అన్వేషించండి

అటవీ భూములపై కన్నేస్తే కఠిన చర్యలు: పెద్దిరెడ్డి

అటవీప్రాంతాలకు సరిహద్దుగా ఉన్న గ్రామాల్లో అటవీభూములను కబ్జా చేసి, తప్పుడు పట్టాలు సృష్టించి భూములను తమ ఆధీనంలో ఉంచుకున్నారనే ఫిర్యాదులపై ఇప్పటికే ప్రభుత్వం దర్యాప్తు జరుపుతోందని తెలిపారు పెద్దిరెడ్డి.

ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎత్తున అటవీ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయన్న ఆరోపణల్లో వాస్తవం లేదని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న జగనన్న భూహక్కు-భూరక్ష సర్వే ద్వారా ప్రతి ఎకరాకు నిర్ధిష్టమైన సమాచారంతో యాజమాన్య హక్కులను గుర్తించే ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని అన్నారు. 

రాష్ట్రంలోని అటవీప్రాంతాలకు సరిహద్దుగా ఉన్న గ్రామాల్లో అటవీభూములను కబ్జా చేసి, తప్పుడు పట్టాలు సృష్టించి భూములను తమ ఆధీనంలో ఉంచుకున్నారనే ఫిర్యాదులపై ఇప్పటికే ప్రభుత్వం దర్యాప్తు జరుపుతోందని తెలిపారు పెద్దిరెడ్డి. దాదాపు పదివేల ఎకరాలకు సంబంధించి ఈ వివాదాలు ఉన్నాయని, వాటిపై అటవీ, రెవెన్యూ అధికారుల సంయుక్త సర్వే జరుగుతోందని వివరించారు. దొంగ పట్టాలతో ఎవరైనా అటవీ భూములను తమ ఆధీనంలో పెట్టుకుని వాటిల్లో పంటలు పండించుకుంటున్నా వదిలిపెట్టేది లేదని, జాయింట్ సర్వేలో పూర్తి వివరాలు వెలుగుచూస్తాయని అన్నారు. 

రాష్ట్రంలో జరుగుతున్న సమగ్ర సర్వేలో సైతం శాటిలైట్ ఇమేజింగ్, అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో ఎవరైనా సరే సులువుగా అర్థం చేసుకునే విధంగా భూముల వివరాలను నమోదు చేస్తున్నామని పేర్కొన్నారు పెద్దిరెడ్డి. కబ్జాదారులను గుర్తించడం, ఆక్రమణకు గురైన భూములను తిరిగి అటవీశాఖకు బదలాయించడం జరుగుతుందని, ఇందులో ఎవరినీ విడిచిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సీఎం జగన్ రాష్ట్రంలో అడ‌వుల‌ సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నారని, ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. అటవీశాఖ ఇచ్చిన ఆర్.ఓ.ఎఫ్.ఆర్ భూములు తప్ప, మిగిలిన అటవీ భూములు అక్రమంగా ఎవరి ఆధీనంలో ఉన్నా అవి తిరిగి స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు.

కావాల‌నే దుష్ర‌చారం.....


అట‌వీ భూముల వ్య‌వ‌హ‌రంలో జ‌రుగుతున్న అస‌త్య ప్ర‌చారాలపై అదికారులు ప్ర‌త్యేకంగా దృష్టి సారించాలని ఈ సంద‌ర్బంగా మంత్రి పెద్ది రెడ్డి స్ప‌ష్టం చేశారు. ప‌ని క‌ట్టుకొని భూముల‌ను క‌బ్జా చేసి వాటిని స్వ‌ప్ర‌యోజ‌నాల‌కు వినియోగించుకొని ల‌బ్ధి పొందుతున్న బ‌డాబాబులపై క‌న్నేసి క‌ఠినంగా,చ‌ట్ట‌ప‌రంగా వ్య‌వరించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పెద్ది రెడ్డి అభిప్రాయ‌ప‌డ్డారు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలోనే ఇలాంటి కార్య‌క‌లాపాలు నిర్వ‌హించారని ఆరోపించారు. ఇప్పుడు వాటిని వెలుగులోకి తీసుకువ‌చ్చి, ప్ర‌భుత్వ ఆదాయానికి గండికొడుతున్న భూక‌బ్జాదారుల‌ను ప్ర‌భుత్వం అడ్డుకుంటుంద‌ని, దీంతో కుట్ర‌పూరితంగా వైసీపీ ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేశారన్నారు. అధికారులు ఎప్ప‌టిక‌ప్పుడు ఇలాంటి అక్ర‌మాల‌ను ఖండించి క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TG DSC Results: డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్, నేడే ఫలితాల వెల్లడి - రిజల్ట్స్ ఎన్నిగంటలకంటే?
డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్, నేడే ఫలితాల వెల్లడి - రిజల్ట్స్ ఎన్నిగంటలకంటే?
Andhra Pradesh: కోరి సీటు ఇచ్చిన చంద్రబాబుకు ఎమ్మెల్యే భారం అయ్యారా? తిరువూరులో ఏం జరుగుతోంది?
కోరి సీటు ఇచ్చిన చంద్రబాబుకు ఎమ్మెల్యే భారం అయ్యారా? తిరువూరులో ఏం జరుగుతోంది?
HYDRA: రూటు మార్చిన హైడ్రా- అక్రమ కట్టడాల కూల్చివేతలపై సరికొత్త ప్లాన్ ఇదే!
రూటు మార్చిన హైడ్రా- అక్రమ కట్టడాల కూల్చివేతలపై సరికొత్త ప్లాన్ ఇదే!
Tirumala Bramhosthavam: తిరుమల ఆలయంలో ఎన్ని మండపాలున్నాయి..ఏ మండపంలో శ్రీవారికి ఏ క్రతువు నిర్వహిస్తారు!
తిరుమల ఆలయంలో ఎన్ని మండపాలున్నాయి..ఏ మండపంలో శ్రీవారికి ఏ క్రతువు నిర్వహిస్తారు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎస్‌కేలోకి అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా ఎమ్‌ఎస్ ధోని, రిటెన్షన్ కొత్త రూల్స్‌తో సస్పెన్స్తిరుమలలో మరోసారి చిరుత కలకలం, సీసీటీవీ ఫుటేజ్‌తో సంచలనంతమిళనాడు డిప్యుటీ సీఎంగా ఉదయ నిధి స్టాలిన్, ప్రకటించిన డీఎమ్‌కేకేరళలో చోరీ, తమిళనాడులో ఎన్‌కౌంటర్ - భారీ యాక్షన్ డ్రామా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TG DSC Results: డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్, నేడే ఫలితాల వెల్లడి - రిజల్ట్స్ ఎన్నిగంటలకంటే?
డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్, నేడే ఫలితాల వెల్లడి - రిజల్ట్స్ ఎన్నిగంటలకంటే?
Andhra Pradesh: కోరి సీటు ఇచ్చిన చంద్రబాబుకు ఎమ్మెల్యే భారం అయ్యారా? తిరువూరులో ఏం జరుగుతోంది?
కోరి సీటు ఇచ్చిన చంద్రబాబుకు ఎమ్మెల్యే భారం అయ్యారా? తిరువూరులో ఏం జరుగుతోంది?
HYDRA: రూటు మార్చిన హైడ్రా- అక్రమ కట్టడాల కూల్చివేతలపై సరికొత్త ప్లాన్ ఇదే!
రూటు మార్చిన హైడ్రా- అక్రమ కట్టడాల కూల్చివేతలపై సరికొత్త ప్లాన్ ఇదే!
Tirumala Bramhosthavam: తిరుమల ఆలయంలో ఎన్ని మండపాలున్నాయి..ఏ మండపంలో శ్రీవారికి ఏ క్రతువు నిర్వహిస్తారు!
తిరుమల ఆలయంలో ఎన్ని మండపాలున్నాయి..ఏ మండపంలో శ్రీవారికి ఏ క్రతువు నిర్వహిస్తారు!
AP News: పీవీ సునీల్ కుమార్ సహా వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రఘురామ ఫిర్యాదు
పీవీ సునీల్ కుమార్ సహా వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రఘురామ ఫిర్యాదు
Nepal Floods: నేపాల్‌లో వరుణుడి బీభత్సానికి 170మందికిపైగా బలి-ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడి అతలాకుతలం
నేపాల్‌లో వరుణుడి బీభత్సానికి 170మందికిపైగా బలి-ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడి అతలాకుతలం
Helene Storm: అమెరికాలో హెలీన్ విలయానికి 95 మంది మృత్యువాత-ఇంకా అంధకారంలోనే లక్షలాది ఇళ్లు
అమెరికాలో హెలీన్ విలయానికి 95 మంది మృత్యువాత-ఇంకా అంధకారంలోనే లక్షలాది ఇళ్లు
Cancer and diet : క్యాన్సర్​కు ఆహారపు అలవాట్లే ముఖ్యకారణమా?
క్యాన్సర్​కు ఆహారపు అలవాట్లే ముఖ్యకారణమా?
Embed widget