అన్వేషించండి

Drone Pilot Training: ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా మహిళలకు డ్రోన్ పైలట్‌ శిక్షణ- కేవలం రూ.2 లక్షలకే డ్రోన్‌లు అందజేత

Agriculture Drone Training In Andhra Pradesh:డ్రోన్ పైలట్స్‌గా డ్వాక్రా మహిళలకు శిక్షణ ఇవ్వబోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంపిక ప్రక్రియను ప్రారంభించింది. శిక్షణ పొందిన వారికి డ్రోన్‌ సప్లై చేయనుంది.

Drone Didi Yojana Scheme In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా సంఘాలకు డ్రోన్ పైలట్ శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది ప్రభుత్వం. ఈ మధ్య ఏర్పాటు చేసిన డ్రోన్ సదస్సులో హామి ఇచ్చినట్టుగా ప్రతి గ్రామంలో ఎంపిక చేసిన మహిళలను ఇందులో శిక్షణ ఇస్తారు. దీంతో వ్యవసాయ పనుల్లో కూలీల కొరతను అధిగమించడమే కాకుండా, రైతుల డబ్బులు ఆదా చేసేలా యంత్రాగాన్ని సిద్ధం చేస్తోంది. 

పెరిగిపోతున్న వ్యవసాయ ఖర్చులు

ఈ కాలంలో వ్యవసాయం అంటే చిన్న విషయం కాదు. పంట పండించేందుకు సిద్ధమైనప్పటి నుంచి ఆ పంట ఇంటికి వచ్చే వరకు కూడా ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఖర్చు, కూలీల కొరత, గిట్టుబాటు ధర ఈ మూడే నేటి తరం రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు. వీటి కారణంగానే రైతు వ్యవసాయానికి దూరం అవుతూ వస్తున్నాడు. అందుకే ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు ప్రభుత్వం సరికొత్త వ్యూహంతో ముందుకెళ్తోంది 

డ్రోన్ సాయంతో తగ్గించే ప్రయత్నం

కూలీల, ఖర్చులు తగ్గించేందుకు ప్లాన్స్ వేస్తోంది. అందులో భాగంగా ఎరువులు పిచికారీ చేయడం లాంటి పనులు చేసే కూలీలు దొరకడం కష్టం. రోజుల తరబడి చేయించాల్సి ఉంటుంది. ఇలాంటి వాటికే కనిపించకుండానే ఖర్చు ఎక్కువ అవుతుంది. అందులో వీటి వాడకం కూడా మోతాదుకు మించడమో లేకపోతే తగ్గడమో జరుగుతుంది. ఇలాంటి బెడద లేకుండా ఉండేందుకు ప్రభుత్వం డ్రోన్‌లను రంగంలోకి దించుతోంది. 

ప్రతి గ్రామానికి అగ్రికల్చర్‌ డ్రోన్స్‌

ప్రతి గ్రామంలో వ్యవసాయ పనులకు డ్రోన్స్ వినియోగించేలా ప్రయత్నాలు ప్రారంభించిది. ఈ బాధ్యతను డ్వాక్రా సంఘాలకు ఇవ్వబోతోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నమో డ్రోన్ దీదీ కార్యక్రమాన్ని పక్కగా అమలు చేయాలని భావిస్తోంది. దీని కోసం డ్వాక్రా సంఘాల్లోని మహిళలను ఎంపిక చేసి డ్రోన్ శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు  లబ్దిదారులను ఎంపిక చేయాలని డీఆర్డీఏ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

డబ్బులు, సమయం ఆదా- ఆరోగ్యం సేఫ్

ఇలా ఎంపికైన వారికి రాయితీపై డ్రోన్లు సరఫరా చేయనుంది. ఈ సీజన్ నుంచే డ్రోన్లు మంజూరు చేసే అవకాశముందని తెలుస్తోంది. దీని ద్వారా మహిళలకు జీవనోపాదితోపాటు రైతుల ఖర్చులు కూడా తగ్గుతాయని అంటున్నారు. అంతే కాకుండా మందులు పిచికారీ చేసేటప్పుడు కూలీలు అస్వస్థతకు గురయ్యే ప్రమాదం ఉంది. వాటి బారి నుంచి కూడా రక్షించుకోవచ్చు. కొన్నిసార్లు ఏపుగా పెరిగిన చేల్లోకి రైతులు, కూలీలు వెళ్లి మందులు చేయడం కష్టంతో కూడుకున్న పని. పంట కూడా నాశనం అవుతుంది. డ్రోన్లతో సులభంగా పని పూర్తి చేయవచ్చు. 

15 రోజుల శిక్షణ

ఎంపిక చేసిన మహిళలకు 15 రోజులపాటు శిక్షణ ఇస్తారు. ఒకరికి రిమోట్ పైలట్‌గా ట్రైనింగ్ ఇస్తే... ఆ కుటుంబంలోనే మరొకరికి ఫిటింగ్, మెకానికల్, మరమ్మతులపై శిక్షణ ఇస్తారు. వారిని డ్రోన్ అసిస్టెంట్ అంటారు. వాళ్లకు  ఐదు రోజులు ట్రైనింగ్ ఇస్తారు. ఇలా శిక్షణ తీసుకున్న వాళ్లకు సర్టిఫికేట్స్ కూడా ఇస్తారు. గ్రామంలోని వ్యవసాయ పనులకు ఉపయోగపడేలా వారిని తీర్చిదిద్దుతారు. 

2 లక్షలకే డ్రోన్

శిక్షణ పొందిన వాళ్లకు 10 లక్షల విలువ చేసే డ్రోన్‌ను అందిస్తారు. ఇందులో 80 శాతం రాయితీ ఇస్తారు. అంటే లబ్ధిదారులు 2 లక్షలు చెల్లిస్తే మిగతా 8 లక్షలు ప్రభుత్వం చెల్లిస్తుంది. పొలంలో మందులు, ఎరువులు పిచికారీ చేయడం, డ్రోన్లకు అమర్చే కెమెరాలతో ఫొటోలు తీయడం, చీడపీడలను గుర్తించడంపై శిక్షణ ఇస్తారు. ఆ ఫొటోలను వ్యవసాయ అధికారులకు పంపించి సూచనలు తీసుకునేలా వారికి ట్రైనింగ్ ఉంటుంది. 

Also Read: శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్, మరో 26 ప్రత్యేక రైళ్లు ఇవే

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Good news for AP farmers: ఏపీ రైతులకు ఉగాది కానుక - 13న అన్నదాత సుఖీభవ నిధులు రూ.6వేలు జమ !
ఏపీ రైతులకు ఉగాది కానుక - 13న అన్నదాత సుఖీభవ నిధులు రూ.6వేలు జమ !
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
Kavuri Sambasivarao Passes Away: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్

వీడియోలు

Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్
ICC Penalizes Arshdeep After T20 World Cup Final | అర్ష్‌దీప్ సింగ్‌పై ఐసీసీ వేటు
Shahid Afridi praises Team India | భారత జట్టుపై షాహిద్ అఫ్రిదీ ప్రశంసలు
BCCI Reward for T20 World Cup Champions | టీమిండియాపై బీసీసీఐ కాసుల వర్షం
Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Good news for AP farmers: ఏపీ రైతులకు ఉగాది కానుక - 13న అన్నదాత సుఖీభవ నిధులు రూ.6వేలు జమ !
ఏపీ రైతులకు ఉగాది కానుక - 13న అన్నదాత సుఖీభవ నిధులు రూ.6వేలు జమ !
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
Kavuri Sambasivarao Passes Away: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
Kerala Assembly Elections 2026: కేరళ కాంగ్రెస్‌లో సీఎం సెగ - వేణుగోపాల్ రాకతో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు!
కేరళ కాంగ్రెస్‌లో సీఎం సెగ - వేణుగోపాల్ రాకతో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు!
Telangana Politics: బీఆర్ఎస్‌ను మించి గ్రౌండ్ పాలిటిక్స్‌లో కవిత దూకుడు - క్యాడర్, లీడర్‌ను ఆకర్షిస్తారా?
బీఆర్ఎస్‌ను మించి గ్రౌండ్ పాలిటిక్స్‌లో కవిత దూకుడు - క్యాడర్, లీడర్‌ను ఆకర్షిస్తారా?
Rajendra Prasad : మళ్లీ నోరు జారిన రాజేంద్ర ప్రసాద్ - స్టేజ్‌పై అలా మాట్లాడతారా అంటూ...
మళ్లీ నోరు జారిన రాజేంద్ర ప్రసాద్ - స్టేజ్‌పై అలా మాట్లాడతారా అంటూ...
Andhra Pradesh alliance Politics: ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?
ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?
Embed widget