అన్వేషించండి

Nizamabad News: నిజామాబాద్‌ జిల్లాలో రైతుల తిరుగుబాటు, సమస్యల పరిష్కారానికి ఐదు రోజుల పాదయాత్ర

పోరుకు సిద్ధమైన పసుపు రైతులు. ఈ నెల 3 నుంచి ముత్యంపేట చెరకు ఫ్యాక్టరీ నుంచి నిజామాబాద్ కలెక్టరేట్ వరకు పాదయాత్ర. పసుపు బోర్డు, పసుపు మద్దతు ధర ముత్యంపేట చెరుకు ఫ్యాక్టరీ పునరుద్దరణే ప్రధాన డిమాండ్

నిజామాబాద్ జిల్లా పసుపు రైతులు భగ్గుమంటున్నారు. పార్టీలకు అతీతంగా పోరుబాట పట్టేందుకు రెడీ అయ్యారు. పసుపు బోర్డు సాధన, పసుపునకు మద్దతు ధర, జగిత్యాల జిల్లా ముత్యంపేట చెరకు ఫ్యాక్టరీ పునరుద్ధరణ ప్రధాన డిమాండ్లతో ఉద్యమానికి సిద్ధమయ్యారు. 

అడిగి అడిగి విసిగిపోయిన పసుపు రైతులు ఇప్పుడు ప్రత్యక్ష ఉద్యమానికి సిద్ధమయ్యారు. మూడు ప్రధాన డిమాండ్లతో ఈ నెల 3 నుంచి పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. పార్టీలతో సంబంధం లేకుండా రైతులంతా ఈ పాదయాత్రలో పాల్గొంటారు. జగిత్యాల జిల్లా ముత్యంపేట చెరకు ఫ్యాక్టరీ నుంచి నిజామాబాద్ కలెక్టరేట్ వరకు పాదయాత్ర సాగనుంది. పాదయాత్రకు సంబంధించి ఏర్పాట్లను రైతులు పూర్తి చేశారు.

ఈ ఉద్యమానికి పసుపు రైతులు నాయకత్వం వహిస్తున్నారు. కానీ రైతులకు సంబంధించిన అన్ని సమస్యలపై పోరాటం చేస్తామంటున్నారు రైతులు. ముత్యంపేట చెరకు ఫ్యాక్టరీ నుంచి నిజామాబాద్ కలెక్టరేట్ వరకు దాదాపు 70 కిలో మీటర్ల మేర ఈ పాదయాత్ర కొనసాగనుంది. పసుపు రైతులతోపాటు అందరికీ మేలు జరిగే లక్ష్యంతో ఈ పాదయాత్ర చేపట్టామని అంటున్నారు. 5 రోజుల పాటు పాదయాత్ర కొనసాగనుంది. ఈ నెల 7న నిజామబాద్ కలెక్టరేట్ వద్ద పాదయాత్ర ముగుస్తుంది.  

రేపు ముత్యంపేట నుంచి ప్రారంభమై నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి వరకు వస్తుంది. రెండో రోజు మోర్తాడ్ మీదుగా అంక్సాపూర్ వరకు కొనసాగుతుంది. మూడో రోజు అంక్సాపూర్ నుంచి పెర్కిట్ వరకు నిర్వహిస్తారు. నాలుగో రోజు ఆర్మూర్‌లో ప్రారంభించి అంకాపూర్‌లో నిలిపివేస్తారు. ఐదో రోజు నిజామాబాద్ మార్కెట్ యార్డు అక్కడి నుంచి కలెక్టరేట్ వరకు కొనసాగుతుంది. ప్రతి రోజు పాదయాత్ర జరిగే రోడ్డుకు ఇరువైపులా ఆయా గ్రామాల రైతులు పసుపు రైతులకు సంఘీభావం తెలిపుతారు.

పసుపు రైతులు పాదయాత్రలో పాల్గొనే విధంగా ఇప్పటికే రైతు ఐక్య కార్యచరణ వేదిక సమావేశాలు సదస్సులు నిర్వహిస్తూ అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. ఈ పాదయాత్ర ఏ పార్టీలకు సంబంధం లేకుండా పసుపు రైతులు మాత్రమే పాల్గొననున్నారని చెప్పారు. పాదయాత్రలో పాల్గొనే రైతులు రాజకీయ పార్టీలకు చెందిన కండువాలు వేసుకోరాదని ఐక్యవేదిక నాయకులు రైతులకు స్పష్టం చేశారు.

తెలంగాణ ప్రభుత్వం వరి వేయొద్దని ఆంక్షలు పెట్టింది కానీ దానికి ప్రత్యామ్నాయంగా ఎలాంటి విధి విధానాలు ఖరారు చేయలేదంటున్నారు రైతులు. వరి ప్రత్యామ్నాయంగా చెరకు వేస్తే సమీపంలో చెరకు ఫ్యాక్టరీలు లేవని.. దీని వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారని వాపోతున్నారు. అందుకే ముత్యంపేట చెరకు ఫ్యాక్టరీ తెరిస్తే రైతులకు మేలు జరుగుతుందని డిమాండ్ చేస్తున్నారు. పసుపు బోర్డు, మద్దతు ధర విషయంలోనూ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదన్న రైతులు, వీటన్నింటినీ సాధించుకునేందుకే పాదయాత్ర చేస్తున్నట్టు పేర్కొన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Samantha : సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
Crime Thriller OTT : నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
Embed widget