అన్వేషించండి

Andhra Pradesh New Districts : ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు జిల్లాలు, ఏడుకొత్త డివిజన్ల ప్రతిపాదన- నివేదిక సిద్ధం చేసిన కేబినెట్‌ ఉపసంఘం 

ఏపీలో పాలనా సౌలభ్యం కోసం జిల్లాల్లో భారీ ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కొత్తగా మరో రెండు జిల్లాలు, ఏడు కొత్త డివిజన్ల ప్రతిపాదనలు ఏర్పాటకు మంత్రిమండలి ఉపసంఘం నివేదిక సిద్ధం చేసింది. 

Andhra Pradesh New Districts : పరిపాలనా సంస్కరణలు, ప్రజల సౌలభ్యమే ప్రధాన లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల, రెవెన్యూ డివిజన్ల పునర్వ్యవస్థీకరణ కసరత్తు ఉధృతమైంది. రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా కూలంకషంగా చర్చించి, పలు కీలక ప్రతిపాదనలను సిద్ధం చేశాయి. ముఖ్యంగా, గత ప్రభుత్వ హయాంలో జరిగిన పునర్విభజన లోపాలను సరిదిద్ది, ప్రజలకు పరిపాలనా కేంద్రాలు చేరువయ్యేలా చూడటం ఈ నివేదిక ముఖ్య ఉద్ధేశం.  

రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధ్యక్షతన బుధవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, మరో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సహా ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో, కొత్తగా రెండు జిల్లాలు, ఏడు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రజల సౌకర్యం ఆధారంగా తుది నిర్ణయాలు ఉంటాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు.

తప్పులు రిపీట్ కాకుండా  

జిల్లాల పునర్విభజనపై తమ విధానాన్ని వివరిస్తూ మంత్రి అనగాని సత్యప్రసాద్, గత ప్రభుత్వం ఎలాంటి స్పష్టమైన విధానం లేకుండా పునర్విభజన చేసిందని, దీనివల్ల అనేక జిల్లాల్లో హెడ్ క్వార్టర్ గ్రామాలు దూరంగా ఉండటం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. అందుకే, ఈసారి ప్రజల సౌకర్యం, పరిపాలనా సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటామని ఆయన చెప్పారు. 

ప్రస్తుతం కొన్ని రెవెన్యూ డివిజన్లు 125 కిలోమీటర్ల దూరం వరకు ఉన్నాయని, దీనివల్ల ప్రజలకు సౌకర్యం కల్పించేలా కొత్త డివిజన్లపై సుదీర్ఘంగా చర్చించామని మంత్రి అనగాని తెలిపారు. పాలనాపరంగా  సాధ్యాసాధ్యాలను పరిగణలోకి తీసుకొని మాత్రమే కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్‌లు పరిశీలిస్తున్నామని, కొత్తగా ఎనిమిది జిల్లాల ఏర్పాటుపై ప్రజల నుంచి వినతులు వచ్చినా, మదనపల్లె, మార్కాపురం జిల్లాల ఏర్పాటుపై స్పష్టత  ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.

మంత్రివర్గ ఉపసంఘం పరిశీలించిన ప్రతిపాదనల్లో రెండు కొత్త జిల్లాల ఏర్పాటు కీలకంగా ఉంది:

1. మదనపల్లె జిల్లా: రాష్ట్రంలోనే అతిపెద్ద రెవెన్యూ డివిజన్‌గా ఉన్న మదనపల్లెను కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో మదనపల్లె, పీలేరు అనే రెండు రెవెన్యూ డివిజన్లు ఉండే అవకాశముంది.

• మదనపల్లె జిల్లాలో మదనపల్లె, తంబళ్లపల్లె, పుంగనూరు, పీలేరు నియోజకవర్గాలు ఉండవచ్చు.

• నూతన జిల్లాలో మదనపల్లెలోని 11 మండలాలు యథావిధిగా ఉంటాయి. రాయచోటి డివిజన్‌లోని నాలుగు మండలాలు (పీలేరు, గుర్రంకొండ, కలకడ, కంభంవారిపల్లె) కూడా ఇందులో కలపాలని ప్రతిపాదించారు.

• మొత్తంగా, ప్రతిపాదిత మదనపల్లె జిల్లాలో 28 మండలాలు ఉండనున్నాయి. రెవెన్యూ శాఖ నుంచే కొత్తగా పీలేరును కూడా డివిజన్‌గా చేయాలనే ప్రతిపాదన వచ్చింది.

2. మార్కాపురం జిల్లా: ప్రకాశం జిల్లాలోని మార్కాపురం కేంద్రంగా కొత్తగా 'మార్కాపురం జిల్లా' ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.

• ఈ జిల్లాలో మార్కాపురం, కనిగిరి, కొత్తగా ఏర్పాటు చేయనున్న గిద్దలూరు రెవెన్యూ డివిజన్లు ఉంటాయి.

• మార్కాపురం జిల్లాలో మొత్తం 21 మండలాలు ఉండనున్నాయి. గిద్దలూరు డివిజన్‌లో గిద్దలూరు, బేస్తవారిపేట, రాచర్ల, కొమరవోలు, కుంభం, అర్ధవీడు మండలాలుంటాయి.

కొత్త రెవెన్యూ డివిజన్ల వెల్లువ: 7 కీలక కేంద్రాలు

ప్రస్తుతం రాష్ట్రంలో 77 రెవెన్యూ డివిజన్లు ఉండగా, కొత్తగా మరో ఆరేడు డివిజన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు మంత్రివర్గ ఉపసంఘం ముందుకు వచ్చాయి. వీటిలో ప్రముఖమైనవి:

• గిద్దలూరు, మడకశిర, పీలేరు: ఈ మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు మద్దతుగా లభించింది. మడకశిర డివిజన్‌లో పెనుకొండ డివిజన్‌లోని ఐదు మండలాలు (మడకశిర, గుడిబండ, రొళ్ల, అమరాపురం, అగళి) ఉంటాయి.

• నక్కపల్లి/పాయకరావుపేట: పారిశ్రామిక క్లస్టర్‌గా ఉన్న నక్కపల్లి మండలం ప్రస్తుతం నర్సీపట్నం డివిజన్‌లో ఉంది. దానిని పాయకరావుపేట కేంద్రంగా కొత్త డివిజన్‌గా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇందులో యలమంచిలి, నక్కపల్లి, పాయకరావుపేట, కోటవురట్ల, రాయవరం మండలాలు ఉండాలని ప్రతిపాదించారు.

• అద్దంకి: బాపట్ల జిల్లాలో ఉన్న అద్దంకిని ఐదు మండలాలతో రెవెన్యూ డివిజన్‌గా మార్చి ప్రకాశం జిల్లాలో కలపాలని మంత్రి గొట్టిపాటి రవి కోరగా, రెవెన్యూ శాఖ కూడా ఈ ప్రతిపాదన చేసింది.

• బనగానపల్లె: ఆర్&బీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బనగానపల్లెను రెవెన్యూ డివిజన్‌గా చేయాలని తొలి నుంచి కోరుతున్నారు.

• అవనిగడ్డ: కృష్ణా జిల్లా యంత్రాంగం నుంచి అవనిగడ్డను డివిజన్ చేయాలనే ప్రతిపాదన వచ్చింది.

Image

మంత్రివర్గం ఉపసంఘం దృష్టికి వచ్చిన మిగతా ప్రతిపాదనలు 

1. శ్రీకాకుళం: నందిగాం మండలం పలాస డివిజన్‌లో 21 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనిని కేవలం 11.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న టెక్కలి డివిజన్‌లో కలపాలని ప్రతిపాదించారు.

2. తూర్పు గోదావరి/అల్లూరి: అల్లూరి జిల్లాలోని రంపచోడవరం, చింతూరు డివిజన్లను తిరిగి తూర్పు గోదావరిలో కలపాలని ప్రతిపాదించారు. రంపచోడవరంలో 8, చింతూరులో 4 మండలాలు ఉన్నాయి. అలాగే పెదబయలు మండలాన్ని విభజించి కొత్తగా గోమంగి మండలాన్ని ఏర్పాటు చేయాలని రెవెన్యూ శాఖ కోరింది.

3. కోనసీమ/రాజమండ్రి: రాయవరం, కపిలేశ్వరపురం, మండపేట మండలాలను రాజమండ్రి డివిజన్‌లో కలపాలని ప్రతిపాదించారు. కాజులూరును కోనసీమలోని రామచంద్రాపురం డివిజన్‌లో కలపాలి.

4. పశ్చిమ గోదావరి/ఏలూరు/ఎన్టీఆర్: భీమవరం డివిజన్‌లో ఉన్న గణపవరం మండలాన్ని తిరిగి ఏలూరు జిల్లాలోకి తీసుకురావాలి. ఏలూరు జిల్లాలోని నూజివీడు డివిజన్‌లోని నాలుగు మండలాలను (నూజివీడు, ఆగిరిపల్లి, ముసునూరు, చాట్రాయి) ఎన్టీఆర్ జిల్లాలోకి తీసుకురావాలి.

5. కృష్ణా/ఎన్టీఆర్: గన్నవరం నియోజకవర్గంలోని బాపులపాడు, గన్నవరం, ఉంగుటూరులను పరిపాలనా సౌలభ్యం కోసం ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని ప్రతిపాదించారు.

6. చిత్తూరు/తిరుపతి/నెల్లూరు: నగరి డివిజన్‌లోని మూడు మండలాలు (నింద్ర, విజయపురం, నగరి) తిరుపతి జిల్లాలో కలపాలి. గూడూరు డివిజన్‌లోని ఐదు మండలాలు (గూడూరు, చిల్లకూరు, కోట, వాకాడు, చిత్తమూరు) తిరిగి నెల్లూరు జిల్లాలోకి తీసుకురావాలని ప్రతిపాదన.

మొత్తం ప్రతిపాదనలపై నివేదికను కొద్ది రోజుల్లో ముఖ్యమంత్రికి అందజేస్తామని, తుది నిర్ణయం సీఎం తీసుకుంటారని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పరిపాలనా ముఖచిత్రాన్ని మార్చే ఈ సంస్కరణలు త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానున్నాయన్నారు. 

Image

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amaravati Land Pooling: త్వరలో అమరావతిలో మూడో విడత భూ సమీకరణ - ఏపీ మంత్రి నారాయణ 
అమరావతిలో మూడో విడత భూ సమీకరణ - మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు
SP Balu Statue Controversy: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుపై వివాదమేంటి? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు
రవీంద్రభారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుపై వివాదమేంటి? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు
Telangana Rising 2047: రేవంత్ రెడ్డి 'విజన్ డాక్యుమెంట్'.. రెండు దశాబ్దాల తెలంగాణ ప్రగతికి 'రోడ్ మ్యాప్'!
రేవంత్ రెడ్డి 'విజన్ డాక్యుమెంట్'.. రెండు దశాబ్దాల తెలంగాణ ప్రగతికి 'రోడ్ మ్యాప్'!
Samantha Wedding Saree: సమంత సంతోషం... పువ్వల్లే నవ్వుల్ నవ్వుల్... రాజ్ నిడిమోరుతో ఏడడుగుల్ - ఫోటోలు చూశారా?
సమంత సంతోషం... పువ్వల్లే నవ్వుల్ నవ్వుల్... రాజ్ నిడిమోరుతో ఏడడుగుల్ - ఫోటోలు చూశారా?
Advertisement

వీడియోలు

Alphonso Davies | శరణార్థి శిబిరం నుంచి లెజెండరీ ఫుట్‌బాలర్‌ వరకూ.. అల్ఫాన్జో స్టోరీ తెలుసా? | ABP
Virendra Sehwag Comments on Virat Kohli | వైరల్ అవుతున్న సెహ్వాగ్ కామెంట్స్
Hardik Pandya in Ind vs SA T20 | టీ20 సిరీస్‌ లో హార్దిక్ పాండ్య ?
Gambhir vs Seniors in Team India | టీమ్‌ఇండియాలో ఏం జరుగుతోంది?
Ashwin Comments on Team India Selection | మేనేజ్‌మెంట్ పై అశ్విన్ ఫైర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Land Pooling: త్వరలో అమరావతిలో మూడో విడత భూ సమీకరణ - ఏపీ మంత్రి నారాయణ 
అమరావతిలో మూడో విడత భూ సమీకరణ - మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు
SP Balu Statue Controversy: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుపై వివాదమేంటి? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు
రవీంద్రభారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుపై వివాదమేంటి? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు
Telangana Rising 2047: రేవంత్ రెడ్డి 'విజన్ డాక్యుమెంట్'.. రెండు దశాబ్దాల తెలంగాణ ప్రగతికి 'రోడ్ మ్యాప్'!
రేవంత్ రెడ్డి 'విజన్ డాక్యుమెంట్'.. రెండు దశాబ్దాల తెలంగాణ ప్రగతికి 'రోడ్ మ్యాప్'!
Samantha Wedding Saree: సమంత సంతోషం... పువ్వల్లే నవ్వుల్ నవ్వుల్... రాజ్ నిడిమోరుతో ఏడడుగుల్ - ఫోటోలు చూశారా?
సమంత సంతోషం... పువ్వల్లే నవ్వుల్ నవ్వుల్... రాజ్ నిడిమోరుతో ఏడడుగుల్ - ఫోటోలు చూశారా?
Sabarimala Special Trains: శబరిమలకు 10 ప్రత్యేక రైళ్లు.. నేటి నుంచే బుకింగ్స్ ప్రారంభం
శబరిమలకు 10 ప్రత్యేక రైళ్లు.. నేటి నుంచే బుకింగ్స్ ప్రారంభం
Bigg Boss Telugu Day 87 Promo : టికెట్ టూ ఫినాలే టాస్క్ హైలెట్స్.. తనూజ vs సుమన్ శెట్టి, సపోర్ట్ చేయని భరణి
టికెట్ టూ ఫినాలే టాస్క్ హైలెట్స్.. తనూజ vs సుమన్ శెట్టి, సపోర్ట్ చేయని భరణి
Crime News: ఎంతకు తెగించార్రా..! ఇన్సూరెన్స్ చేపించి మరీ అన్నను హత్య చేసిన తమ్ముడు.. ఇంత దారుణమా!
ఎంతకు తెగించార్రా..! ఇన్సూరెన్స్ చేపించి మరీ అన్నను హత్య చేసిన తమ్ముడు..
Revanth Reddy On Temples: దేవుళ్లపైనే ఏకాభిప్రాయం లేనప్పుడు..రాజకీయ నాయకులపై ఏముంటుంది? - రేవంత్ వ్యాఖ్యలతో దుమారం
దేవుళ్లపైనే ఏకాభిప్రాయం లేనప్పుడు..రాజకీయ నాయకులపై ఏముంటుంది? - రేవంత్ వ్యాఖ్యలతో దుమారం
Embed widget