అన్వేషించండి

Amaravati What Next: అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!

Amaravati: అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక శాశ్వత రాజధానిగా ఖరారు చేస్తూ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. మరి చట్టంగా ఎప్పుడు మారుతుంది?

Legality for Amaravati:  అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక   శాశ్వత రాజధానిగా ఖరారు చేస్తూ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేయడం ఒక చారిత్రాత్మక ఘట్టం.  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటిస్తూ చేసిన తీర్మానం కేవలం ఒక ప్రకటన మాత్రమే కాదు, అది ఒక బలమైన చట్టపరమైన అడుగు. 2014 విభజన చట్టంలో  ఏపీకి కొత్త రాజధాని ఉంటుంది అని ఉందే తప్ప, స్పష్టంగా  అమరావతి అనే పేరు లేదు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన  మూడు రాజధానుల గందరగోళం మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలంటే, విభజన చట్టంలోనే అమరావతి పేరు ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే సెక్షన్ 5(2)కు సవరణ కోరుతూ ఈ తీర్మానం చేశారు.

కేంద్రం పాత్ర - పార్లమెంట్ సవరణ

రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన ఈ తీర్మానం వెంటనే కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చేరుతుంది. సాధారణంగా రాష్ట్రాల తీర్మానాలపై కేంద్రం నిర్ణయం తీసుకోవడానికి సమయం పడుతుంది, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న సమన్వయం  వల్ల ఈ ప్రక్రియ వేగవంతం కానుంది. కేంద్ర క్యాబినెట్ దీనిని పరిశీలించి, ఆమోదముద్ర వేసిన తర్వాత, ఒక సవరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెడతారు. ఉభయ సభలు దీనిని ఆమోదించి, రాష్ట్రపతి సంతకం చేస్తే, అది గెజిట్ నోటిఫికేషన్‌గా మారుతుంది.

విభజన చట్టంలో మార్పులు

పార్లమెంట్ ఆమోదంతో 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో అమరావతి పేరు అధికారికంగా చేరుతుంది. దీనివల్ల అమరావతికి  స్టాట్యూటరీ స్టేటస్ లభిస్తుంది. అంటే, భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా, చట్టాన్ని మార్చకుండా రాజధానిని మార్చడం సాధ్యం కాదు. ఇది రాజధాని ప్రాంత రైతులకు, పెట్టుబడిదారులకు ఒక పెద్ద భరోసా ఇస్తుంది. కేంద్రం ఇప్పటికే దీనికి సంబంధించి సానుకూల సంకేతాలు ఇవ్వడంతో, ఈ ప్రక్రియ ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే లేదా త్వరలోనే పూర్తయ్యే అవకాశం ఉంది.

చంద్రబాబు వ్యూహం - సమన్వయం

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సారి ఎక్కడా చట్టపరమైన లొసుగులు లేకుండా జాగ్రత్త పడుతున్నారు. గతంలో ఎదురైన న్యాయపరమైన చిక్కులను దృష్టిలో ఉంచుకుని, కేంద్ర ప్రభుత్వ సలహా మేరకే అసెంబ్లీలో ఈ తీర్మానం ప్రవేశపెట్టారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ప్రధాని మోదీలతో ఆయన జరిపిన చర్చల ఫలితంగానే ఈ డ్రాఫ్ట్ బిల్లుకు రూపకల్పన జరిగింది. కేంద్రం కూడా అమరావతి అభివృద్ధికి పెద్దపీట వేస్తుండటంతో, రాజకీయంగా మరియు సాంకేతికంగా ఈ మార్గం సుగమమైంది.

ఏమి మారబోతోంది?

ఈ చట్టబద్ధత వల్ల అమరావతి కేవలం ఒక నగరంలా కాకుండా, దేశ గెజిట్‌లో నమోదైన రాజధానిగా మారుతుంది. దీనివల్ల కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు, వరల్డ్ బ్యాంక్ వంటి సంస్థల నుంచి వచ్చే రుణాలు మరింత సులభంగా అందుతాయి. అలాగే, రాజధాని ప్రాంతంలో భూములు ఇచ్చిన రైతులకు ఉన్న లీగల్ గ్యారెంటీ మరింత బలపడుతుంది. మొత్తానికి, ఈ తీర్మానం అమరావతికి ఒక   అదృశ్య రక్షణ కవచం  లాంటిది. పదేళ్ల అనిశ్చితికి తెర దించుతూ అమరావతి ప్రస్థానం ఇక చట్టబద్ధంగా ముందుకు సాగనుంది.  

టాప్ హెడ్ లైన్స్

Investment Fraud: తిరుపతి డీఎస్పీ పేరుతో కోట్లలో వసూళ్లు చేసిన గ్యాంగ్.. నిందితుడి అరెస్ట్
తిరుపతి డీఎస్పీ పేరుతో కోట్లలో వసూళ్లు చేసిన గ్యాంగ్.. నిందితుడి అరెస్ట్
AP Special TET 2026 Notification: ఏపీలో టీచర్లకు గుడ్ న్యూస్.. స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల- ముఖ్యమైన తేదీలివే
ఏపీలో టీచర్లకు గుడ్ న్యూస్.. స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల- ముఖ్యమైన తేదీలివే
AE Nookaraju Family Suicide Case: సౌజన్య, సాధిక్ రిలేషన్‌లో ఉన్నారు.. మతం మారాలని ఒత్తిడి చేశాడు: కాకినాడ ఎస్పీ
సౌజన్య, సాధిక్ రిలేషన్‌లో ఉన్నారు.. మతం మారాలని ఒత్తిడి చేశాడు: కాకినాడ ఎస్పీ
AP Local Body Elections: ఏపీలో స్థానిక ఎన్నికల షెడ్యూల్- వారిపై కేసులు నమోదు చేస్తామని వార్నింగ్
ఏపీలో స్థానిక ఎన్నికల షెడ్యూల్- వారిపై కేసులు నమోదు చేస్తామని వార్నింగ్

వీడియోలు

IND vs SL 2nd Test Day 1 | కోహ్లీ రికార్డ్‌ను బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్
Yashasvi Jaiswal Fight With Asitha Fernando | అసిథ ఫెర్నాండోతో జైస్వాల్ గొడవ
Serial Actor Charishma Shreekhar Profile | అమ్మోరు' సీరియల్ నటి సక్సెస్ స్టోరీ ఇదే
Anasuya Bharadwaj Emotional Comments | సమాజంపై అనసూయ ఎమోషనల్ వీడియో
Gundenininda Gudigantalu Serial August 24 | రోహిణి, మనోజ్ రూమ్‌కి తాళం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Special TET 2026 Notification: ఏపీలో టీచర్లకు గుడ్ న్యూస్.. స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల- ముఖ్యమైన తేదీలివే
ఏపీలో టీచర్లకు గుడ్ న్యూస్.. స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల- ముఖ్యమైన తేదీలివే
CM Revanth Reddy: కేంద్రం వివక్షను విదేశాల్లో లేవనెత్తితే దోశద్రోహి అని ముద్ర పడేది: సీఎం రేవంత్ రెడ్డి
కేంద్రం వివక్షను విదేశాల్లో లేవనెత్తితే దోశద్రోహి అని ముద్ర పడేది: సీఎం రేవంత్ రెడ్డి
AE Nookaraju Family Suicide Case: సౌజన్య, సాధిక్ రిలేషన్‌లో ఉన్నారు.. మతం మారాలని ఒత్తిడి చేశాడు: కాకినాడ ఎస్పీ
సౌజన్య, సాధిక్ రిలేషన్‌లో ఉన్నారు.. మతం మారాలని ఒత్తిడి చేశాడు: కాకినాడ ఎస్పీ
AP Local Body Elections: ఏపీలో స్థానిక ఎన్నికల షెడ్యూల్- వారిపై కేసులు నమోదు చేస్తామని వార్నింగ్
ఏపీలో స్థానిక ఎన్నికల షెడ్యూల్- వారిపై కేసులు నమోదు చేస్తామని వార్నింగ్
Pithapuram AE Nookaraju Case: ఏఈ నూకరాజు కుటుంబ ఆత్మహత్య ఎపిసోడ్‌పై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు! సోషల్ మీడియాలో సౌజన్య లేఖ వైరల్‌!
ఏఈ నూకరాజు కుటుంబ ఆత్మహత్య ఎపిసోడ్‌పై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు! సోషల్ మీడియాలో సౌజన్య లేఖ వైరల్‌!
Janasena in Telangana MLC Elections: తెలంగాణలో జనసేన పొలిటికల్ యాక్టివిటీస్ షురూ! యువతను టార్గెట్ చేస్తూ కీలక నిర్ణయం!
తెలంగాణలో జనసేన పొలిటికల్ యాక్టివిటీస్ షురూ! యువతను టార్గెట్ చేస్తూ కీలక నిర్ణయం!
"నా గొంతు నొక్కేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారు" కుటుంబ వివాదాలపై స్పందించిన జోగి రమేష్‌ 
Rashmika Mandanna : విజయ్ దేవరకొండతో రష్మిక - గాయం తర్వాత ఫస్ట్ టైం బయటకు... వీడియో వైరల్
విజయ్ దేవరకొండతో రష్మిక - గాయం తర్వాత ఫస్ట్ టైం బయటకు... వీడియో వైరల్
Embed widget