అన్వేషించండి

CM Jagan : విద్యార్థుల సిలబస్‌లో ఏఐ తప్పనిసరి కావాలి - సీఎం జగన్ ఆకాంక్ష !

విద్యా కరికులంలో ఏఐ భాగంకావాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. వైస్ చాన్సలర్లతో జరిగిన భేటీలో ఆయన పలు ఆలోచనలు వెల్లడించారు.

 

CM jagan :    విద్యా వ్యవస్థలో  వర్చువల్‌ రియాలిటీ ,  అగ్‌మెంటెడ్‌ రియాలిటీ ,  ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ లు సిలబస్‌లో  భాగంగా ఉండాలని.. సీఎం జగన్ ఆకాంక్షించారు.  టెక్నాలజీల సాంకేతికతను విద్యా వ్యవస్థలో పెంచాల్సి ఉందన్నారు.  లో లెవల్‌ మెషిన్‌ లెర్నింగ్, మెటావర్స్‌తో మిళితం చేయాలి. మన విద్యార్థులు ఏఐలో నిష్ణాతులుగా మారి, ఆ తర్వాత క్రియేటర్లుగా రాణించేలా ఇక్కడి నుంచే తొలి అడుగు వేయాలి. అందుకే పాఠశాల విద్య, ఉన్నత విద్య స్థాయిలో వేర్వేరుగా ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేస్తామని చెప్పారు. వైస్ చాన్సలర్లతో జరిగిన సమావేశంలో సీఎం జగన్ తన ఆలోచనలు వివరించారు.  అత్యుత్తమ ప్రతిభావంతుల ద్వారా పాశ్చాత్య దేశాల విద్యా విధానంలోని అంశాలతో మన కరిక్యులమ్‌ను రీడిజైన్‌ చేద్దామని పిలుపునిచ్ారు. 

ఆంధ్రప్రదేశ్‌ విద్యా విధానంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)ను ప్రవేశ పెట్టడం ద్వారా విద్యార్థులకు అత్యుత్తమ బోధన, నేర్చుకునే సామర్థ్యం పెంచడంతో పాటు.. వారిని ఏఐ క్రియేటర్లుగా తీర్చిదిద్దేలా పాఠ్య ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వర్సిటీల వీసీలకు పిలుపునిచ్చారు. పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు కరిక్యులమ్‌లో ఏఐ ఒక భాగం కావాలని స్పష్టం చేశారు. భవిష్యత్తు విద్యా విధానాన్ని ఏఐ మార్చబోతోందని, ఈ రూపంలో ప్రపంచం నాలుగో పారిశ్రామిక విప్లవం దిశగా అడుగులు వేస్తోందని చెప్పారు.

బోధన, నైపుణ్యాభివృద్ధిలో తొలిసారిగా ఎమర్జింగ్‌ టెక్నాలజీ అనుసంధానం చేసేలా వేగవంతంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యా శాఖ అధికారులు, విశ్వవిద్యాలయాల వైస్‌ చాన్సలర్లతో గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థుల్లో ప్రాక్టికల్‌ అప్లికబులిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ను తీసుకురావడంతో పాటు మరిన్ని వర్టికల్స్‌ చదువుకునే అవకాశం ఇవ్వాలన్నారు.
 
  ప్రపంచ స్థాయిలో మన విద్యార్థులను అనేక రంగాల్లో లీడర్లుగా చూడాలనుకుంటున్నాం. అందుకు తగ్గట్టుగా మనం చదువులు అందిస్తున్నామో లేదో ఆలోచించాలి. ఇప్పుడు ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ విప్లవం వేగంగా అడుగులు వేస్తోంది. అందులో మనం వెనుకబడితే కేవలం అనుసరించే వాళ్లుగానే మిగిలిపోతాం. ఏఐ అభివృద్ధి చెందేకొద్దీ.. దానిని వినియోగించుకుని, సామర్థ్యాన్ని పెంచుకునే వర్గం ఒకటైతే.. ఏఐని క్రియేట్‌ చేసే వర్గం మరొకటి తయారవుతుందని జోస్యం  చెప్పారు.  జర్మనీ వంటి దేశంలో నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరత ఉంది.  భారతదేశంలోనైనా.. ఆంధ్రప్రదేశ్‌లో చూసినా సుమారు 70 శాతం మంది పనిచేసే వయస్కులు ఉన్నారు. వీరికి సరైన విజ్ఞానం, నైపుణ్యం అందించేందకు విద్యా రంగంలో మార్పులకు శ్రీకారం చుట్టాలన్నారు. 
 
  మన వాళ్లు మంచి డిగ్రీ కోసం విదేశాలకు వెళ్లాల్సిందే. ఏపీలో చదువుకునే విద్యార్థులకు నచ్చిన వర్టికల్స్‌ చదువుకునే అవకాశాలు ఇవ్వాలి. తాజాగా డిగ్రీలకు సంబంధించి క్రెడిట్స్‌ ఇస్తున్నాం. ఇకపై వాటి స్థాయిని పెంచుతూ ప్రతి ఫ్యాకల్టీలో ఎక్కువ ఆప్షన్లలో బోధన సాగించాలి. ఇప్పటికే ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేసి, ఉద్యోగాల కల్పన దిశగా అడుగులేశాం. విద్యార్థుల ఉన్నతికి ఇలాంటి ఎన్నో మార్పులు అవసరమ్నారు.  సెక్యూరిటీ అనాలసిస్, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ వంటి వర్టికల్‌ కోర్సులకు బోధన సామర్థ్యం మన దగ్గర అందుబాటులో లేకపోతే.. వర్చువల్‌ రియాలిటీని.. ఆగ్‌మెంటెడ్‌ రియాలిటీతో అనుసంధానించి వర్చువల్‌ క్లాస్‌ టీచర్‌ ద్వారా పాఠాలు చెప్పిద్దామన్నరు.  

వైద్య విద్య కోర్సుల్లోని బోధన పద్ధతుల్లో గణనీయమైన మార్పులు రావాలి. భవిష్యత్తులో ఐదేళ్ల మెడికల్‌ కోర్సులో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచాలి. శరీర భాగాలను కోసి ఆపరేషన్‌ చేసే రోజులు మారిపోయాయి. కంప్యూటర్ల ద్వారా ఏఐను వాడకుని చిన్న చిన్న రంధ్రాలతో ఆపరేషన్‌ చేస్తున్నారు. అందుకే వైద్య విద్యలో రోబోటిక్స్, ఏఐలను భాగస్వామ్యం చేయాలన్నారు.  ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్, ఎంఐటీ, కేంబ్రిడ్జ్‌ వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లోని పాఠ్యపుస్తకాలు, బోధనా పద్ధతులు, ప్రశ్నపత్రాల సరళి మన కంటే ఎంతో భిన్నంగా ఉంటుంది. అక్కడ టెక్ట్ బుక్స్‌ విద్యార్థులకు ఇచ్చి సమాధానాలు రాయిస్తారు. తద్వారా ప్రాక్టికల్‌ అప్లికబిలిటీని పరీక్షిస్తారు. అందుకే మనదగ్గర కూడా ప్రశ్నపత్రాల రూపకల్పన, బోధనా పద్ధతులు పూర్తిగా మారాలన్నారు.  


విద్యా వ్యవస్థలో పాఠశాల స్థాయి నుంచే సమూల మార్పులు రావాలి. ఇప్పటికే మనం ఆ దిశగా చర్యలు చేపట్టాం. ఇంగ్లిష్‌ మీడియం చదువులు, బైలింగ్వల్‌ పాఠ్య పుస్తకాలు, ఆరో తరగతి నుంచి డిజిటల్‌ బోధనను తీసుకొచ్చాం. డిసెంబర్‌ నాటికి 63 వేల క్లాస్‌ రూమ్స్‌ను ఐఎఫ్‌పీ ఫ్యానెల్స్‌తో డిజిటలైజ్‌ చేస్తున్నాం. ఇప్పటికే 31 వేల తరగతి గదుల్లో ప్యానెల్స్‌ ఏర్పాటు చేశామన్నారు.   విద్యా రంగంలో ఇప్పుడు జరుగుతున్న మార్పులను గమనిస్తే.. మనం ఒక స్థాయిలో ఉంటే.. లక్ష్యం ఇంకో స్థాయిలో ఉంది. ఈ గ్యాప్‌ను పూడ్చాలంటే వైస్‌ చాన్సలర్లు కూడా ఆలోచించాలన్నారు.  

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Viveka murder case:  వివేకా హత్య కేసులో మరో మలుపు! దస్తగిరిని జైల్లో బెదిరించిన ఘటనపై విచారణకు ప్రత్యేక టీం ఏర్పాటు!
వివేకా హత్య కేసులో మరో మలుపు! దస్తగిరిని జైల్లో బెదిరించిన ఘటనపై విచారణకు ప్రత్యేక టీం ఏర్పాటు!
iBOMMA Ravi : iBOMMA రవి రాబిన్ హుడ్... - RGV లాజిక్... నెటిజన్లకు షాక్
iBOMMA రవి రాబిన్ హుడ్... - RGV లాజిక్... నెటిజన్లకు షాక్
Shiva Jyothi : తిరుమల ప్రసాదంపై కామెంట్స్ - వివాదంలో యాంకర్ శివజ్యోతి... వీడియో వైరల్
తిరుమల ప్రసాదంపై కామెంట్స్ - వివాదంలో యాంకర్ శివజ్యోతి... వీడియో వైరల్
ibomma: పాప్ కార్న్ బక్కెట్‌ నుంచి ఐ బొమ్మ ఆలోచన- పోలీసు కస్డడీలో రవి చెప్పిన సంచలన విషయాలు!
పాప్ కార్న్ బక్కెట్‌ నుంచి ఐ బొమ్మ ఆలోచన- పోలీసు కస్డడీలో రవి చెప్పిన సంచలన విషయాలు!
Advertisement

వీడియోలు

India vs South Africa 2nd Test Match | రెండో టెస్ట్ నుంచి శుభమన్ గిల్ అవుట్
Australia Vs England 1st Test Ashes 2025 |  యాషెస్‌లో చెలరేగిన బౌలర్లు
Gambhir Warning to Team India | టీమిండియా ప్లేయర్లకు గంభీర్ వార్నింగ్ ?
Asia Cup Rising Stars 2025 | సెమీ ఫైనల్ లో భారత్ ఓటమి
Akhanda 2 Thaandavam Trailer Reaction | బాబోయ్ బాలయ్యా...వన్ మ్యాన్ ఆర్మీగా మారి యుద్ధం | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Viveka murder case:  వివేకా హత్య కేసులో మరో మలుపు! దస్తగిరిని జైల్లో బెదిరించిన ఘటనపై విచారణకు ప్రత్యేక టీం ఏర్పాటు!
వివేకా హత్య కేసులో మరో మలుపు! దస్తగిరిని జైల్లో బెదిరించిన ఘటనపై విచారణకు ప్రత్యేక టీం ఏర్పాటు!
iBOMMA Ravi : iBOMMA రవి రాబిన్ హుడ్... - RGV లాజిక్... నెటిజన్లకు షాక్
iBOMMA రవి రాబిన్ హుడ్... - RGV లాజిక్... నెటిజన్లకు షాక్
Shiva Jyothi : తిరుమల ప్రసాదంపై కామెంట్స్ - వివాదంలో యాంకర్ శివజ్యోతి... వీడియో వైరల్
తిరుమల ప్రసాదంపై కామెంట్స్ - వివాదంలో యాంకర్ శివజ్యోతి... వీడియో వైరల్
ibomma: పాప్ కార్న్ బక్కెట్‌ నుంచి ఐ బొమ్మ ఆలోచన- పోలీసు కస్డడీలో రవి చెప్పిన సంచలన విషయాలు!
పాప్ కార్న్ బక్కెట్‌ నుంచి ఐ బొమ్మ ఆలోచన- పోలీసు కస్డడీలో రవి చెప్పిన సంచలన విషయాలు!
AI Chatbots on Mental Health : మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోన్న AI Chatbots.. AI సైకోసిస్​పై నిపుణుల హెచ్చరికలివే
మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోన్న AI Chatbots.. AI సైకోసిస్​పై నిపుణుల హెచ్చరికలివే
Special Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్! తిరుపతి-షిర్డీ ప్రత్యేక రైళ్లు పొడిగింపు, తేదీలు ఇవే!
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్! తిరుపతి-షిర్డీ ప్రత్యేక రైళ్లు పొడిగింపు, తేదీలు ఇవే!
CNAP Caller ID System:ట్రూ-కాలర్ లాంటి కాలర్ ID సిస్టమ్ తీసుకొస్తున్న ప్రభుత్వం- రెండింటికీ తేడా తెలిస్తే షాక్ అవుతారు?
ట్రూ-కాలర్ లాంటి కాలర్ ID సిస్టమ్ తీసుకొస్తున్న ప్రభుత్వం- రెండింటికీ తేడా తెలిస్తే షాక్ అవుతారు?
Hyderabad Global City : గ్లోబల్‌ సిటీగా హైదరాబాద్‌! ఇంతకీ దీన్ని ఎవరు గుర్తిస్తారు? ఉండాల్సిన లక్షణాలేంటీ?
గ్లోబల్‌ సిటీగా హైదరాబాద్‌! ఇంతకీ దీన్ని ఎవరు గుర్తిస్తారు? ఉండాల్సిన లక్షణాలేంటీ?
Embed widget