అన్వేషించండి

Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం పథకానికి సంబంధించిన కీలక అప్‌డేట్‌ వచ్చింది. ఈ ఏడాది సుమారు 78 లక్షల మంది విద్యార్థులను అర్హులుగా గుర్తించింది ప్రభుత్వం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • తల్లికి వందనం పథకం నిధులు త్వరలో లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతాయి.
  • రాష్ట్రవ్యాప్తంగా 78 లక్షల మంది విద్యార్థులు ఈ పథకానికి అర్హులుగా గుర్తించారు.
  • పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థుల చదువుకు ఆర్థిక తోడ్పాటు అందిస్తుంది.
  • ఖాతా యాక్టివ్‌గా ఉంచుకోవాలి, ఆధార్, NPCI మ్యాపింగ్ తప్పనిసరి.

Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం నిధులు మరికొన్ని రోజుల్లో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసేందుకు సిద్ధమవుతోంది. 2026 విద్యాసంవత్సరానికి సంబంధించి అర్హులైన లబ్ధిదారుల జాబితా రూపకల్పన, నగదు జమ ప్రక్రియపై విద్యాశాఖ అధికారులు కసరత్తు వేగవంతం చేశారు. పేదరికంతో ఏ ఒక్క విద్యార్థి కూడా చదువుకు దూరం కాకూడదనే ఉన్నత లక్ష్యంతో సాగుతున్న ఈ పథకం ద్వారా ఈ ఏడాది లక్షలాది కుటుంబాలకు ఆర్థిక ఊరట కలగనుంది. 

78 లక్షల మంది అర్హులు 

ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా సుమారు 78 లక్షల మంది విద్యార్థులను తల్లికి వందనం పథకానికి ప్రాథమికంగా అర్హులుగా తేల్చారు. పాఠశాలల నుంచి సేకరించిన విద్యార్థుల డేటాను ఇప్పటికే క్రోడీకరించి, తుది వడపోత కోసం క్షేత్రస్థాయి అధికారులకు పంపారు. ప్రస్తుతం గ్రామ, వారు సచివాలయాల్లోని సంక్షేమ కార్యదర్శులు ఈ వివరాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. 

ఈ తనిఖీ ప్రక్రియలో భాగంగా, విద్యార్థుల హాజరు, కుటుంబ ఆర్థిక స్థితిగతులు, ఇతర అర్హత ప్రమాణాలను సరి చూస్తున్నారు. అనర్హులను తొలగించి, నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేయడమే లక్ష్యంగా ఈ పరిశీలన సాగుతోంది. ఈ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే అర్హుల తుది జాబితాను విడుదల చేసి, ముఖ్యమంత్రి చేతుల మీదుగా నగదును విడుదల చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 

పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా పాఠశాలలకు వెళ్లడం మానేయకూడదనేది ఈ పథకం ప్రధాన ఉద్దేశం. తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపేలా ప్రోత్సహించడానికి, వారి విద్యా అవసరాల కోసం ప్రభుత్వం నేరుగా తల్లుల ఖాతాల్లోనే నగదును జమ చేస్తోంది. రాష్ట్రంలో అక్షరాస్యత శాతాన్ని పెంచడానికి, డ్రాపౌట్స్‌ సంఖ్యను తగ్గించడానికి తీసుకున్న ఒక సామాజిక విప్లవం. 

ఖాతాల్లో డబ్బులు పడాలంటే మీరు చేయాల్సిన పనులు ఇవే !

తల్లికి వందనం నిధులు ఎటువంటి సాంకేతిక అడ్డంకులు లేకుండా నేరుగా ఖాతాల్లో జమ కావాలి అంటే లబ్ధిదారులు కొన్ని ముఖ్యమైన చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మీ బ్యాంకు ఖాతా యాక్టివ్‌గా ఉంచుకోవాలి. అలా ఉందో లేదో చూడాలి. చాలా కాలం నుంచి లావాదేవీలు జరపని ఖాతాలు ఇన్ యాక్టివ్‌ అయ్యే అవకాశం ఉంది. విద్యార్థి తల్లి బ్యాంక్‌ ఖాతాకు ఆధార్ నెంబర్ తప్పనిసరిగా లింక్ అయ్యి ఉండాలి. ఎన్‌పీసీఐ మ్యాపింగ్ కీలకమైన అంశం. ప్రభుత్వ పథకాల నగదు డైరెక్ట్‌గా బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా అందాలంటే, ఖాతాకు ఎన్‌పీసీఐ మ్యాపింగ్ పూర్తి అయి ఉండాలి. పాఠశాల రికార్డుల్లో, సచివాలయ డేటాలో విద్యార్థి, తల్లి వివరాలు ఒకే విధంగా ఉండాలి. 

తల్లిదండ్రులు తమ వివరాలను లేదా ఎన్‌పీసీఐ స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో లేదా స్థానిక గ్రామ వార్డు సచివాలయంలో చెక్ చేసుకోవచ్చు. ఏవైనా తప్పులు ఉంటే వెంటనే సరిచేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. 

గత ఏడాది వివరాలు పరిశీలిస్తే...

 గత ఆర్థిక సంవత్సరం ఏపీ ప్రభుత్వం సుమా౩రు రూ. 8, 711 కోట్లను విద్యార్థుల కుటుంబాల ఖాతాల్లో జమ చేసింది. ఈ భారీ మొత్తం రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థుల విద్యా అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషించింది. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో లేదా అంత కంటే ఎక్కువ మొత్తంలో నిధుల విడుదల  చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. 

మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Frequently Asked Questions

తల్లికి వందనం పథకం ఎవరి కోసం ఉద్దేశించబడింది?

ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువు మానేయకూడదని పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థుల కోసం ఈ పథకం ఉద్దేశించబడింది. తల్లిదండ్రులను ప్రోత్సహించి, పిల్లల విద్యా అవసరాలకు ప్రభుత్వం నేరుగా తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తుంది.

ఈ ఏడాది తల్లికి వందనం పథకానికి ఎంతమంది విద్యార్థులు అర్హులుగా గుర్తించారు?

ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా సుమారు 78 లక్షల మంది విద్యార్థులను తల్లికి వందనం పథకానికి ప్రాథమికంగా అర్హులుగా గుర్తించారు.

తల్లికి వందనం నిధులు నేరుగా ఖాతాల్లో జమ కావాలంటే ఏం చేయాలి?

బ్యాంకు ఖాతా యాక్టివ్‌గా ఉంచుకోవాలి, తల్లి బ్యాంకు ఖాతాకు ఆధార్ నంబర్ లింక్ అయి ఉండాలి, మరియు NPCI మ్యాపింగ్ పూర్తి అయి ఉండాలి. పాఠశాల, సచివాలయ డేటాలో విద్యార్థి, తల్లి వివరాలు సరిగ్గా ఉండాలి.

గత ఏడాది తల్లికి వందనం పథకం కింద ఎంత మొత్తం జమ చేశారు?

గత ఆర్థిక సంవత్సరంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుమారు రూ. 8,711 కోట్లను విద్యార్థుల కుటుంబాల ఖాతాల్లో జమ చేసింది. ఇది లక్షలాది మంది విద్యార్థుల విద్యా అవసరాలను తీర్చడంలో సహాయపడింది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan Mohan Reddy On Beach Shacks: వైజాగ్ ఆర్కే బీచ్‌లో మందుబాబులు చిందేయేబోతున్నారా? జగన్ చేసిన విమర్శలేంటీ? అసలు ఈ బీచ్‌ షాక్స్ కథేంటీ? 
వైజాగ్ ఆర్కే బీచ్‌లో మందుబాబులు చిందేయేబోతున్నారా? జగన్ చేసిన విమర్శలేంటీ? అసలు ఈ బీచ్‌ షాక్స్ కథేంటీ? 
ఇంకా దొరకని చిన్నారి జ్ఞానేశ్వరి జాడ.. ఆచూకీ చెబితే రూ.1 లక్ష పారితోషికం.. ఛాన్స్ ఉందా
ఇంకా దొరకని చిన్నారి జ్ఞానేశ్వరి జాడ.. ఆచూకీ చెబితే రూ.1 లక్ష రివార్డ్.. ఛాన్స్ ఉందా
Sai Krishna Murder Case: లాకప్ డెత్ ఒప్పుకోవాలని బలవంతం చేస్తున్నారు, ప్రాణహాని ఉంది: సీఐ నాగరాజు సంచలన వ్యాఖ్యలు
లాకప్ డెత్ ఒప్పుకోవాలని బలవంతం చేస్తున్నారు, ప్రాణహాని ఉంది: సీఐ నాగరాజు సంచలన వ్యాఖ్యలు
Palnadu Road Accident: 2 లారీలు ఢీకొని నలుగురు సజీవ దహనం.. అన్నా కాపాడండి, నాకు పిల్లలున్నారంటూ డ్రైవర్ ఆర్తనాదాలు
2 లారీలు ఢీకొని నలుగురు సజీవ దహనం.. అన్నా కాపాడండి, నాకు పిల్లలున్నారంటూ డ్రైవర్ ఆర్తనాదాలు
Advertisement

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Latest News: తెలంగాణ అప్పులపై చర్చకు ప్లేస్‌, టైం ఫిక్స్ చేయమని కేటీఆర్ సవాల్! తెలంగాణ భవన్‌లో పెడదామని మంత్రి జూపల్లి ప్రతిసవాల్! 
తెలంగాణ అప్పులపై చర్చకు ప్లేస్‌, టైం ఫిక్స్ చేయమని కేటీఆర్ సవాల్! తెలంగాణ భవన్‌లో పెడదామని మంత్రి జూపల్లి ప్రతిసవాల్! 
Serial Killer Book: దొరకకుండా మగవాళ్లను చంపేయడం ఎలా? - పుస్తకం మార్కెట్లోకి వచ్చేసింది - ఇక పురుషులకు రక్షణేది?
దొరకకుండా మగవాళ్లను చంపేయడం ఎలా? - పుస్తకం మార్కెట్లోకి వచ్చేసింది - ఇక పురుషులకు రక్షణేది?
Viral Video: 'హౌ టు కిల్ మెన్' బుక్ చదువుతున్న యువతి! సోనమ్, సియా, ముస్కాన్‌తో పోలుస్తున్న నెటిజన్లు!
'హౌ టు కిల్ మెన్' బుక్ చదువుతున్న యువతి! సోనమ్, సియా, ముస్కాన్‌తో పోలుస్తున్న నెటిజన్లు!
Plot To Topple CM Vijay Government: సీఎం విజయ్ ప్రభుత్వంపై రూ. 35 కోట్ల కుట్ర! టీవీకే ఎమ్మెల్యే కొనుగోలుకు డీఎంకే నేతల యత్నం.. ముగ్గురు అరెస్ట్!
సీఎం విజయ్ ప్రభుత్వంపై రూ. 35 కోట్ల కుట్ర! టీవీకే ఎమ్మెల్యే కొనుగోలుకు డీఎంకే నేతల యత్నం.. ముగ్గురు అరెస్ట్!
WhatsApp User ID:వాట్సాప్ యూజర్ ఐడీతో చిక్కుల్లో మెటా! నోటీసులు పంపేందుకు సిద్ధమవుతున్న కేంద్ర ప్రభుత్వం!
వాట్సాప్ యూజర్ ఐడీతో చిక్కుల్లో మెటా! నోటీసులు పంపేందుకు సిద్ధమవుతున్న కేంద్ర ప్రభుత్వం!
Chandrababu Naidu Reaction Cattle Death: కన్నీటి ఏరువాక.. తుంగభద్రలో కాడెద్దుల మృతి! చలించిపోయిన సీఎం చంద్రబాబు.. రైతు కుటుంబానికి తక్షణ సాయం!
కన్నీటి ఏరువాక.. తుంగభద్రలో కాడెద్దుల మృతి! చలించిపోయిన సీఎం చంద్రబాబు.. రైతు కుటుంబానికి తక్షణ సాయం!
Cocktail 2 OTT : ఓటీటీలోకి రష్మిక లేటెస్ట్ బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఓటీటీలోకి రష్మిక లేటెస్ట్ బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Prakash Raj: ప్రకాష్ రాజ్ వర్సెస్ విష్ణువర్ధన్ రెడ్డి! జర్నలిస్టుల అరెస్టులపై ఏపీలో మొదలైన కొత్త పొలిటికల్ వార్!
ప్రకాష్ రాజ్ వర్సెస్ విష్ణువర్ధన్ రెడ్డి! జర్నలిస్టుల అరెస్టులపై ఏపీలో మొదలైన కొత్త పొలిటికల్ వార్!
Embed widget