Amaravati Farmers Padayatra : ఏకైక రాజధానిగా అమరావతి లక్ష్యం.. రాజధాని రైతుల పాదయాత్ర ప్రారంభం ! వైఎస్ఆర్సీపీ మినహా అన్ని పార్టీల మద్దతు !
ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ భూములిచ్చిన రైతుల మహాపాదయాత్ర ప్రారంభమయింది. వైఎస్ఆర్సీపీ మినహా అన్ని పార్టీల నేతలూ మద్దతు పలికారు. ఉద్యమం విజయవంతం అవ్వాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు చేపట్టిన " న్యాయస్థానం టు దేవస్థానం " పాదయాత్ర తుళ్లూరు నుంచి ప్రారంభమయింది. అమరావతి జేఏసీ నేతృత్వంలో ఈ మహాపాదయాత్ర సాగనుంది. పాదయాత్ర ప్రారంభానికి ముందు వేంకటేశ్వరస్వామి, న్యాయదేవత ప్రతిమలకు పూజలు నిర్వహించారు. తర్వాత సర్వమత ప్రార్థనలు చేసి .. రైతులు నడక ప్రారంబించారు.
Also Read : "సమైక్య రాష్ట్రంగా మళ్లీ ఏపీ" ! సాధ్యమా ? రాజకీయమా?
ఏకైక రాజధానిగా అమరావతి పరిరక్షించాలని అలాగే.. అమరావతి వల్ల 13 జిల్లాలకు కలిగే ప్రయోజనాలను వివరిస్తామని రైతులు ప్రకటించారు. ఈ పాదయాత్ర.. మొత్తం 45 రోజులపాటు కొనసాగనుంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని 70 ప్రధాన గ్రామాల మీదుగా జరిగే ఈ యాత్ర డిసెంబరు 17న తిరుపతిలో ముగియనుంది. పాదయాత్రలో పెద్ద ఎత్తున రైతులు, మహిళలు, వివిధ రాజకీయపక్షాల నేతలు పాల్గొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేత రేణుకాచౌదరి ర్యాలీగా వచ్చి రైతులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రాజధాని గ్రామాలు కిక్కిరిసిపోయాయి.
Also Read : ఏపీ ప్రజలకు తెలుగులో శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
పాదయాత్రకు వైసీపీ మినహా అన్నిరాజకీయ పార్టీల నేతలు మద్దతు పలికారు. తమ తమ ప్రతినిధుల్ని పంపారు. టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, ఆమ్ఆద్మీ వంటి పార్టీలతో పాటు ప్రజా, రైతు సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. పాదయాత్ర ప్రారంభ కార్యక్రమానిక ిటీడీప ీతరపున దేవినేని ఉమ, ప్రత్తిపాటి పుల్లారావు, నేతలు తెనాలి శ్రవణ్కుమార్, మర్రెడ్డి శ్రీనివాస్రెడ్డి, గోనుగుంట్ల కోటేశ్వరరావు హాజరయ్యారు. ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగేవరకు తమ మద్దతు కొనసాగుతుందని టీడీపీ నేతలు భరోసా ఇచ్చారు. అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్రను ఆదరించాలని రాష్ట్ర ప్రజలకు పార్టీలు, ప్రజా సంఘాల నేతలు పిలుపునిచ్చారు. 45 రోజుల పాటు జరిగే మహా పాదయాత్రకు ప్రజలు అడుగడుగునా నీరాజనం పలకాలని కోరారు.
రైతుల పాదయాత్రకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంఘిభావం తెలియచేశారు. ఇది పాదయాత్ర కాదు, రాష్ట్ర పరిరక్షణ కోసం, రాష్ట్ర భవిష్యత్ కోసం కన్నతల్లి లాంటి భూముల్ని త్యాగం చేసిన పుడమితల్లి వారసులు చేస్తున్న ఉద్యమమన్నారు.
ఓ వైపు విజన్ 2020 ఫలితాలు చూసి సంతోషం కలుగుతున్నా... మరో వైపు విజన్ 2029 ప్రణాళికల అమలుపై గొడ్డలి వేటుతో బాధగలుగుతోంది. అమరావతి, పోలవరం లేని రాష్ట్రాన్ని ఊహించలేం. అమరావతిని కాపాడుకోలేకపోతే రాష్ట్రం అంధకారమవుతుంది.(3/4) #AmaravatiFarmersMarch
— N Chandrababu Naidu (@ncbn) November 1, 2021
టీడీపీ యువనేత లోకేష్ కూడా రైతులకు సంఘిభావం తెలిపారు. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని నినాదంతో ప్రజారాజధాని అమరావతి పరిరక్షణకి మీరు తలపెట్టిన మహా పాదయాత్ర విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు.
రాజధాని కోసం త్యాగం, భావితరాల భవిష్యత్తు కోసం పోరాటం. అణిచివేతకి గురైనా, అవమానాలు ఎదురైనా ఎత్తిన జెండా దించకుండా 685 రోజులుగా జై అమరావతి అంటూ నినదిస్తున్న రైతులకు, మహిళలకు, యువతకు ఉద్యమాభివందనాలు.(1/2)#AmaravatiFarmersMarch
— Lokesh Nara (@naralokesh) November 1, 2021
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
and tablets