Vaibhav Suryavanshi Debuting vs Ireland | సూర్యవంశీ ఎంట్రీపై మాజీల షాకింగ్ కామెంట్స్
రెండు టీ20ల సిరీస్ కోసం ఐర్లాండ్ వెళ్లిన టీమ్ ఇండియా శుక్రవారం తొలి మ్యాచ్ ఆడనుంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో 2027 వరల్డ్ కప్ రోడ్ మ్యాప్కు ఇక్కడే పునాది పడబోతోంది. అయితే, ఈ సిరీస్లో అందరి కళ్లూ వైభవ్ సూర్యవంశీ పైనే ఉన్నాయి. తొలి మ్యాచ్తోనే అతను అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేస్తాడని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.
కానీ, మాజీ క్రికెటర్స్ మాత్రం సూర్యవంశీ ఫ్యాన్స్కు గట్టి షాక్ ఇస్తున్నాడు. ప్లేయింగ్ ఎలెవన్లో సూర్యవంశీకి చోటు దక్కదు అని చెప్పుకొస్తున్నారు. అసలు ఇప్పుడే అతనికి టీమిండియాలో స్థానం అవసరం లేదని చెప్పడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆల్రెడీ వరల్డ్ కప్ గెలిచిన టీమ్లో ఉన్న అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ లాంటి హిట్టర్లు ఓపెనర్లుగా అందుబాటులో ఉన్నారు. అలాగే వన్ డౌన్లో ఇషాన్ కిషన్ లాంటి సీనియర్ ఉన్నాడు. ఇలాంటి టాప్ ఆర్డర్ ఉన్నప్పుడు.. ప్రెజర్ను తట్టుకోవడానికి 15 ఏళ్ల సూర్యవంశీకి ఇప్పుడే తొందరపడి ఛాన్స్ ఇవ్వడం కరెక్ట్ కాదని వాళ్ల వాదన.
కానీ ఫ్యాన్స్ మాత్రం.. ఐర్లాండ్ లాంటి చిన్న టీమ్పై కాకపోతే ఇంకెప్పుడు అరంగేట్రం చేయిస్తారు? అంటూ ఫైర్ అవుతున్నారు. మరి ఈ యంగ్ సెన్సేషన్కు క్యాప్ ఇస్తారా ? లేక బెంచ్ కే పరిమితం చేస్తాడా? అన్నది చూడాలి.
ట్రెండింగ్ వార్తలు






















