అన్వేషించండి

EBC Nestam: మహిళలకు ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌.. జనవరి 25న రూ. 15 వేలు

మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి 25న వారి ఖాతాల్లో డబ్బులు వేయనుంది. ఈబీసీ నేస్తం లబ్ధిదారులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈబీసీ నేస్తం పథకాన్నిసీఎం ఈనెల 25న ప్రారంభించనున్నారు. అగ్రవర్ణాల్లోని 45-60 మధ్య వయస్సు గల పేద మహిళలకు ఏడాదికి 15వేల చొప్పున మూడేళ్ళలో 45వేల రూపాయల నగదు అందించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా 3,92,674 మంది మహిళలకు లబ్ది చేకూరనున్నట్టు ప్రభుత్వం చెబుతుంది . దీనికోసం  589.01 కోట్లు ప్రభుత్వం కేటాయించనుంది . 

కృష్ణ పట్నం పవర్ ప్లాంట్ మెయింటనెన్స్ బాధ్యతలు కొత్త సంస్థకు అప్పగింత

కృష్ణపట్నం పవర్‌ ప్లాంట్‌ ఆపరేషనల్‌ మెయింటైనెన్స్‌ బాధ్యతలను వేరొకరికి అప్పగించేందుకు అవసరమైన బిడ్డింగ్‌కు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. రానున్న 25 ఏళ్ల పాటు ఓ అండ్‌ ఏం (ఆపరేషనల్‌ అండ్‌ మెయింటైనెన్స్‌) కు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటూ  అందులో పనిచేసే జెన్‌కో ఉద్యోగులను తిరిగి జెన్‌కోలోకి వచ్చేందుకు వెసులుబాటు కలిగించింది. 
వరుస నష్టాలు చవిచూస్తున్న కృష్టపట్నం థర్మల్‌ ప్లాంట్‌ ను లాభాల బాట పట్టించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేబినెట్ తెలిపింది . ప్రస్తుతం కిలోవాట్‌ కోసం అవుతున్న ఖర్చు రూ.3.14 కాగా దాని పక్కనే ఉన్న మరో పవర్‌ ప్లాంట్‌లో కి లోవాట్‌ ఉత్పత్తికి అవుతున్న ఖర్చు రూ.2.34 గా ఉంది. ఈ ఆపరేషనల్‌ ఖర్చులు తగ్గించుకునేందుకు నిర్వహణ హక్కులు వేరొకరికి అప్పగించడానికి ఓ అండ్‌ ఎం కోసం బిడ్డింగ్‌కు ఆహ్వానించాలని మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. 

జిల్లాకో మెడికల్ కాలేజ్ కు  కేబినెట్ నిర్ణయం
ఇకపై రాష్ట్రంలో ప్రతీ జిల్లాలోనూ ఒక్కో మెడికల్ కాలేజ్ ఉండాలని కేబినెట్ నిర్ణయించింది. మొత్తం 16 కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణానికి రూ.7880 కోట్లకు పరిపాలనా పరమైన అనుమతులకు ఆమోదం తెలిపింది. మరో రూ.3820 కోట్లతో పాత మెడికల్‌ కాలేజీలు, అనుబంధ ఆస్పత్రులు పునరుద్ధరణ, అభివృద్ధి పనులకు ఓకే చెప్పింది. అలాగే ఎన్‌ఎంసీ నిబంధనల మేరకు 8 అడిషనల్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ పోస్టుల మంజూరుకు కేబినెట్‌ అంగీకరిస్తూ ఆయుష్‌ విభాగంలో నేచురోపతి, యోగా డిస్పెన్సరీల్లో 78 పోస్టుల మంజూరుకు ఆమోదం తెలిపింది. దీనివల్ల మొత్తం 26 డిస్పెన్సరీల్లో ముగ్గురు చొప్పున 78 పోస్టులు భర్తీ కానున్నాయి . 

రాష్ట్రంలో కొత్తగా 4 విమాన సర్వీసులకు ఇండిగోతో ఒప్పందం

కడప, కర్నూలు నుంచి విమానాలు నడిపేందుకు ఇండిగోతో ఏపీ చేసిన ఒప్పందానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. కడప విమానాశ్రయం నుంచి కడప–విజయవాడ, కడప–చెన్నై, కర్నూలు నుంచి విజయవాడకు వారానికి 4 సర్వీసులు నడపడానికి ప్రభుత్వం ఇండిగో సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఈ సర్వీసులు  27 మార్చి నుంచి  ప్రారంభం కానున్నాయి . 

ధాన్యం కొనుగోళ్లు, వ్యవసాయ పరిస్థితులపై మంత్రివర్గసమావేశంలో చర్చ

వ్యవసాయ అనుబంధ రంగాల్లో గుడ్‌ గవర్నెన్స్‌ ఇండెక్స్‌ (జీజీఐ)లో ప్రథమ స్ధానంలో ఆంధ్రప్రదేశ్‌ ఉందని కేబినెట్ తెలిపింది. వ్యవసాయ రంగంలో 11.3 శాతం, ఉద్యానవన రంగంలో 12.3 శాతం, పశుసంవర్ధకశాఖలో 11.7 శాతం, మాంసం ఉత్పత్తిలో 10.3 శాతం అభివృద్ధి సాధించిన ఏపీ. దీంతో పాటు క్రాప్‌ ఇన్సూరెన్స్‌లో అనుసరించిన వినూత్న విధానాలతో ఆంధ్రప్రదేశ్‌ దేశంలో మిగిలిన రాష్ట్రాలకు రోల్‌మోడల్‌గా నిల్చిందని కేబినెట్‌కు  అధికారులు తెలిపారు. ఉద్యానవనశాఖలో అనుసరించిన వినూత్న విధానాల ఫలితంగా,అగ్రి పుడ్‌ ఎంపవరింగ్‌ ఇండియా అవార్డ్స్‌ 2020–21 గాను బెస్ట్‌ హార్చికల్చర్‌ స్టేట్‌ ఇన్‌ ఇండియా అవార్డును పొందిన ఏపీ ఉద్యానవనశాఖను కేబినెట్ అభినందించింది. 2019 –20తో పోల్చుకుంటే కాంపౌండ్‌ యాన్యువల్‌ గ్రోత్‌ రేట్‌ (సీఏజీఆర్‌) 4.7 శాతం నుంచి 2020–21లో 12.3శాతానికి  ఉద్యానవన ఉత్పత్తులు పెరిగాయని కేబినెట్ తెలిపింది. 

OTS స్కీం చెల్లింపుల్లో స్వల్ప మార్పులు

జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంలో స్వల్ప మార్పులు చేసినట్టు కేబినెట్ తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లోని వారికి 2 వాయిదాల్లో ఓటీఎస్‌ కట్టే వెసులుబాటు కల్పించినట్టు ప్రభుత్వం చెప్పింది. ఉగాది, దీపావళి రెండు వాయిదాల్లో చెల్లించే వెసులుబాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఓటీఎస్‌ ఇళ్లు, టిడ్కో, విశాఖలోని మిషనరీస్‌ ఆఫ్‌ చారిటీస్‌కి స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఛార్జీ మినహాయింపులకు కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది . 

మరికొన్ని కీలక నిర్ణయాలు

వీటితోపాటు తిరుపతిలో క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్ కు అకాడమీ నిర్మాణం కోసం 5 ఎకరాలు కేటాయించడానికి ఆమోదం తెలిపింది మంత్రిమండలి. ఐసీడీఎస్‌కు బాలమృతం, ఫోర్టిఫైడ్‌ ఆహారం, తాజా పాలు అమూల్‌ నుంచి సరఫరాకు కేబినెట్‌ ఓకే చెబుతూ 
ఏపీడీడీసీఎఫ్‌ ద్వారా అమూల్ సరఫరా చేస్తుందని కేబినెట్ తెలిపింది. అలాగే ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన మీట్ కార్పొరేషన్ కు 7 పోస్టులు మంజూరు చేసింది. వీటితో పాటు ఎండో మెంట్‌ చట్టం – 1987 కి సవరణలతో ఆర్డినెన్స్‌ జారీకి కేబినెట్‌ ఆమోదం చెప్పింది . 
దీని ద్వారా టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుల నియామకానికి సంబంధించి సవరణలు తీసుకురావాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది . ఆచార్య ఎన్టీరంగా యూనివర్శిటీ పరిధిలో అనకాపల్లిలో రీజనల్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ ( రార్స్‌)కు ఉచితంగా భూమి కేటాయిస్తూ తీసుకున్న    నిర్ణయానికి కేబినెట్‌ అంగీకరిస్తూ దానితోపాటే రీజనల్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ స్టేషన్‌(రార్స్‌)కు 50 ఎకరాల భూమిని కేటాయించేందుకు కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది .

Also Read: ఏపీ సర్కార్‌కు మరో ఝలక్.. ఇక ఆ ఉద్యోగులు కూడా రంగంలోకి.. ఈ నెల జీతాలు రానట్లే..!

Also Read: ఫిబ్రవరి 7 లేదా 8 నుంచి నిరవధిక సమ్మె.. ఏపీ ఉద్యోగ సంఘాల నిర్ణయం !

Also Read: మెప్పు కోసం విప్పుకొని తిరుగుతావా రాజా, ఏ1 చేతిలో తన్నులు తినకుండా చూస్కో..’ ట్విటర్‌లో వైసీపీ ఎంపీల రచ్చ

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AMNS Steel Plant in Anakapalli: నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
AP Rains Alert: ఏపీలో 4 రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాల్లో పిడుగులు పడతాయని వార్నింగ్
ఏపీలో 4 రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాల్లో పిడుగులు పడతాయని వార్నింగ్
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
RTA Challan Link Scam: ఎమ్మెల్యేకే తప్పని సైబర్ షాక్.. చలాన్ పేరుతో లింక్, ఒక్క క్లిక్‌తో ₹12 లక్షలు మాయం
ఎమ్మెల్యేకే తప్పని సైబర్ షాక్.. చలాన్ పేరుతో లింక్, ఒక్క క్లిక్‌తో ₹12 లక్షలు మాయం

వీడియోలు

5 key Reasons behind Trump's decision to halt war | ఇరాన్ పై 5 రోజులపాటు దాడులకు విరామం ప్రకటించిన ట్రంప్. ఆయన నిర్ణయం వెనుక 5 ప్రధాన కారణాలపై విశ్లేషణ
MS Dhoni about IPL Retirement | రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన తల ధోని | ABP Desam
Virat Kohli Reacts on Fake News | ఫేక్ వార్తలపై విరాట్ ఫన్నీ రియాక్షన్ | ABP Desam
Abhishek Sharma Shouts 'Jai Babu' | జై బాబు అంటూ అభిషేక్ శర్మ రచ్చ | ABP Desam
Aakash Chopra comments on SRH | SRH బౌలింగ్‌పై ఆకాశ్ చోప్రా ఘాటు వ్యాఖ్యలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Formula E Race Case: ఫార్ములా ఈ కార్ రేస్ కేసు చార్జిషీట్.. ఏ1గా కేటీఆర్‌, క్విడ్ ప్రోకో జరిగిందన్న ఏసీబీ
ఫార్ములా ఈ కార్ రేస్ కేసు చార్జిషీట్.. ఏ1గా కేటీఆర్‌, క్విడ్ ప్రోకో జరిగిందన్న ఏసీబీ
Foundation stone laid for steel plant: చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
Hyderabad Latest News: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
YS Sharmila On Jagan: నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Pawan Kalyan : పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
Gold and Silver Price: పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
Stock Market 23 March: కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
Embed widget