అన్వేషించండి

Drone Pilot Training: ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా మహిళలకు డ్రోన్ పైలట్‌ శిక్షణ- కేవలం రూ.2 లక్షలకే డ్రోన్‌లు అందజేత

Agriculture Drone Training In Andhra Pradesh:డ్రోన్ పైలట్స్‌గా డ్వాక్రా మహిళలకు శిక్షణ ఇవ్వబోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంపిక ప్రక్రియను ప్రారంభించింది. శిక్షణ పొందిన వారికి డ్రోన్‌ సప్లై చేయనుంది.

Drone Didi Yojana Scheme In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా సంఘాలకు డ్రోన్ పైలట్ శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది ప్రభుత్వం. ఈ మధ్య ఏర్పాటు చేసిన డ్రోన్ సదస్సులో హామి ఇచ్చినట్టుగా ప్రతి గ్రామంలో ఎంపిక చేసిన మహిళలను ఇందులో శిక్షణ ఇస్తారు. దీంతో వ్యవసాయ పనుల్లో కూలీల కొరతను అధిగమించడమే కాకుండా, రైతుల డబ్బులు ఆదా చేసేలా యంత్రాగాన్ని సిద్ధం చేస్తోంది. 

పెరిగిపోతున్న వ్యవసాయ ఖర్చులు

ఈ కాలంలో వ్యవసాయం అంటే చిన్న విషయం కాదు. పంట పండించేందుకు సిద్ధమైనప్పటి నుంచి ఆ పంట ఇంటికి వచ్చే వరకు కూడా ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఖర్చు, కూలీల కొరత, గిట్టుబాటు ధర ఈ మూడే నేటి తరం రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు. వీటి కారణంగానే రైతు వ్యవసాయానికి దూరం అవుతూ వస్తున్నాడు. అందుకే ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు ప్రభుత్వం సరికొత్త వ్యూహంతో ముందుకెళ్తోంది 

డ్రోన్ సాయంతో తగ్గించే ప్రయత్నం

కూలీల, ఖర్చులు తగ్గించేందుకు ప్లాన్స్ వేస్తోంది. అందులో భాగంగా ఎరువులు పిచికారీ చేయడం లాంటి పనులు చేసే కూలీలు దొరకడం కష్టం. రోజుల తరబడి చేయించాల్సి ఉంటుంది. ఇలాంటి వాటికే కనిపించకుండానే ఖర్చు ఎక్కువ అవుతుంది. అందులో వీటి వాడకం కూడా మోతాదుకు మించడమో లేకపోతే తగ్గడమో జరుగుతుంది. ఇలాంటి బెడద లేకుండా ఉండేందుకు ప్రభుత్వం డ్రోన్‌లను రంగంలోకి దించుతోంది. 

ప్రతి గ్రామానికి అగ్రికల్చర్‌ డ్రోన్స్‌

ప్రతి గ్రామంలో వ్యవసాయ పనులకు డ్రోన్స్ వినియోగించేలా ప్రయత్నాలు ప్రారంభించిది. ఈ బాధ్యతను డ్వాక్రా సంఘాలకు ఇవ్వబోతోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నమో డ్రోన్ దీదీ కార్యక్రమాన్ని పక్కగా అమలు చేయాలని భావిస్తోంది. దీని కోసం డ్వాక్రా సంఘాల్లోని మహిళలను ఎంపిక చేసి డ్రోన్ శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు  లబ్దిదారులను ఎంపిక చేయాలని డీఆర్డీఏ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

డబ్బులు, సమయం ఆదా- ఆరోగ్యం సేఫ్

ఇలా ఎంపికైన వారికి రాయితీపై డ్రోన్లు సరఫరా చేయనుంది. ఈ సీజన్ నుంచే డ్రోన్లు మంజూరు చేసే అవకాశముందని తెలుస్తోంది. దీని ద్వారా మహిళలకు జీవనోపాదితోపాటు రైతుల ఖర్చులు కూడా తగ్గుతాయని అంటున్నారు. అంతే కాకుండా మందులు పిచికారీ చేసేటప్పుడు కూలీలు అస్వస్థతకు గురయ్యే ప్రమాదం ఉంది. వాటి బారి నుంచి కూడా రక్షించుకోవచ్చు. కొన్నిసార్లు ఏపుగా పెరిగిన చేల్లోకి రైతులు, కూలీలు వెళ్లి మందులు చేయడం కష్టంతో కూడుకున్న పని. పంట కూడా నాశనం అవుతుంది. డ్రోన్లతో సులభంగా పని పూర్తి చేయవచ్చు. 

15 రోజుల శిక్షణ

ఎంపిక చేసిన మహిళలకు 15 రోజులపాటు శిక్షణ ఇస్తారు. ఒకరికి రిమోట్ పైలట్‌గా ట్రైనింగ్ ఇస్తే... ఆ కుటుంబంలోనే మరొకరికి ఫిటింగ్, మెకానికల్, మరమ్మతులపై శిక్షణ ఇస్తారు. వారిని డ్రోన్ అసిస్టెంట్ అంటారు. వాళ్లకు  ఐదు రోజులు ట్రైనింగ్ ఇస్తారు. ఇలా శిక్షణ తీసుకున్న వాళ్లకు సర్టిఫికేట్స్ కూడా ఇస్తారు. గ్రామంలోని వ్యవసాయ పనులకు ఉపయోగపడేలా వారిని తీర్చిదిద్దుతారు. 

2 లక్షలకే డ్రోన్

శిక్షణ పొందిన వాళ్లకు 10 లక్షల విలువ చేసే డ్రోన్‌ను అందిస్తారు. ఇందులో 80 శాతం రాయితీ ఇస్తారు. అంటే లబ్ధిదారులు 2 లక్షలు చెల్లిస్తే మిగతా 8 లక్షలు ప్రభుత్వం చెల్లిస్తుంది. పొలంలో మందులు, ఎరువులు పిచికారీ చేయడం, డ్రోన్లకు అమర్చే కెమెరాలతో ఫొటోలు తీయడం, చీడపీడలను గుర్తించడంపై శిక్షణ ఇస్తారు. ఆ ఫొటోలను వ్యవసాయ అధికారులకు పంపించి సూచనలు తీసుకునేలా వారికి ట్రైనింగ్ ఉంటుంది. 

Also Read: శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్, మరో 26 ప్రత్యేక రైళ్లు ఇవే

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం

వీడియోలు

India vs Sri Lanka 3rd T20 Highlights | మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం
Rohit Sharma Golden Duck | రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్
Virat Kohli Half Century in Vijay Hazare Trophy | 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన కింగ్
Rinku Singh Century in Vijay Hazare Trophy | విజయ్ హజారే ట్రోఫీలీ రింకూ సింగ్ సెంచరీ
Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
YSRCP Politics: ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
Year Ender 2025: ఈ ఏడాది NPS లో 5 భారీ మార్పులు.. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే రూల్స్ ఇవే
ఈ ఏడాది NPS లో 5 భారీ మార్పులు.. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే రూల్స్ ఇవే
Hyderabad Crime Report: హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
Kerala Gen Z political Leader: జెన్‌జీ తరం మున్సిపల్ చైర్మన్ దియా బిను - వారసురాలు కాదు.. నాయకత్వంతో ఎదిగిన లీడర్ -మనకూ స్ఫూర్తే !
జెన్‌జీ తరం మున్సిపల్ చైర్మన్ దియా బిను - వారసురాలు కాదు.. నాయకత్వంతో ఎదిగిన లీడర్ -మనకూ స్ఫూర్తే !
Embed widget