అన్వేషించండి

Top Headlines: ఆ కేసుతో జగన్‌కు రాజకీయంగా మరిన్ని సమస్యలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM

Top News: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

Top Headlines In AP And Telangana:

1. అమెరికా కేసుతో జగన్‌కు రాజకీయంగా మరిన్ని సమస్యలు

అధికారం పోయి ఇబ్బంది పడుతున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అమెరికా నుంచి వచ్చి పడిన అదానీ కేసు సమస్యగా మారింది. ఈ విషయంలో జరుగుతున్న ప్రచారంతో ఆయన ఇబ్బంది పడుతున్నారు. విషయం బయటపడిన దాదాపు వారం రోజుల తర్వాత ప్రెస్ మీట్ పెట్టి అసలు తనకు ఆ కేసు గురించే తెలియదన్నారు. ఎఫ్‌బీఐ చార్జిషీట్‌లో తన పేరు లేదని స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారం చేసే వాళ్లపై వంద కోట్లకు పరువు నష్టం దావా వేస్తామని కూడా హెచ్చరించారు. ఇంకా చదవండి.

2. సచివాలయ ఉద్యోగ సంఘం నేత మందు పార్టీ

 సచివాలయం ఉద్యోగులు సంఘం నేత వెంకటరామిరెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. అనుమతి లేకుండా ఉద్యోగులకు మందుపార్టీ ఇస్తూ సమస్యలు కొనితెచ్చుకున్నారు. పార్టీ జరుగుతున్న ప్రాంతంలో తనిఖీలు చేసిన ఎక్సైజ్‌, పోలీసు అధికారులు వెంకటరామిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. సచివాలయం క్యాంటిన్ ఎన్నికల వేళ వెంకటరామిరెడ్డి చర్యలు వివాదానికి కారణమయ్యాయి. కొందరు సిబ్బందితో ఆయన మందుపార్టీ చేసుకున్నారు. కొంత మంది సచివాలయ ఉద్యోగులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇంకా చదవండి.

3. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ రాజకీయాల్లో కాక రేపిన లగచర్ల భూ వివాదంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భూసేకరణ రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం వికారాబాద్ జిల్లా లగచర్ల దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. అక్కడ పారిశ్రామిక వాడ నిర్మించాలని భావించిన ప్రభుత్వం భూసేకరణ చేపట్టింది. దీన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. భూసేకరణ విషయంపై చర్చించేందుకు రావాలని స్థానికులు పిలుపు మేరకు వెళ్లిన జిల్లా కలెక్టర్ ఇతర సిబ్బందిపై ప్రజలు దాడి చేయడంతో వివాదం మరో మలుపు తిరిగింది. ఇంకా చదవండి.

4. కొమురంభీం జిల్లాలో దారుణం

కొమురంభీం జిల్లాలో దారుణం జరిగింది. కొన్ని రోజులు భయాందోళనలకు గురి చేస్తున్న పెద్ద పులి మనుషులపై పడింది. ఇప్పటి వరకు పశువులపై దాడి చేస్తూ వస్తున్న పెద్ద పులి ఈ ఉదయం కాగజ్‌నగర్ మండలం గన్నారంలో మహిళపై అటాక్ చేసింది. పెద్దపులి దాడిలో ఆ మహిళ స్పాట్‌లోనే చనిపోయింది. కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని బెంగాల్ క్యాంప్ 6వ నెంబర్‌లో గన్నారం గ్రామానికి చెందిన మోర్లే లక్ష్మీ అనే మహిళ పై పులి దాడి చేసింది. పులి దాడిలో గాయపడిన మొర్లే లక్ష్మీ అనే మహిళ మృతి చెందింది. ఇంకా చదవండి.

5. మిర్యాలగూడ నుంచి సైబర్ నేరాలు

తెలంగాణలో నమోదు అవుతున్న సైబర్ కేసుల్లో మరో సంచలనం నమోదు అయింది. నేరగాళ్లతో చేతులు కలిపిన తెలుగు వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. అనుమానాస్పదంగా ఓ ప్రాంతంలో ఖాతాల్లోకి లక్షల్లో నగదు వచ్చి పడటాన్ని గుర్తించి విచారిస్తే అసలు గుట్టు వెలుగు చూసింది. వేర్వేరు రాష్ట్రాల్లో ఉంటూ వేలి కొనలతోనే వేల మందిని బురిడీ కొట్టించి కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. ఇలాంటి సైబర్ కేటుగాళ్లకు నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన వ్యక్తి సహాయం చేస్తున్నట్టు వెలుగులోకి వచ్చింది. ఇంకా చదవండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Fake Currency Printing Racket: డబ్బు సంపాదించడం కన్నా ప్రింట్ చేసుకోవడం ఈజీ అనుకున్నారు - కానీ దొరికిపోయారు - ఇప్పుడెలా?
డబ్బు సంపాదించడం కన్నా ప్రింట్ చేసుకోవడం ఈజీ అనుకున్నారు - కానీ దొరికిపోయారు - ఇప్పుడెలా?
Rushikonda Hilltop Buildings: రుషికొండ భవనాలపై ఏపీటీడీసీ కీలక నిర్ణయం.. ప్రైవేట్ భాగస్వామ్యానికి లీజ్ నోటిఫికేషన్ విడుదల!
రుషికొండ భవనాలపై ఏపీటీడీసీ కీలక నిర్ణయం.. ప్రైవేట్ భాగస్వామ్యానికి లీజ్ నోటిఫికేషన్ విడుదల!
Breaking News: సాయంత్రం 5 గంటలకు రండి, నిజాలేంటో తేల్చేద్దాం.. బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి ఛాలెంజ్
సాయంత్రం 5 గంటలకు రండి, నిజాలేంటో తేల్చేద్దాం.. బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి ఛాలెంజ్
Sai Krishna Case: సాయికృష్ణ కేసులో నేను నిర్దోషిని, నన్ను ఇరికించాలని చూస్తున్నారు - సీఐ నాగరాజు లేఖ వైరల్
సాయికృష్ణ కేసులో నేను నిర్దోషిని, నన్ను ఇరికించాలని చూస్తున్నారు - సీఐ నాగరాజు లేఖ వైరల్

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jupally Krishna Rao: ప్లేస్ ఫిక్స్, సాయంత్రం 5 గంటలకు రండి.. నిజాలేంటో తేల్చేద్దాం: బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి సవాల్
ప్లేస్ ఫిక్స్, సాయంత్రం 5 గంటలకు రండి.. నిజాలేంటో తేల్చేద్దాం: బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి సవాల్
Hyderabad Crime News: ఘట్‌కేసర్‌లో రైలు కిందపడి దంపతులు ఆత్మహత్య! లంగర్ హౌజ్ లాడ్జిలో యువతి మృతి
ఘట్‌కేసర్‌లో రైలు కిందపడి దంపతులు ఆత్మహత్య! లంగర్ హౌజ్ లాడ్జిలో యువతి మృతి
JSW Rayalaseema Steel Plant: కడప స్టీలు ప్లాంటు నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన.. దేశంలోనే తొలి గ్రీన్‌ స్టీల్‌ ప్లాంట్
కడప స్టీలు ప్లాంటు నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన.. దేశంలోనే తొలి గ్రీన్‌ స్టీల్‌ ప్లాంట్ విశేషాలు
Sai Krishna Case: సాయికృష్ణ కేసులో నేను నిర్దోషిని, నన్ను ఇరికించాలని చూస్తున్నారు - సీఐ నాగరాజు లేఖ వైరల్
Sai Krishna Case: సాయికృష్ణ కేసులో నేను నిర్దోషిని, నన్ను ఇరికించాలని చూస్తున్నారు - సీఐ నాగరాజు లేఖ వైరల్
Modi Cabinet Reshuffle: పార్లమెంట్‌కు ముందే మోదీ క్యాబినెట్ రీసెట్.. రాజ్యాంగ సవరణల వేళ అసలు వ్యూహం ఇదే!
పార్లమెంట్‌కు ముందే మోదీ క్యాబినెట్ రీసెట్.. రాజ్యాంగ సవరణల వేళ అసలు వ్యూహం ఇదే!
160 km రేంజ్‌, రూ.1.40 లక్షల రేటు - ఇదే కాదు, Revolt RVX గురించి మీకు ఇంకా తెలియాలి!
చూడ్డానికి స్టైల్‌గా ఉందని Revolt RVX కొనబోతున్నారా? ముందు ఈ 5 నిజాలు తెలుసుకోండి!
Nara Lokesh: మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునరుద్ధరణ పనులకు మంత్రి నారా లోకేష్ భూమి పూజ
మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునరుద్ధరణ పనులకు మంత్రి నారా లోకేష్ భూమి పూజ
Tata Sierra EVని ఏ ప్రాతిపదికన కొంటారు? - ఇలా సింపుల్‌గా కంపేర్‌ చేస్తే మీకో క్లారిటీ వస్తుంది!
Tata Sierra EV వర్సెస్‌ 5 ప్రత్యర్థి మోడళ్లు - ఈ టేబుల్స్‌ చూస్తే బెస్ట్ EV ఏదో ఈజీగా అర్ధమవుతుంది!
Embed widget