అన్వేషించండి

AP Assembly 2022 Live Updates: ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ గా కోలగట్ల వీరభద్ర స్వామి ఎన్నిక

నేటి ఏపీ అసెంబ్లీ లైవ్ అప్ డేట్స్ ఈ లైవ్ పేజీలో చూడవచ్చు. తాజా సమాచారం కోసం ఈ బ్లాగ్ ని రీఫ్రెష్ చేయండి.

Key Events
Andhra pradesh assembly 2022 live updates CM Jagan YSRCP leaders speech in ap assembly AP Assembly 2022 Live Updates: ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ గా కోలగట్ల వీరభద్ర స్వామి ఎన్నిక
ప్రతీకాత్మక చిత్రం

Background

వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులకు కట్టుబడి ఉందని మంత్రి గుడివాడ అమర్ నాథ్ మరోసారి స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్లేందుకే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామని స్పష్టంచేశారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని పిటిషన్ వేశామన్నారు. శివరామకృష్ణన్‌ కమిటీ నివేదిక రాకముందే టీడీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించిందని ఆరోపించారు. అప్పట్లో రాజధానిపై చంద్రబాబు వేసింది ఎక్స్‌పర్ట్‌ కమిటీ కాదని, ఇన్వెస్ట్‌మెంట్‌ కమిటీ అని ఎద్దేవా చేశారు. రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిదే అని కేంద్రం పార్లమెంట్ లో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ విషయాన్ని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసిందన్నారు. అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతం అవ్వడంతో ఉద్యమాలు వస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలకు భంగం వాటిల్లే విధంగా ఉన్న హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్‌ చేశామని మంత్రి గుడివాడ అమర్ నాథ్ తెలిపారు. 

రాజధాని అంశం రాష్ట్రానికి చెందినదే 

"రాజధానిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశాం. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై శాసనసభలో చర్చ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిపై అధికారం లేదని సరికాదని శాసనసభ అభిప్రాయపడింది. సీఆర్డీఏ చట్టాన్ని 2014లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం చేసింది. అది కేంద్రం చేసిన చట్టం కాదు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టానికి రాష్ట్ర ప్రభుత్వానికి మార్చడానికి అధికారం లేదని అనడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాం. టీడీపీ ఎంపీ పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది. రాజధాని అంశంపై రాష్ట్రానికి చెందినది అని కేంద్రం చెప్పింది. రాజ్యాంగంలోని అన్ని అంశాలను గుర్తుచేస్తూ సుప్రీంలో పిటిషన్ వేశాం. పునర్విభజన చట్టం ప్రకారం ఓ కమిటీని ఏర్పాటుచేసి దాని ప్రకారం రాజధానిని నిర్ణయించారని కోర్టు తీర్పులో ఉంది. 2014లో రాజధానిపై వేసిన శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఇవ్వకుండా అమరావతిని రాజధానిగా ప్రకటించారు. ఇది ఎలా చెల్లుతుందని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాం." -  మంత్రి గుడివాడ అమర్ నాథ్ 

చంద్రబాబుకు ఎందుకంత తపన

చంద్రబాబు అతని అనుచరులు అమరావతి ప్రాంతంలో ఎవరికీ తెలియకుండా ముందుగానే భూములను కొనుగోలు చేసి ఆ తర్వాత దానిని రాజధానిగా ప్రకటించారని మంత్రి అమర్నాథ్ ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చెప్పినట్లుగా చంద్రబాబు తను కట్టని, కట్టలేని దానికోసం ఎందుకు  తపనపడుతున్నారని ప్రశ్నించారు. ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చిన చంద్రబాబు కనీసం యాభై ఎనిమిది నెలలపాటు అమరావతిని పాలించలేని ఆయన రాష్ట్రాన్ని ఏం చేయాలని ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని అమర్నాథ్ ప్రశ్నించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలనే తపనతో ముఖ్యమంత్రి ప్రయత్నాలు సాగిస్తుంటే కేవలం 29 గ్రామాల కోసం చంద్రబాబు రాష్ట్రాన్ని అగ్నిగుండంగా చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు వెనకుండి నడిపిస్తున్న రాజకీయ యాత్ర అని అమర్నాథ్ విమర్శించారు. రాష్ట్రంలో అమరావతితో పాటు ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నామన్నారు. అమరావతితో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ అభివృద్ధి చేస్తామని, అమరావతి పూర్తిగా అభివృద్ధి చేయడానికి 2024 వరకు తమ ప్రభుత్వానికి సమయం ఉందని అమర్నాథ్ తెలియజేశారు.

11:41 AM (IST)  •  19 Sep 2022

AP Assembly Sessions 2022: ఏపీ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రైతుల నిరసన సెగ

మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రైతుల నిరసన సెగ
సచివాలయం సమీపంలోని విద్యుత్ సబ్ స్టేషన్ గోడదూకి ఒక్కసారిగా అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన రైతులు
రైతుల ఆందోళనతో అసెంబ్లీ-సచివాలయం మార్గంలో భారీగా నిలిచిపోయిన వాహనాలు
ట్రాఫిక్ లో ఇరుక్కుపోయిన పలువురు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
ఎస్కార్ట్ వాహనాల మోతతో దద్దరిల్లిన అసెంబ్లీ పరిసరాలు
రైతులను పోలీసులు అరెస్ట్ చేసి ట్రాఫిక్ క్లియర్ చేసేవరకు అసెంబ్లీకి వెళ్లే మార్గం లేక వాహనాల్లో ఉండిపోయిన ప్రజాప్రతినిధులు

11:35 AM (IST)  •  19 Sep 2022

ఏపీ అసెంబ్లీని తాకిన టీడీపీ రైతు విభాగం నిరసన, పలువురు రైతు నేతల అరెస్ట్

ఏపీ అసెంబ్లీని తాకిన టీడీపీ రైతు విభాగం నిరసన, పలువురు రైతు నేతల అరెస్ట్ 
పోలీసు వలయాన్ని ఛేదించుకుని అసెంబ్లీకి చేరుకున్న తెలుగు రైతు విభాగం అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి
పోలీసులకు, రైతు నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం – కొద్దిసేపు అసెంబ్లీ మార్గంలో నిలిచిన వాహనాలు 
మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, రైతు నాయకుల అరెస్ట్ 
రైతులకు న్యాయం జరిగేవరకూ ప్రభుత్వాన్ని వదిలేది లేదంటున్న మర్రెడ్డి, రైతు నాయకులు 
సచివాలయం సమీపంలోని విద్యుత్ సబ్ స్టేషన్ గోడదూకి ఒక్కసారిగా అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నంచిన రైతులు

Load More
New Update
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vizag Railway Zone: త్వరలోనే విశాఖ రైల్వేజోన్ కార్యకలాపాలు - ది డెక్ భవనంలో తాత్కలిక కార్యాలయం
త్వరలోనే విశాఖ రైల్వేజోన్ కార్యకలాపాలు - ది డెక్ భవనంలో తాత్కలిక కార్యాలయం
YSRCP Ugadi: జగన్‌కు రాజపూజ్యం 1, అవమానం 7 - వైసీపీ కార్యాలయ ఉగాది వేడుకల్లో సిద్ధాంతి పంచాంగం
జగన్‌కు రాజపూజ్యం 1, అవమానం 7 - వైసీపీ కార్యాలయ ఉగాది వేడుకల్లో సిద్ధాంతి పంచాంగం
Andhra Pradesh Job Calendar 2026: ఆంధ్రప్రదేశ్‌లో పదివేల పోస్టులతో జాబ్‌ క్యాలెండర్ విడుదల - ఏటా ఉగాదికి ఉద్యోగాల జాతర!
ఆంధ్రప్రదేశ్‌లో పదివేల పోస్టులతో జాబ్‌ క్యాలెండర్ విడుదల - ఏటా ఉగాదికి ఉద్యోగాల జాతర!
YS Jagan: సీఈసీపై అభిశంసన - జగన్‌కు పెద్ద సమస్య ! మద్దతివ్వకపోతే ఓట్ల గల్లంతు,ఈవీఎంలపై ఎలా మాట్లాడగలరు?
సీఈసీపై అభిశంసన - జగన్‌కు పెద్ద సమస్య ! మద్దతివ్వకపోతే ఓట్ల గల్లంతు,ఈవీఎంలపై ఎలా మాట్లాడగలరు?

వీడియోలు

Petrolium Ministry on LPG Shoratge | ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదంటూనే కేంద్రం సూచనలు | ABP Desam
Negative Campaign on SRH | IPL 2026 కి ముందు సన్ రైజర్స్ పై ఫేక్ పోస్టులు | ABP Desam
CSK Video on Shivam Dube | IPL 2026 కి ముందు చెన్నైలో క్రికెట్ బాల్స్ ఆందోళన | ABP Desam
Virat Kohli Home Coming RCB | IPL 2026 యుద్ధానికి తిరిగొచ్చిన మహారాజు | ABP Desam
Ishan Kishan Interim Captain SRH | ఇషాన్ వైపే ఆరెంజ్ ఆర్మీ మొగ్గు చూపింది అందుకే | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu Assembly Elections 2026:విజయ్ మెడకు కరూర్ తొక్కిసలాట కేసు - జననాయగన్ షూటింగ్ వల్లే 41 మంది ప్రాణాలు పోయాయా?
విజయ్ మెడకు కరూర్ తొక్కిసలాట కేసు - జననాయగన్ షూటింగ్ వల్లే 41 మంది ప్రాణాలు పోయాయా?
Telangana Gaddar Awards 2026 : తెలంగాణ గద్దర్ అవార్డ్స్ 2026 - విజేతలకు పురస్కారాలు
తెలంగాణ గద్దర్ అవార్డ్స్ 2026 - విజేతలకు పురస్కారాలు
Israel-Iran War: దేశంలోని చమురు, గ్యాస్ కంపెనీలకు కేంద్రం కీలక ఆదేశాలు! మధ్యప్రాచ్య సంక్షోభం వేళ ముందస్తు చర్యలు!
దేశంలోని చమురు, గ్యాస్ కంపెనీలకు కేంద్రం కీలక ఆదేశాలు! మధ్యప్రాచ్య సంక్షోభం వేళ ముందస్తు చర్యలు!
Amazon Prime Series : అమెజాన్ ప్రైమ్ వీడియో మెగా లైనప్ - 55కి పైగా కొత్త సిరీస్‌లు... మీర్జాపూర్ నుంచి గూఢచారి 2 వరకూ కంప్లీట్ లిస్ట్
అమెజాన్ ప్రైమ్ వీడియో మెగా లైనప్ - 55కి పైగా కొత్త సిరీస్‌లు... మీర్జాపూర్ నుంచి గూఢచారి 2 వరకూ కంప్లీట్ లిస్ట్
Kalvakuntla Kavitha: డాడీ, మోడీ, చిన్న మోడీపై పోరాటం - తన రాజకీయాన్ని తేల్చేసిన కవిత
డాడీ, మోడీ, చిన్న మోడీపై పోరాటం - తన రాజకీయాన్ని తేల్చేసిన కవిత
Iran War Updates: సహనం నశించింది - ఇరాన్‌కు అరబ్ దేశాల హెచ్చరిక - రంజాన్ ముగియగానే విరుచుకుపడతారా?
సహనం నశించింది - ఇరాన్‌కు అరబ్ దేశాల హెచ్చరిక - రంజాన్ ముగియగానే విరుచుకుపడతారా?
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి గొప్ప మనసు - త్వరలోనే మరో సేవా కార్యక్రమానికి శ్రీకారం
మెగాస్టార్ చిరంజీవి గొప్ప మనసు - త్వరలోనే మరో సేవా కార్యక్రమానికి శ్రీకారం
Viral News: ఇన్‌స్టాగ్రామ్ చూసి ప్రమాదకరమైన ఆయుధాలు తయారు చేసిన పిల్లలు! చెప్పుతో పొట్టుపొట్టున కొట్టిన తండ్రి; వీడియో వైరల్!
ఇన్‌స్టాగ్రామ్ చూసి ప్రమాదకరమైన ఆయుధాలు తయారు చేసిన పిల్లలు! చెప్పుతో పొట్టుపొట్టున కొట్టిన తండ్రి; వీడియో వైరల్!
Embed widget