అన్వేషించండి

Today Top Headlines: దావోస్‌లో తెలుగు రాష్ట్రాల సీఎంల ప్రత్యేక భేటీ - ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM

Top News: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

Today Top Headlines In AP And Telangana:

1. దావోస్‌లో తెలుగు రాష్ట్రాల సీఎంల ప్రత్యేక భేటీ

దావోస్‌లో జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తమ బృందాలతో స్విట్జర్లాండ్ కు వెళ్లారు. ఈ క్రమంలో జ్యూరిచ్ విమానాశ్రయంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రాష్ట్రాలకు రావాల్సిన పెట్టుబడులపై  చర్చించారు. విదేశాల్లోనూ తెలుగు వారంతా ఒకటేనని అభివృద్ధిలో మాత్రం పోటీ పడతామని సంకేతాలిచ్చారు. ఇంకా చదవండి.

2. టీడీపీలో పెరిగిన ఆ డిమాండ్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ ను ఏపీ కి ఉప ముఖ్యమంత్రి చేయాలంటూ డిమాండ్ పెరుగుతోంది. మొదట్లో పార్టీ క్యాడర్ నుంచి మొదలైన ఈ డిమాండ్ ప్రస్తుతం పార్టీ లీడర్ల వరకు పాకిపోయింది. త్వరలోనే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉన్న నేపథ్యంలో నారా లోకేష్ కు ఉప ముఖ్యమంత్రిగా  ప్రమోషన్ ఇవ్వాలంటూ వినిపిస్తున్న డిమాండ్ల వెనకాల  పార్టీ హైకమాండ్ ఆశీస్సులు ఉన్నాయా అన్న కొత్త చర్చ ఇప్పుడు మొదలైంది. ఇంకా చదవండి.

3. కేంద్రంపై నిప్పులు చెరిగిన షర్మిల

కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) వ్యాఖ్యలకు రంగులు మార్చే ఊసరవెల్లి సైతం సిగ్గుపడుతుందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. వైసీపీ పాలన ఓ విపత్తు అని నిజంగానే అనుకుంటే.. 5 ఏళ్లలో విధ్వంసం జరుగుతుంటే ఢిల్లీలో కూర్చొని మీరు వేడుక చూశారా అని అమిత్ షాను ప్రశ్నించారు. ఆ ఐదేళ్లు కేంద్రంలో ఉన్నది మీ ప్రభుత్వమే కదా ? రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం పనులను ఆపితే ఒక్కనాడైనా కేంద్రం నుంచి అడిగారా ? రాజధాని లేని రాష్ట్రంగా ఏపీలో 5 ఏళ్లు పాలన చేస్తుంటే మీకు కనిపించలేదా ?. ఇంకా చదవండి.

4. మైనింగ్ వద్దంటూ రైతుల పోరుబాట

‘మైనింగ్ వద్దు.. గుట్ట ముద్దు’ అనే నినాదంతో నాగర్‌ కర్నూల్‌ జిల్లా బల్మూర్‌ మండలం మైలారం ప్రజలు పోరుబాట పట్టారు. ఆందోళన చేస్తున్న రైతులను పోలీసులు అరెస్ట్​ చేయడంతో గ్రామంలో ఉద్రిక్త నెలకొంది. మైలారంలోని గుట్టతో విడదీయలేని అనుబంధం ఉంది ఆ గ్రామస్థులకు. కానీ ఆ గుట్టపై ప్రభుత్వం మైనింగ్​కు అనుమతివ్వడంతో మైలారం గ్రామస్తులు ఆగ్రహానికి గురయ్యారు. కొంత కాలంగా నిరసనలు చేపడుతున్నారు. అక్కడి రైతులు నేటి నుంచి రిలే నిరాహార దీక్షలకు సిద్ధమవడంతో.. అలెర్ట్​ అయిన పోలీసులు ముందస్తుగా పలువురు రైతులు, స్థానికులను అదుపులోకి తీసుకొని పోలీస్​స్టేషన్​కు తరలించారు. ఇంకా చదవండి.

5. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం

తెలంగాణ(Telangana)లో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(SIB) మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు(Prabhakarrao), శంకర్‌రావును  రాష్ట్రానికి రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. చివరిగా నేరస్తుల అప్పగింత (Extradition)అస్త్రంను ప్రయోగించేందుకు  సిద్ధమైంది. ఇంకా చదవండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh Speech Tribal University Convocation: ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే అసలైన విద్య - ఘనంగా కేంద్రీయ గిరిజన వర్సిటీ మొదటి స్నాతకోత్సవం
ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే అసలైన విద్య - ఘనంగా కేంద్రీయ గిరిజన వర్సిటీ మొదటి స్నాతకోత్సవం
Breaking News: తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల
తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల
Pawan Kalyan Meets Devendra Fadnavis : రాష్ట్రానికి రెండు ఆడపులులను సాధించిన కొమరం పులి! మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక భేటీ
రాష్ట్రానికి రెండు ఆడపులులను సాధించిన కొమరం పులి! మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక భేటీ
Adopted Boy Sad Story: దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy : ఈ ఏడాది వర్షాధార పంటలు వేయొద్దు- రైతులకు రేవంత్ రెడ్డి సూచన- ఫామ్‌హౌస్ పశుపతిని రానీయొద్దని పిలుపు!
ఈ ఏడాది వర్షాధార పంటలు వేయొద్దు- రైతులకు రేవంత్ రెడ్డి సూచన- ఫామ్‌హౌస్ పశుపతిని రానీయొద్దని పిలుపు!
Adopted Boy Sad Story: దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
AP EAPCET 2026 Results: అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
Breaking News: తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల
తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల
Sudha Kongara: డబ్బులు ఎగ్గొట్టారు... నిర్మాతపై కోర్టుకు వెళ్లిన లేడీ డైరెక్టర్
డబ్బులు ఎగ్గొట్టారు... నిర్మాతపై కోర్టుకు వెళ్లిన లేడీ డైరెక్టర్
Gold In Land: బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో సంచలనంగా మారిన వ్యవహారం!
బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో సంచలనంగా మారిన వ్యవహారం!
Uttar Pradesh Elections Polarisation: అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
Rythu Bharosa Scheme: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
Embed widget