News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Guntur Murders: గుంటూరు జిల్లాలో దారుణం.. తల్లీకుమార్తెను కత్తితో పొడిచి చంపిన దుండగుడు

గుంటూరు జిల్లా సత్తెనపల్లి నాగర్జుననగర్ లో దారుణం జరిగింది. ఓ దుండగుడు తల్లీకుమార్తెను కత్తితో పొడిచి చంపాడు.

FOLLOW US: 
Share:

గుంటూరు జిల్లా సత్తెనపల్లి నాగార్జుననగర్‌లో దారుణం జరిగింది. తల్లి, కుమార్తెను దుండగుడు కత్తితో నరికి చంపాడు.  హత్యలకు ఆస్తి పంపకాల గొడవే కారణమని అనుమానిస్తున్నారు. మృతులు తల్లి పద్మావతి(55), ప్రత్యూష(25)గా గుర్తించారు. ఈ ఘటన సంబంధించి  కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయింతే బంధువే ఈ హత్యలకు కారణమని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.  ఈ హత్యకు సంబంధించిన వీడియో ఒకటి బయటకొచ్చింది.

అవే చివరి మాటలు

 తల్లీ కుమార్తెలను వారి బంధువే అతి పాశవికంగా హతమార్చాడు. తల్లీ కుమార్తె ఇంట్లోనే రక్తపుమడుగులో విగతజీవులుగా ఉన్నారు. ఇళ్లంతా రక్తం, రక్తపు మడుగులో అచేతనంగా పడి ఉన్న తల్లిని చూస్తూ, కత్తిపోట్ల బాధతో యువతి తన సోదరుడికి ఫోన్‌ చేసింది. శ్రీనివాస్ అమ్మను, తనను పొడిచాడని తెలిపింది. ఇవే ఆమె చివరి మాటలు. యువతిని ఆసుపత్రికి తరలించేలోపు మార్గమధ్యలో మృతిచెందింది. 

గర్భిణి అని చూడకుండా

 గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో శనివారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటన జరిగింది. ఆస్తి వివాదమే ఈ జంట హత్యలకు కారణమైందని పోలీసులు స్పష్టం చేశారు. తల్లీ కుమార్తెలను వారి బంధువు శ్రీనివాస్ హతమార్చినట్లు  డీఎస్పీ విజయభాస్కరరెడ్డి వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సత్తెనపల్లి మండలం కట్టమూరు వీఆర్వోగా పనిచేసిన కోనూరు శివప్రసాద్‌ నాలుగేళ్ల కిందట చనిపోయారు. కారుణ్య నియామకం కింద ఆయన కుమారుడు లక్ష్మీనారాయణ గుంటూరు ఆర్డీవో కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్నారు. తల్లి వెంకట సుగుణ పద్మావతితో కలిసి నాగార్జుననగర్‌లో ఉంటున్నారు లక్ష్మీనారాయణ. సోదరి లక్ష్మీప్రత్యూషకు  పశ్చిమగోదావరి జిల్లా గణపవరానికి చెందిన సాయితేజస్వికి ఇచ్చి 5 నెలల క్రింత వివాహం జరిపించారు. ప్రస్తుత గర్భిణి అయిన లక్ష్మీప్రత్యూష శ్రావణమాసం కావడంతో సారె కోసం పుట్టింటికి వచ్చింది. 

పొలం వివాదం

లక్ష్మీనారాయణ కుటుంబానికి, వారి పెదనాన్న మధుసూదనరావు కుటుంబాల మధ్య పొలం వివాదం నడుస్తోంది. గుంటూరులో ఉంటున్న మధుసూదనరావు కుమారుడు శ్రీనివాసరావు శనివారం రాత్రి సత్తెనపల్లిలోని చిన్నాన్న ఇంటికి వచ్చి గొడవపడ్డాడు. లక్ష్మీనారాయణ ఇంట్లో లేరని తెలుసుకుని, పద్మావతి, లక్ష్మీప్రత్యూషలపై శ్రీనివాసరావు కత్తితో దాడిచేశాడు. దీంతో తల్లి, కూతురు ఘటనాస్థలిలోనే మృతి చెందారు. నిందితుడు శ్రీనివాసరావు పట్టణ పోలీసుస్టేషన్‌లో లొంగిపోయినట్లు తెలుస్తోంది. దాడి సమయంలో సెల్‌ఫోన్‌లో తీసిన వీడియోలు పోలీసులు సేకరించారు.

Also Read: Uthra Murder Case: పాముతో సీన్ రీ కన్ స్ట్రక్షన్.. ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని ఇంట్రస్టింగ్ కేసు ఇది

Also Read: Uthra Murder Case: పాముతో సీన్ రీ కన్ స్ట్రక్షన్.. ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని ఇంట్రస్టింగ్ కేసు ఇది

Published at : 29 Aug 2021 12:42 AM (IST) Tags: AP Crime news guntur murders sattenapalli murders

ఇవి కూడా చూడండి

Top Headlines Today: నాగార్జున సాగర్ వద్ద హై టెన్షన్; ఏపీ చర్యలు కరెక్టేనన్న అంబటి - నేటి టాప్ న్యూస్

Top Headlines Today: నాగార్జున సాగర్ వద్ద హై టెన్షన్; ఏపీ చర్యలు కరెక్టేనన్న అంబటి - నేటి టాప్ న్యూస్

Ambati Rambabu: 'మా వాటాకు మించి ఒక్క నీటి బొట్టునూ వాడుకోం' - సాగర్ నీటి విషయంలో ఏపీ చర్యలు సరైనవేనన్న మంత్రి అంబటి

Ambati Rambabu: 'మా వాటాకు మించి ఒక్క నీటి బొట్టునూ వాడుకోం' - సాగర్ నీటి విషయంలో ఏపీ చర్యలు సరైనవేనన్న మంత్రి అంబటి

YSRCP Leader Arrest in US : బానిసత్వం, హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు - అమెరికాలో వైసీపీ నేత సత్తారు వెంకటేష్ రెడ్డి అరెస్ట్ !

YSRCP Leader Arrest in US : బానిసత్వం, హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు - అమెరికాలో వైసీపీ  నేత సత్తారు వెంకటేష్ రెడ్డి అరెస్ట్ !

Tension at Nagarjuna Sagar Dam: నాగార్జున సాగర్ వద్ద హై టెన్షన్ - డ్యామ్ పరిశీలించిన కృష్ణా రివర్ బోర్డు సభ్యులు, ఏపీ పోలీసులపై కేసు నమోదు

Tension at Nagarjuna Sagar Dam: నాగార్జున సాగర్ వద్ద హై టెన్షన్ - డ్యామ్ పరిశీలించిన కృష్ణా రివర్ బోర్డు సభ్యులు, ఏపీ పోలీసులపై కేసు నమోదు

AP Police: ఏపీ పోలీసు అధికారుల పల్లెనిద్ర-శాంతి భద్రతలపై ఫోకస్‌

AP Police: ఏపీ పోలీసు అధికారుల పల్లెనిద్ర-శాంతి భద్రతలపై ఫోకస్‌

టాప్ స్టోరీస్

Animal Movie Review - యానిమల్ రివ్యూ: ఇంటర్వెల్‌కే క్లైమాక్స్ 'హై' ఇచ్చిన రణబీర్, సందీప్ రెడ్డి వంగా - మరి, ఆ తర్వాత?

Animal Movie Review - యానిమల్ రివ్యూ: ఇంటర్వెల్‌కే క్లైమాక్స్ 'హై' ఇచ్చిన రణబీర్, సందీప్ రెడ్డి వంగా - మరి, ఆ తర్వాత?

భారత్, ఆస్ట్రేలియా T20 మ్యాచ్ జరిగే స్టేడియంలో పవర్ కట్, రూ.3 కోట్ల బిల్ పెండింగ్

భారత్, ఆస్ట్రేలియా T20 మ్యాచ్ జరిగే స్టేడియంలో పవర్ కట్, రూ.3 కోట్ల బిల్ పెండింగ్

Rs 2000 Notes: రూ.2,000 నోట్లు ఇప్పటికీ చెల్లుతాయి, కీలక అప్‌డేట్‌ ఇచ్చిన ఆర్‌బీఐ

Rs 2000 Notes: రూ.2,000 నోట్లు ఇప్పటికీ చెల్లుతాయి, కీలక అప్‌డేట్‌ ఇచ్చిన ఆర్‌బీఐ

Andhra News: బ్యాంకులో రూ.4 కోట్ల విలువైన బంగారం మాయం - మహిళా అధికారి ఆత్మహత్య

Andhra News: బ్యాంకులో రూ.4 కోట్ల విలువైన బంగారం మాయం - మహిళా అధికారి ఆత్మహత్య