అన్వేషించండి

Nizamabad News: నిజామాబాద్‌ జిల్లాలో రైతుల తిరుగుబాటు, సమస్యల పరిష్కారానికి ఐదు రోజుల పాదయాత్ర

పోరుకు సిద్ధమైన పసుపు రైతులు. ఈ నెల 3 నుంచి ముత్యంపేట చెరకు ఫ్యాక్టరీ నుంచి నిజామాబాద్ కలెక్టరేట్ వరకు పాదయాత్ర. పసుపు బోర్డు, పసుపు మద్దతు ధర ముత్యంపేట చెరుకు ఫ్యాక్టరీ పునరుద్దరణే ప్రధాన డిమాండ్

నిజామాబాద్ జిల్లా పసుపు రైతులు భగ్గుమంటున్నారు. పార్టీలకు అతీతంగా పోరుబాట పట్టేందుకు రెడీ అయ్యారు. పసుపు బోర్డు సాధన, పసుపునకు మద్దతు ధర, జగిత్యాల జిల్లా ముత్యంపేట చెరకు ఫ్యాక్టరీ పునరుద్ధరణ ప్రధాన డిమాండ్లతో ఉద్యమానికి సిద్ధమయ్యారు. 

అడిగి అడిగి విసిగిపోయిన పసుపు రైతులు ఇప్పుడు ప్రత్యక్ష ఉద్యమానికి సిద్ధమయ్యారు. మూడు ప్రధాన డిమాండ్లతో ఈ నెల 3 నుంచి పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. పార్టీలతో సంబంధం లేకుండా రైతులంతా ఈ పాదయాత్రలో పాల్గొంటారు. జగిత్యాల జిల్లా ముత్యంపేట చెరకు ఫ్యాక్టరీ నుంచి నిజామాబాద్ కలెక్టరేట్ వరకు పాదయాత్ర సాగనుంది. పాదయాత్రకు సంబంధించి ఏర్పాట్లను రైతులు పూర్తి చేశారు.

ఈ ఉద్యమానికి పసుపు రైతులు నాయకత్వం వహిస్తున్నారు. కానీ రైతులకు సంబంధించిన అన్ని సమస్యలపై పోరాటం చేస్తామంటున్నారు రైతులు. ముత్యంపేట చెరకు ఫ్యాక్టరీ నుంచి నిజామాబాద్ కలెక్టరేట్ వరకు దాదాపు 70 కిలో మీటర్ల మేర ఈ పాదయాత్ర కొనసాగనుంది. పసుపు రైతులతోపాటు అందరికీ మేలు జరిగే లక్ష్యంతో ఈ పాదయాత్ర చేపట్టామని అంటున్నారు. 5 రోజుల పాటు పాదయాత్ర కొనసాగనుంది. ఈ నెల 7న నిజామబాద్ కలెక్టరేట్ వద్ద పాదయాత్ర ముగుస్తుంది.  

రేపు ముత్యంపేట నుంచి ప్రారంభమై నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి వరకు వస్తుంది. రెండో రోజు మోర్తాడ్ మీదుగా అంక్సాపూర్ వరకు కొనసాగుతుంది. మూడో రోజు అంక్సాపూర్ నుంచి పెర్కిట్ వరకు నిర్వహిస్తారు. నాలుగో రోజు ఆర్మూర్‌లో ప్రారంభించి అంకాపూర్‌లో నిలిపివేస్తారు. ఐదో రోజు నిజామాబాద్ మార్కెట్ యార్డు అక్కడి నుంచి కలెక్టరేట్ వరకు కొనసాగుతుంది. ప్రతి రోజు పాదయాత్ర జరిగే రోడ్డుకు ఇరువైపులా ఆయా గ్రామాల రైతులు పసుపు రైతులకు సంఘీభావం తెలిపుతారు.

పసుపు రైతులు పాదయాత్రలో పాల్గొనే విధంగా ఇప్పటికే రైతు ఐక్య కార్యచరణ వేదిక సమావేశాలు సదస్సులు నిర్వహిస్తూ అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. ఈ పాదయాత్ర ఏ పార్టీలకు సంబంధం లేకుండా పసుపు రైతులు మాత్రమే పాల్గొననున్నారని చెప్పారు. పాదయాత్రలో పాల్గొనే రైతులు రాజకీయ పార్టీలకు చెందిన కండువాలు వేసుకోరాదని ఐక్యవేదిక నాయకులు రైతులకు స్పష్టం చేశారు.

తెలంగాణ ప్రభుత్వం వరి వేయొద్దని ఆంక్షలు పెట్టింది కానీ దానికి ప్రత్యామ్నాయంగా ఎలాంటి విధి విధానాలు ఖరారు చేయలేదంటున్నారు రైతులు. వరి ప్రత్యామ్నాయంగా చెరకు వేస్తే సమీపంలో చెరకు ఫ్యాక్టరీలు లేవని.. దీని వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారని వాపోతున్నారు. అందుకే ముత్యంపేట చెరకు ఫ్యాక్టరీ తెరిస్తే రైతులకు మేలు జరుగుతుందని డిమాండ్ చేస్తున్నారు. పసుపు బోర్డు, మద్దతు ధర విషయంలోనూ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదన్న రైతులు, వీటన్నింటినీ సాధించుకునేందుకే పాదయాత్ర చేస్తున్నట్టు పేర్కొన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Weather in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం! ఉరుములు పిడుగులతో దద్దరిల్లిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ!
తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం! ఉరుములు పిడుగులతో దద్దరిల్లిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ!
Rythu Bharosa Funds: తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
PM Kisan Yojana: హోలీకి PM కిసాన్ యోజన 22వ విడత నిధులు వస్తాయా? తాజా అప్‌డేట్ ఏంటీ?
హోలీకి PM కిసాన్ యోజన 22వ విడత నిధులు వస్తాయా? తాజా అప్‌డేట్ ఏంటీ?
Andhra Pradesh and Telangana Weather Update: తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్! పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్! పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు!

వీడియోలు

Negative Campaign on SRH | IPL 2026 కి ముందు సన్ రైజర్స్ పై ఫేక్ పోస్టులు | ABP Desam
CSK Video on Shivam Dube | IPL 2026 కి ముందు చెన్నైలో క్రికెట్ బాల్స్ ఆందోళన | ABP Desam
Virat Kohli Home Coming RCB | IPL 2026 యుద్ధానికి తిరిగొచ్చిన మహారాజు | ABP Desam
Ishan Kishan Interim Captain SRH | ఇషాన్ వైపే ఆరెంజ్ ఆర్మీ మొగ్గు చూపింది అందుకే | ABP Desam
India Bullet Train : హైదరాబాద్‌ కేంద్రంగా.. మూడు బుల్లెట్ ట్రైన్ మార్గాలు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Ugadi: జగన్‌కు రాజపూజ్యం 1, అవమానం 7 - వైసీపీ కార్యాలయ ఉగాది వేడుకల్లో సిద్ధాంతి పంచాంగం
జగన్‌కు రాజపూజ్యం 1, అవమానం 7 - వైసీపీ కార్యాలయ ఉగాది వేడుకల్లో సిద్ధాంతి పంచాంగం
TVK Vijay trouble: కరూర్ తొక్కిసలాట పాపం అంతా విజయ్‌దేనా ? - తమిళనాట కలకలం రేపుతున్న సీబీఐ దూకుడు
కరూర్ తొక్కిసలాట పాపం అంతా విజయ్‌దేనా ? - తమిళనాట కలకలం రేపుతున్న సీబీఐ దూకుడు
North Korean elections: ఉత్తరకొరియా ఎన్నికల్లో 99.93 శాతం ఓట్లతో కిమ్ విజయం - ఆ కొద్ది మంది ఏమై ఉంటారో ఊహించగలరా?
ఉత్తరకొరియా ఎన్నికల్లో 99.93 శాతం ఓట్లతో కిమ్ విజయం - ఆ కొద్ది మంది ఏమై ఉంటారో ఊహించగలరా?
Dalal Street Market Crash 2026: దలాల్ స్ట్రీట్‌లో ఊచకోత!1,400 పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్! హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బోర్డులో 'నైతిక' కలకలం!
దలాల్ స్ట్రీట్‌లో ఊచకోత!1,400 పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్! హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బోర్డులో 'నైతిక' కలకలం!
Dhurandhar 2 OTT : ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ ధురంధర్ 2 - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ ధురంధర్ 2 - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
Anushka Shetty : అనుష్క పెళ్లి రూమర్స్ - అదే ఎందుకు హైలెట్ చేస్తున్నారంటూ టీం స్ట్రాంగ్ రియాక్షన్
అనుష్క పెళ్లి రూమర్స్ - అదే ఎందుకు హైలెట్ చేస్తున్నారంటూ టీం స్ట్రాంగ్ రియాక్షన్
YS Jagan: సీఈసీపై అభిశంసన - జగన్‌కు పెద్ద సమస్య ! మద్దతివ్వకపోతే ఓట్ల గల్లంతు,ఈవీఎంలపై ఎలా మాట్లాడగలరు?
సీఈసీపై అభిశంసన - జగన్‌కు పెద్ద సమస్య ! మద్దతివ్వకపోతే ఓట్ల గల్లంతు,ఈవీఎంలపై ఎలా మాట్లాడగలరు?
Revanth Reddy: 2029లో మళ్లీ తొక్కకపోతే చూడు! అసెంబ్లీ వేదికగా బీఆర్‌ఎస్‌కు రేవంత్ రెడ్డి సవాల్!
2029లో మళ్లీ తొక్కకపోతే చూడు! అసెంబ్లీ వేదికగా బీఆర్‌ఎస్‌కు రేవంత్ రెడ్డి సవాల్!
Embed widget