అన్వేషించండి

Top Headlines: ఆ కేసుతో జగన్‌కు రాజకీయంగా మరిన్ని సమస్యలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM

Top News: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

Top Headlines In AP And Telangana:

1. అమెరికా కేసుతో జగన్‌కు రాజకీయంగా మరిన్ని సమస్యలు

అధికారం పోయి ఇబ్బంది పడుతున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అమెరికా నుంచి వచ్చి పడిన అదానీ కేసు సమస్యగా మారింది. ఈ విషయంలో జరుగుతున్న ప్రచారంతో ఆయన ఇబ్బంది పడుతున్నారు. విషయం బయటపడిన దాదాపు వారం రోజుల తర్వాత ప్రెస్ మీట్ పెట్టి అసలు తనకు ఆ కేసు గురించే తెలియదన్నారు. ఎఫ్‌బీఐ చార్జిషీట్‌లో తన పేరు లేదని స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారం చేసే వాళ్లపై వంద కోట్లకు పరువు నష్టం దావా వేస్తామని కూడా హెచ్చరించారు. ఇంకా చదవండి.

2. సచివాలయ ఉద్యోగ సంఘం నేత మందు పార్టీ

 సచివాలయం ఉద్యోగులు సంఘం నేత వెంకటరామిరెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. అనుమతి లేకుండా ఉద్యోగులకు మందుపార్టీ ఇస్తూ సమస్యలు కొనితెచ్చుకున్నారు. పార్టీ జరుగుతున్న ప్రాంతంలో తనిఖీలు చేసిన ఎక్సైజ్‌, పోలీసు అధికారులు వెంకటరామిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. సచివాలయం క్యాంటిన్ ఎన్నికల వేళ వెంకటరామిరెడ్డి చర్యలు వివాదానికి కారణమయ్యాయి. కొందరు సిబ్బందితో ఆయన మందుపార్టీ చేసుకున్నారు. కొంత మంది సచివాలయ ఉద్యోగులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇంకా చదవండి.

3. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ రాజకీయాల్లో కాక రేపిన లగచర్ల భూ వివాదంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భూసేకరణ రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం వికారాబాద్ జిల్లా లగచర్ల దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. అక్కడ పారిశ్రామిక వాడ నిర్మించాలని భావించిన ప్రభుత్వం భూసేకరణ చేపట్టింది. దీన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. భూసేకరణ విషయంపై చర్చించేందుకు రావాలని స్థానికులు పిలుపు మేరకు వెళ్లిన జిల్లా కలెక్టర్ ఇతర సిబ్బందిపై ప్రజలు దాడి చేయడంతో వివాదం మరో మలుపు తిరిగింది. ఇంకా చదవండి.

4. కొమురంభీం జిల్లాలో దారుణం

కొమురంభీం జిల్లాలో దారుణం జరిగింది. కొన్ని రోజులు భయాందోళనలకు గురి చేస్తున్న పెద్ద పులి మనుషులపై పడింది. ఇప్పటి వరకు పశువులపై దాడి చేస్తూ వస్తున్న పెద్ద పులి ఈ ఉదయం కాగజ్‌నగర్ మండలం గన్నారంలో మహిళపై అటాక్ చేసింది. పెద్దపులి దాడిలో ఆ మహిళ స్పాట్‌లోనే చనిపోయింది. కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని బెంగాల్ క్యాంప్ 6వ నెంబర్‌లో గన్నారం గ్రామానికి చెందిన మోర్లే లక్ష్మీ అనే మహిళ పై పులి దాడి చేసింది. పులి దాడిలో గాయపడిన మొర్లే లక్ష్మీ అనే మహిళ మృతి చెందింది. ఇంకా చదవండి.

5. మిర్యాలగూడ నుంచి సైబర్ నేరాలు

తెలంగాణలో నమోదు అవుతున్న సైబర్ కేసుల్లో మరో సంచలనం నమోదు అయింది. నేరగాళ్లతో చేతులు కలిపిన తెలుగు వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. అనుమానాస్పదంగా ఓ ప్రాంతంలో ఖాతాల్లోకి లక్షల్లో నగదు వచ్చి పడటాన్ని గుర్తించి విచారిస్తే అసలు గుట్టు వెలుగు చూసింది. వేర్వేరు రాష్ట్రాల్లో ఉంటూ వేలి కొనలతోనే వేల మందిని బురిడీ కొట్టించి కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. ఇలాంటి సైబర్ కేటుగాళ్లకు నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన వ్యక్తి సహాయం చేస్తున్నట్టు వెలుగులోకి వచ్చింది. ఇంకా చదవండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Bonda Uma TDP: అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ - త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
Uday Krishna Reddy Arrest: పరారీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ - మిర్యాలగూడ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు!
పరారీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ - మిర్యాలగూడ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు!
Breaking News: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్-మిర్యాలగూడలో అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్!
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్-మిర్యాలగూడలో అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్!
Allu Arjun Fans Meet 2026: నచ్చకపోతే పట్టించుకోవద్దు - ఫ్యాన్స్‌కు అల్లు అర్జున్ ఇచ్చిన సలహా వెనుక అసలు కారణం ఇదే !
నచ్చకపోతే పట్టించుకోవద్దు - ఫ్యాన్స్‌కు అల్లు అర్జున్ ఇచ్చిన సలహా వెనుక అసలు కారణం ఇదే !

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget