అన్వేషించండి

Thalliki Vandanam Scheme AP: ఏపీలో తల్లికి వందనం లబ్ధిదారులకు గుడ్ న్యూస్! డబ్బులు పడే ముందు ఈ పని పూర్తి చేయండి!

Thalliki Vandanam Scheme AP:ఏపీలో తల్లికి వందనం పథకం కింద 15000 జమ  చేయడానికి ముహూర్తం ఖరారైంది. జూన్ 19న నిధులు విడుదల కానున్నాయి. అర్హతలు, అప్లికేషన్‌ స్టేటస్‌, నగదు జమ వివరాలు గురించి తెలుసుకుందా. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కూటమి ప్రభుత్వం తల్లికి వందనం నిధులు జూన్ 19న విడుదల.
  • రూ.13వేలు తల్లికి, రూ.2వేలు పాఠశాల నిర్వహణకు, కిట్లు పంపిణీ.
  • పేద విద్యార్థులు చదువుకు దూరం కాకుండా ఈ పథకం ఉద్దేశ్యం.
  • అర్హులు ఆధార్-బ్యాంకు ఖాతా అనుసంధానం, KYC అప్డేట్ చేయాలి.

Thalliki Vandanam Scheme AP: ఆంధ్రప్రదేశ్‌ మరో నాలుగు రోజుల్లో స్కూల్స్ ప్రారంభంకానున్నాయి. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన తల్లికి వందనం పథకం నిధులు ఎప్పుడు వస్తాయనే చర్చ జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులు తల్లులు ఎదురు చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జూన్ 19న నిధులు విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది. 

అధికారికంగా వచ్చిన సమాచారం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం 2026 జూన్ 19వ తేదీన నిధులు విడుదల చేయనుంది. ఆ రోజున రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో మెగా పేరెంట్ టీచర్ మీట్ నిర్వహించనున్నారు. ఈ వేదిక నుంచే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులను బదిలీ చేస్తారు. అదే రోజున విద్యార్థులకు ఉచిత స్కూల్ కిట్లను కూడా పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 

15000 ఎలా అందుతాయి?

తల్లికి వందనం పథకం కింద అర్హత కలిగిన ప్రతి విద్యార్థికి ఏడాదికి 15000 ఆర్థిక సాయం అందుతోంది. అయితే ఈ నిధుల వినియోగం ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను ఇచ్చింది. 13వేలు విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాలో జమ అవుతాయి. ఒక వేళ తల్లి లేని పక్షంలో కండ్రి లేదా చట్టబద్ధమైన సంరక్షకుడి ఖాతాలో నగదు వేస్తారు. మిగతా రెండు వేల రూపాయలను పాఠశాల లేదా కళాశాల నిర్వహణ నిధి కోసం కేటాయిస్తారు. ఇది పాఠశాలల్లో మౌలిక వసతులు, టాయిలెట్లు పరిశుభ్రత కోసం వినియోగిస్తారు. 

రాష్ట్రంలోని ప్రతి బిడ్డ బడికి వెళ్లాలని, ఆర్థిక ఇబ్బందులు వల్ల ఏ ఒక్కరు కూడా చదువుకు దూరం కాకూడదని లక్ష్యంతో ఈ పథకాన్ని రూపొందించారు. ప్రభుత్వ పాఠశాలలతోపాటు గుర్తింపు పొందిన ప్రైవేటు స్కూల్స్‌లో చదివే పేద విద్యార్థులు కూడా ఈ పథకం వర్తింపజేయడం గమనార్హం. 

తల్లికి వందనం పథకానికి ఎవరు అర్హులు 

ఈ పథకం కింద లబ్ధి పొందాలంటే ప్రభుత్వం కొన్ని నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తోంది. క్షేత్రస్థాయిలో గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది వీటిని ధృవీకరిస్తున్నారు. విద్యార్థి 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు చదువుతూ ఉండాలి. గత విద్యా సంవత్సరంలో విద్యార్థికి కనీసం 75 శాతం హాజరు ఉండాలి. కుటుంబానికి 3 ఎకరాల లోపు మాగాణి, పది ఎకరాల లోపు మెట్ట భూమి మాత్రమే ఉండాలి. గత 12 నెలల సగటు కరెంటు వాడకం 300 యూనిట్ల కంటే తక్కువ ఉండాలి. తప్పనిసరిగా వైట్‌రైస్ కార్డ్ కలిగి ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగులు, ఇన్‌కమ్‌ టాక్స్‌ చెల్లించే వారు ఈ పథకానికి అనర్హులు. 

ఎలా చెక్ చేసుకోవాలి ప్రాసెస్ ఏంటీ?

మీ పేరు అర్హుల జాబితాలో ఉందో లేదో తెలుసుకోవడానికి ప్రభుత్వం సులభమైన మార్గాలను కల్పించింది. నవశకం పోర్టల్‌లో విద్యార్థులు, తల్లిదండ్రులు తమ ఆధార్ నెంబర్‌ ఉపయోగించి అప్లికేషన్ స్టేటస్‌ను స్వయంగా చూసుకోవచ్చు. మీ సమీప గ్రామ లేదా వారు సచివాలయానికి వెళ్లి కూడా అర్హుల జాబితా గురించి ఆరా తీయవచ్చు. 

మీ బ్యాంకు అకౌంట్ అప్‌డేట్‌ చేశారా?

డబ్బులు అకౌంట్‌లో పడక ముందే విద్యార్థుల తల్లులు ఈ పనులు పూర్తి చేసుకోవాలి. తల్లిపేరు మీద ఉన్న బ్యాంక్ ఖాతా రన్నింగ్‌లో ఉండాలి. ఆధార్ నెంబర్‌, బ్యాంక్ ఖాతాను ఎన్‌పీసీఐ మ్యాపింగ్ పూర్తి అయి ఉండాలి. ఒకవేళ మీ బ్యాంకులో కేవైసీ అప్‌డేట్ లేకపోతే వెంటనే పూర్తి చేయండి. లేదంటే నగదు బదిలీలో టెక్నికల్ ఇబ్బందులు తలెత్తవచ్చు. 

Frequently Asked Questions

తల్లికి వందనం పథకం నిధులు ఎప్పుడు విడుదల అవుతాయి?

జూన్ 19న నిధులు విడుదల చేయనున్నారు. ఆ రోజున ముఖ్యమంత్రి బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులను బదిలీ చేస్తారు.

తల్లికి వందనం పథకం కింద ఎంత ఆర్థిక సాయం అందుతుంది, అది ఎలా వినియోగిస్తారు?

ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15,000 ఆర్థిక సాయం అందుతుంది. రూ.13,000 తల్లి ఖాతాలో, రూ.2,000 పాఠశాల నిర్వహణ నిధికి కేటాయిస్తారు.

తల్లికి వందనం పథకానికి అర్హత ప్రమాణాలు ఏమిటి?

విద్యార్థి 1వ తరగతి నుండి ఇంటర్ వరకు చదవాలి, 75% హాజరు ఉండాలి. కొన్ని భూమి, కరెంటు వినియోగ పరిమితులు, వైట్‌రైస్ కార్డ్ తప్పనిసరి.

తల్లికి వందనం పథకం అర్హుల జాబితాను ఎలా తనిఖీ చేయాలి?

నవశకం పోర్టల్‌లో ఆధార్ నెంబర్ ఉపయోగించి స్టేటస్ చూడవచ్చు. లేదా సమీప గ్రామ/వార్డు సచివాలయంలో ఆరా తీయవచ్చు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP NDA Alliance: వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
AP Aqua Farmers: ఆక్వా రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. విద్యుత్ ఛార్జీలు భారీగా తగ్గిస్తూ జీవో జారీ
AP Aqua Farmers: ఆక్వా రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. విద్యుత్ ఛార్జీలు భారీగా తగ్గిస్తూ జీవో జారీ
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Chemical Signaling: మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Telangana 22A Land Issues:తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
Embed widget