అన్వేషించండి

AP Capital Amaravati: ఏపీ రాజధాని అమరావతి చట్టబద్ధతపై తీర్మానానికి అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం..

ఏపీ అసెంబ్లీలో రాజధాని అమరావతిపై ప్రత్యేక చర్చ ముగిసింది. రాజధానిగా అమరావతిని చట్టబద్ధం, శాశ్వతం చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీలో పేర్కొన్నారు.

అమరావతి: ఏపీకి శాశ్వత రాజధాని అమరావతి అని, అందుకే చట్టబద్ధత కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 2028 ఆగస్టులో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతిలోని ఐకానిక్ టవర్స్‌ ప్రారంభోత్సవం జరుగుతుందని ప్రకటించారు. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తే శాశ్వతంగా ఏ ఇబ్బంది ఉండదని కేంద్రానికి ప్రతిపాదన పంపగా.. అసెంబ్లీ తీర్మానం ఉండాలని సూచించింది. ఈ మేరకు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమై అమరావతిని శాశ్వత రాజధానిగా చేసేందుకు తీర్మానం చేశామన్నారు. రాజధానిగా అమరావతి చట్టబద్ధతపై తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నట్లు స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు శనివారం ప్రకటించారు. ఈ తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపనుంది. చివరగా పార్లమెంట్‌ ఆమోదం పొందిన తరువాత రాజధానిగా అమరావతి చట్టమవుతుంది.

అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. క్రీ.పూ 2020లో శాతవాహనులు జైత్రయాత్ర చేశారు. కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాలను పాలించారు. అమరావతి రాజధానిగా ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రాంతాలను పరిపాలించారు. లోహాలు, వజ్రాలు, వస్త్రాలు సహా మరిన్ని ఉత్పత్తులతో విదేశీ వ్యాపారం జరిగింది. బ్రిటీష్ మ్యూజియంలో అమరావతికి ప్రత్యేక గ్యాలరీ ఉంది. ఇక్కడున్న వారికి అంతగా తెలియకున్నా విదేశాల్లో మన ప్రాచీన వైభవం గుర్తింపు పొందింది. 

కాకతీయులు వరంగల్ కేంద్రంగా పాలిస్తూ ఆలయాలు, ఆర్కిటెక్చర్ అద్భుతాలు చేశారు. విజయనగర సామ్రాజ్యం తెలుగు వారిని పాలించింది. తరువాత బ్రిటీష్ పాలన మొదలై మన చరిత్ర మనుగడ కోల్పోయింది. మదరాసీలు అని పిలిచేవారు. నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపనతో తెలుగువారి ఆత్మగౌరవం, విలువ మళ్లీ గుర్తించారు. అమరజీవి పొట్టిశ్రీరాములు తెలుగువారి కోసం రాష్ట్ర సాధనకు పోరాడారు. నెహ్రూ లాంటి వారు దిగొచ్చి తెలుగు వారికి రాష్ట్రాన్ని ప్రకటించారు. 1953 అక్టోబర్ 1న విజయవాడకు వచ్చి ఉంటే సెంటర్ గా ఉండే ప్రాంతం ఏ స్థాయిలో అభివృద్ధి చెందేదో మనం ఊహించలేం. తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కర్నూల్ రాజధానిగా చేసింది. పొట్టి శ్రీరాములు త్యాగఫలంతో తెలుగు వారికి గుర్తింపు లభించింది.


AP Capital Amaravati: ఏపీ రాజధాని అమరావతి చట్టబద్ధతపై తీర్మానానికి అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం..

తరువాత హైదరాబాద్ సీఎం బూర్గుల రామకృష్ణారావు రాజీనామా చేసి, ఉమ్మడి రాష్ట్రం ఏర్పాటయ్యాక నీలం సంజీవరెడ్డిని ముఖ్యమంత్రిని చేశారు. రాజధాని కోల్పోయాం, విమర్శలు, అవమానాలు భరిస్తూ వచ్చాం. ఈ క్రమంలో 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగింది. 2014 జూన్ 2న రెండు రాష్ట్రాలుగా విడదీశారు. దాంతో ఏరోజు రాష్ట్ర అవతరణ దినోత్సవం జరిపాలని చర్చకు వచ్చింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో చర్చించాక.. పొట్టిశ్రీరామలు డిసెంబర్ లో ఆత్మార్ఫణ చేశారు కనుక అదేరోజు అవతరణ దినోత్సవం జరుపుకుని ఎన్డీయే ప్రభుత్వం గుర్తింపు తీసుకొచ్చింది.   

విభజన తర్వాత కార్యాలయాలు లేకపోయినా, 9 నెలల్లోనే సచివాలయం, అసెంబ్లీ భవనాలను పూర్తి చేశామని గుర్తుచేశారు. రాజధాని విషయంలో జగన్ ఊసరవెల్లి రాజకీయాలు చేశారని, అమరావతిపై విషం చిమ్మి రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి నెట్టారని మండిపడ్డారు. రైతులు ఎంతో నమ్మకంతో 34 వేల ఎకరాల భూములు ఇస్తే, వైసీపీ ప్రభుత్వం వారిని హింసించి, ప్రాజెక్టును అడ్డుకోవడానికి ప్రపంచ బ్యాంకుకు లేఖలు రాసిందని ధ్వజమెత్తారు.

వైసీపీ విధ్వంసకర పాలన వల్లే ఆ పార్టీ 151 సీట్ల నుండి 11 సీట్లకు పడిపోయిందని ఎద్దేవా చేశారు. 2028 నాటికి అమరావతిలో మెజారిటీ పనులు పూర్తి చేస్తామని, ప్రస్తుతం రూ.56 వేల కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో ఇకపై రాజారెడ్డి రాజ్యాంగం నడవదని, అంబేడ్కర్ రాజ్యాంగమే ఉంటుందని స్పష్టం చేశారు. "ఏపీకి ఒకే ఒక్క రాజధాని.. అది అమరావతి మాత్రమే" అని అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటించారు.

ఇన్నేళ్లయినా రాజధాని కోసం పోరాటాలు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ఏపీ అసెంబ్లీలో రాజధాని అమరావతిపై జరిగిన చర్చలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ప్రసంగం చేశారు. విభజన సమయంలో కాంగ్రెస్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందని, సరైన కార్యాలయాలు లేకపోయినా చంద్రబాబు పట్టుదలతో పాలన సాగించారని కొనియాడారు. రాష్ట్రం ఏర్పడి ఇన్నేళ్లయినా ఇప్పటికీ రాజధాని కోసం పోరాడాల్సి రావడం బాధాకరమన్నారు.


AP Capital Amaravati: ఏపీ రాజధాని అమరావతి చట్టబద్ధతపై తీర్మానానికి అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం..

అమరావతి కోసం రైతులు స్వచ్ఛందంగా 33 వేల ఎకరాలు ఇచ్చారని, కానీ గత వైసీపీ ప్రభుత్వం వారిపై కక్షగట్టి హింసించిందని మండిపడ్డారు. మూడు రాజధానుల పేరుతో సమస్యను మరింత క్లిష్టతరం చేశారని, ఇకపై వైసీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని ధీమా వ్యక్తం చేశారు. అమరావతి విషయంలో జనసేన తన మాటపై స్థిరంగా ఉంటుందని స్పష్టం చేశారు. హైదరాబాద్ అభివృద్ధి సమయంలో చంద్రబాబుపై విమర్శలు వచ్చినా ఆయన వెనకడుగు వేయలేదని గుర్తు చేస్తూ.. "సాధారణ రాజకీయ నాయకుడు ఎన్నికల గురించి ఆలోచిస్తే, దార్శనికుడు రాబోయే తరం గురించి ఆలోచిస్తాడు" అని పవన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే రాజకీయ స్థిరత్వం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: కృష్ణా జిల్లా గూడూరులో విషాదం- ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళల ఆత్మహత్య  
కృష్ణా జిల్లా గూడూరులో విషాదం- ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళల ఆత్మహత్య  
Sai Krishna Case: సాయికృష్ణ కేసులో నేను నిర్దోషిని, నన్ను ఇరికించాలని చూస్తున్నారు - సీఐ నాగరాజు లేఖ వైరల్
సాయికృష్ణ కేసులో నేను నిర్దోషిని, నన్ను ఇరికించాలని చూస్తున్నారు - సీఐ నాగరాజు లేఖ వైరల్
Kadapa Steel Plant: మళ్లీ మళ్లీ జరగాలి పెళ్లి.. చంద్రబాబు కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనపై గుడివాడ అమర్నాథ్ సెటైర్లు
మళ్లీ మళ్లీ జరగాలి పెళ్లి.. చంద్రబాబు కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనపై గుడివాడ అమర్నాథ్ సెటైర్లు
Nara Lokesh: మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునరుద్ధరణ పనులకు మంత్రి నారా లోకేష్ భూమి పూజ
మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునరుద్ధరణ పనులకు మంత్రి నారా లోకేష్ భూమి పూజ

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TRS Chief Kavitha: టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
Rayalaseema Manufacturing Hub: పారిశ్రామిక చదరంగంలో ‘రాయల్’ సీమ.. తయారీ రంగ కేంద్రంగా మార్చేందుకు కూటమి సర్కార్ పక్కా స్కెచ్!
పారిశ్రామిక చదరంగంలో ‘రాయల్’ సీమ.. తయారీ రంగ కేంద్రంగా మార్చేందుకు కూటమి సర్కార్ పక్కా స్కెచ్!
Telangana Police Recruitment 2026: తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ కొలువులు జాతర! ఐదు వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్!
తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ కొలువులు జాతర! ఐదు వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్!
200 Rupee News: 200 రూపాయల నోటు అసలైనదో, నకిలీదో ఎలా గుర్తించాలి? ఆర్‌బిఐ చెప్పిన ట్రిక్స్‌ ఇవే!
200 రూపాయల నోటు అసలైనదో, నకిలీదో ఎలా గుర్తించాలి? ఆర్‌బిఐ చెప్పిన ట్రిక్స్‌ ఇవే!
Rao Bahadur Collections Day 1: ఓవర్సీస్‌లో దుమ్ము రేపిన సత్యదేవ్... 'రావు బహదూర్' ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
ఓవర్సీస్‌లో దుమ్ము రేపిన సత్యదేవ్... 'రావు బహదూర్' ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
How Car Airbags Work: ఎయిర్‌బ్యాగ్ లోపల సరిగ్గా ఏం జరుగుతుంది? అది ప్రాణాలను ఎలా కాపాడుతుంది? 
ఎయిర్‌బ్యాగ్ లోపల సరిగ్గా ఏం జరుగుతుంది? అది ప్రాణాలను ఎలా కాపాడుతుంది? 
Peddi OTT: పెద్ది ఓటీటీ రిలీజ్ డేట్... Netflixలో ఈవారమే స్ట్రీమింగ్ - కానీ ట్విస్ట్ ఏమిటంటే?
పెద్ది ఓటీటీ రిలీజ్ డేట్... Netflixలో ఈవారమే స్ట్రీమింగ్ - కానీ ట్విస్ట్ ఏమిటంటే?
Chiluka Gorinka: చిలుక గోరింకకు సంబంధం లేదు..మరెందుకు అలా దీవిస్తారు?
చిలుక గోరింకకు సంబంధం లేదు..మరెందుకు అలా దీవిస్తారు?
Embed widget