అన్వేషించండి

Andhra Pradesh News: మెరుగైన పౌర సేవల కోసం ఏపీ ప్రభుత్వం అవేర్ యాప్.. 42 అంశాలపై సమాచారం

గ్రామసభల ఆమోదంతోనే పనులు చేపట్టాలని, 42 అంశాలతో త్వరలో అవేర్ యాప్ విడుదల చేయాలని రియల్ టైమ్ గవర్నెన్సుపై సమీక్షలో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

అమరావతి: వివిధ ప్రభుత్వ శాఖలు అందించే పౌర సేవలను మరింత మెరుగ్గా అందించాలని అధికారులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. సోమవారం సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ (RTG) కేంద్రంలో పలు అంశాలపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు సమర్థంగా ప్రజల్లోకి వెళ్లాలని సూచనలు జారీ చేశారు. సీఎం చంద్రబాబు అధికారులతో మాట్లాడుతూ, ప్రజామోదం మేరకే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పనులు చేపట్టేలా చూడాలని ఆదేశించారు. అదేవిధంగా, గ్రామీణ ప్రాంతాల్లోనూ గ్రామ సభల అనుమతి లేకుండా పనులు చేపట్టవద్దని, నరేగా (NREGA) పనులకూ ఇదే నిబంధన వర్తించేలా చూడాలని స్పష్టం చేశారు.

జవాబుదారీతనం, పారదర్శకత ఉండాలి..

మంత్రులు, ప్రజా ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమర్థంగా వివిధ అంశాలను ప్రజల ముందు ఉంచాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రభుత్వ విభాగాలు సాంకేతికతను మరింతగా అందిపుచ్చుకోవడంతో పాటు సామర్థ్యాలను పెంచుకోవాలని పేర్కొన్నారు. సుపరిపాలన లాంటి మోడల్ ఆఫ్ గవర్నెన్స్‌ ద్వారానే ప్రజల్లో సంతృప్తి స్థాయి పెరుగుతుందని, క్షేత్రస్థాయిలో ప్రజలకు మంచి సేవలు అందించడం ద్వారానే దీనిని సాధించవచ్చని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాల అమలు, పౌరసేవలకు సంబంధించి ప్రతి అంశంలోనూ జవాబుదారీతనం కీలకమైన అంశంగా పరిగణించాలన్నారు. దీనికి సంబంధించి 175 నియోజకవర్గాల్లోనూ కెపాసిటీ బిల్డింగ్ (సామర్థ్య పెంపు) కూడా జరగాలని అన్నారు. ప్రజల్లో సానుకూలత పెరిగేలా సూక్ష్మ స్థాయి వరకు విశ్లేషణ జరగాలని సూచించారు.

ఇటీవల రాష్ట్రంలో మొక్కజొన్న, కాటన్ (పత్తి), అరటి పంటల్లోని సమస్యను పరిష్కరించి రైతులకు ధర దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వ శాఖలు ఆర్థిక, ఆర్థికేతర అంశాలను ప్రాధాన్యతా క్రమంలో పనులు పూర్తి చేయాలని, తద్వారా ప్రజల్లో సానుకూల ధోరణి పెరిగేందుకు వీలుగా కార్యాచరణ ఉండాలన్నారు. నిరంతరం డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకునేలా ప్రణాళికలు ఉండాలని సూచించారు. పౌర సేవల్ని అందించటంలో నిర్లక్ష్యంగా ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

టెక్నాలజీ, పర్యవేక్షణ చర్యలు
త్వరలో ప్రజలకు అందుబాటులోకి 'అవేర్ యాప్' తీసుకురావాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. వాతావరణ హెచ్చరికలు సహా 42 అంశాల్లో నిరంతర సమాచారం కోసం ఈ యాప్‌ను ప్రజల వినియోగం కోసం విడుదల చేయాలన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలూ డేటా లేక్‌కు అనుసంధానం కావాలని సూచించారు.  రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో బ్యాండ్ విడ్త్ కనెక్టివిటీని పెంచాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ హాస్టళ్లలోని తాగు నీరు, పరిశుభ్రత తదితర అంశాలపై పర్యవేక్షణ జరగాలని సూచించారు. దీనిపై ఓ యాప్‌ను రూపొందించి రోజువారీగా తనిఖీ చేస్తున్నామని అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు.

దేవాలయాలు, పర్యావరణం
తిరుమలలో టీటీడీ భక్తులకు అందించే సేవలు, క్రౌడ్ మేనేజ్‌మెంట్, సెక్యూరిటీ లాంటి అంశాలను అధ్యయనం చేసి ఇతర దేవాలయాల్లో అమలు చేయాలని చంద్రబాబు సూచించారు. కాలుష్య నియంత్రణ మండలితో కలిసి ఎయిర్ క్వాలిటీ సెన్సార్లను ఏర్పాటు చేసి ఆ వివరాలను కూడా ప్రజలకు అందించాలన్నారు. సుపరిపాలనా అంశాలపై డిసెంబరులో ఎమ్మెల్యేలు, ఎంపీలతో వర్క్‌షాప్ నిర్వహించనున్నట్టు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

 Nara Lokesh Big Announcement: మహిళలకు 33శాతం సీట్లు  మహానాడులో చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన లోకష్
మహిళలకు 33శాతం సీట్లు..!  మహానాడులో చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన నారాలోకేష్
Nara Lokesh On Women Reservation: రిజర్వేషన్‌తో సంబంధం లేకుండా వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు- నారా లోకేష్ కీలక ప్రకటన
రిజర్వేషన్‌తో సంబంధం లేకుండా వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు- నారా లోకేష్ కీలక ప్రకటన
TDP Mahanadu 2026: నేటి నుంచి 2 రోజులపాటు టీడీపీ మహానాడు.. ఈసారి అజెండా, తీర్మానాలు, ప్రత్యేకతలు ఇవే
నేటి నుంచి 2 రోజులపాటు టీడీపీ మహానాడు.. ఈసారి అజెండా, తీర్మానాలు, ప్రత్యేకతలు ఇవే
DAY NRLM Scheme: డ్వాక్రా మహిళలకు బంపర్ ఆఫర్.. పూచీకత్తు లేకుండా రూ. 10 లక్షల లోన్.. వడ్డీ రాయితీ కూడా!
డ్వాక్రా మహిళలకు బంపర్ ఆఫర్.. పూచీకత్తు లేకుండా రూ. 10 లక్షల లోన్.. వడ్డీ రాయితీ కూడా!

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan Key Comments: ఓట్లు తగ్గినా, పెరిగినా డేంజరే -స్థానికల్లో పోటీ చేసి తీరాలి - పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం
ఓట్లు తగ్గినా, పెరిగినా డేంజరే -స్థానికల్లో పోటీ చేసి తీరాలి - పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం
Uppal Real Estate: ఉప్పల్‌లో రివర్స్ గేర్ వేసిన రియల్ భూమ్.. ప్లాట్లు కొనేందుకు వెనకాడుతున్న జనం, కారణం అదేనా?
ఉప్పల్‌లో రివర్స్ గేర్ వేసిన రియల్ భూమ్.. ప్లాట్లు కొనేందుకు వెనకాడుతున్న జనం, కారణం అదేనా?
ED Raids Kerala: కేరళలో ఈడీ అధికారులపై సీపీఎం కార్యకర్తల దాడి - మాజీ సీఎం విజయన్ ఇంట్లో సోదాలు చేశారని ఆగ్రహం
కేరళలో ఈడీ అధికారులపై సీపీఎం కార్యకర్తల దాడి - మాజీ సీఎం విజయన్ ఇంట్లో సోదాలు చేశారని ఆగ్రహం
Nara lokesh Big Announcement మహిళలకు 33 శాతం సీట్లు
Nara lokesh Big Announcement మహిళలకు 33 శాతం సీట్లు
Byjus Founder Byju Raveendran: బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు 6 నెలల జైలు, భారీ జరిమానా! రోడ్డున పడ్డ బిలియనీర్
బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు 6 నెలల జైలు, భారీ జరిమానా! రోడ్డున పడ్డ బిలియనీర్
Chandrababu Speech At Mahanadu: జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఏకైక పార్టీ టీడీపీ, విజన్ పాలిటిక్స్‌కు నాంది: చంద్రబాబు
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఏకైక పార్టీ టీడీపీ, విజన్ పాలిటిక్స్‌కు నాంది: చంద్రబాబు
BRS Aggressive Politics: బీఆర్ఎస్ యువనేతల దూకుడు.. ఆవేశంలో మునిగిపోతున్న ఆలోచన! లాభమా..నష్టమా?
బీఆర్ఎస్ యువనేతల దూకుడు.. ఆవేశంలో మునిగిపోతున్న ఆలోచన! లాభమా..నష్టమా?
Mancherial Crime News: రూ.2 కోట్ల ఇన్సురెన్స్ నగదు కోసం సుపారీ ఇచ్చి భర్త హత్య.. మంచిర్యాల జిల్లాలో దారుణం
రూ.2 కోట్ల ఇన్సురెన్స్ నగదు కోసం సుపారీ ఇచ్చి భర్త హత్య.. మంచిర్యాల జిల్లాలో దారుణం
Embed widget