అన్వేషించండి

Thalliki Vandanam Scheme AP: ఏపీలో తల్లికి వందనం లబ్ధిదారులకు గుడ్ న్యూస్! డబ్బులు పడే ముందు ఈ పని పూర్తి చేయండి!

Thalliki Vandanam Scheme AP:ఏపీలో తల్లికి వందనం పథకం కింద 15000 జమ  చేయడానికి ముహూర్తం ఖరారైంది. జూన్ 19న నిధులు విడుదల కానున్నాయి. అర్హతలు, అప్లికేషన్‌ స్టేటస్‌, నగదు జమ వివరాలు గురించి తెలుసుకుందా. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కూటమి ప్రభుత్వం తల్లికి వందనం నిధులు జూన్ 19న విడుదల.
  • రూ.13వేలు తల్లికి, రూ.2వేలు పాఠశాల నిర్వహణకు, కిట్లు పంపిణీ.
  • పేద విద్యార్థులు చదువుకు దూరం కాకుండా ఈ పథకం ఉద్దేశ్యం.
  • అర్హులు ఆధార్-బ్యాంకు ఖాతా అనుసంధానం, KYC అప్డేట్ చేయాలి.

Thalliki Vandanam Scheme AP: ఆంధ్రప్రదేశ్‌ మరో నాలుగు రోజుల్లో స్కూల్స్ ప్రారంభంకానున్నాయి. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన తల్లికి వందనం పథకం నిధులు ఎప్పుడు వస్తాయనే చర్చ జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులు తల్లులు ఎదురు చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జూన్ 19న నిధులు విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది. 

అధికారికంగా వచ్చిన సమాచారం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం 2026 జూన్ 19వ తేదీన నిధులు విడుదల చేయనుంది. ఆ రోజున రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో మెగా పేరెంట్ టీచర్ మీట్ నిర్వహించనున్నారు. ఈ వేదిక నుంచే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులను బదిలీ చేస్తారు. అదే రోజున విద్యార్థులకు ఉచిత స్కూల్ కిట్లను కూడా పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 

15000 ఎలా అందుతాయి?

తల్లికి వందనం పథకం కింద అర్హత కలిగిన ప్రతి విద్యార్థికి ఏడాదికి 15000 ఆర్థిక సాయం అందుతోంది. అయితే ఈ నిధుల వినియోగం ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను ఇచ్చింది. 13వేలు విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాలో జమ అవుతాయి. ఒక వేళ తల్లి లేని పక్షంలో కండ్రి లేదా చట్టబద్ధమైన సంరక్షకుడి ఖాతాలో నగదు వేస్తారు. మిగతా రెండు వేల రూపాయలను పాఠశాల లేదా కళాశాల నిర్వహణ నిధి కోసం కేటాయిస్తారు. ఇది పాఠశాలల్లో మౌలిక వసతులు, టాయిలెట్లు పరిశుభ్రత కోసం వినియోగిస్తారు. 

రాష్ట్రంలోని ప్రతి బిడ్డ బడికి వెళ్లాలని, ఆర్థిక ఇబ్బందులు వల్ల ఏ ఒక్కరు కూడా చదువుకు దూరం కాకూడదని లక్ష్యంతో ఈ పథకాన్ని రూపొందించారు. ప్రభుత్వ పాఠశాలలతోపాటు గుర్తింపు పొందిన ప్రైవేటు స్కూల్స్‌లో చదివే పేద విద్యార్థులు కూడా ఈ పథకం వర్తింపజేయడం గమనార్హం. 

తల్లికి వందనం పథకానికి ఎవరు అర్హులు 

ఈ పథకం కింద లబ్ధి పొందాలంటే ప్రభుత్వం కొన్ని నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తోంది. క్షేత్రస్థాయిలో గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది వీటిని ధృవీకరిస్తున్నారు. విద్యార్థి 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు చదువుతూ ఉండాలి. గత విద్యా సంవత్సరంలో విద్యార్థికి కనీసం 75 శాతం హాజరు ఉండాలి. కుటుంబానికి 3 ఎకరాల లోపు మాగాణి, పది ఎకరాల లోపు మెట్ట భూమి మాత్రమే ఉండాలి. గత 12 నెలల సగటు కరెంటు వాడకం 300 యూనిట్ల కంటే తక్కువ ఉండాలి. తప్పనిసరిగా వైట్‌రైస్ కార్డ్ కలిగి ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగులు, ఇన్‌కమ్‌ టాక్స్‌ చెల్లించే వారు ఈ పథకానికి అనర్హులు. 

ఎలా చెక్ చేసుకోవాలి ప్రాసెస్ ఏంటీ?

మీ పేరు అర్హుల జాబితాలో ఉందో లేదో తెలుసుకోవడానికి ప్రభుత్వం సులభమైన మార్గాలను కల్పించింది. నవశకం పోర్టల్‌లో విద్యార్థులు, తల్లిదండ్రులు తమ ఆధార్ నెంబర్‌ ఉపయోగించి అప్లికేషన్ స్టేటస్‌ను స్వయంగా చూసుకోవచ్చు. మీ సమీప గ్రామ లేదా వారు సచివాలయానికి వెళ్లి కూడా అర్హుల జాబితా గురించి ఆరా తీయవచ్చు. 

మీ బ్యాంకు అకౌంట్ అప్‌డేట్‌ చేశారా?

డబ్బులు అకౌంట్‌లో పడక ముందే విద్యార్థుల తల్లులు ఈ పనులు పూర్తి చేసుకోవాలి. తల్లిపేరు మీద ఉన్న బ్యాంక్ ఖాతా రన్నింగ్‌లో ఉండాలి. ఆధార్ నెంబర్‌, బ్యాంక్ ఖాతాను ఎన్‌పీసీఐ మ్యాపింగ్ పూర్తి అయి ఉండాలి. ఒకవేళ మీ బ్యాంకులో కేవైసీ అప్‌డేట్ లేకపోతే వెంటనే పూర్తి చేయండి. లేదంటే నగదు బదిలీలో టెక్నికల్ ఇబ్బందులు తలెత్తవచ్చు. 

Frequently Asked Questions

తల్లికి వందనం పథకం నిధులు ఎప్పుడు విడుదల అవుతాయి?

జూన్ 19న నిధులు విడుదల చేయనున్నారు. ఆ రోజున ముఖ్యమంత్రి బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులను బదిలీ చేస్తారు.

తల్లికి వందనం పథకం కింద ఎంత ఆర్థిక సాయం అందుతుంది, అది ఎలా వినియోగిస్తారు?

ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15,000 ఆర్థిక సాయం అందుతుంది. రూ.13,000 తల్లి ఖాతాలో, రూ.2,000 పాఠశాల నిర్వహణ నిధికి కేటాయిస్తారు.

తల్లికి వందనం పథకానికి అర్హత ప్రమాణాలు ఏమిటి?

విద్యార్థి 1వ తరగతి నుండి ఇంటర్ వరకు చదవాలి, 75% హాజరు ఉండాలి. కొన్ని భూమి, కరెంటు వినియోగ పరిమితులు, వైట్‌రైస్ కార్డ్ తప్పనిసరి.

తల్లికి వందనం పథకం అర్హుల జాబితాను ఎలా తనిఖీ చేయాలి?

నవశకం పోర్టల్‌లో ఆధార్ నెంబర్ ఉపయోగించి స్టేటస్ చూడవచ్చు. లేదా సమీప గ్రామ/వార్డు సచివాలయంలో ఆరా తీయవచ్చు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: వైసీపీ నేతలపై దాడి చేసింది రైతులు కాదు, టీడీపీ గూండాలు: అంబటి రాంబాబు
వైసీపీ నేతలపై దాడి చేసింది రైతులు కాదు, టీడీపీ గూండాలు: అంబటి రాంబాబు
Pawan Kalyan Comments :
"క్రిమినల్స్‌కి వత్తాసు పలికే వైసీపీ కమిట్‌మెంట్‌ చూసి ముచ్చటేస్తుంది- వారు అలానే ఉండి, మరింత కరిగిపోవాలి" పవన్ కామెంట్స్ వైరల్ 
YSRCP Leaders: అమరావతిలో పర్యటనకు వెళ్లిన వైసీపీ లీడర్లు! కోడిగుడ్లతో దాడి చేసిన రాజధాని రైతులు!
అమరావతిలో పర్యటనకు వెళ్లిన వైసీపీ లీడర్లు! కోడిగుడ్లతో దాడి చేసిన రాజధాని రైతులు!
Gade Sai Krishna Case: సాయికృష్ణ కేసులో ఇద్దరు కానిస్టేబుళ్లకు సిట్ అల్టిమేటం! కోర్టులో విజయలక్ష్మి మరో పిటిషన్! డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీస్!
సాయికృష్ణ కేసులో ఇద్దరు కానిస్టేబుళ్లకు సిట్ అల్టిమేటం! కోర్టులో విజయలక్ష్మి మరో పిటిషన్! డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీస్!
Advertisement

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Made in Jonnagiri Gold Biscuits: బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
KTR Politics: కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
Vizag Land Scam: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
Jai Moondra Cricket Career: ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
Pawan Kalyan Comments :
"క్రిమినల్స్‌కి వత్తాసు పలికే వైసీపీ కమిట్‌మెంట్‌ చూసి ముచ్చటేస్తుంది- వారు అలానే ఉండి, మరింత కరిగిపోవాలి" పవన్ కామెంట్స్ వైరల్ 
Suhas as Saattapuli: సాట్టపులిగా సుహాస్... 80 కోట్ల బడ్జెట్ సినిమాలో విలన్ రోల్!
సాట్టపులిగా సుహాస్... 80 కోట్ల బడ్జెట్ సినిమాలో విలన్ రోల్!
K Bhagyaraj : భాగ్యరాజ్ చివరి వీడియో - రెండు రోజుల క్రితం పెళ్లి వేడుకలో సందడి... ఫ్యాన్స్ ఎమోషనల్
భాగ్యరాజ్ చివరి వీడియో - రెండు రోజుల క్రితం పెళ్లి వేడుకలో సందడి... ఫ్యాన్స్ ఎమోషనల్
Embed widget