అన్వేషించండి

TDP Foundation Day: ఇకపై మూడు ముక్కలాటలు ఉండవు.. అమరావతి అభివృద్ధే లక్ష్యం: సీఎం చంద్రబాబు

పార్టీకి కార్యకర్తలే బలమని, వారి త్యాగాలకు టీడీపీలో ఎప్పటికీ గుర్తింపు ఉంటుందని పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతే అని స్పష్టం చేశారు.

అమరావతి: రాష్ట్ర భవిష్యత్తు రాజధాని నిర్మాణంతోనే ముడిపడి ఉంటుందని.. ఇకపై మూడు ముక్కలాటలు ఉండవు.. ఒకే రాష్ట్రం - ఒకే రాజధాని అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతిని వ్యతిరేకించే శక్తులను ఇక్కడ అడుగుపెట్టనివ్వకూడదని, హైదరాబాద్‌ను మించిన నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం (మార్చి 29న) తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 


TDP Foundation Day: ఇకపై మూడు ముక్కలాటలు ఉండవు.. అమరావతి అభివృద్ధే లక్ష్యం: సీఎం చంద్రబాబు

దేశానికే రోల్ మోడల్‌గా టీడీపీ సంస్కరణలు, నిర్ణయాలు..

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు అమరావతి ప్రాధాన్యతను నొక్కి చెప్పారు. రాజధాని అమరావతి కోసం రైతులు ఒక్క పైసా ఆశించకుండా భూములు ఇచ్చారని, అది తెలుగుదేశం పార్టీపై వారికి ఉన్న అచంచలమైన నమ్మకానికి నిదర్శనమని చంద్రబాబు పేర్కొన్నారు. 2019లో టీడీపీ విజయం సాధించి ఉంటే, ఈపాటికే అమరావతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచ స్థాయిలో ఉండేవని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో తాము తెచ్చిన విద్యుత్ సంస్కరణలు, డ్వాక్రా సంఘాల ఏర్పాటు దేశానికే మోడల్‌గా నిలిచాయని, ఇప్పుడు అమరావతి కూడా అదే తరహాలో ఒక గమ్యస్థానంగా మారుతుందని చంద్రాబు చెప్పారు.

పార్టీకి కార్యకర్తలే కీలకం

పార్టీ కోసం ఆస్తులు పోగొట్టుకుని, ప్రాణ త్యాగాలు చేసిన కార్యకర్తలే టీడీపీకి అసలైన బలం అని సీఎం చంద్రబాబు కొనియాడారు. సమర్థంగా పనిచేసే కార్యకర్తలకే పార్టీలో గుర్తింపు ఉంటుందని, వారి త్యాగాలను విస్మరించడం ప్రమాదకరమం అన్నారు.  బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళల జీవితాల్లో వెలుగులు నింపిన పార్టీ ఇదని, సామాన్యులను చట్టసభలకు పంపిన ఘనత స్వర్గీయ ఎన్టీఆర్‌దేనని గుర్తు చేశారు. తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం పుట్టిన ఈ పసుపు జెండా నిరంతరం ఎగురుతూనే ఉంటుందని, రాష్ట్రం బలంగా ఉండాలంటే టీడీపీ బలంగా ఉండాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఏపీ అసెంబ్లీ తీర్మానం..

ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పిస్తూ రాష్ట్ర శాసనసభ చారిత్రక తీర్మానాన్ని మార్చి 28న ఆమోదించింది. గత ప్రభుత్వ హయాంలో వచ్చిన 'మూడు రాజధానుల' ప్రతిపాదనకు స్వస్తి పలుకుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం "ఒకే రాష్ట్రం - ఒకే రాజధాని" విధానాన్ని అధికారికంగా ఖరారు చేసింది. ఈ తీర్మానం ద్వారా అమరావతి కేవలం పరిపాలనా కేంద్రం మాత్రమే కాకుండా, రాష్ట్ర గౌరవానికి చిహ్నమని ప్రభుత్వం స్పష్టం చేసింది.

సభలో తీర్మానాన్ని ప్రవేశపెడుతూ, రాజధాని కోసం భూములిచ్చిన అమరావతి రైతుల త్యాగాలను ప్రభుత్వం కొనియాడింది. హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను గౌరవిస్తూ, రాజధాని నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది. ఈ తీర్మానం ఆమోదం పొందడంతో, అమరావతిపై నెలకొన్న అనిశ్చితి తొలగిపోయి, పెట్టుబడిదారులకు, ప్రజలకు భరోసా లభించింది. భవిష్యత్తులో రాజకీయ మార్పులు సంభవించినా రాజధాని విషయంలో ఎలాంటి మార్పులు ఉండకూడదనే ఉద్దేశంతో ఈ చట్టబద్ధతకు ప్రాధాన్యత ఇచ్చారు. విభజన చట్టం ప్రకారం ఏపీకి అమరావతే శాశ్వత రాజధాని అని ఈ తీర్మానం ద్వారా పునరుద్ఘాటించారు.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Mahindra Scorpio N కొనేందుకు రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేస్తే.. ప్రతి నెల EMI ఎంత కట్టాలి
Mahindra Scorpio N కొనేందుకు రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేస్తే.. ప్రతి నెల EMI ఎంత కట్టాలి
Embed widget