అన్వేషించండి

Top Headlines: సజ్జల భార్గవరెడ్డికి సుప్రీంకోర్టు షాక్ - తెలంగాణలో ఎస్సై ఆత్మహత్య, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM

Top News: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

Top Headlines In AP And Telangana:

1. సజ్జల భార్గవరెడ్డికి సుప్రీంకోర్టు షాక్

వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్‌గా పని చేసిన సజ్జల భార్గవ్‌రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టించారన్న కేసులు కొట్టేయాలని ముందస్తు బెయిల్ ఇవ్వాలని అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఏమైనా ఉంటే హైకోర్టులో చెప్పుకోవాలని పేర్కొంది. అయితే రెండు వారాల వరకు అరెస్టు చేయొద్దని మాత్రం ఊరట కల్పించింది. ఇంకా చదవండి.

2. ఏపీలోని పర్యాటక ప్రాంతాలకు మహర్దశ

అరసవల్లి సూర్యనారాయణ దేవాలయం మరింతంగా అభివృద్ధి చెంది ప్రజలను, పర్యాటకులను ఆకట్టుకోనుంది. ఏటా వచ్చే లక్షల మంది భక్తుల సౌకర్యార్థం మరిన్ని వసతులు సమకూరే ఆవకాశం ఉంది. స్థానిక ఎంపీ, కేంద్రమంత్రి రామ్మోహన్ ప్రత్యేక మాస్టర్ ప్లాన్‌ను కేంద్రానికి సమర్పించారు. దానికి అనుమతి లభిస్తే మాత్రం సూర్యనారాయణ దేవాలయం మరింత శోభాయమానంగా మారిపోనుంది. అరసవల్లి దేవాలయ అభివృద్ధికి సహకరించాలని ఈ మధ్యే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఢిల్లీలో కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కోరారు. ఇంకా చదవండి.

3. తెలంగాణలో ఎస్సై ఆత్మహత్య

ములుగు జిల్లా వాజేడు పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా పనిచేస్తున్న హరీష్ తుపాకితో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వాజేడు మండలం ముళ్ళ కట్ట వద్ద ఉన్న హరిత రిసార్ట్‌లోని గదిలో హరీష్ రివాల్వర్‌తో కాల్చుకున్నాడు. హరీష్ నిన్న హరిత హోటల్లో రూం తీసుకున్నాడు. హరీష్ స్వగ్రామం భూపాలపల్లి జిల్లా వెంకటేశ్వర్ల పల్లి. వ్యక్తిగత కారణాల లేక విధి నిర్వహణ ఒత్తిడి కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడ అనే కారణాలు తెలియాల్సి ఉంది. ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకొని  విచారణ చేపట్టారు. ఇంకా చదవండి.

4. కానిస్టేబుల్ అక్కను పొడిచి చంపేసిన తమ్ముడు

కులాంతర వివాహం చేసుకుందన్న కారణంతో అక్కను హత్య చేశాడో తమ్ముడు. హైదరాబాద్‌ శివారులోని హయత్‌నగర్‌లో జరిగిన దుర్ఘటన సంచలనంగా మారింది. కానిస్టేబుల్‌గా పని చేస్తున్న అక్కను తమ్ముడు కిరాతకంగా హత్య చేశాడు.డ్యూటీకి వెళ్తున్న అక్కను వెంబడించి కారుతో ఢీ కొట్టి కత్తితో పొడి నడిరోడ్డుపై హత్య చేశాడు. ఇబ్రహింపట్నం రాయపోల్‌లో ఉంటున్న నాగమణి కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. ఆమె వేరే కులం వ్యక్తిని ప్రేమించింది. వివాహం చేసుకుంటానని ఇంట్లో చెప్పింది. దీనికి కుటుంబ పెద్దలు వద్దని చెప్పారు. ఇది నచ్చని తమ్ముడు పరమేష్‌ కూడా ఈ పెళ్లి అడ్డు చెప్పాడు. ఇంకా చదవండి.

5. రిలయన్స్ జియో అద్భుత ఆఫర్

దేశంలో టాప్‌ ప్రైవేట్ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో నుంచి అనేక ఆకర్షణీయమైన రీఛార్జ్ ప్లాన్‌లు యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. కస్టమర్‌ అవసరాలకు అనుగుణంగా వివిధ కాల పరిమితులతో (Validity) ట్రూ 5G అన్‌లిమిటెడ్‌ ప్లాన్స్‌, ట్రూ అన్‌లిమిటెడ్‌ అప్‌గ్రేడ్‌, డేటా బూస్టర్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్లాన్స్‌, యాన్యువల్‌ ప్లాన్స్‌, డేటా ప్యాక్స్‌, ఇంటర్నేషనల్‌ రోమింగ్‌, ఐఎస్‌డీ, టాప్‌-అప్‌, వాల్యూ ప్లాన్స్‌ను జియో అందిస్తోంది. వీటితోపాటు వినియోగదారులు నెట్‌ఫ్లిక్స్ ఉచిత సభ్యత్వాన్ని పొందే సూపర్‌ ప్లాన్‌లు కూడా ఉన్నాయి. ఇంకా చదవండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kerala Tragedy: సంచలనం కోసం వీడియో తీసి వైరల్ చేసిన మహిళ - అవమానంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి - కేరళలో ఘోరం !
సంచలనం కోసం వీడియో తీసి వైరల్ చేసిన మహిళ - అవమానంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి - కేరళలో ఘోరం !
Delhi Earthquake: ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు

వీడియోలు

Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు
Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kerala Tragedy: సంచలనం కోసం వీడియో తీసి వైరల్ చేసిన మహిళ - అవమానంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి - కేరళలో ఘోరం !
సంచలనం కోసం వీడియో తీసి వైరల్ చేసిన మహిళ - అవమానంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి - కేరళలో ఘోరం !
Delhi Earthquake: ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
Aamir Khan Weight Loss : జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో
జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో
RTC Bus Overturns: డ్రైవింగ్ చేస్తుండగా ఫిట్స్.. పొలాల్లోకి దూసుకెళ్లి ఆర్టీసీ బస్సు బోల్తా - విజయనగరంలో ఘటన
డ్రైవింగ్ చేస్తుండగా ఫిట్స్.. పొలాల్లోకి దూసుకెళ్లి ఆర్టీసీ బస్సు బోల్తా - విజయనగరంలో ఘటన
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Embed widget