అన్వేషించండి

CM Jagan Delhi Tour : రేపు దిల్లీకి సీఎం జగన్, ప్రధాని మోదీతో భేటీ!

CM Jagan Delhi Tour : సీఎం జగన్ రేపు(మంగళవారం) దిల్లీ వెళ్లనున్నారు. రేపు సాయంత్రం ప్రధాని మోదీతో సీఎం సమావేశం అవ్వనున్నారు.

CM Jagan Delhi Tour : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మంగళవారం దిల్లీ వెళ్లనున్నారు. దిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అవుతారు. రాష్ట్రానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలపై ప్రధాని మోదీతో సీఎం జగన్ మాట్లాడనున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు చేసిన మరుసటి రోజే సీఎం జగన్ దిల్లీ పర్యటనకు వెళ్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానితో భేటీలో పోలవరం, పెండింగ్ ప్రాజెక్టుల అంశాల్ని ఈ భేటీలో ప్రస్తవించే అవకాశం ఉంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రధాని మోదీతో చర్చించే అవకాశం ఉంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ కూడా సీఎంవో కోరినట్లు తెలుస్తోంది. 

విభజన హామీలపై చర్చించే అవకాశం 

సీఎం జగన్ దిల్లీ టూర్ పై ఇటీవల వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని మోదీతో సీఎం భేటీ అవుతారన్నారు. ఈ భేటీలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, సంక్షేమ పథకాల అమలుకు కేంద్రం సాయం అడగనున్నారని తెలిపారు. ఏపీ విభజన హామీలను కూడా సీఎం జగన్ ప్రధానితో భేటీలో ప్రస్తావిస్తారన్నారు. అలాగే పాలనా వికేంద్రీకరణ తమ ప్రభుత్వ లక్ష్యమని, మూడు రాజధానులలో కేంద్రం సహకారం తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, కొత్త పొత్తులపై వీరిద్దరి మధ్య చర్చ జరిగే అవకాశం ఉందన్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ దిల్లీ టూర్ 

సీఎం కేసీఆర్‌ ఆదివారం సాయంత్రం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో దిల్లీకి వెళ్లారు. సీఎం వెంట ఆయన సతీమణి శోభ, ఎమ్మెల్సీ కవిత, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, టీఆర్ఎస్ పార్లమెంటరీ పక్ష నేత కేశవరావు ఉన్నారు. తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై కేంద్రం, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ ఆందోళనలు చేస్తుంది. ఆందోళనల నేపథ్యంలో కేసీఆర్‌ దిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. దిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌లను సీఎం కేసీఆర్ కలవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రధాని, కేంద్ర మంత్రి కార్యాలయాలను సీఎంవో ఇప్పటికే అపాయింట్‌మెంట్‌ కోరింది. ఒకవేళ అపాయింట్మెంట్ లభించకపోతే సీఎం కేసీఆర్ తదుపరి కార్యాచరణ ప్రకటించనున్నారు. దిల్లీ కేంద్రంగా వివిధ పార్టీల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తారని తెలుస్తోంది. దిల్లీ టూర్ లో సీఎం దంపతులు వైద్య పరీక్షలు కూడా చేయించుకోనున్నారని తెలుస్తోంది. 

Also Read : AP New Districts Inaguration: ఏపీలో అవతరించిన కొత్త జిల్లాలు, ఇకపై మొత్తం 26 - ప్రారంభించిన సీఎం జగన్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kurnool Bus Tragedy: ఎమర్జెన్సీ డోర్ మూసేయడంతో 19 ప్రాణాలు పోయాయి. కర్నూలు బస్సు ప్రమాదంపై ASCI నివేదిక
ఎమర్జెన్సీ డోర్ మూసేయడంతో 19 ప్రాణాలు పోయాయి. కర్నూలు బస్సు ప్రమాదంపై ASCI నివేదిక
Amaravati Gazette: అమరావతి గెజిట్‌తోనే అన్నీ అయిపోవు - ప్రభుత్వం మూడేళ్లలో చేయాల్సింది చాలా ఉంది - లేకపోతే?
అమరావతి గెజిట్‌తోనే అన్నీ అయిపోవు - ప్రభుత్వం మూడేళ్లలో చేయాల్సింది చాలా ఉంది - లేకపోతే?
Endowments Assistant Commissioner arrest: దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్‌ శాంతికి భారీగా అక్రమాస్తులు - అరెస్టు చేసిన ఏసీబీ
దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్‌ శాంతికి భారీగా అక్రమాస్తులు - అరెస్టు చేసిన ఏసీబీ
Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్‌పై క్లారిటీ - అంతర్జాతీయ హోటల్ గ్రూపులకు నిర్వహణ బాధ్యతలు?
రుషికొండ ప్యాలెస్‌పై క్లారిటీ - అంతర్జాతీయ హోటల్ గ్రూపులకు నిర్వహణ బాధ్యతలు?

వీడియోలు

Delhi Capitals Mitchell Starc IPL 2026 | మరికొన్ని మ్యాచ్‌లకు స్టార్క్ దూరం | ABP Desam
Vaibhav Suryavamshi MI vs RR IPL 2026 | బుమ్రా బౌలింగ్ లో వైభవ్ మెరుపులు | ABP Desam
IPL 2026 Shubman Gill Back in Nets | గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఎంట్రీ | ABP Desam
IPL 2026 RR VS MI Result | రాజ‌స్థాన్ రాయ‌ల్స్ హ్యాట్రిక్ విజయం | ABP Desam
Bumrah vs Vaibhav Suryavanshi IPL 2026 | బుమ్రా యార్కర్ల ముందు వైభవ్ నిలబడగలడా?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Constable Revathi: కానిస్టేబుల్ రేవతి సాహసంతోనే సాతంకుళం తీర్పు! ఎన్ని బెదిరింపులు వచ్చినా వెనక్కి తగ్గని పోలీసు కథ!
కానిస్టేబుల్ రేవతి సాహసంతోనే సాతంకుళం తీర్పు! ఎన్ని బెదిరింపులు వచ్చినా వెనక్కి తగ్గని పోలీసు కథ!
Kurnool Bus Tragedy: ఎమర్జెన్సీ డోర్ మూసేయడంతో 19 ప్రాణాలు పోయాయి. కర్నూలు బస్సు ప్రమాదంపై ASCI నివేదిక
ఎమర్జెన్సీ డోర్ మూసేయడంతో 19 ప్రాణాలు పోయాయి. కర్నూలు బస్సు ప్రమాదంపై ASCI నివేదిక
Share Market: ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటనతో స్టాక్ మార్కెట్లో వైల్డ్ ఫైర్.. సెన్సెక్స్ 2800, నిఫ్టీ 800 పాయింట్లు జంప్
ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటనతో స్టాక్ మార్కెట్లో వైల్డ్ ఫైర్.. సెన్సెక్స్ 2800, నిఫ్టీ 800 పాయింట్లు జంప్
Amaravati Gazette: అమరావతి గెజిట్‌తోనే అన్నీ అయిపోవు - ప్రభుత్వం మూడేళ్లలో చేయాల్సింది చాలా ఉంది - లేకపోతే?
అమరావతి గెజిట్‌తోనే అన్నీ అయిపోవు - ప్రభుత్వం మూడేళ్లలో చేయాల్సింది చాలా ఉంది - లేకపోతే?
Naga Vamsi : మాకు క్లాసులు పీకావ్... ప్రొడ్యూసర్ కష్టాలు తెలిశాయా! - సుప్రియపై నాగవంశీ, మైత్రీ రవి ఫన్ ర్యాగింగ్
మాకు క్లాసులు పీకావ్... ప్రొడ్యూసర్ కష్టాలు తెలిశాయా! - సుప్రియపై నాగవంశీ, మైత్రీ రవి ఫన్ ర్యాగింగ్
Congress guarantees: కారణాలు కాదు హామీల అమలు కావాలి - మాటల చాణక్యంతో ఆర్థిక నిస్సహాయతను రేవంత్ అధిగమిస్తారా?
కారణాలు కాదు హామీల అమలు కావాలి - మాటల చాణక్యంతో ఆర్థిక నిస్సహాయతను రేవంత్ అధిగమిస్తారా?
Toll Tax New Rule: టోల్ ప్లాజాల వద్ద కేవలం క్యాష్‌లెస్ పేమెంట్స్.. ఏప్రిల్ 10 నుంచి FASTAG, UPI ద్వారా చెల్లింపులు
టోల్ ప్లాజాల వద్ద కేవలం క్యాష్‌లెస్ పేమెంట్స్.. ఏప్రిల్ 10 నుంచి FASTAG, UPI ద్వారా చెల్లింపులు
IPL 2026 RR VS MI Result Update: రాజ‌స్థాన్ రాయ‌ల్స్ హ్యాట్రిక్.. ముంబైపై ఘ‌న విజ‌యం.. దుమ్మురేపిన జైస్వాల్, సూర్య‌వంశీ.. ప‌ట్టిక‌లో టాప్ ప్లేస్ కు రాయ‌ల్స్
రాజ‌స్థాన్ రాయ‌ల్స్ హ్యాట్రిక్.. ముంబైపై ఘ‌న విజ‌యం.. దుమ్మురేపిన జైస్వాల్, సూర్య‌వంశీ.. ప‌ట్టిక‌లో టాప్ ప్లేస్ కు రాయ‌ల్స్
Embed widget