచివాలయంలో సమావేశం అవుతోంది. ఉద్యోగ సంఘాల నేతలు వస్తారని ఎదురు చూస్తున్నారు. కానీ ఎవరూ రావడం లేదు. పీఆర్సీ జీవోలను రద్దు చేసి.. ఈ నెలకు పాత జీతాలు ఇస్తే చర్చలకు వస్తామంటున్నారు. కానీ తాము చేసేది చేస్తాం.. కానీ ఉద్యోగులు అడిగే ఎలాంటి డిమాండ్‌ను పరిష్కరించే ప్రశ్నే లేదని చెబుతున్నారు. ప్రతీ రోజూ మీడియాతో మాట్లాడుతున్న  ప్రభుత్వ సలహాదారు సజ్జల, మంత్రి బొత్స ఉద్యోగులపై కాస్త కఠినమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ఓ సారి..  చర్చలకు ఎవరు వచ్చినా జరుపుతామని మరోసారి ప్రకటనలు చేశారు. శుక్రవారం బొత్స సత్యనారాయణ మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులను అలుసుగా తీసుకోవద్దని హెచ్చరించారు. 

మంత్రులు, సలహాదారుకు ధీటుగా బదులిస్తున్న ఉద్యోగ సంఘాల నేతలు !

మంత్రుల హెచ్చరికలకు ఉద్యోగ సంఘాల నేతలు ధీటుగా బదులిస్తున్నారు. ఉద్యోగులను రెచ్చగొట్టే విధంగా, ఏ చిన్న సంఘం వచ్చినా చర్చలు జరుపుతున్నారని  పెయిడ్‌ ఆర్టిస్టులను తయారు చేసి, వారితో చర్చలు జరపడం కరెక్ట్‌ కాదని ఎపీ ఎన్జీవో నేత బండి శ్రీనివాసరావు మండిపడ్డారు. ప్రభుత్వం ఏం చేసినా ఉద్యమం మాత్రం ఆగదని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగుల బిల్లులు ప్రాసెస్ చేయకపోతే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామన్న  ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలపై సచివాలయ ఉద్యోగ సంఘం నేత  వెంకట్రామిరెడ్డి ఘాటుగా స్పందించారు. ఒక్కరిపై చర్యలు తీసుకున్నా..  తక్షణం సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. ఇలా మాటకు మాట అటు ప్రభుత్వ ప్రతినిధులు..ఇటు ఉద్యోగ సంఘాల మధ్య పెరుగుతూనే ఉంది.  

ఇరువర్గాల మధ్య ఉద్రిక్తతలు పెరిగితే సమస్య పీటముడి పడినట్లే !

ఉద్యోగ సంఘాల నేతలకు ప్రభుత్వ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సీఎం జగన్ పీఆర్సీ ప్రకటించినప్పుడు కూడా ఉద్యోగ సంఘాల నేతలందరూ చప్పట్లు కొట్టారు. కానీ అప్పుడు హెచ్‌ఆర్ఏతో పాటు మరికొన్ని అలవెన్స్‌ల విషయంలో క్లారిటీ లేదు. తర్వాత ఉద్యోగ సంఘాలు ఎంత బతిమాలినప్పటికీ ప్రభుత్వం తాము అనుకున్నట్లుగా అర్థరాత్రి జీవోలు ఇచ్చేసింది. దీంతో ఉద్యోగ నేతలు ప్రభుత్వం తమను అవమానించిందని భావిస్తూ ఉద్యమ షెడ్యూల్ ప్రకటించారు.  రెండు వర్గాలూ తమ తమ వాదనల విషయంలో పట్టు వీడే ప్రసక్తి లేకపోవడంతో సమస్యకు ఎక్కడ పరిష్కారం లభిస్తుందన్నది క్వశ్చన్ మార్క్‌గా మిగిలిపోతోంది. ఈ మధ్య ప్రభుత్వం - ఉద్యోగుల మధ్య గ్యాప్ పెరిగిపోవడం మరింత ఆందోళనకమైన అంశంగా భావిస్తున్నారు. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amaravati Breaking News: అమరావతి విస్తరణ.. మళ్లీ భూసేకరణ  2.O అంటున్న ప్రభుత్వం.. అసలు కథ ఏంటంటే
అమరావతి విస్తరణ.. మళ్లీ భూసేకరణ 2.O అంటున్న ప్రభుత్వం.. అసలు కథ ఏంటంటే
TG SC Classification GO: ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం, 3 గ్రూపులుగా ఉపకులాల వర్గీకరణ
ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం, 3 గ్రూపులుగా ఉపకులాల వర్గీకరణ
Reason for Explosion: అనకాపల్లిలో బాణసంచా కేంద్రంలో ప్రమాదానికి కారణం ఏంటి? ఆ సమయంలో ఏం జరిగింది..
అనకాపల్లిలో బాణసంచా కేంద్రంలో ప్రమాదానికి కారణం ఏంటి? ఆ సమయంలో ఏం జరిగింది..
KTR News: ఎస్సీ డిక్లరేషన్ అమలు చేయకుండా మోసం, రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలి - కేటీఆర్
ఎస్సీ డిక్లరేషన్ అమలు చేయకుండా మోసం, రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలి - కేటీఆర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Virat Kohli Heart Beat Checking | RR vs RCB మ్యాచులో గుండె పట్టుకున్న కొహ్లీRohit Sharma Karn Sharma Strategy | DC vs MI మ్యాచ్ లో హైలెట్ అంటే ఇదేKarun Nair vs Bumrah Fight | Dc vs MI IPL 2025 మ్యాచ్ లో బుమ్రా వర్సెస్ కరుణ్ | ABP DesamKarun Nair Historic Comeback vs MI | ఓటమి ఒప్పుకోని వాడి కథ..గెలుపు కాళ్ల దగ్గరకు రావాల్సిందే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Breaking News: అమరావతి విస్తరణ.. మళ్లీ భూసేకరణ  2.O అంటున్న ప్రభుత్వం.. అసలు కథ ఏంటంటే
అమరావతి విస్తరణ.. మళ్లీ భూసేకరణ 2.O అంటున్న ప్రభుత్వం.. అసలు కథ ఏంటంటే
TG SC Classification GO: ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం, 3 గ్రూపులుగా ఉపకులాల వర్గీకరణ
ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం, 3 గ్రూపులుగా ఉపకులాల వర్గీకరణ
Reason for Explosion: అనకాపల్లిలో బాణసంచా కేంద్రంలో ప్రమాదానికి కారణం ఏంటి? ఆ సమయంలో ఏం జరిగింది..
అనకాపల్లిలో బాణసంచా కేంద్రంలో ప్రమాదానికి కారణం ఏంటి? ఆ సమయంలో ఏం జరిగింది..
KTR News: ఎస్సీ డిక్లరేషన్ అమలు చేయకుండా మోసం, రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలి - కేటీఆర్
ఎస్సీ డిక్లరేషన్ అమలు చేయకుండా మోసం, రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలి - కేటీఆర్
HIT 3 Trailer: మనుషుల మధ్య అర్జున్, మృగాల మధ్య సర్కార్ - నాని 'హిట్ 3' ట్రైలర్ గూస్ బంప్స్ అంతే!
మనుషుల మధ్య అర్జున్, మృగాల మధ్య సర్కార్ - నాని 'హిట్ 3' ట్రైలర్ గూస్ బంప్స్ అంతే!
Mehul Choksi Arrest: వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ బెల్జియంలో అరెస్ట్, భారత్ విజయంగా పేర్కొన్న కేంద్ర మంత్రి
వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ బెల్జియంలో అరెస్ట్, భారత్ విజయంగా పేర్కొన్న కేంద్ర మంత్రి
Upcoming Telugu Movies: అవెయిటెడ్ మూవీస్ చూసేద్దామా! - ఈ వారం థియేటర్, ఓటీటీల్లో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్
అవెయిటెడ్ మూవీస్ చూసేద్దామా! - ఈ వారం థియేటర్, ఓటీటీల్లో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్
Anna Lezhneva: టీటీడీ అన్నదాన ట్రస్ట్‌కు పవన్ సతీమణి విరాళం - భక్తులకు స్వయంగా అన్న ప్రసాదం వడ్డించిన అన్నా లెజినోవా
టీటీడీ అన్నదాన ట్రస్ట్‌కు పవన్ సతీమణి విరాళం - భక్తులకు స్వయంగా అన్న ప్రసాదం వడ్డించిన అన్నా లెజినోవా
Embed widget