T20 World Cup India vs Pakistan | ఫిబ్రవరి 15న భారత్ - పాక్ మ్యాచ్
టీ20 ప్రపంచకప్ 2026లో ( T20 World Cup 2026 ) భాగంగా భారత్-పాకిస్థాన్ ( India vs Pakistan ) మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే టీమ్ ఇండియాతో తాము మ్యాచ్ ఆడమని చెప్పుకొచ్చింది పాకిస్తాన్. ఈ టోర్నమెంట్ లో మాత్రమే కాదు.. ఫ్యూచర్ లో జరిగే మ్యాచ్లను కూడా భహిష్కరిస్తునట్టు ప్రకటించారు. అయితే ఈ విషయంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ( Pakistan Cricket Board ) తన నిర్ణయాన్ని మార్చుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.
బంగ్లాదేశ్కు మద్దతుగా ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన మ్యాచ్ను బాయ్కాట్ చేస్తామని పాక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం వల్ల టోర్నీకి ఆర్థిక నష్టం కలుగుతుంది. దీనికి బాధ్యత వహిస్తూ పాక్ నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని ఐసీసీ స్పష్టం చేసింది.
ఈ వివాదంపై ఆతిథ్య శ్రీలంక క్రికెట్ బోర్డు ( Sri Lanka Cricket Board ) కూడా స్పందించింది. భారత్-పాక్ మ్యాచ్ రద్దయితే టికెట్ల అమ్మకాలు, పర్యాటక ఆదాయంపై తీవ్ర ప్రభావం పడుతుందని పీసీబీకి లేఖ రాసింది. ఇలా అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరగడంతో, పాక్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకునే ఆలోచనలో ఉన్నారట.























