By: ABP Desam | Updated at : 28 Jul 2021 10:20 AM (IST)
आंध्र प्रदेश के मुख्यमंत्री जगन मोहन रेड्डी (फाइल फोटो)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న అప్పులు ఎప్పుడూ చర్చనీయాంశం అవుతూనే ఉన్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా... ఈ అంశంలో అధికారికంగా స్పందించింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ వేసిన ప్రశ్నకు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరంలో అనుమతించిన దాని కంటే.. రూ.4,872 కోట్లు అప్పు చేసిందని తెలిపారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు, మున్సిపల్ పన్నుల పెంపు సహా అనేక సంస్కరణలు అమలు చేయడం వల్ల కల్పించిన అదనపు రుణ సౌకర్యంతో కలిపి.. మొత్తం రూ.49,497 కోట్ల రుణం తీసుకునే వెసులుబాటు కలిగినా రాష్ట్ర ప్రభుత్వం అప్పు రూ.54,369 కోట్లు అప్పు తీసుకుందని తెలిపారు.
అయితే పార్లమెంట్కు కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి ఇచ్చిన సమాచారం కన్నా ఎక్కువగా ఏపీ అప్పులు చేసిందనే ఆరోపణలు కొద్ది రోజులుగా వినిపిస్తున్నాయి. లెక్కల్లోకి రాకుండా అప్పులు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అప్పుల లెక్కల్లోకి ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ రావు. అంటే.. కార్పొరేషన్ల పేరుతో.. ఇతర వాటితో తీసుకునే రుణాలు... ఏపీ సర్కార్ గ్యారంటీల ద్వారా తెచ్చే రుణాలు ఉంటాయి. వాటిని డైరక్ట్ ప్రభుత్వ అప్పులుగా చెప్పరు. అలాంటివే ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్, మెడికల్ కార్పొరేషన్ వంటి వి ఏర్పాటు చేసి.. ఎఫ్ఆర్బీఎం చట్టం కళ్లుగప్పేందుకు స్పెషల్ పర్పస్ వెహికల్స్ను తేవడం ద్వారా నిధుల సమీకరణ చేపట్టడం వంటివి చేస్తోంది. 2020-21 రాబడుల ప్రకారం గ్యారంటీలు ఇచ్చేందుకు గరిష్ట పరిమితి రూ. 1,06,200కోట్లు కాగా, మార్చి 2021నాటికి ఇచ్చిన గ్యారంటీలు బడ్జెట్ లో చెప్పినవే రూ. 91,330కోట్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ. 21,500కోట్ల గ్యారంటీ ఇచ్చి రూ. 18,500కోట్లు రుణం తీసుకుంది. ఇది ఆ ఖాతాలో వేయలేదు. అయితే.. తాము గ్యారంటీ ఇవ్వలేదని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది.
అయితే ఈ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ కాకుండా.. ఈ ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.42,472 కోట్లు రుణాలుగా తీసుకోవచ్చని కేంద్రం వెసులుబాటు ఇచ్చింది. అయితే ఇప్పటి వరకూ ఏపీ చేసిన అప్పుల లెక్కలను తీసుకున్న కేంద్రం...రుణ పరిమితిని రూ.27,668 కోట్లుగా తేల్చింది. కోత వేసిన రుణపరిమితి మేరకు ఇప్పటికే ఏపీ అప్పు చేసిందని కేంద్రం గుర్తించింది. ఈ రెండింటి మధ్య తేడా కేంద్రం.. లోక్సభకు ఇచ్చిన సమాచారం కంటే ఎక్కువ ఉంది. అంటే కేంద్రం వద్ద ఏపీ అప్పులపై ఇంకా ఎక్కువ సమాచారం ఉందన్నమాట.
ఈ పరిస్థితిపై విపక్షాలు కొద్ది రోజులుగా ఆరోపణలు చేస్తున్నాయి. పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్..బ్యాంకుల వద్ద ఏపీ సర్కార్ పెట్టిన తనఖాలు.. హామీల గురించిన పత్రాలను బయట పెట్టి ... ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. దాదాపుగా రూ.41వేల కోట్ల ప్రజాధనానికి లెక్కలు లేవని చెబుతున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం వీటన్నింటినీ తోసి పుచ్చుతోంది. తాము ప్రజల కోసమే అప్పులు చేస్తున్నామని వారిని ఆదుకోవడం తప్పా అని ఎదురు ప్రశ్నిస్తోంది. కేంద్ర ప్రభుత్వం మాత్రం.. ఇప్పటికీ చూసీ చూడనట్లుగానే ఉంటోంది. ఆంధ్రప్రదేశ్ దయనీయమైన ఆర్థిక పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం ఏమైనా మదింపు చేసిందా? అన్న మరో ప్రశ్నకు కేంద్రం లేదని సమాధానమిచ్చింది. అంటే.. ఏపీ ఎలాంటి ఆర్థిక పరిస్థితుల్లో పడినా పట్టించుకోకూడదన్న నిర్ణయానికి వచ్చినట్లుగా కనిపిస్తోంది.
Bhavani Island: పర్యాటక అద్బుతం విజయవాడ భవానీ ఐల్యాండ్, నది మధ్యలో ప్రకృతి అందాలు
Student Debarred: ఏపీ ఇంటర్ బోర్డ్ పరీక్షల్లో కాపీయింగ్ - 13 మంది విద్యార్థుల్ని డిబార్ చేసిన అధికారులు
R Krishnaiah Thanks YS Jagan: ఏ రాజకీయ పార్టీ గుర్తించలేదు, కానీ వైఎస్ జగన్ ఛాన్స్ ఇచ్చారు : ఆర్ కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు
YSRCP Rajyasabha Equation : వైఎస్ఆర్సీపీలో అర్హులు లేరా ? రాజ్యసభ అభ్యర్థుల ఎంపికకు జగన్ చూసిన అర్హత ఏమిటి ?
Breaking News Live Updates: జూబ్లీహిల్స్లో నటుడు బాలకృష్ణ ఇంటి వద్ద రోడ్డు ప్రమాదం
Covid 19 Vaccine Gap: కరోనా వ్యాక్సినేషన్పై కేంద్రం కీలక నిర్ణయం, వ్యాక్సిన్ డోసుల మధ్య గ్యాప్ తగ్గింపు - వారికి మాత్రమే !
Woman Police SHO: మరో మహిళా పోలీస్కు అరుదైన గౌరవం, ఎస్హెచ్వోగా నియమించిన నగర కమిషనర్
Pushpa 2 Release Date: బన్నీ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్, ‘పుష్ప: ది రూల్’ వచ్చేది అప్పుడేనట, మరీ అంత లేటా?
Vaaradhi App: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా, అయితే మీకు గుడ్న్యూస్