అన్వేషించండి

Andhra Pradesh News: మెరుగైన పౌర సేవల కోసం ఏపీ ప్రభుత్వం అవేర్ యాప్.. 42 అంశాలపై సమాచారం

గ్రామసభల ఆమోదంతోనే పనులు చేపట్టాలని, 42 అంశాలతో త్వరలో అవేర్ యాప్ విడుదల చేయాలని రియల్ టైమ్ గవర్నెన్సుపై సమీక్షలో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

అమరావతి: వివిధ ప్రభుత్వ శాఖలు అందించే పౌర సేవలను మరింత మెరుగ్గా అందించాలని అధికారులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. సోమవారం సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ (RTG) కేంద్రంలో పలు అంశాలపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు సమర్థంగా ప్రజల్లోకి వెళ్లాలని సూచనలు జారీ చేశారు. సీఎం చంద్రబాబు అధికారులతో మాట్లాడుతూ, ప్రజామోదం మేరకే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పనులు చేపట్టేలా చూడాలని ఆదేశించారు. అదేవిధంగా, గ్రామీణ ప్రాంతాల్లోనూ గ్రామ సభల అనుమతి లేకుండా పనులు చేపట్టవద్దని, నరేగా (NREGA) పనులకూ ఇదే నిబంధన వర్తించేలా చూడాలని స్పష్టం చేశారు.

జవాబుదారీతనం, పారదర్శకత ఉండాలి..

మంత్రులు, ప్రజా ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమర్థంగా వివిధ అంశాలను ప్రజల ముందు ఉంచాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రభుత్వ విభాగాలు సాంకేతికతను మరింతగా అందిపుచ్చుకోవడంతో పాటు సామర్థ్యాలను పెంచుకోవాలని పేర్కొన్నారు. సుపరిపాలన లాంటి మోడల్ ఆఫ్ గవర్నెన్స్‌ ద్వారానే ప్రజల్లో సంతృప్తి స్థాయి పెరుగుతుందని, క్షేత్రస్థాయిలో ప్రజలకు మంచి సేవలు అందించడం ద్వారానే దీనిని సాధించవచ్చని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాల అమలు, పౌరసేవలకు సంబంధించి ప్రతి అంశంలోనూ జవాబుదారీతనం కీలకమైన అంశంగా పరిగణించాలన్నారు. దీనికి సంబంధించి 175 నియోజకవర్గాల్లోనూ కెపాసిటీ బిల్డింగ్ (సామర్థ్య పెంపు) కూడా జరగాలని అన్నారు. ప్రజల్లో సానుకూలత పెరిగేలా సూక్ష్మ స్థాయి వరకు విశ్లేషణ జరగాలని సూచించారు.

ఇటీవల రాష్ట్రంలో మొక్కజొన్న, కాటన్ (పత్తి), అరటి పంటల్లోని సమస్యను పరిష్కరించి రైతులకు ధర దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వ శాఖలు ఆర్థిక, ఆర్థికేతర అంశాలను ప్రాధాన్యతా క్రమంలో పనులు పూర్తి చేయాలని, తద్వారా ప్రజల్లో సానుకూల ధోరణి పెరిగేందుకు వీలుగా కార్యాచరణ ఉండాలన్నారు. నిరంతరం డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకునేలా ప్రణాళికలు ఉండాలని సూచించారు. పౌర సేవల్ని అందించటంలో నిర్లక్ష్యంగా ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

టెక్నాలజీ, పర్యవేక్షణ చర్యలు
త్వరలో ప్రజలకు అందుబాటులోకి 'అవేర్ యాప్' తీసుకురావాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. వాతావరణ హెచ్చరికలు సహా 42 అంశాల్లో నిరంతర సమాచారం కోసం ఈ యాప్‌ను ప్రజల వినియోగం కోసం విడుదల చేయాలన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలూ డేటా లేక్‌కు అనుసంధానం కావాలని సూచించారు.  రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో బ్యాండ్ విడ్త్ కనెక్టివిటీని పెంచాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ హాస్టళ్లలోని తాగు నీరు, పరిశుభ్రత తదితర అంశాలపై పర్యవేక్షణ జరగాలని సూచించారు. దీనిపై ఓ యాప్‌ను రూపొందించి రోజువారీగా తనిఖీ చేస్తున్నామని అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు.

దేవాలయాలు, పర్యావరణం
తిరుమలలో టీటీడీ భక్తులకు అందించే సేవలు, క్రౌడ్ మేనేజ్‌మెంట్, సెక్యూరిటీ లాంటి అంశాలను అధ్యయనం చేసి ఇతర దేవాలయాల్లో అమలు చేయాలని చంద్రబాబు సూచించారు. కాలుష్య నియంత్రణ మండలితో కలిసి ఎయిర్ క్వాలిటీ సెన్సార్లను ఏర్పాటు చేసి ఆ వివరాలను కూడా ప్రజలకు అందించాలన్నారు. సుపరిపాలనా అంశాలపై డిసెంబరులో ఎమ్మెల్యేలు, ఎంపీలతో వర్క్‌షాప్ నిర్వహించనున్నట్టు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Andhra Praedesh News: ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూల్ ఉద్యోగుల ఏజ్ లిమిట్ పెంపు
ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూల్ ఉద్యోగుల ఏజ్ లిమిట్ పెంపు
Devansh Birthday:శ్రీవారి సన్నిధిలో చంద్రబాబు ఫ్యామిలీ! దేవాన్ష్ పుట్టిన రోజున తిరుమలలో అన్నదాన కార్యక్రమం! స్వయంగా వడ్డించిన సీఎం!
శ్రీవారి సన్నిధిలో చంద్రబాబు ఫ్యామిలీ! దేవాన్ష్ పుట్టిన రోజున తిరుమలలో అన్నదాన కార్యక్రమం! స్వయంగా వడ్డించిన సీఎం!
Andhra Pradesh Weather: ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన! రెండు రోజులు బీభత్సం! పిడుగులతో జనం బెంబేలు!
ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన! రెండు రోజులు బీభత్సం! పిడుగులతో జనం బెంబేలు!
Andhra Pradesh Latest News:ఏపీలో ఐఏఎస్ అధికారుల భారీ బదిలీలు- సీఆర్డీఏకు కొత్త బాస్‌!
ఏపీలో ఐఏఎస్ అధికారుల భారీ బదిలీలు- సీఆర్డీఏకు కొత్త బాస్‌!

వీడియోలు

Petrolium Ministry on LPG Shoratge | ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదంటూనే కేంద్రం సూచనలు | ABP Desam
Negative Campaign on SRH | IPL 2026 కి ముందు సన్ రైజర్స్ పై ఫేక్ పోస్టులు | ABP Desam
CSK Video on Shivam Dube | IPL 2026 కి ముందు చెన్నైలో క్రికెట్ బాల్స్ ఆందోళన | ABP Desam
Virat Kohli Home Coming RCB | IPL 2026 యుద్ధానికి తిరిగొచ్చిన మహారాజు | ABP Desam
Ishan Kishan Interim Captain SRH | ఇషాన్ వైపే ఆరెంజ్ ఆర్మీ మొగ్గు చూపింది అందుకే | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Praedesh News: ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూల్ ఉద్యోగుల ఏజ్ లిమిట్ పెంపు
ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూల్ ఉద్యోగుల ఏజ్ లిమిట్ పెంపు
Harish Rao: శ్రమ మాది.. శిలాఫలకం రేవంత్ రెడ్డిది - సిద్దిపేట పర్యటనపై హరీశ్ రావు బహిరంగలేఖ
శ్రమ మాది.. శిలాఫలకం రేవంత్ రెడ్డిది - సిద్దిపేట పర్యటనపై హరీశ్ రావు బహిరంగలేఖ
Fire Cracker Lorry Catches Fire: హైటెన్షన్ వైర్లు తగిలి పేలిన టపాసులు, లారీ దగ్ధం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన
హైటెన్షన్ వైర్లు తగిలి పేలిన టపాసులు, లారీ దగ్ధం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన
Anand Mahindra: గంటన్నర ముచ్చట్లే మహింద్రా గ్రూపును నిడిపే లీడర్లను తయారు చేస్తాయి - ఆనంద్ మహింద్రా విజయరహస్యం ఇదే!
గంటన్నర ముచ్చట్లే మహింద్రా గ్రూపును నిడిపే లీడర్లను తయారు చేస్తాయి - ఆనంద్ మహింద్రా విజయరహస్యం ఇదే!
Chandrababu Tirumala: సాంకేతికతతో ఆధ్యాత్మిక వైభవం - తిరుమలలో సీఎం చంద్రబాబు సరికొత్త మార్పులు
సాంకేతికతతో ఆధ్యాత్మిక వైభవం - తిరుమలలో సీఎం చంద్రబాబు సరికొత్త మార్పులు
Karimnagar SI Chandrasekhar Suicide : కరీంనగర్‌ టూటౌన్‌ ఎస్సై చంద్రశేఖర్‌ సూసైడ్‌- ఐదు రోజుల క్రితమే భార్య ఆత్మహత్య 
కరీంనగర్‌ టూటౌన్‌ ఎస్సై చంద్రశేఖర్‌ సూసైడ్‌- ఐదు రోజుల క్రితమే భార్య ఆత్మహత్య 
Trump Iran War:ఇరాన్ యుద్ధం ముగింపు దిశగా అడుగులు! అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన!
ఇరాన్ యుద్ధం ముగింపు దిశగా అడుగులు! అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన!
రైలులో భోజనం తాజాదో కాదో తెలుసుకునేందుకు ఈ పని చేయండి, చిటికెలో మీకు సమాధానం వచ్చేస్తుంది!
రైలులో భోజనం తాజాదో కాదో తెలుసుకునేందుకు ఈ పని చేయండి, చిటికెలో మీకు సమాధానం వచ్చేస్తుంది!
Embed widget