అన్వేషించండి

Jagan vs Lokesh: నాణ్యమైన విద్యకు గండి అన్న జగన్ - ఇంతకీ ఏం చదివావో చెప్పాలంటూ లోకేష్ కౌంటర్

Jagan Lokesh Tweet War: పాఠశాలల రూపురేఖలు మార్చానని జగన్ చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు లోకేష్. జగన్ నిజంగానే అంత ఉద్దరిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గిందో చెప్పాలన్నారు.

Andhra Pradesh News | అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాది ఏపీలో ప్రభుత్వ స్కూళ్లలో చదివే టెన్త్ క్లాస్ విద్యార్థులు CBSE బోర్డ్ పరీక్షలు రాసి ఉండేవారు. కానీ కూటమి అధికారంలోకి రావడంతో ఆ ప్యాట్రన్ పక్కనపెట్టారు. CBSE విషయంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాదికి వారంతా SSC బోర్డ్ పరీక్షలే రాసే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ ఓ ట్వీట్ వేశారు. తమ ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయాలను కూటమి ప్రభుత్వం ఎందుకు పక్కనపెడుతోందని ప్రశ్నించారు. ఈ ట్వీట్ కి నారా లోకేష్ స్పందించారు. విద్యా శాఖ గురించి జగన్ లెక్చర్లు ఇవ్వడం వింతగా ఉందన్నారాయన. జగన్ విమర్శలు, నారా లోకేష్ విమర్శలు.. ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. 

ఇంతకీ జగన్ ట్వీట్ ఏంటి..?
ఏపీలోని ప్రభుత్వ స్కూళ్లలో టెన్త్ విద్యార్థులకు CBSE విధానాన్ని రద్దు చేయడంపై జగన్ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ స్కూళ్లలో కొన్నిచోట్ల ప్రయోగాత్మకంగా ఈ విధానం అమలు చేయాలని గత వైసీపీ ప్రభుత్వం నిర్ణయించి సిలబస్ మార్చి బోధనలో మార్పులు తీసుకొచ్చినా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని రద్దు చేసిందని, ఇది సరికాదని అన్నారాయన. చంద్రబాబు పేదల వ్యతిరేకి అని దీనివల్ల మరోసారి రుజవైందని తన ట్వీట్ లో పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో నాడు-నేడుతో బడుల రూపు రేఖలు మార్చామని, ఇంగ్లిషు మీడియం ప్రవేశ పెట్టామని, సీబీఎస్‌ఈ, ఐబీ సిలబస్ లను ముందుచూపుతో తీసుకొచ్చామని చెప్పారు జగన్. పేద పిల్లల తలరాతలు మార్చే ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నామని, కానీ కొత్త ప్రభుత్వం ఒక్కొక్క నిర్ణయాన్ని రద్దు చేస్తోందని మండిపడ్డారు. టీడీపీ నేతలకు చెందిన ప్రైవేట్ స్కూల్స్ ని ప్రోత్సహించేందుకు, ప్రభుత్వ స్కూళ్లను దెబ్బతీస్తున్నారని విమర్శించారు జగన్. ఆ ట్వీట్ లో చంద్రబాబుతోపాటు విద్యాశాఖ మంత్రిగా లోకేష్ ని కూడా మెన్షన్ చేశారు. 

జగన్ ట్వీట్ కి లోకేష్ బదులిచ్చారు. ఏం చదివారో.. ఎక్కడ చదివారో తెలియని జగన్ ఇలాంటి లెక్చర్లివ్వడం వింతగా ఉందన్నారు లోకేష్. కనీస అవగాహన లేకుండా రాత్రి ఆత్మలతో మాట్లాడి ఉదయం జగన్ నిర్ణయాలు తీసుకునేవారని తన ట్వీట్ లో ఎద్దేవా చేశారు. ఆ నిర్ణయాలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల పాలిట శాపంగా మారాయన్నారు. CBSE విధానం ప్రవేశపెట్టినా.. పిల్లలకు పరీక్షలు రాయడానికి అవసరమైన సామర్థ్యాలు పెంచే దిశగా ప్రభుత్వం ఆలోచించలేదని, ఉపాధ్యాయులకు ఎలాంటి శిక్షణ ఇవ్వలేదని అన్నారు. జగన్ నిర్ణయం వల్ల ప్రభుత్వ స్కూళ్లలో  చదువుతున్న 75వేల మంది టెన్త్ క్లాస్ విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు లోకేష్. నిపుణులతో తాము చర్చిస్తామని, వచ్చే విద్యాసంవత్సరం 6వ తరగతి నుండే పరీక్షా విధానంలో మార్పులు తీసుకొస్తామని అన్నారు. 

వైసీపీ దిగిపోయేటప్పుడు పిల్లలకు ఇచ్చే కోడి గుడ్లు, చిక్కీలు, ఆఖరికి ఆయమ్మల జీతాలు కూడా బకాయి పెట్టి పోయిందని అన్నారు లోకేష్. అలాంటి కంసమామ జగన్ అని సెటైర్లు పేల్చారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చానని జగన్ చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్ నిజంగానే అంత ఉద్దరిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గిందో చెప్పాలని నిలదీశారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
VB GRAM G Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో వీబీ గ్రామ్‌జీ పథకం ప్రారంభం! గ్రామాల్లో విప్లవం మొదలైందన్న సీఎం, డిప్యూటీ సీఎం!
ఆంధ్రప్రదేశ్‌లో వీబీ గ్రామ్‌జీ పథకం ప్రారంభం! గ్రామాల్లో విప్లవం మొదలైందన్న సీఎం, డిప్యూటీ సీఎం!
Prasna Ravan Bail and Arrest: అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్‌ ప్రశ్న రావణ్‌ మళ్లీ అరెస్టు! 2025 నాటి కేసులో చర్యలు!
అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్‌ ప్రశ్న రావణ్‌ మళ్లీ అరెస్టు! 2025 నాటి కేసులో చర్యలు!
AP TET 2026: ఆంధ్రప్రదేశ్‌ టెట్ అభ్యర్థులకు అలర్ట్! దరఖాస్తుల సవరణకు వన్ టైమ్ డిలీట్ ఆప్షన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌ టెట్ అభ్యర్థులకు అలర్ట్! దరఖాస్తుల సవరణకు వన్ టైమ్ డిలీట్ ఆప్షన్! పూర్తి వివరాలు ఇవే!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Basara Temple Theft Case: బాసర ఆలయంలో చోరీ చేసిన దొంగ పట్టివేత - వెండి కిరిటం రికవరీ - పోలీస్ ఆపరేషన్ సాగింది ఇలా !
బాసర ఆలయంలో చోరీ చేసిన దొంగ పట్టివేత - వెండి కిరిటం రికవరీ - పోలీస్ ఆపరేషన్ సాగింది ఇలా !
KTR Latest News:సవాళ్లు విసిరి పారిపోయారు, అసెంబ్లీలోనైనా చర్చ పెట్టండి! ప్రభుత్వానికి కేటీఆర్ ఛాలెంజ్‌ 
సవాళ్లు విసిరి పారిపోయారు, అసెంబ్లీలోనైనా చర్చ పెట్టండి! ప్రభుత్వానికి కేటీఆర్ ఛాలెంజ్‌ 
Sky High Marriage Proposal New York: ఆకాశమే హద్దుగా సాహసాల జంట ప్రేమకథ.. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌పై రోమాంచిత ప్రపోజల్! వైరల్ వీడియో
ఆకాశమే హద్దుగా సాహసాల జంట ప్రేమకథ.. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌పై రోమాంచిత ప్రపోజల్! వైరల్ వీడియో
Kalvakuntla Kavitha Uppal Bhagayat Protest: ఉప్పల్ భగాయత్ లో తీవ్ర ఉద్రిక్తత.. తెలంగాణ రక్షణ సేన భూపోరాటంలో కవితకు గాయాలు.. అరెస్ట్!
ఉప్పల్ భగాయత్ లో తీవ్ర ఉద్రిక్తత.. తెలంగాణ రక్షణ సేన భూపోరాటంలో కవితకు గాయాలు.. అరెస్ట్!
Balan The Boy OTT : ఓటీటీలోకి బాలన్ ది బాయ్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఓటీటీలోకి బాలన్ ది బాయ్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Breaking News: అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
Amarnath Yatra 2026 : అమర్‌నాథ్ యాత్ర 2026.. ఈ డాక్యుమెంట్స్ లేకపోతే అనుమతి ఉండదు, కచ్చితంగా తీసుకెళ్లాల్సిందే
అమర్‌నాథ్ యాత్ర 2026.. ఈ డాక్యుమెంట్స్ లేకపోతే అనుమతి ఉండదు, కచ్చితంగా తీసుకెళ్లాల్సిందే
Ketan Agarwal Lohagad Fort death case: కేతన్‌ను సియానే తోసేసిందన్నదానికి ఆధారాల్లేవంటున్న పోలీసులు - ఇక తప్పించుకున్నట్లేనా ?
కేతన్‌ను సియానే తోసేసిందన్నదానికి ఆధారాల్లేవంటున్న పోలీసులు - ఇక తప్పించుకున్నట్లేనా ?
Embed widget