అన్వేషించండి

స్పందనకు రాలేకపోతున్నారా, అయితే 1902కు కాల్ చేయండి

సీఎం జగన్ మంగళవారం జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీన్ని ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకువెళ్ళేందుకు అధికార యంత్రాంగం అన్ని ప్రయత్నాలు చేస్తోంది.

స్పందనకు రాలేకపోతే  ఏం చేయాలనే సందేహం ఇప్పటి వరకు చాలా మంది బాధితుల్లో ఉంది. అయితే ఇప్పడు సింపుల్‌గా ఒక్క ఫోన్ కాల్‌తో తమ సమస్యను వివరించుకునే ఛాన్స్ అందుబాటులోకి వచ్చిందని అధికారులు చెబుతున్నారు.

సీఎం జగన్ మంగళవారం జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకువెళ్ళేందుకు అధికార యంత్రాంగం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రతి సోమవారం వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే స్పందనకు ప్రజల నుంచి వినతులు వస్తుంటాయి. 

ఒక్కో జిల్లాలో స్పందనకు కనీసం 450కి పైగా అర్జీలు రావటం కామన్ అయిపోయింది. అయితే జిల్లా కార్యాలయానికి రాలేని వారు, సీనియర్ సిటిజన్లు, మహిళలు, చాలా మంది స్పందనలో తమ బాధలను చెప్పుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. బయటకు వచ్చి తమ సమస్యను లేదా సామాజిక అంశాల గురించి వివరించేందుకు చాలా మంది జంకుతుంటారు. 

అలాంటి పరిస్థితులకు భిన్నంగా ఇప్పుడు ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన 1902 నెంబర్‌కు కాల్ చేసి నేరుగా తమ సమస్యను చెప్పుకునేందుకు వీలు కల్పించామని అధికారులు చెబుతున్నారు. స్పందనకు రాలేని వారు ఇకపై 1902కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని ప్రభుత్వం ప్రకటించింది.

ఫిర్యాదు తీసుకోవడంతోనే సరిపెట్టడం లేదని అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. జిల్లా మండల గ్రామ స్థాయిలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు పరిష్కారమైన తరువాత ఫిర్యాదుదారుడుకు ఫోన్ చేసి అడిగి తెలుసుకునే వెసులుబాటును కూడా కల్పిస్తున్నామని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.

స్పందన అప్ డేట్ కీలకం..
ఇప్పటి వరకు ఒక ఎత్తు...ఇక పై మరో ఎత్తు అనే విధంగా రాష్ట్ర ప్రభుత్వం 1902కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది. జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో భాగంగా మరిన్ని సదుపాయాసు అందుబాటులోకి తీసుకు వచ్చింది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ముందుగా చెబుతున్న రీతిలోనే స్పందనకు అప్ డేట్ వర్షన్‌గా జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సో ఈ కార్యక్రమం ద్వార ప్రజల సమస్యలు, వ్యక్తిగత సమస్యలను సైతం పొందుపరచేందుకు వీలుంటుంది. 

చాలా చోట్ల వర్గాలు, విభేదాలు వంటి సమస్యలతో అభివృద్ధికి తీవ్ర ఆటంకాలు జరుగుతున్న సందర్భాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఇలాంటి వాటిని వెలుగులోకి తేవటం అంటే స్థానికంగా ఉన్న వారికి చాలా ఇబ్బందులు వస్తుంటాయి. ప్రత్యర్థులు లేదా ఆధిపత్యం చెలాయించే వ్యక్తులు ఫిర్యాదు చేసిన వారి పై దాడులకు దిగటం, వేధింపులకు గురి చేయటం వంటి సందర్భాలు కూడా లేకపోలేదు. ఇలాంటి పరిస్థితులను అధిగమించేందుకు కూడా 1902కాల్ సెంటర్ ఉపయోగ పడుతుందని భావిస్తున్నారు. 

పల్నాడు,రాయలసీమ ప్రాంతల్లో ప్రత్యర్థులు కాపు కాసి తమకు వ్యతిరేకంగా పని చేస్తున్న వారిపై దాడులు చేయటం చాలా చోట్ల వెలుగులోకి వచ్చాయి. లేదంటే ప్రభుత్వానికి, అధికారులకు ఫిర్యాదు చేసేందుకు వెళుతున్న వారిని అటకాయించి బెదిరింపులకు గురి చేయటం కూడా కామన్. అలాంటి పరిస్థితులకు చెక్ పెడుతూ ఇకపై ఇంట్లో ఉండే 1902కి కాల్ చేసి సమస్యను గురించి వివరించవచ్చు. ఆయా శాఖలకు చెందిన అధికారులు తప్పనిసరిగా అప్రమత్తమై సమస్యలను పరిష్కరిస్తారు. బాధితుడికి ఫోన్ చేసి సమస్య పరిష్కారానికి సంబంధించిన వివరాలను సైతం వెల్లడిస్తారు. ఇలా భరోసా కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Keshineni Chinni vs Kolikapudi: టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి మధ్య వివాదం ముగిసినట్లే.. అంతా క్లియర్ అయిందా!
టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి మధ్య వివాదం ముగిసినట్లే.. అంతా క్లియర్ అయిందా!
Social Media Ban for Children: 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం.. ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటన
13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం.. ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటన
Free Sanitary Napkins: ఏపీలో 7 నుంచి 12వ తరగతి బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్ కిన్స్: నారా లోకేష్
ఏపీలో 7 నుంచి 12వ తరగతి బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్ కిన్స్: నారా లోకేష్
Tiger Rampachodavaram Agency: రంపచోడవరం మన్యం ప్రజల్ని వణికిస్తున్న పెద్దపులి.. జాడ కోసం అధికారుల ప్రయత్నాలు
రంపచోడవరం మన్యం ప్రజల్ని వణికిస్తున్న పెద్దపులి.. జాడ కోసం అధికారుల ప్రయత్నాలు

వీడియోలు

Vijay Trisha Attended Marriage | పట్టు బట్టల్లో..ఒకే కారులో..విజయ్ త్రిష | ABP Desam
Axar patel Catches vs Eng T20 World Cup 2026 | కళ్లు చెదిరే క్యాచ్ లతో దుమ్మురేపిన బాపు | ABP Desam
Jasprit Bumrah Bowling vs Eng | T20 World Cup 2026 ఫైనల్ కి భారత్ వెళ్లింది అంటే..బుమ్రా దయ | ABP Desam
Sanju Samson 89 vs England Semis | T20 World Cup 2026లో హీరోగా మారిపోయిన సంజూ శాంసన్ | ABP Desam
Ind vs Eng 2nd Semifinal Highlights | T20 World Cup 2026 సెమీస్ లో ఇంగ్లండ్ పై భారత్ విక్టరీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
New Governor of Telangana: కొత్త గవర్నర్ అజర్ మంత్రిపదవి కాపాడతారా?
కొత్త గవర్నర్ అజర్ మంత్రిపదవి కాపాడతారా?
Assembly Botsa Chit Chat: చంద్రబాబు ఢిల్లీకి వెళ్తే.. పవన్ సీఎం కావొచ్చు - బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు
చంద్రబాబు ఢిల్లీకి వెళ్తే.. పవన్ సీఎం కావొచ్చు - బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు
Tamil Nadu Assembly Elections 2026 : ఒక్క చాన్స్ అంటూ వేడుకోళ్లు - రుణమాఫీ తాయిలాలు - టీవీకే విజయ్ అన్నీ అస్త్రాలూ వాడేస్తున్నారా?
ఒక్క చాన్స్ అంటూ వేడుకోళ్లు - రుణమాఫీ తాయిలాలు - టీవీకే విజయ్ అన్నీ అస్త్రాలూ వాడేస్తున్నారా?
Allu Sirish Wedding : అల్లు శిరీష్ నయనికల వెడ్డింగ్ - బెస్ట్ మూమెంట్స్ విత్ ఫ్యామిలీ
అల్లు శిరీష్ నయనికల వెడ్డింగ్ - బెస్ట్ మూమెంట్స్ విత్ ఫ్యామిలీ
Chandrababu Assembly: లడ్డూ కల్తీ ప్రణాళిక ప్రకారం చేసిన కుట్ర - అసెంబ్లీలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
లడ్డూ కల్తీ ప్రణాళిక ప్రకారం చేసిన కుట్ర - అసెంబ్లీలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Tiger Rampachodavaram Agency: రంపచోడవరం మన్యం ప్రజల్ని వణికిస్తున్న పెద్దపులి.. జాడ కోసం అధికారుల ప్రయత్నాలు
రంపచోడవరం మన్యం ప్రజల్ని వణికిస్తున్న పెద్దపులి.. జాడ కోసం అధికారుల ప్రయత్నాలు
Keshineni Chinni vs Kolikapudi: టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి మధ్య వివాదం ముగిసినట్లే.. అంతా క్లియర్ అయిందా!
టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి మధ్య వివాదం ముగిసినట్లే.. అంతా క్లియర్ అయిందా!
Iconic Bridge on Krishna River: కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జికి అటవీ శాఖ అనుమతి.. 80 కి.మీ తగ్గనున్న దూరం
Iconic Bridge on Krishna River: కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జికి అటవీ శాఖ అనుమతి.. 80 కి.మీ తగ్గనున్న దూరం
Embed widget