అన్వేషించండి

TDP Foundation Day: ఇకపై మూడు ముక్కలాటలు ఉండవు.. అమరావతి అభివృద్ధే లక్ష్యం: సీఎం చంద్రబాబు

పార్టీకి కార్యకర్తలే బలమని, వారి త్యాగాలకు టీడీపీలో ఎప్పటికీ గుర్తింపు ఉంటుందని పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతే అని స్పష్టం చేశారు.

అమరావతి: రాష్ట్ర భవిష్యత్తు రాజధాని నిర్మాణంతోనే ముడిపడి ఉంటుందని.. ఇకపై మూడు ముక్కలాటలు ఉండవు.. ఒకే రాష్ట్రం - ఒకే రాజధాని అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతిని వ్యతిరేకించే శక్తులను ఇక్కడ అడుగుపెట్టనివ్వకూడదని, హైదరాబాద్‌ను మించిన నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం (మార్చి 29న) తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 


TDP Foundation Day: ఇకపై మూడు ముక్కలాటలు ఉండవు.. అమరావతి అభివృద్ధే లక్ష్యం: సీఎం చంద్రబాబు

దేశానికే రోల్ మోడల్‌గా టీడీపీ సంస్కరణలు, నిర్ణయాలు..

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు అమరావతి ప్రాధాన్యతను నొక్కి చెప్పారు. రాజధాని అమరావతి కోసం రైతులు ఒక్క పైసా ఆశించకుండా భూములు ఇచ్చారని, అది తెలుగుదేశం పార్టీపై వారికి ఉన్న అచంచలమైన నమ్మకానికి నిదర్శనమని చంద్రబాబు పేర్కొన్నారు. 2019లో టీడీపీ విజయం సాధించి ఉంటే, ఈపాటికే అమరావతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచ స్థాయిలో ఉండేవని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో తాము తెచ్చిన విద్యుత్ సంస్కరణలు, డ్వాక్రా సంఘాల ఏర్పాటు దేశానికే మోడల్‌గా నిలిచాయని, ఇప్పుడు అమరావతి కూడా అదే తరహాలో ఒక గమ్యస్థానంగా మారుతుందని చంద్రాబు చెప్పారు.

పార్టీకి కార్యకర్తలే కీలకం

పార్టీ కోసం ఆస్తులు పోగొట్టుకుని, ప్రాణ త్యాగాలు చేసిన కార్యకర్తలే టీడీపీకి అసలైన బలం అని సీఎం చంద్రబాబు కొనియాడారు. సమర్థంగా పనిచేసే కార్యకర్తలకే పార్టీలో గుర్తింపు ఉంటుందని, వారి త్యాగాలను విస్మరించడం ప్రమాదకరమం అన్నారు.  బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళల జీవితాల్లో వెలుగులు నింపిన పార్టీ ఇదని, సామాన్యులను చట్టసభలకు పంపిన ఘనత స్వర్గీయ ఎన్టీఆర్‌దేనని గుర్తు చేశారు. తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం పుట్టిన ఈ పసుపు జెండా నిరంతరం ఎగురుతూనే ఉంటుందని, రాష్ట్రం బలంగా ఉండాలంటే టీడీపీ బలంగా ఉండాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఏపీ అసెంబ్లీ తీర్మానం..

ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పిస్తూ రాష్ట్ర శాసనసభ చారిత్రక తీర్మానాన్ని మార్చి 28న ఆమోదించింది. గత ప్రభుత్వ హయాంలో వచ్చిన 'మూడు రాజధానుల' ప్రతిపాదనకు స్వస్తి పలుకుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం "ఒకే రాష్ట్రం - ఒకే రాజధాని" విధానాన్ని అధికారికంగా ఖరారు చేసింది. ఈ తీర్మానం ద్వారా అమరావతి కేవలం పరిపాలనా కేంద్రం మాత్రమే కాకుండా, రాష్ట్ర గౌరవానికి చిహ్నమని ప్రభుత్వం స్పష్టం చేసింది.

సభలో తీర్మానాన్ని ప్రవేశపెడుతూ, రాజధాని కోసం భూములిచ్చిన అమరావతి రైతుల త్యాగాలను ప్రభుత్వం కొనియాడింది. హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను గౌరవిస్తూ, రాజధాని నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది. ఈ తీర్మానం ఆమోదం పొందడంతో, అమరావతిపై నెలకొన్న అనిశ్చితి తొలగిపోయి, పెట్టుబడిదారులకు, ప్రజలకు భరోసా లభించింది. భవిష్యత్తులో రాజకీయ మార్పులు సంభవించినా రాజధాని విషయంలో ఎలాంటి మార్పులు ఉండకూడదనే ఉద్దేశంతో ఈ చట్టబద్ధతకు ప్రాధాన్యత ఇచ్చారు. విభజన చట్టం ప్రకారం ఏపీకి అమరావతే శాశ్వత రాజధాని అని ఈ తీర్మానం ద్వారా పునరుద్ఘాటించారు.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Press Meet:
"నా గుండెల్లో తెలంగాణ ఉంది! మీ అయ్య జాగీరా అడ్డుకుంటామని బెదిరించడానికి?" పవన్ సంచలన కామెంట్స్
Pawan Kalyan Press Meet: పవన్ కల్యాణ్‌ ప్రెస్‌మీట్‌కు ముందే హైవోల్టేజ్ డ్రామా! జనసేనానిపై కాంగ్రెస్ చేస్తున్న ప్రచారమేంటీ? 
పవన్ కల్యాణ్‌ ప్రెస్‌మీట్‌కు ముందే హైవోల్టేజ్ డ్రామా! జనసేనానిపై కాంగ్రెస్ చేస్తున్న ప్రచారమేంటీ? 
India Monsoon Delay 2026:వాన కోసం ఎదురు చూడాల్సిందే! నైరుతి రుతుపవనాల రాక ఎప్పుడు? వాతావరణ శాఖ ఏమంటోంది? 
వాన కోసం ఎదురు చూడాల్సిందే! నైరుతి రుతుపవనాల రాక ఎప్పుడు? వాతావరణ శాఖ ఏమంటోంది? 
Nara Lokesh Slams Jagan: జనం ఛీకొట్టినా జగన్ డ్రామాలు మానడం లేదు- నంద్యాలలో YSR విగ్రహం ధ్వంసంపై నారా లోకేష్
జనం ఛీకొట్టినా జగన్ డ్రామాలు మానడం లేదు- నంద్యాలలో YSR విగ్రహం ధ్వంసంపై నారా లోకేష్
Advertisement

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War: అమెరికా స్థావరాలపై ఇరాన్ మిస్సైల్, డ్రోన్ దాడులు.. యుద్ధం మళ్లీ మొదలైందా?
అమెరికా స్థావరాలపై ఇరాన్ మిస్సైల్, డ్రోన్ దాడులు.. యుద్ధం మళ్లీ మొదలైందా?
BRS Silent On Pawan Kalyan:సెంటిమెంట్ రచ్చలో బీఆర్ఎస్ సైలెంట్ వ్యూహం - కవిత, కాంగ్రెస్ దూకుడు.. కేసీఆర్ మౌనం వెనుక గ్రేటర్ స్కెచ్ ఇదేనా!
సెంటిమెంట్ రచ్చలో బీఆర్ఎస్ సైలెంట్ వ్యూహం - కవిత, కాంగ్రెస్ దూకుడు.. కేసీఆర్ మౌనం వెనుక గ్రేటర్ స్కెచ్ ఇదేనా!
TGPSC Recruitment 2026: తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!
తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!
Peddi Vs Bollywood Movie: పెద్దితో బాక్సాఫీస్ క్లాష్... బాలీవుడ్ సినిమా టికెట్ రేట్స్‌పై డిస్కౌంట్ ఆఫర్
పెద్దితో బాక్సాఫీస్ క్లాష్... బాలీవుడ్ సినిమా టికెట్ రేట్స్‌పై డిస్కౌంట్ ఆఫర్
Rains In AP and Telangana: తెలంగాణలో పలు జిల్లాల్లో 2 రోజులపాటు వర్షాలు, ఏపీలో రెడ్ అలర్ట్.. పిడుగులు పడతాయని వార్నింగ్
తెలంగాణలో పలు జిల్లాల్లో 2 రోజులపాటు వర్షాలు, ఏపీలో రెడ్ అలర్ట్.. పిడుగుల వార్నింగ్
Best Playing 11 Of IPL : అశ్విన్స్ ఐపీఎల్ 2026 బెస్ట్ టీమ్ లో కెప్టెన్ ఎవరో తెలుసా?: రోహిత్, కోహ్లీలకు నో ఛాన్స్.. నెట్టింట వైరల్ అవుతున్న హాట్ లైనప్
అశ్విన్స్ ఐపీఎల్ 2026 బెస్ట్ టీమ్ లో కెప్టెన్ ఎవరో తెలుసా?: రోహిత్, కోహ్లీలకు నో ఛాన్స్.. నెట్టింట వైరల్ అవుతున్న హాట్ లైనప్
భూమిలో దాచిన నిధుల దగ్గర పాములు ఎందుకు కనిపిస్తాయి, అవి నిజంగా వాటిని కాపలా కాస్తాయా?
భూమిలో దాచిన నిధుల దగ్గర పాములు ఎందుకు కనిపిస్తాయి, అవి నిజంగా వాటిని కాపలా కాస్తాయా?
Peddi Nizam Bookings: 'పెద్ది'కి టెన్షన్ లేదు... తెలంగాణలోనూ టికెట్ రేట్స్ పెరిగాయ్... కాసేపటిలో బుకింగ్స్ మొదలు
'పెద్ది'కి టెన్షన్ లేదు... తెలంగాణలోనూ టికెట్ రేట్స్ పెరిగాయ్... కాసేపటిలో బుకింగ్స్ మొదలు
Embed widget