Ind W vs NL W World Cup | నెదర్లాండ్స్పై భారత్ ఘన విజయం
ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్లో మన టీమిండియా విజయ పరంపర కొనసాగుతోంది. వరుసగా రెండో విజయం సాధించి గ్రూప్-ఏ పాయింట్ల టేబుల్ లో నంబర్ వన్ పొజిషన్కు దూసుకెళ్లింది. లీడ్స్ వేదికగా నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో భారత్ 95 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.
టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 5 వికెట్లకు 209 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ స్మృతి మంధానా స్టన్నింగ్ ఇన్నింగ్స్తో అదరగొట్టింది. కేవలం 47 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్తో 74 రన్స్ చేసి టాప్ స్కోరర్గా నిలిచింది. వరుస హాఫ్ సెంచరీలతో రాణించిన స్మృతికే 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కింది.
210 పరుగుల భారీ టార్గెట్తో బరిలోకి దిగిన నెదర్లాండ్స్.. మన బౌలర్ల ధాటికి తట్టుకోలేక 17.3 ఓవర్లలో కేవలం 114 పరుగులకే ఆలౌట్ అయింది. ఒక దశలో 50 రన్స్కు 1 వికెట్తో ఉన్న నెదర్లాండ్స్ను మన స్పిన్నర్లు కోలుకోలేని దెబ్బ కొట్టారు. ముఖ్యంగా తెలుగు స్టార్ శ్రీ చరణి తన స్పిన్ తో 4 వికెట్లు తీసి సత్తా చాటింది. గత మ్యాచ్లో మూడు, ఈ మ్యాచ్లో నాలుగు వికెట్లతో ఆమె ఇండియా తరఫున లీడింగ్ వికెట్ టేకర్ గా నిలిచింది.
ట్రెండింగ్ వార్తలు






















