అన్వేషించండి

Thalliki Vandanam Scheme: తల్లికి వందనం డబ్బులు పడని వారికి ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. రూ. 325 కోట్లు విడుదల

Andhra Pradesh News | ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం నగదు రాని లబ్దిదారులకు త్వరలోనే నగదు జమ చేయనుంది. ఫస్ట్ క్లాస్, ఇంటర్ ఫస్టియర్ విద్యార్థుల తల్లుల ఖాతాల్లోనూ నగదు జమ చేయనున్నారు.

Thalliki Vandanam Scheme | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న Thalliki Vandanam పథకానికి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే తొలి విడతలో లక్షల మంది తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం నగదు జమ అయినా, కొందరికి సాంకేతిక కారణాల వల్ల డబ్బులు అందలేదు. అలాంటి అర్హులైన లబ్ధిదారులను తిరిగి గుర్తించడంతో పాటు ఒకటో తరగతి, ఇంటర్ ఫస్టియర్ విద్యార్థుల తల్లులకు సైతం నగదు జమ చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.

₹325 కోట్లు మంజూరు
తల్లికి వందనం పథకానికి సంబంధించి తాజాగా ఏపీ ప్రభుత్వం రూ.325 కోట్లను విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ నిధులు అర్హులైన తల్లులు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ మేరకు సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ అయ్యాయి.  తల్లికి వందనం పథకం కోసం ఏపీ ప్రభుత్వం జూన్ నెలలో రూ.10,091 కోట్లు ఖర్చు చేసినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఇందులో రూ.1,346 కోట్లు పాఠశాలల అభివృద్ధికి కేటాయిస్తామని పేర్కొన్నారు. ఒక్కో విద్యార్థికి రూ.15 వేలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం విద్యార్థుల తల్లులు, ఇతర సంరక్షకుల బ్యాంక్ ఖాతాల్లో రూ.13 వేలు జమ చేసింది. రూ.2 వేలను స్కూల్ డెవలప్‌మెంట్ కోసం వినియోగిస్తామని మార్గదర్శకాలలో తెలిపారు. ఇటీవల నగదు రాని లబ్ధిదారుల దరఖాస్తులను వార్డు, గ్రామ సచివాలయాల ద్వారా పరిశీలించి తుది జాబితా సిద్ధం చేశారు.

కొత్త విద్యార్థులకూ ప్రయోజనం
ఈ ఏడాది కొత్తగా స్కూల్‌లో చేరిన విద్యార్థులు కూడా తల్లికి వందనం పథకంలో భాగమయ్యారు. తొలి విడతలో 67.27 లక్షల మంది లబ్ధి పొందగా, రెండో విడతలో ఐదున్నర లక్షల 1వ తరగతి విద్యార్థులు, ఇంటర్ ఫస్టియర్‌లో చేరిన 4.7 లక్షల  విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం నిధులు జమ చేయనుంది.

ఈ వారం నుంచే ఖాతాల్లో డబ్బులు
ప్రస్తుతం అర్హుల తుది జాబితా సిద్ధం చేస్తోంది సర్కార్. ఈ వారం నుంచే లబ్ధిదారుల ఖాతాల్లో తల్లికి వందనం డబ్బులు ఒక్కో విద్యార్థికి రూ.13 వేలు చొప్పున తల్లుల ఖాతాల్లో జమకానున్నాయి. ఇంతవరకు డబ్బులు అందని అర్హులకూ ఈ విడతలో నిధులు అందే అవకాశం ఉంది.

అర్హుల జాబితాలో పేరు చెక్ చేసుకోండి..

అధికారిక వెబ్‌సైట్‌ https://gsws-nbm.ap.gov.in/ లో అర్హుల జాబితాలో మీ పేరు ఉందో, లేదో తెలుసుకోవచ్చు. వెబ్ సైట్‌లో Application Status Check పై క్లిక్ చేసిన తరువాత మీరు తల్లికి వందనం సెలక్ట్ చేసుకోవాలి. అనంతరం మీ ఆధార్ నెంబర్, క్యాప్చాను ఎంటర్ చేయాలి. గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీ మొబైల్ నంబర్‌కు ఓటీపీ (OTP) వస్తుంది. ఆ ఓటీపీని నమోదు చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే తల్లికి వందనం పథకం అర్హుల జాబితాలో మీ వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.

విద్యా ప్రోత్సాహానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. Thalliki Vandanam పథకం ద్వారా సీఎం చంద్రబాబు ప్రభుత్వం విద్యను ప్రోత్సహిస్తూ, ప్రతి విద్యార్థి కుటుంబానికి ఆర్థిక సహాయం చేస్తూ వారిని చదువుకు దూరం కావొద్దనే లక్ష్యంతో ముందడుగు వేస్తోంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

AP Local Body Direct Elections: ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
Minster Lokesh: అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలు - 3,168 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ - చేనేతలకు నేతన్న భరోసా !
ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలు - 3,168 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ - చేనేతలకు నేతన్న భరోసా !
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Direct Elections: ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Rahul Gandhi Delhi NEET Protest: ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
IND vs ZIM 1st T20 Result Update: శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
Minster Lokesh: అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Land Dispute Selfie Suicide Attempt: కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
Embed widget