అన్వేషించండి

AP Contempt Cases : మా ఆదేశాలంటే లెక్కలేదా..? మళ్లీ నలుగురు ఐఏఎస్‌లపై ఏపీ హైకోర్టు ఫైర్..!

స్కూళ్ల ఆవరణల్లో ఇతర నిర్మాణాలు చేపడుతున్నారని హైకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. అలా కట్టవద్దని గతంలో హైకోర్టు ఆదేశాలిచ్చింది. కానీ నిర్మణాలు కొనసాగుతూండటంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.


పాఠశాలల్లో  రైతు భరోసా కేంద్రాలు, పంచాయతీ భవనాలు, గ్రామ సచివాలయ నిర్మాణాలు వద్దంటూ గతంలో తాము ఇచ్చిన ఆదేశాలను పాటించకుండా నిర్మాణాలను ఇంకా కొనసాగించడంపై ఏపీ హైకోర్టు ప్రభుత్వంపై మండిపడింది. ఈ అంశంపై నలుగురు ఐఏఎస్ అధికారులు తమ ఎదుట హాజరు కావాలని గత విచారణ సందర్భంగా హైకోర్టు ఆదేశించింది. దీంతో పంచాయితీ రాజ్ ప్రిన్సిపల్‌ సెక్రటరీ గోపాలకృష్ణ దివ్వేది, అదే శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌, పురపాలక శాఖ సెక్రటరీ శ్రీలక్ష్మీతో పాటు ఐఏఎస్‌ అధికారి విజయ్‌కుమార్‌ కూడా కోర్టుకు హాజరయ్యారు. 

స్కూల్‌ ఆవరణలో భవనాలు నిర్మించవద్దని...ఇచ్చిన ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని ధర్మాసనం మండిపడింది. పిల్లలు చదువుకునే స్కూళ్లను కలుషితం చేస్తున్నారని.. అక్కడకు రాజకీయాలను తీసుకెళ్లడం ఏమిటని ప్రశ్నించింది. వీటిపై  ఐఏఎస్ అధికారులు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ప్రభుత్వం తరపున వాదించిన లాయర్ మాత్రం.. అన్ని విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నివేదిక ఇస్తామని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తదుపరి విచారణను హైకోర్టు  ఆగస్టు 31కి వాయిదా  వేసింది. ఆ రోజున మళ్లీ ఉన్నతాధికారులంతా హాజరు కావాలని ఆదేశించింది. 

నెల్లూరు జిల్లా కోటపోలూరు, కర్నూలు జిల్లాల్లో తాళ్లముడిపిలో పాఠశాలల ఆవరణలో గ్రామసచివాలయాల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఇతర జిల్లాల్లోనూ ఇలాగే నిర్మాణాలు జరుగుతున్నాయి. బడి ఆవరణలో గ్రామసచివాలయాలు కట్టవద్దని గతేడాది జూన్‌లో హైకోర్టు ఆదేశించింది. అయినా ప్రభుత్వం వినిపించుకోలేదు. దీంతో గత జూలై  13వ తేదీన విచారణ జరిపిన హైకరోర్టు సుమోటోగా కేసులు నమోదు చేసింది. పాఠశాల విద్య కమిషనర్‌, పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌లను ప్రతివాదులుగా చేర్చి నోటీసులు పంపింది. వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకే ఉన్నతాధికారులు హైకోర్టుకు హాజరయ్యారు. కాని వారు కోర్టుకు సరైన సమాధానం చెప్పలేకపోయారు. 

ఏపీలో అధికారులు కోర్టులు తీర్పులు ఉల్లంఘించడం.. హైకోర్టు ఆగ్రహానికి గురి కావడం కొత్తేమీ కాదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ సహా అనేక మంది కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఎదుర్కొంటున్నారు. తరచూ ఆయన హైకోర్టుకు హాజరవుతున్నారు. పలువురు అధికారులపై హైకోర్టు కేసులు కూడా నమోదు చేస్తూ ఆదేశాలిచ్చింది. తాజాగా మరో నలుగురు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పాఠశాల ఆవరణల్లో గ్రామ సచివాలయాల నిర్మాణం ఆపకపోవడంపై ప్రభుత్వం ఇచ్చే సమాధానాన్ని బట్టి హైకోర్టు వీరిపై తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. 

డీజీపీ కూడా ఒకటి రెండు సార్లు కోర్టు మెట్లెక్కారు. కోర్టుకు సమాధానం ఇచ్చుకున్నారు. దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తోంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి, ఆయన మంత్రులు చేసిన తప్పులకు అధికారులు కోర్టు మెట్లు ఎక్కుతున్నారని ఆరోపిస్తున్నాయి. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం- లోయలో పడిన కారు, 13 మంది మృతి 
హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం- లోయలో పడిన కారు, 13 మంది మృతి 
Pawan Kalyan Vs Vijay: పవన్, చంద్రబాబుపై సెటైర్... జన నాయకుడికి జైలు సీన్ అవసరమా?
పవన్, చంద్రబాబుపై సెటైర్... జన నాయకుడికి జైలు సీన్ అవసరమా?
Rampachodavaram Mega PTM: ప్రతి విద్యార్థి ప్రతిభను వెలికి తీసేలా విద్యావ్యవస్థలో మార్పులు - రంపచోడవరం మెగా పీటీఎంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ప్రతి విద్యార్థి ప్రతిభను వెలికి తీసేలా విద్యావ్యవస్థలో మార్పులు - రంపచోడవరం మెగా పీటీఎంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
AP Education Reforms: ప్రైవేటు నుంచి ప్రభుత్వ స్కూళ్లకు మారిన లక్ష మందికిపైగా విద్యార్థులు - గిరిజన స్కూళ్లన్నింటికీ సొంత భవనాలు - లోకేష్ కీలక ప్రకటన
ప్రైవేటు నుంచి ప్రభుత్వ స్కూళ్లకు మారిన లక్ష మందికిపైగా విద్యార్థులు - గిరిజన స్కూళ్లన్నింటికీ సొంత భవనాలు - లోకేష్ కీలక ప్రకటన

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Warning to PM Modi : జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Honda ZR-V Review: మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Embed widget