అన్వేషించండి

Nizamabad News: నిజామాబాద్‌ జిల్లాలో రైతుల తిరుగుబాటు, సమస్యల పరిష్కారానికి ఐదు రోజుల పాదయాత్ర

పోరుకు సిద్ధమైన పసుపు రైతులు. ఈ నెల 3 నుంచి ముత్యంపేట చెరకు ఫ్యాక్టరీ నుంచి నిజామాబాద్ కలెక్టరేట్ వరకు పాదయాత్ర. పసుపు బోర్డు, పసుపు మద్దతు ధర ముత్యంపేట చెరుకు ఫ్యాక్టరీ పునరుద్దరణే ప్రధాన డిమాండ్

నిజామాబాద్ జిల్లా పసుపు రైతులు భగ్గుమంటున్నారు. పార్టీలకు అతీతంగా పోరుబాట పట్టేందుకు రెడీ అయ్యారు. పసుపు బోర్డు సాధన, పసుపునకు మద్దతు ధర, జగిత్యాల జిల్లా ముత్యంపేట చెరకు ఫ్యాక్టరీ పునరుద్ధరణ ప్రధాన డిమాండ్లతో ఉద్యమానికి సిద్ధమయ్యారు. 

అడిగి అడిగి విసిగిపోయిన పసుపు రైతులు ఇప్పుడు ప్రత్యక్ష ఉద్యమానికి సిద్ధమయ్యారు. మూడు ప్రధాన డిమాండ్లతో ఈ నెల 3 నుంచి పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. పార్టీలతో సంబంధం లేకుండా రైతులంతా ఈ పాదయాత్రలో పాల్గొంటారు. జగిత్యాల జిల్లా ముత్యంపేట చెరకు ఫ్యాక్టరీ నుంచి నిజామాబాద్ కలెక్టరేట్ వరకు పాదయాత్ర సాగనుంది. పాదయాత్రకు సంబంధించి ఏర్పాట్లను రైతులు పూర్తి చేశారు.

ఈ ఉద్యమానికి పసుపు రైతులు నాయకత్వం వహిస్తున్నారు. కానీ రైతులకు సంబంధించిన అన్ని సమస్యలపై పోరాటం చేస్తామంటున్నారు రైతులు. ముత్యంపేట చెరకు ఫ్యాక్టరీ నుంచి నిజామాబాద్ కలెక్టరేట్ వరకు దాదాపు 70 కిలో మీటర్ల మేర ఈ పాదయాత్ర కొనసాగనుంది. పసుపు రైతులతోపాటు అందరికీ మేలు జరిగే లక్ష్యంతో ఈ పాదయాత్ర చేపట్టామని అంటున్నారు. 5 రోజుల పాటు పాదయాత్ర కొనసాగనుంది. ఈ నెల 7న నిజామబాద్ కలెక్టరేట్ వద్ద పాదయాత్ర ముగుస్తుంది.  

రేపు ముత్యంపేట నుంచి ప్రారంభమై నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి వరకు వస్తుంది. రెండో రోజు మోర్తాడ్ మీదుగా అంక్సాపూర్ వరకు కొనసాగుతుంది. మూడో రోజు అంక్సాపూర్ నుంచి పెర్కిట్ వరకు నిర్వహిస్తారు. నాలుగో రోజు ఆర్మూర్‌లో ప్రారంభించి అంకాపూర్‌లో నిలిపివేస్తారు. ఐదో రోజు నిజామాబాద్ మార్కెట్ యార్డు అక్కడి నుంచి కలెక్టరేట్ వరకు కొనసాగుతుంది. ప్రతి రోజు పాదయాత్ర జరిగే రోడ్డుకు ఇరువైపులా ఆయా గ్రామాల రైతులు పసుపు రైతులకు సంఘీభావం తెలిపుతారు.

పసుపు రైతులు పాదయాత్రలో పాల్గొనే విధంగా ఇప్పటికే రైతు ఐక్య కార్యచరణ వేదిక సమావేశాలు సదస్సులు నిర్వహిస్తూ అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. ఈ పాదయాత్ర ఏ పార్టీలకు సంబంధం లేకుండా పసుపు రైతులు మాత్రమే పాల్గొననున్నారని చెప్పారు. పాదయాత్రలో పాల్గొనే రైతులు రాజకీయ పార్టీలకు చెందిన కండువాలు వేసుకోరాదని ఐక్యవేదిక నాయకులు రైతులకు స్పష్టం చేశారు.

తెలంగాణ ప్రభుత్వం వరి వేయొద్దని ఆంక్షలు పెట్టింది కానీ దానికి ప్రత్యామ్నాయంగా ఎలాంటి విధి విధానాలు ఖరారు చేయలేదంటున్నారు రైతులు. వరి ప్రత్యామ్నాయంగా చెరకు వేస్తే సమీపంలో చెరకు ఫ్యాక్టరీలు లేవని.. దీని వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారని వాపోతున్నారు. అందుకే ముత్యంపేట చెరకు ఫ్యాక్టరీ తెరిస్తే రైతులకు మేలు జరుగుతుందని డిమాండ్ చేస్తున్నారు. పసుపు బోర్డు, మద్దతు ధర విషయంలోనూ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదన్న రైతులు, వీటన్నింటినీ సాధించుకునేందుకే పాదయాత్ర చేస్తున్నట్టు పేర్కొన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Warangal Viral News: లేగ దూడకు నామకరణ మహోత్సవం! అయ్యప్ప మాలధరణ స్వాముల సమక్షంలో పేరు పెట్టిన వరంగల్ జిల్లా రైతు 
లేగ దూడకు నామకరణ మహోత్సవం! అయ్యప్ప మాలధరణ స్వాముల సమక్షంలో పేరు పెట్టిన వరంగల్ జిల్లా రైతు 
Durgam Cheruvu Cable Bridge: నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
Amaravati Land Pooling: అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Warangal Viral News: లేగ దూడకు నామకరణ మహోత్సవం! అయ్యప్ప మాలధరణ స్వాముల సమక్షంలో పేరు పెట్టిన వరంగల్ జిల్లా రైతు 
లేగ దూడకు నామకరణ మహోత్సవం! అయ్యప్ప మాలధరణ స్వాముల సమక్షంలో పేరు పెట్టిన వరంగల్ జిల్లా రైతు 
Durgam Cheruvu Cable Bridge: నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
Amaravati Land Pooling: అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
Aadi Saikumar: ఆది సాయి కుమార్ ఇంట్లో డబుల్ ధమాకా - 'శంబాల' సక్సెస్ తర్వాత మరో శుభవార్త!
ఆది సాయి కుమార్ ఇంట్లో డబుల్ ధమాకా - 'శంబాల' సక్సెస్ తర్వాత మరో శుభవార్త!
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
India vs New Zealand ODI : ఇది కదా రో.కో. పవర్‌! 8 నిమిషాల్లో భారత్ న్యూజిలాండ్ మొదటి వన్డే టిక్కెట్లు సేల్‌!
ఇది కదా రో.కో. పవర్‌! 8 నిమిషాల్లో భారత్ న్యూజిలాండ్ మొదటి వన్డే టిక్కెట్లు సేల్‌!
Grok AI: 'X'కు నోటీసు పంపిన కేంద్రం! గ్రోక్ ఏఐ నుంచి అశ్లీల కంటెంట్ తొలగించాలని ఆదేశం! 72 గంటల గడువు
'X'కు నోటీసు పంపిన కేంద్రం! గ్రోక్ ఏఐ నుంచి అశ్లీల కంటెంట్ తొలగించాలని ఆదేశం! 72 గంటల గడువు
Embed widget