అన్వేషించండి

TDP Foundation Day: ఇకపై మూడు ముక్కలాటలు ఉండవు.. అమరావతి అభివృద్ధే లక్ష్యం: సీఎం చంద్రబాబు

పార్టీకి కార్యకర్తలే బలమని, వారి త్యాగాలకు టీడీపీలో ఎప్పటికీ గుర్తింపు ఉంటుందని పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతే అని స్పష్టం చేశారు.

అమరావతి: రాష్ట్ర భవిష్యత్తు రాజధాని నిర్మాణంతోనే ముడిపడి ఉంటుందని.. ఇకపై మూడు ముక్కలాటలు ఉండవు.. ఒకే రాష్ట్రం - ఒకే రాజధాని అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతిని వ్యతిరేకించే శక్తులను ఇక్కడ అడుగుపెట్టనివ్వకూడదని, హైదరాబాద్‌ను మించిన నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం (మార్చి 29న) తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 


TDP Foundation Day: ఇకపై మూడు ముక్కలాటలు ఉండవు.. అమరావతి అభివృద్ధే లక్ష్యం: సీఎం చంద్రబాబు

దేశానికే రోల్ మోడల్‌గా టీడీపీ సంస్కరణలు, నిర్ణయాలు..

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు అమరావతి ప్రాధాన్యతను నొక్కి చెప్పారు. రాజధాని అమరావతి కోసం రైతులు ఒక్క పైసా ఆశించకుండా భూములు ఇచ్చారని, అది తెలుగుదేశం పార్టీపై వారికి ఉన్న అచంచలమైన నమ్మకానికి నిదర్శనమని చంద్రబాబు పేర్కొన్నారు. 2019లో టీడీపీ విజయం సాధించి ఉంటే, ఈపాటికే అమరావతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచ స్థాయిలో ఉండేవని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో తాము తెచ్చిన విద్యుత్ సంస్కరణలు, డ్వాక్రా సంఘాల ఏర్పాటు దేశానికే మోడల్‌గా నిలిచాయని, ఇప్పుడు అమరావతి కూడా అదే తరహాలో ఒక గమ్యస్థానంగా మారుతుందని చంద్రాబు చెప్పారు.

పార్టీకి కార్యకర్తలే కీలకం

పార్టీ కోసం ఆస్తులు పోగొట్టుకుని, ప్రాణ త్యాగాలు చేసిన కార్యకర్తలే టీడీపీకి అసలైన బలం అని సీఎం చంద్రబాబు కొనియాడారు. సమర్థంగా పనిచేసే కార్యకర్తలకే పార్టీలో గుర్తింపు ఉంటుందని, వారి త్యాగాలను విస్మరించడం ప్రమాదకరమం అన్నారు.  బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళల జీవితాల్లో వెలుగులు నింపిన పార్టీ ఇదని, సామాన్యులను చట్టసభలకు పంపిన ఘనత స్వర్గీయ ఎన్టీఆర్‌దేనని గుర్తు చేశారు. తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం పుట్టిన ఈ పసుపు జెండా నిరంతరం ఎగురుతూనే ఉంటుందని, రాష్ట్రం బలంగా ఉండాలంటే టీడీపీ బలంగా ఉండాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఏపీ అసెంబ్లీ తీర్మానం..

ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పిస్తూ రాష్ట్ర శాసనసభ చారిత్రక తీర్మానాన్ని మార్చి 28న ఆమోదించింది. గత ప్రభుత్వ హయాంలో వచ్చిన 'మూడు రాజధానుల' ప్రతిపాదనకు స్వస్తి పలుకుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం "ఒకే రాష్ట్రం - ఒకే రాజధాని" విధానాన్ని అధికారికంగా ఖరారు చేసింది. ఈ తీర్మానం ద్వారా అమరావతి కేవలం పరిపాలనా కేంద్రం మాత్రమే కాకుండా, రాష్ట్ర గౌరవానికి చిహ్నమని ప్రభుత్వం స్పష్టం చేసింది.

సభలో తీర్మానాన్ని ప్రవేశపెడుతూ, రాజధాని కోసం భూములిచ్చిన అమరావతి రైతుల త్యాగాలను ప్రభుత్వం కొనియాడింది. హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను గౌరవిస్తూ, రాజధాని నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది. ఈ తీర్మానం ఆమోదం పొందడంతో, అమరావతిపై నెలకొన్న అనిశ్చితి తొలగిపోయి, పెట్టుబడిదారులకు, ప్రజలకు భరోసా లభించింది. భవిష్యత్తులో రాజకీయ మార్పులు సంభవించినా రాజధాని విషయంలో ఎలాంటి మార్పులు ఉండకూడదనే ఉద్దేశంతో ఈ చట్టబద్ధతకు ప్రాధాన్యత ఇచ్చారు. విభజన చట్టం ప్రకారం ఏపీకి అమరావతే శాశ్వత రాజధాని అని ఈ తీర్మానం ద్వారా పునరుద్ఘాటించారు.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Rains In AP, Telangana: వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ - మత్స్యకారులకు వార్నింగ్
వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ - మత్స్యకారులకు వార్నింగ్
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Arunachalam Giri Pradakshina: అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Drugs Case: అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
KTR Legal Notice Strategy on Revanth Reddy: కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
Polimera 3 : పొలిమేర 3లో యాక్షన్ కింగ్ ఎంట్రీ - హారర్ థ్రిల్లర్‌లో ఆయన రోల్ ఏంటి?
పొలిమేర 3లో యాక్షన్ కింగ్ ఎంట్రీ - హారర్ థ్రిల్లర్‌లో ఆయన రోల్ ఏంటి?
Gen Z Protest: భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
Monsoon Laundry Hacks : వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
హైవే మీద, నగరంలోనూ అదరహో! MG Windsor EV 15,000 15,000km లాంగ్ టర్మ్ రివ్యూ
లాంగ్‌టర్మ్‌లో MG Windsor EV ఎలా ఉంది? 15,000km సుదీర్ఘ ప్రయాణంలో బయటపడిన నిజాలు
Joint Stiffness : కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
Upcoming Cars in India: 3 కొత్త కార్లు లాంచ్ చేస్తున్న టయోటా.. హైలైట్‌గా 35 కి.మీ కంటే ఎక్కువ మైలేజ్ కారు!
3 కొత్త కార్లు లాంచ్ చేస్తున్న టయోటా.. హైలైట్‌గా 35 కి.మీ కంటే ఎక్కువ మైలేజ్ కారు!
Embed widget