అన్వేషించండి

Weather Update: తెలుగు రాష్ట్రాలపై ఉపరితల ఆవర్తనం ప్రభావం- మూడు రోజుల పాటు వర్షాలు 

Weather Update: ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రాబోయే మూడు రోజులు వర్షాలు దంచి కొడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. బాపట్లలో పిడుగుల వర్షం పడుతుందని పవన్ పర్యటన క్యాన్సిల్ అయ్యింది.

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో మరోసారి జోరు వానలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో జరుగుతున్న మార్పులు కారణంగా తెలుగు రాష్ట్రాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అందుకే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో దాదాపు అన్ని జిల్లాలకు వర్ష సూచన ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే పలు జిల్లాల్లో మంగళవారం నుంచి వానలు కురుస్తున్నాయి. ఇదే పరిస్థితి మరో మూడు రోజులు కంటిన్యూ అవుతుందని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. 
 
ఆంధ్రప్రదేశ్‌లో ఉపరితల ఆవర్తనం ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఉత్తరాంధ్ర మీదుగానే కొనసాగుతున్నందున భారీ వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. ఆ ప్రాంతంలో భారీ వర్షాలు పడితే మిగతా ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. వాతావరణ శాఖ విడుదల చేసిన వివరాలు ప్రకారం బుధవారం అనకాపల్లిలోని అచ్యుతాపురంలో అత్యధిక వర్షపాతం నమోదు అయింది. అక్కడ ఒక్కరోజే 6.1 సెంటీమీటర్ల వర్షం పడింది. తర్వాత స్థానం తూర్పుగోదావరి జిల్లా పైడిమెట్ట ఉంది.       

గురువారం నాడు అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం పడుతుందని అధికారులు పేర్కొన్నారు. మిగతా జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చమగోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తారు వర్షాలు పడతాయని పేర్కొన్నారు.   

పవన్ బాపట్ల పర్యటన రద్దు  

వర్షాలు కారణంగా పవన్ కల్యాణ్ బాపట్ల పర్యటన రద్దు అయ్యింది. జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా బాపట్లలో పర్యటించి సూర్యలంక  రోడ్డులోని నగరవనం అటవీ పార్కులో ఏర్పాటు చేసిన స్థూపాన్ని ప్రారంభించాల్సి ఉంది. రాజమండ్రి నుంచి తెచ్చిన ప్రత్యేక మొక్కలను ఇక్కడ నాటాలని ప్లాన్ చేశారు. కానీ ఆయన ప్రయాణించే హెలికాప్టర్‌ దిగేందుకు వాతావరణం అనుకూలించకపోవడంతో అధికారులు పర్యటనకు అనుమతి ఇవ్వలేదు. అందుకే చివరి నిమిషంలో టూర్ క్యాన్సిల్ అయినట్టు ప్రకటన వెలువడింది.    

తెలంగాణలో వాతావరణం  

తెలంగాణలో కూడా దాదాపు అన్ని జిల్లాల్లో వాతావరణం మేఘావృతమై ఉంది. బుధవారం హైదరాబాద్‌సహా పలు జిల్లాల్లో జోరు వానలు కురిశాయి. పిడుగులతో కురిసిన వర్షానికి భారీ విధ్వంసం జరిగిది. ఇలాంటి పరిస్థితి 14వ తేదీ వరకు ఉంటుంది. ఇవాళ రేపు ఉత్తర తూర్పు తెలంగాణలోని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, సూర్యపేట, మహబూబాబాద్‌ జిల్లాల్లో నేడు జోరు వానలు కురుస్తాయి. దీంతో ఆ ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.         

బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పిడుగు వర్షం కురిసింది. నిర్మల్, జోగుళాంబ గద్వాల, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో దాదాపు ఎనిమిది మంది చనిపోయారు. ఇందులో రైతులు నలుగురు, వ్యవసాయ కూలీలు ముగ్గురు ఉన్నారు. మరో ఐదుగురు వ్యక్తులు పిడుగుపాటుకు గాయపడి చికిత్స పొందుతున్నారు. ఇవాళ కూడా పిడుగులతో కూడిన వర్షం పడుతుందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.   

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

KTR News: దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
Amaravati News: అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు.. ఏపీ సర్కార్ ఇకపై అన్నీ ఇక్కడే చేస్తుందా?
అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు.. ఏపీ సర్కార్ ఇకపై అన్నీ ఇక్కడే చేస్తుందా?
Sunita Williams Retires: నాసా నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సునీతా విలియమ్స్, ఆమెకు పెన్షన్ ఎంత వస్తుంది?
నాసా నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సునీతా విలియమ్స్, ఆమెకు పెన్షన్ ఎంత వస్తుంది?
AR Rahman: భగవద్గీత, ఖురాన్ చదవరు కానీ మా నాన్నను తిడతారు... తండ్రికి సపోర్టుగా ఏఆర్ రెహమాన్ పిల్లలు
భగవద్గీత, ఖురాన్ చదవరు కానీ మా నాన్నను తిడతారు... తండ్రికి సపోర్టుగా ఏఆర్ రెహమాన్ పిల్లలు

వీడియోలు

MI vs DC WPL 2026 | ముంబై ఢిల్లీ విజయం
Rohit, Virat BCCI Contracts Changes | విరాట్​, రోహిత్​కు బీసీసీఐ షాక్?
Ishan Kishan Ind vs NZ T20 | ఇషాన్ కిషన్ పై సూర్య సంచలన ప్రకటన
India vs New Zealand T20 Preview | నేడు భారత్ - న్యూజిలాండ్ మొదటి టీ20
Medaram Jatara Houseflies Mystery | మేడారం మహాజాతరలో కనిపించని ఈగలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
Amaravati News: అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు.. ఏపీ సర్కార్ ఇకపై అన్నీ ఇక్కడే చేస్తుందా?
అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు.. ఏపీ సర్కార్ ఇకపై అన్నీ ఇక్కడే చేస్తుందా?
Sunita Williams Retires: నాసా నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సునీతా విలియమ్స్, ఆమెకు పెన్షన్ ఎంత వస్తుంది?
నాసా నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సునీతా విలియమ్స్, ఆమెకు పెన్షన్ ఎంత వస్తుంది?
AR Rahman: భగవద్గీత, ఖురాన్ చదవరు కానీ మా నాన్నను తిడతారు... తండ్రికి సపోర్టుగా ఏఆర్ రెహమాన్ పిల్లలు
భగవద్గీత, ఖురాన్ చదవరు కానీ మా నాన్నను తిడతారు... తండ్రికి సపోర్టుగా ఏఆర్ రెహమాన్ పిల్లలు
BRS ప్రభుత్వంలో హరీష్ రావు ఫోన్ ట్యాప్ చేసింది ఎవరు? సొంత పార్టీలో చిచ్చురేపుతున్న సిట్ లీక్స్
BRS ప్రభుత్వంలో హరీష్ రావు ఫోన్ ట్యాప్ చేసింది ఎవరు? సొంత పార్టీలో చిచ్చురేపుతున్న సిట్ లీక్స్
Tiger Near Hyderabad: హైదరాబాద్ సమీపంలో తిరుగుతున్న పెద్దపులి.. 50 ఏళ్లలో తొలిసారి అని అటవీశాఖ హెచ్చరిక
హైదరాబాద్ సమీపంలో తిరుగుతున్న పెద్దపులి.. 50 ఏళ్లలో తొలిసారి అని అటవీశాఖ హెచ్చరిక
BJP జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ రాజకీయ భవిష్యత్తు - జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతోంది?
BJP జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ రాజకీయ భవిష్యత్తు - జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతోంది?
Most imported item in India: భారత్ అత్యధికంగా ఏం దిగుమతి చేసుకుంటుంది, ఎక్కడి నుండి అవుతుందో తెలుసా
భారత్ అత్యధికంగా ఏం దిగుమతి చేసుకుంటుంది, ఎక్కడి నుండి అవుతుందో తెలుసా
Embed widget