అన్వేషించండి

YSRCP Plenary: "కిక్‌ బాబు అవుట్‌" ఇదే వైఎస్‌ఎస్‌ఆర్‌సీపీ ప్లీన‌రీ నినాదం

నియోజ‌క‌వ‌ర్గ స్దాయిలో ప్లీన‌రీలు నిర్వ‌హించిన వైసీపీ.. మూడు రోజుల పాటు జిల్లా స్దాయిలో ప్లీన‌రీలు నిర్వ‌హిస్తుంది. ఆ త‌రువాత రాష్ట్ర స్దాయిలో రెండు రోజుల పాటుగా ప్లీన‌రీకి ఏర్పాట్లు చేస్తోంది.

వైసీపీ ప్లీన‌రీకి రెడీ అవుతుంది. జులై 8, 9 తేదీల్లో జ‌రిగే ప్లీన‌రీకి అధికార పార్టీ విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది. పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను జ‌గ‌న్ స్వ‌యంగా తాను సంత‌కం చేసిన ఆహ్వ‌న ప‌త్రిక‌తో ఆహ్వ‌నిస్తున్నారు. ఐదే క్రితం ఇదే ప్రాంగంణంలో వైసీపీ ప్లీన‌రీ జ‌రిగింది. ఇప్పుడు కూడ ఇదే ప్రాంగ‌ణంలో ప్లీన‌రీ నిర్వ‌హ‌స్తున్నారు. అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత వైసీపీకి ఇది తొలి ప్లీన‌రీ స‌మావేశం. ఇదే స్పూర్తితో మ‌రో ఐదేళ్ల త‌రువాత కూడ అధికార ప‌క్షంగానే ప్లీన‌రి 2027లో మ‌రోసారి నిర్వ‌హిస్తామ‌ని ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల వ్యాఖ్యానించారు.

వేదిక ఏర్పాట్లను పార్టీ అగ్ర‌నాయ‌కులు విజ‌య‌సాయిరెడ్డి, స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి, ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు, మంత్రి మేరుగ నాగార్జు, మాజీ మంత్రి సుచ‌రిత ఇత‌ర నాయ‌కులు ప‌రిశీలించారు. టార్గెట్ 175 పేరుతో వైసీపీ ఈ స‌మావేశం నిర్వ‌హిస్తుంది. తొలి రోజున సీఎం జ‌గ‌న్ ప్ర‌సంగంతో ప్లీన‌రితో ప్రారంభం అవుతుంది. రెండో రోజు కూడా సాయంత్రం జ‌గ‌న్ ప్ర‌సంగంతో ప్లీన‌రీ ముగుస్తుంది. 8వ తేదీన రాజ‌శేఖ‌ర్ రెడ్డి జ‌యంతి కూడా ఉండ‌టంతో పార్టీ నాయ‌కులు ప్లీన‌రీని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించ‌టం ఆన‌వాయితీగా వ‌స్తుంది. తొలి ప్లీన‌రి నిర్వ‌హించిన స‌మ‌యంలో వైసీపీ రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షంలో ఉంది. ఇప్పుడు అధికారంలోకి వ‌చ్చి పార్టీ ప్లీన‌రీ నిర్వ‌హిస్తుండ‌టం విశేషంగా పార్టీ క్యాడ‌ర్ భావిస్తోంది.

ఇప్ప‌టికే నియోజ‌క‌వ‌ర్గ స్దాయిలో ప్లీన‌రీలు వైసీపీ నిర్వ‌హించింది. మ‌రో మూడు రోజుల పాటు జిల్లా స్దాయిలో ప్లీన‌రీలు నిర్వ‌హిస్తుంది. ఆ త‌రువాత రాష్ట్ర స్దాయిలో రెండు రోజుల పాటుగా వైసీపీ ప్లీన‌రీ నిర్వ‌హించ‌టం పార్టీ నిర్ణ‌యం తీసుకుంది. కార్య‌క‌ర్త మెద‌లుకొని సీఎం జ‌గ‌న్ వ‌ర‌కు ఈ స‌మావేశానికి భారీగా త‌ర‌లి వ‌స్తార‌ని పార్టీ క్యాడ‌ర్ భావిస్తుంది.

కిక్ బాబు అవుట్...గెట్ ది ప‌వ‌ర్.. అండ్ స‌ర్వ్ ది పీపుల్..అనే నినాదంతో రాష్ట్ర స్దాయి ప్లీన‌రీని నిర్వ‌హిస్తున్న‌ట్లుగా పార్టీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి తెలిపారు. నవరత్నాలే వైసీపీకి వేద‌ మంత్రాలని, ప్రజల అజెండాపైనే పార్టీ ప్లీనరీలో నిర్ణయాలు ఉంటాయ‌న్నారు. 2024లో జ‌రిగే ఎన్నిక‌ల్లో 175స్దానాల‌ను కైవ‌సం చేసుకుంటామ‌నే ధీమాతోనే ఎన్నిక‌ల‌కు వెళుతున్నామ‌ని వివ‌రించారు. వైసీపీ 151 సీట్లుతో విజ‌యం సాధించ‌టం ఒక ఎత్త‌యితే, ఆ త‌రువాత జ‌రిగిన ప్ర‌తి ఎన్న‌ిక‌ల్లో కూడా ప్ర‌జ‌లు వైసీపీకే ప‌ట్టంక‌ట్ట‌టం చారిత్రాత్మికమైంద‌ని పార్టీ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి అన్నారు. ఇలాంటి విజ‌యం చ‌రిత్ర‌లో ఏ ఇత‌ర పార్టీకి కూడా ద‌క్క‌లేద‌ని ఆయ‌న చెప్పారు. పార్టీ ప్లీన‌రికి భారీగా కార్య‌క‌ర్త‌లు త‌ర‌లి వ‌స్తుండ‌టంతో ఏర్పాట్లు కూడ ప‌క్కాగా నిర్వ‌హించేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.

వ‌ర్షాలు ప‌డుతుండ‌టంతో మైదానంలో బుర‌ద‌తో ఇబ్బందులు రాకుండా,ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల్లో భాగంగా,వాట‌ర్ ప్రూఫ్ షామియానాలు ఏర్పాట్లు చేస్తున్నారు. జాతీయ ర‌హాదారి ప‌క్క‌నే ప్లీన‌రీ వేదిక కావ‌టంతో ట్రాఫిక్ స‌మ‌స్య‌లు లేకుండా మ‌ళ్లింపు చ‌ర్య‌లు కూడ చేయాల‌ని నిర్ణ‌యించారు. సీఎం జ‌గ‌న్ వ‌చ్చి వెళ్లేందుకు వీలుగా ప్లీన‌రీ వేదిక వ‌ద్ద‌నే హెలిప్యాడ్ కూడా ఏర్పాటు చేయ‌నున్నారు. ఇత‌ర ముఖ్య నాయ‌కులు, మంత్రులు కూడా హ‌జ‌రవుతుండ‌టంతో ర‌హ‌దారి మార్గం ద్వార జ‌గ‌న్ రాక‌పోక‌ల‌కు ఇబ్బందులు లేకుండా ముంద‌స్తు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Gannavaram Airport: గన్నవరం ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ఫ్టైట్‌లో మంత్రి గొట్టిపాటి, ఇద్దరు ఎమ్మెల్యేలు
గన్నవరంలో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ఫ్టైట్‌లో మంత్రి గొట్టిపాటి, ఇద్దరు ఎమ్మెల్యేలు
Bihar IPS Sunil Naik: రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు.. విచారణకు హాజరైన బిహార్ ఐపీఎస్ సునీల్ నాయక్
రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు.. విచారణకు హాజరైన బిహార్ ఐపీఎస్ సునీల్ నాయక్
Dhulipalla Narendra: పాలు, వెన్న లేకుండా నెయ్యి తయారు చేశారు, వైసీపీ ఇకనైనా తప్పు ఒప్పుకోవాలి: ధూళిపాళ్ల నరేంద్ర
పాలు, వెన్న లేకుండా నెయ్యి తయారు చేశారు, వైసీపీ ఇకనైనా తప్పు ఒప్పుకోవాలి: ధూళిపాళ్ల నరేంద్ర
AP Free Bus: దివ్యాంగులకు APSRTC గుడ్‌న్యూస్.. ఏ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చు
దివ్యాంగులకు APSRTC గుడ్‌న్యూస్.. ఏ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చు

వీడియోలు

Ind vs Eng 2nd Semi Final Preview | ఫైనల్ కు కివీస్ పిలుస్తోంది..ప్రత్యర్థి ఎవరో తేలేది నేడే | ABP Desam
Dinesh karthik Counter on Pak Matches | మైఖేల్ అథర్టన్, నాసిర్ హుస్సేన్ లకు డీకే మాస్ కౌంటర్ | ABP Desam
SA vs NZ Semis 1 Highlights | టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ కు దూసుకెళ్లిన న్యూజిలాండ్ | ABP Desam
South Africa ICC Bad Luck Continues | మరోసారి కప్పు లేకుండానే తిరుగుముఖం పట్టిన సౌతాఫ్రికా | ABP Desam
Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tolichawki building collapses : ఐదో అంతస్తు నుండి పడిన భవన నిర్మాణ కార్మికులు - ముగ్గురు మృతి - టోలిచౌకీలో విషాదం
ఐదో అంతస్తు నుండి పడిన భవన నిర్మాణ కార్మికులు - ముగ్గురు మృతి - టోలిచౌకీలో విషాదం
India Condoles Khamenei Death: ఖమేనీ మృతిపై తొలిసారి స్పందించిన భారత్.. సంతాపం తెలిపిన విదేశాంగ శాఖ
ఖమేనీ మృతిపై తొలిసారి స్పందించిన భారత్.. సంతాపం తెలిపిన విదేశాంగ శాఖ
AP 10th Hall Tickets: ఏపీ టెన్త్ క్లాస్ హాల్‌ టికెట్లు విడుదల.. వాట్సాప్‌లో ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి
ఏపీ టెన్త్ క్లాస్ హాల్‌ టికెట్లు విడుదల.. వాట్సాప్‌లో ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి
India vs England 2nd Semi Final: ఇంగ్లాండ్‌ వర్సెస్ భారత్ ప్లేయింగ్ ఎలెవన్, పిచ్ రిపోర్ట్.. ఆ 5 ప్లేయర్లతో డేంజర్!
ఇంగ్లాండ్‌ వర్సెస్ భారత్ ప్లేయింగ్ ఎలెవన్, పిచ్ రిపోర్ట్.. ఆ 5 ప్లేయర్లతో డేంజర్!
Operation Decapitation: ట్రాఫిక్ కెమెరాల హ్యాకింగ్ నుండి బంకర్ బస్టర్ల వరకు.. ఖమేనీ అంతం వెనుక CIA, మోసాద్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్!
ట్రాఫిక్ కెమెరాల హ్యాకింగ్ నుండి బంకర్ బస్టర్ల వరకు.. ఖమేనీ అంతం వెనుక CIA, మోసాద్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్!
Mrithyunjay OTT : మృత్యుంజయ్ ఓటీటీ ప్లాట్ ఫాం ఫిక్స్ - ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మృత్యుంజయ్ ఓటీటీ ప్లాట్ ఫాం ఫిక్స్ - ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Speaker chit chat: వైసీపీ సభ్యులు సభకు వస్తేనే మసాలా - జగన్ జీతం తీసుకోవడం లేదు - స్పీకర్ అయ్యన్న కీలక వ్యాఖ్యలు
వైసీపీ సభ్యులు సభకు వస్తేనే మసాలా - జగన్ జీతం తీసుకోవడం లేదు - స్పీకర్ అయ్యన్న కీలక వ్యాఖ్యలు
ప్రారంభమైన Nissan Gravite 7 సీటర్ కారు డెలివరీ.. ఫ్యామిలీ కోసం బెస్ట్ ఆప్షన్, ధర, ఫీచర్ల వివరాలు
ప్రారంభమైన Nissan Gravite 7 సీటర్ కారు డెలివరీ.. ఫ్యామిలీ కోసం బెస్ట్ ఆప్షన్, ధర, ఫీచర్ల వివరాలు
Embed widget