అన్వేషించండి

ప్రజలకు మరిన్ని రుణాలు ఇచ్చి సహకరించండి- బ్యాంకర్లకు మంత్రి బుగ్గన సూచన

దేశ ఆక్వారంగ ఉత్పత్తుల ఎగుమతుల్లో 40 నుంచి 50 శాతం వాటా రాష్ట్రం నుంచే జరుగుతున్నాయని వివరించిన మంత్రి బుగ్గన...ఈ రంగం తోడ్పాటును బ్యాంకులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్ర స్థాయి బ్యాంకరుల కమిటీ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో బ్యాంకింగ్ సెక్టార్ కీలకపాత్ర పోషిస్తోందని కితాబు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కాబట్టి రైతులకు వ్యవసాయ పంట రుణాలు, కౌలు రైతులకు రుణాలు అందించుటలో బ్యాంకులు పూర్తిగా సహకరించాలని విజ్ణప్తి చేశారు.

ఎంఎస్ఎంఇ రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్టు కూడా బ్యాంకర్లకు వివరించారు బుగ్గన. ఆ రంగంలో కూడా బ్యాంకులు తమ వంతు తోడ్పాటును అందించి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ముందుకు రావాలని కోరారు. టిడ్కో గృహాలు, ఇతర గృహనిర్మాణ పథకాల లబ్ధిదారులకు బ్యాంకులు సకాలంలో రుణాలు మంజూరు చేయాలని మంత్రి రాజేంద్రనాధ్ విజ్ఞప్తి చేశారు. స్వయం సహాయక సంఘాలకు రుణాలు మంజూరులో బ్యాంకులు పూర్తి స్థాయిలో సహకారం అందించాలని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలులో బ్యాంకులు అందిస్తున్న తోడ్పాటు అభినందనీయమైనదని రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అభిప్రాయపడ్డారు. అమరావతి సచివాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకరుల కమిటీ (SLBC) సమావేశం జరిగింది. 2022-23 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి బ్యాంకుల వార్షిక రుణ ప్రణాళిక(ఎసిపి)అమలులో వివిధ బ్యాంకులు సాధించిన ప్రగతి, వివిధ ఇండికేటర్ల వారీ సాధించిన లక్ష్యాలు సమీక్షించారు.

ఆక్వా రంగం పై ...

దేశ ఆక్వారంగ ఉత్పత్తుల ఎగుమతుల్లో 40 నుంచి 50 శాతం వాటా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే జరుగుతున్నాయని వివరించిన మంత్రి...ఈ రంగంలో తోడ్పాటును అందించేందుకు బ్యాంకులు అన్ని విధాలా కృషి చేయాలని బ్యాంకరులకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి రాష్ట్రంలోని ప్రతి నియోజక వర్గానికి ఒక నైపుణ్య హబ్ ఏర్పాటు చేస్తోందని నైపుణ్యాభివృద్ధిని ఇంటిగ్రేట్ చేసేందుకు వీలుగా బ్యాంకులు తగిన ప్రోత్సాహాన్ని ఇవ్వాలని సూచించారు.  ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్ధులు బ్యాంకులతో ఇంటర్నషిప్పు చేసేందుకు వీలుగా ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి సబ్ కమిటీ ముందుకు రావాలని అన్నారు. 

బ్యాంకుల మాటేంటంటే....

సమావేశంలో యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్, కంట్రీ హెడ్ ఫర్ అగ్రికల్చర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలకు బ్యాంకులు తగిన సహకారాన్ని అందిస్తు న్నాయని పేర్కొన్నారు. 2022-23 ఆర్ధిక సంవత్సరంలో బ్యాంకులు వార్షిక రుణ ప్రణాళిక మొత్తం 3లక్షల 19వేల 480 కోట్ల రూపాయల రుణాలు అందించాల్సి ఉండగా జూన్ 30 వరకూ లక్షా 39వేల 798 కోట్లు సహాయం అందించినట్టు వివరించారు. 43.76 శాతం లక్ష్యాన్ని సాధించినట్టు తెలిపారు. రంగాల వారీగా చూస్తే ప్రాధాన్యతా రంగం కింద 2లక్షల 35వేల 680 కోట్లు అందించాల్సి ఉండగా 74వేల 177 కోట్లు అందించి 31.47శాతం లక్ష్యాన్ని సాధించాయని వివరించారు. వ్యవసాయానికి సంబంధించి లక్షా 64వేల 740 కోట్లు అందించాల్సి ఉండగా 53వేల 732 కోట్లు అందించి 32.62శాతం లక్ష్యాన్ని అందుకున్నామని తెలిపారు. ఎంఎస్ఎంఇ కింద 50 వేల 100 కోట్లు అందించాల్సి ఉండగా 17 వేల 847 కోట్లు అందించి 35.62 శాతం లక్ష్యాన్ని సాధించారని పేర్కొన్నారు. ప్రాధాన్యేతర రంగానికి సంబంధించి 83వేల 800 కోట్లు అందించాల్సి ఉండగా జూన్ 30 నాటికి 65 వేల 622 కోట్లు సహాయం అందించి 78.31 శాతం లక్ష్యాన్ని అధిగమించినట్టు శ్రీనివాసరావు చెప్పారు. 

ఎస్ఎల్బీసి కన్వీనర్, యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ నవనీత్ కుమార్ మాట్లాడుతూ... జూన్ 30 వరకూ వివిధ బ్యాంకులు సాధించిన ప్రగతి వివరించారు. వివిధ ఆన్ గోయింగ్ ప్రచార కార్యక్రమాలు, కిసాన్ క్రెడిట్ కార్డులు గురించి మాట్లాడారు. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీస్ ఇన్చార్జి అనిల్ మిశ్రా మాట్లాడుతూ కిసాన్ క్రెడిట్ కార్డుదారులకు మరింత తోడ్పాటును అందించాలని సూచించారు. నాబార్డు జనరల్ మేనేజర్ ఎన్.ఎస్.మూర్తి మాట్లాడుతూ గత ఏడాది నాబార్డు ద్వారా రాష్ట్రంలో 26వేల కోట్లు సహాయం అందించగా ఈ ఏడాది 37వేల 500 కోట్లు సహాయం అందించడం జరుగుతోందని తెలిపారు. ఇప్పటికే 14వేల కోట్లు అందించినట్టు చెప్పారు. జిల్లాల పునర్వవస్థీకరణతో పొటెన్సియల్ లింక్డ్ ప్లాన్(పిఎల్పి) ఒక సవాలు కానుందని పేర్కొన్నారు. 

ఈ ఏడాది వార్షిక రుణ ప్రణాళిక అమలులో వివిధ బ్యాంకులు మెరుగైన ఫలితాలను సాధించాయని చెప్పారు ఎన్‌ఎస్‌ మూర్తి. ముఖ్యంగా వ్యవసాయ టర్మ్ రుణాలలో మంచి లక్ష్యాలు సాధించాయని పేర్కొన్నారు. వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్పిఓ)కు మరిన్ని రుణాలు అందించాలని సూచించారు. వ్యవసాయ సాంకేతికతలో భాగంగా డ్రోన్ల వినియోగానికి తగిన తోడ్పాటును అందించేందుకు బ్యాంకులు అన్ని విధాలా ముందుకు రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Parvesh Verma BJP: కేజ్రీవాల్‌నే ఓడించిన బీజేపీ అభ్యర్థి.. ఇంతకీ ఎవరీ పర్వేశ్ వర్మ?
కేజ్రీవాల్‌నే ఓడించిన బీజేపీ అభ్యర్థి.. ఇంతకీ ఎవరీ పర్వేశ్ వర్మ?
Arvind Kejriwal: మోదీనే వణికించిన మొనగాడు కేజ్రీవాల్, కానీ నాలుగోసారి ఎందుకు ఓడాడంటే!
మోదీనే వణికించిన మొనగాడు కేజ్రీవాల్, కానీ నాలుగోసారి ఎందుకు ఓడాడంటే!
Anna Hazare On AAP Loss: హెచ్చరించినా పట్టించుకోలేదు- కేజ్రీవాల్ ఓటమికి కారణాలపై అన్నా హజారే ఘాటు వ్యాఖ్యలు
హెచ్చరించినా పట్టించుకోలేదు- కేజ్రీవాల్ ఓటమికి కారణాలపై అన్నా హజారే ఘాటు వ్యాఖ్యలు
Delhi Elections 2025: ‘బీజేపీని మళ్లీ గెలిపించిన రాహుల్​ గాంధీకి కంగ్రాట్స్’​.. కేటీఆర్​ పోస్ట్​
Delhi Elections 2025: ‘బీజేపీని మళ్లీ గెలిపించిన రాహుల్​ గాంధీకి కంగ్రాట్స్’​.. కేటీఆర్​ పోస్ట్​
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Delhi Elections Results 2025 | మాస్టర్ మైండ్ Manish Sisodia ను వీక్ చేశారు..ఆప్ ను గద్దె దింపేశారు | ABP DesamDelhi Elections Results 2025 | Delhi గద్దె Arvind Kejriwal దిగిపోయేలా చేసింది ఇదే | ABP DesamArvind Kejriwal Lost Election | ఆప్ అగ్రనేతలు కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా ఓటమి | ABP DesamDarien Gap Crossing in Telugu | మానవ అక్రమరవాణాకు దారి చూపెడుతున్న మహారణ్యం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Parvesh Verma BJP: కేజ్రీవాల్‌నే ఓడించిన బీజేపీ అభ్యర్థి.. ఇంతకీ ఎవరీ పర్వేశ్ వర్మ?
కేజ్రీవాల్‌నే ఓడించిన బీజేపీ అభ్యర్థి.. ఇంతకీ ఎవరీ పర్వేశ్ వర్మ?
Arvind Kejriwal: మోదీనే వణికించిన మొనగాడు కేజ్రీవాల్, కానీ నాలుగోసారి ఎందుకు ఓడాడంటే!
మోదీనే వణికించిన మొనగాడు కేజ్రీవాల్, కానీ నాలుగోసారి ఎందుకు ఓడాడంటే!
Anna Hazare On AAP Loss: హెచ్చరించినా పట్టించుకోలేదు- కేజ్రీవాల్ ఓటమికి కారణాలపై అన్నా హజారే ఘాటు వ్యాఖ్యలు
హెచ్చరించినా పట్టించుకోలేదు- కేజ్రీవాల్ ఓటమికి కారణాలపై అన్నా హజారే ఘాటు వ్యాఖ్యలు
Delhi Elections 2025: ‘బీజేపీని మళ్లీ గెలిపించిన రాహుల్​ గాంధీకి కంగ్రాట్స్’​.. కేటీఆర్​ పోస్ట్​
Delhi Elections 2025: ‘బీజేపీని మళ్లీ గెలిపించిన రాహుల్​ గాంధీకి కంగ్రాట్స్’​.. కేటీఆర్​ పోస్ట్​
Bandi Sanjay: అవినీతి, అక్రమాల ఆప్‌ను ఢిల్లీ ప్రజలు ఊడ్చిపారేశారు - బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
అవినీతి, అక్రమాల ఆప్‌ను ఢిల్లీ ప్రజలు ఊడ్చిపారేశారు - బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
Delhi Elections 2025: ఢిల్లీలో మ్యాజిక్​ ఫిగర్​ దాటిన బీజేపీ, హస్తినలో ఆప్ కోటకు బీటలు!
ఢిల్లీలో మ్యాజిక్​ ఫిగర్​ దాటిన బీజేపీ, హస్తినలో ఆప్ కోటకు బీటలు!
Delhi Election Results: మనం మనం కొట్లాడుకుంటే ఇట్లుంటాది - ఢిల్లీ ఫలితాలపై ఒమర్ అబ్దుల్లా మీమ్ రిప్లై
మనం మనం కొట్లాడుకుంటే ఇట్లుంటాది - ఢిల్లీ ఫలితాలపై ఒమర్ అబ్దుల్లా మీమ్ రిప్లై
PM Modi: 'ANR భారతదేశానికి గర్వ కారణం' - అక్కినేని ఫ్యామిలీ మీట్‌పై ప్రధాని మోదీ ట్వీట్
'ANR భారతదేశానికి గర్వ కారణం' - అక్కినేని ఫ్యామిలీ మీట్‌పై ప్రధాని మోదీ ట్వీట్
Embed widget