By: ABP Desam | Updated at : 04 Apr 2022 03:22 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
సీఎం జగన్(ఫైల్ ఫొటో)
CM Jagan Delhi Tour : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మంగళవారం దిల్లీ వెళ్లనున్నారు. దిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అవుతారు. రాష్ట్రానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలపై ప్రధాని మోదీతో సీఎం జగన్ మాట్లాడనున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు చేసిన మరుసటి రోజే సీఎం జగన్ దిల్లీ పర్యటనకు వెళ్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానితో భేటీలో పోలవరం, పెండింగ్ ప్రాజెక్టుల అంశాల్ని ఈ భేటీలో ప్రస్తవించే అవకాశం ఉంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రధాని మోదీతో చర్చించే అవకాశం ఉంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ కూడా సీఎంవో కోరినట్లు తెలుస్తోంది.
విభజన హామీలపై చర్చించే అవకాశం
సీఎం జగన్ దిల్లీ టూర్ పై ఇటీవల వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని మోదీతో సీఎం భేటీ అవుతారన్నారు. ఈ భేటీలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, సంక్షేమ పథకాల అమలుకు కేంద్రం సాయం అడగనున్నారని తెలిపారు. ఏపీ విభజన హామీలను కూడా సీఎం జగన్ ప్రధానితో భేటీలో ప్రస్తావిస్తారన్నారు. అలాగే పాలనా వికేంద్రీకరణ తమ ప్రభుత్వ లక్ష్యమని, మూడు రాజధానులలో కేంద్రం సహకారం తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, కొత్త పొత్తులపై వీరిద్దరి మధ్య చర్చ జరిగే అవకాశం ఉందన్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ దిల్లీ టూర్
సీఎం కేసీఆర్ ఆదివారం సాయంత్రం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో దిల్లీకి వెళ్లారు. సీఎం వెంట ఆయన సతీమణి శోభ, ఎమ్మెల్సీ కవిత, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, టీఆర్ఎస్ పార్లమెంటరీ పక్ష నేత కేశవరావు ఉన్నారు. తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై కేంద్రం, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ ఆందోళనలు చేస్తుంది. ఆందోళనల నేపథ్యంలో కేసీఆర్ దిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. దిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్లను సీఎం కేసీఆర్ కలవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రధాని, కేంద్ర మంత్రి కార్యాలయాలను సీఎంవో ఇప్పటికే అపాయింట్మెంట్ కోరింది. ఒకవేళ అపాయింట్మెంట్ లభించకపోతే సీఎం కేసీఆర్ తదుపరి కార్యాచరణ ప్రకటించనున్నారు. దిల్లీ కేంద్రంగా వివిధ పార్టీల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తారని తెలుస్తోంది. దిల్లీ టూర్ లో సీఎం దంపతులు వైద్య పరీక్షలు కూడా చేయించుకోనున్నారని తెలుస్తోంది.
Also Read : AP New Districts Inaguration: ఏపీలో అవతరించిన కొత్త జిల్లాలు, ఇకపై మొత్తం 26 - ప్రారంభించిన సీఎం జగన్
Nellore Knife Attack : నెల్లూరులో దారుణం, పట్టపగలే యువకుడిపై కత్తులతో దాడి
Atmakur Elections : ఆత్మకూరులో పోటీపై తేల్చని పార్టీలు - విక్రమ్ రెడ్డికి ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థేనా ?
Breaking News Live Updates: సత్తెనపల్లిలో రూ.11 లక్షల విలువైన అక్రమ మద్యం ధ్వంసం
Chandrababu Ongole Rally : భారీ ర్యాలీగా ఒంగోలుకు చంద్రబాబు, రేపటి మహానాడుకు తరలివస్తున్న టీడీపీ శ్రేణులు
YSRCP Bus Yatra : బస్సుల్లోనే మంత్రులు - యాత్రలో కిందకు దిగేందుకు నిరాసక్తత !
Bengal Cabinet: మొన్న తమిళనాడు, నేడు బంగాల్- కేంద్రానికి షాక్లు, గవర్నర్ అధికారాల్లో కోతలు!
PM Modi Hyderabad Tour: కేసీఆర్పై ప్రధాని మోదీ హాట్ కామెంట్స్- తెలంగాణలో బీజేపీ గెలుస్తుందని జోస్యం
May 26 Records in Cricket: మే 26తో భారత క్రికెట్కు ప్రత్యేక కనెక్షన్ - రెండు మర్చిపోలేని రికార్డులు - ద్రవిడ్కు కూడా!
Hyderabad News : సరూర్ నగర్ కుటుంబం ఆత్మహత్యాయత్నం కేసు, వెలుగులోకి సంచలన విషయాలు