అన్వేషించండి

YSRCP Plenary: "కిక్‌ బాబు అవుట్‌" ఇదే వైఎస్‌ఎస్‌ఆర్‌సీపీ ప్లీన‌రీ నినాదం

నియోజ‌క‌వ‌ర్గ స్దాయిలో ప్లీన‌రీలు నిర్వ‌హించిన వైసీపీ.. మూడు రోజుల పాటు జిల్లా స్దాయిలో ప్లీన‌రీలు నిర్వ‌హిస్తుంది. ఆ త‌రువాత రాష్ట్ర స్దాయిలో రెండు రోజుల పాటుగా ప్లీన‌రీకి ఏర్పాట్లు చేస్తోంది.

వైసీపీ ప్లీన‌రీకి రెడీ అవుతుంది. జులై 8, 9 తేదీల్లో జ‌రిగే ప్లీన‌రీకి అధికార పార్టీ విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది. పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను జ‌గ‌న్ స్వ‌యంగా తాను సంత‌కం చేసిన ఆహ్వ‌న ప‌త్రిక‌తో ఆహ్వ‌నిస్తున్నారు. ఐదే క్రితం ఇదే ప్రాంగంణంలో వైసీపీ ప్లీన‌రీ జ‌రిగింది. ఇప్పుడు కూడ ఇదే ప్రాంగ‌ణంలో ప్లీన‌రీ నిర్వ‌హ‌స్తున్నారు. అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత వైసీపీకి ఇది తొలి ప్లీన‌రీ స‌మావేశం. ఇదే స్పూర్తితో మ‌రో ఐదేళ్ల త‌రువాత కూడ అధికార ప‌క్షంగానే ప్లీన‌రి 2027లో మ‌రోసారి నిర్వ‌హిస్తామ‌ని ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల వ్యాఖ్యానించారు.

వేదిక ఏర్పాట్లను పార్టీ అగ్ర‌నాయ‌కులు విజ‌య‌సాయిరెడ్డి, స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి, ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు, మంత్రి మేరుగ నాగార్జు, మాజీ మంత్రి సుచ‌రిత ఇత‌ర నాయ‌కులు ప‌రిశీలించారు. టార్గెట్ 175 పేరుతో వైసీపీ ఈ స‌మావేశం నిర్వ‌హిస్తుంది. తొలి రోజున సీఎం జ‌గ‌న్ ప్ర‌సంగంతో ప్లీన‌రితో ప్రారంభం అవుతుంది. రెండో రోజు కూడా సాయంత్రం జ‌గ‌న్ ప్ర‌సంగంతో ప్లీన‌రీ ముగుస్తుంది. 8వ తేదీన రాజ‌శేఖ‌ర్ రెడ్డి జ‌యంతి కూడా ఉండ‌టంతో పార్టీ నాయ‌కులు ప్లీన‌రీని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించ‌టం ఆన‌వాయితీగా వ‌స్తుంది. తొలి ప్లీన‌రి నిర్వ‌హించిన స‌మ‌యంలో వైసీపీ రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షంలో ఉంది. ఇప్పుడు అధికారంలోకి వ‌చ్చి పార్టీ ప్లీన‌రీ నిర్వ‌హిస్తుండ‌టం విశేషంగా పార్టీ క్యాడ‌ర్ భావిస్తోంది.

ఇప్ప‌టికే నియోజ‌క‌వ‌ర్గ స్దాయిలో ప్లీన‌రీలు వైసీపీ నిర్వ‌హించింది. మ‌రో మూడు రోజుల పాటు జిల్లా స్దాయిలో ప్లీన‌రీలు నిర్వ‌హిస్తుంది. ఆ త‌రువాత రాష్ట్ర స్దాయిలో రెండు రోజుల పాటుగా వైసీపీ ప్లీన‌రీ నిర్వ‌హించ‌టం పార్టీ నిర్ణ‌యం తీసుకుంది. కార్య‌క‌ర్త మెద‌లుకొని సీఎం జ‌గ‌న్ వ‌ర‌కు ఈ స‌మావేశానికి భారీగా త‌ర‌లి వ‌స్తార‌ని పార్టీ క్యాడ‌ర్ భావిస్తుంది.

కిక్ బాబు అవుట్...గెట్ ది ప‌వ‌ర్.. అండ్ స‌ర్వ్ ది పీపుల్..అనే నినాదంతో రాష్ట్ర స్దాయి ప్లీన‌రీని నిర్వ‌హిస్తున్న‌ట్లుగా పార్టీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి తెలిపారు. నవరత్నాలే వైసీపీకి వేద‌ మంత్రాలని, ప్రజల అజెండాపైనే పార్టీ ప్లీనరీలో నిర్ణయాలు ఉంటాయ‌న్నారు. 2024లో జ‌రిగే ఎన్నిక‌ల్లో 175స్దానాల‌ను కైవ‌సం చేసుకుంటామ‌నే ధీమాతోనే ఎన్నిక‌ల‌కు వెళుతున్నామ‌ని వివ‌రించారు. వైసీపీ 151 సీట్లుతో విజ‌యం సాధించ‌టం ఒక ఎత్త‌యితే, ఆ త‌రువాత జ‌రిగిన ప్ర‌తి ఎన్న‌ిక‌ల్లో కూడా ప్ర‌జ‌లు వైసీపీకే ప‌ట్టంక‌ట్ట‌టం చారిత్రాత్మికమైంద‌ని పార్టీ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి అన్నారు. ఇలాంటి విజ‌యం చ‌రిత్ర‌లో ఏ ఇత‌ర పార్టీకి కూడా ద‌క్క‌లేద‌ని ఆయ‌న చెప్పారు. పార్టీ ప్లీన‌రికి భారీగా కార్య‌క‌ర్త‌లు త‌ర‌లి వ‌స్తుండ‌టంతో ఏర్పాట్లు కూడ ప‌క్కాగా నిర్వ‌హించేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.

వ‌ర్షాలు ప‌డుతుండ‌టంతో మైదానంలో బుర‌ద‌తో ఇబ్బందులు రాకుండా,ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల్లో భాగంగా,వాట‌ర్ ప్రూఫ్ షామియానాలు ఏర్పాట్లు చేస్తున్నారు. జాతీయ ర‌హాదారి ప‌క్క‌నే ప్లీన‌రీ వేదిక కావ‌టంతో ట్రాఫిక్ స‌మ‌స్య‌లు లేకుండా మ‌ళ్లింపు చ‌ర్య‌లు కూడ చేయాల‌ని నిర్ణ‌యించారు. సీఎం జ‌గ‌న్ వ‌చ్చి వెళ్లేందుకు వీలుగా ప్లీన‌రీ వేదిక వ‌ద్ద‌నే హెలిప్యాడ్ కూడా ఏర్పాటు చేయ‌నున్నారు. ఇత‌ర ముఖ్య నాయ‌కులు, మంత్రులు కూడా హ‌జ‌రవుతుండ‌టంతో ర‌హ‌దారి మార్గం ద్వార జ‌గ‌న్ రాక‌పోక‌ల‌కు ఇబ్బందులు లేకుండా ముంద‌స్తు ఏర్పాట్లు చేస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Health Condition: పవన్ కళ్యాణ్‌కు భుజాల్లో తీవ్ర గాయం.. వెంటనే సర్జరీ చేయించుకోవాలని ముంబై డాక్టర్ల సూచన!
పవన్ కళ్యాణ్‌కు భుజాల్లో తీవ్ర గాయం.. వెంటనే సర్జరీ చేయించుకోవాలని ముంబై డాక్టర్ల సూచన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు గుడ్‌న్యూస్.. ఖాతాల్లోకి పరిహారం నిధులు జమ
వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు గుడ్‌న్యూస్.. ఖాతాల్లోకి పరిహారం నిధులు జమ
Bullet Train Corridors: హైదరాబాద్- చెన్నై, హైదరాబాద్- బెంగళూరు బుల్లెట్ రైళ్ల పనుల్లో తొలి అడుగు.. మార్కింగ్ చేస్తున్న అధికారులు
హైదరాబాద్- చెన్నై, హైదరాబాద్- బెంగళూరు బుల్లెట్ రైళ్ల పనుల్లో తొలి అడుగు.. మార్కింగ్ చేస్తున్న అధికారులు
Viral News: దుప్పటి అడిగినందుకు విద్యార్థినిని హాస్టల్ ఖాళీ చేపించిన వార్డెన్! చింతలపూడిలో ఘటన
దుప్పటి అడిగినందుకు విద్యార్థినిని హాస్టల్ ఖాళీ చేపించిన వార్డెన్! చింతలపూడిలో ఘటన

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rythu Bharosa Scheme: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
AP Local Body Elections 2026 Delay: ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
CM Chandrababu Naidu Amaravati Capital Review: అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
Nerve Weakness : నరాల బలహీనతకి కారణాలు ఏంటి? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
నరాల బలహీనతకి కారణాలు ఏంటి? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
CII Partnership Summit 2026: నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
Breaking News: గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
Ayodhya Ram Mandir Donation Theft Case: అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
Kakinada KIET College Invitation To CM Vijay: కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
Embed widget