అన్వేషించండి

Top Headlines: ఆ కేసుతో జగన్‌కు రాజకీయంగా మరిన్ని సమస్యలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM

Top News: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

Top Headlines In AP And Telangana:

1. అమెరికా కేసుతో జగన్‌కు రాజకీయంగా మరిన్ని సమస్యలు

అధికారం పోయి ఇబ్బంది పడుతున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అమెరికా నుంచి వచ్చి పడిన అదానీ కేసు సమస్యగా మారింది. ఈ విషయంలో జరుగుతున్న ప్రచారంతో ఆయన ఇబ్బంది పడుతున్నారు. విషయం బయటపడిన దాదాపు వారం రోజుల తర్వాత ప్రెస్ మీట్ పెట్టి అసలు తనకు ఆ కేసు గురించే తెలియదన్నారు. ఎఫ్‌బీఐ చార్జిషీట్‌లో తన పేరు లేదని స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారం చేసే వాళ్లపై వంద కోట్లకు పరువు నష్టం దావా వేస్తామని కూడా హెచ్చరించారు. ఇంకా చదవండి.

2. సచివాలయ ఉద్యోగ సంఘం నేత మందు పార్టీ

 సచివాలయం ఉద్యోగులు సంఘం నేత వెంకటరామిరెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. అనుమతి లేకుండా ఉద్యోగులకు మందుపార్టీ ఇస్తూ సమస్యలు కొనితెచ్చుకున్నారు. పార్టీ జరుగుతున్న ప్రాంతంలో తనిఖీలు చేసిన ఎక్సైజ్‌, పోలీసు అధికారులు వెంకటరామిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. సచివాలయం క్యాంటిన్ ఎన్నికల వేళ వెంకటరామిరెడ్డి చర్యలు వివాదానికి కారణమయ్యాయి. కొందరు సిబ్బందితో ఆయన మందుపార్టీ చేసుకున్నారు. కొంత మంది సచివాలయ ఉద్యోగులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇంకా చదవండి.

3. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ రాజకీయాల్లో కాక రేపిన లగచర్ల భూ వివాదంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భూసేకరణ రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం వికారాబాద్ జిల్లా లగచర్ల దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. అక్కడ పారిశ్రామిక వాడ నిర్మించాలని భావించిన ప్రభుత్వం భూసేకరణ చేపట్టింది. దీన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. భూసేకరణ విషయంపై చర్చించేందుకు రావాలని స్థానికులు పిలుపు మేరకు వెళ్లిన జిల్లా కలెక్టర్ ఇతర సిబ్బందిపై ప్రజలు దాడి చేయడంతో వివాదం మరో మలుపు తిరిగింది. ఇంకా చదవండి.

4. కొమురంభీం జిల్లాలో దారుణం

కొమురంభీం జిల్లాలో దారుణం జరిగింది. కొన్ని రోజులు భయాందోళనలకు గురి చేస్తున్న పెద్ద పులి మనుషులపై పడింది. ఇప్పటి వరకు పశువులపై దాడి చేస్తూ వస్తున్న పెద్ద పులి ఈ ఉదయం కాగజ్‌నగర్ మండలం గన్నారంలో మహిళపై అటాక్ చేసింది. పెద్దపులి దాడిలో ఆ మహిళ స్పాట్‌లోనే చనిపోయింది. కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని బెంగాల్ క్యాంప్ 6వ నెంబర్‌లో గన్నారం గ్రామానికి చెందిన మోర్లే లక్ష్మీ అనే మహిళ పై పులి దాడి చేసింది. పులి దాడిలో గాయపడిన మొర్లే లక్ష్మీ అనే మహిళ మృతి చెందింది. ఇంకా చదవండి.

5. మిర్యాలగూడ నుంచి సైబర్ నేరాలు

తెలంగాణలో నమోదు అవుతున్న సైబర్ కేసుల్లో మరో సంచలనం నమోదు అయింది. నేరగాళ్లతో చేతులు కలిపిన తెలుగు వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. అనుమానాస్పదంగా ఓ ప్రాంతంలో ఖాతాల్లోకి లక్షల్లో నగదు వచ్చి పడటాన్ని గుర్తించి విచారిస్తే అసలు గుట్టు వెలుగు చూసింది. వేర్వేరు రాష్ట్రాల్లో ఉంటూ వేలి కొనలతోనే వేల మందిని బురిడీ కొట్టించి కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. ఇలాంటి సైబర్ కేటుగాళ్లకు నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన వ్యక్తి సహాయం చేస్తున్నట్టు వెలుగులోకి వచ్చింది. ఇంకా చదవండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Assembly Botsa Chit Chat: చంద్రబాబు ఢిల్లీకి వెళ్తే.. పవన్ సీఎం కావొచ్చు - బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు
చంద్రబాబు ఢిల్లీకి వెళ్తే.. పవన్ సీఎం కావొచ్చు - బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు
Chandrababu Assembly: లడ్డూ కల్తీ ప్రణాళిక ప్రకారం చేసిన కుట్ర - అసెంబ్లీలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
లడ్డూ కల్తీ ప్రణాళిక ప్రకారం చేసిన కుట్ర - అసెంబ్లీలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Keshineni Chinni vs Kolikapudi: టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి మధ్య వివాదం ముగిసినట్లే.. అంతా క్లియర్ అయిందా!
టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి మధ్య వివాదం ముగిసినట్లే.. అంతా క్లియర్ అయిందా!
Social Media Ban for Children: 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం.. ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటన
13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం.. ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటన

వీడియోలు

Axar patel Catches vs Eng T20 World Cup 2026 | కళ్లు చెదిరే క్యాచ్ లతో దుమ్మురేపిన బాపు | ABP Desam
Jasprit Bumrah Bowling vs Eng | T20 World Cup 2026 ఫైనల్ కి భారత్ వెళ్లింది అంటే..బుమ్రా దయ | ABP Desam
Sanju Samson 89 vs England Semis | T20 World Cup 2026లో హీరోగా మారిపోయిన సంజూ శాంసన్ | ABP Desam
Ind vs Eng 2nd Semifinal Highlights | T20 World Cup 2026 సెమీస్ లో ఇంగ్లండ్ పై భారత్ విక్టరీ | ABP Desam
US Attacks Iran Warship | వైజాగ్ నుంచి వెళ్తున్న ఇరాన్ యుద్ధనౌకపై USA దాడి | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
New Governor of Telangana: కొత్త గవర్నర్ అజర్ మంత్రిపదవి కాపాడతారా?
కొత్త గవర్నర్ అజర్ మంత్రిపదవి కాపాడతారా?
Assembly Botsa Chit Chat: చంద్రబాబు ఢిల్లీకి వెళ్తే.. పవన్ సీఎం కావొచ్చు - బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు
చంద్రబాబు ఢిల్లీకి వెళ్తే.. పవన్ సీఎం కావొచ్చు - బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు
Tamil Nadu Assembly Elections 2026 : ఒక్క చాన్స్ అంటూ వేడుకోళ్లు - రుణమాఫీ తాయిలాలు - టీవీకే విజయ్ అన్నీ అస్త్రాలూ వాడేస్తున్నారా?
ఒక్క చాన్స్ అంటూ వేడుకోళ్లు - రుణమాఫీ తాయిలాలు - టీవీకే విజయ్ అన్నీ అస్త్రాలూ వాడేస్తున్నారా?
Allu Sirish Wedding : అల్లు శిరీష్ నయనికల వెడ్డింగ్ - బెస్ట్ మూమెంట్స్ విత్ ఫ్యామిలీ
అల్లు శిరీష్ నయనికల వెడ్డింగ్ - బెస్ట్ మూమెంట్స్ విత్ ఫ్యామిలీ
Chandrababu Assembly: లడ్డూ కల్తీ ప్రణాళిక ప్రకారం చేసిన కుట్ర - అసెంబ్లీలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
లడ్డూ కల్తీ ప్రణాళిక ప్రకారం చేసిన కుట్ర - అసెంబ్లీలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Tiger Rampachodavaram Agency: రంపచోడవరం మన్యం ప్రజల్ని వణికిస్తున్న పెద్దపులి.. జాడ కోసం అధికారుల ప్రయత్నాలు
రంపచోడవరం మన్యం ప్రజల్ని వణికిస్తున్న పెద్దపులి.. జాడ కోసం అధికారుల ప్రయత్నాలు
Keshineni Chinni vs Kolikapudi: టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి మధ్య వివాదం ముగిసినట్లే.. అంతా క్లియర్ అయిందా!
టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి మధ్య వివాదం ముగిసినట్లే.. అంతా క్లియర్ అయిందా!
Iconic Bridge on Krishna River: కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జికి అటవీ శాఖ అనుమతి.. 80 కి.మీ తగ్గనున్న దూరం
Iconic Bridge on Krishna River: కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జికి అటవీ శాఖ అనుమతి.. 80 కి.మీ తగ్గనున్న దూరం
Embed widget