SRH Spends 10 Crores for Uppal Stadium | 10 కోట్లతో ఉప్పల్ స్టేడియం రినోవేషన్ | ABP Desam
సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ తమ అభిమానుల కోసం ఒక అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. హోమ్ గ్రౌండ్ అయిన ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియాన్ని ఏకంగా 10 కోట్ల సొంత నిధులతో రినోవేట్ చేసారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)తో సంబంధం లేకుండా, సన్ గ్రూప్ ఈ భారీ రినోవేషన్ పనులను చేపట్టింది. స్టేడియంలోని 42 టాయిలెట్లు, కార్పొరేట్ బాక్సులు మరియు లాంజ్లను పూర్తిగా ఆధునీకరించారు. వీటితో పాటు అభిమానుల కోసం కొత్తగా రెండు ఎలివేటర్లు, ఎయిర్ కండిషనర్లను ఏర్పాటు చేశారు. గతంలో ఉప్పల్ స్టేడియంలో సీట్లు, సౌకర్యాల విషయంలో ఫ్యాన్స్ పడ్డ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.
గత ఏడాది కూడా సన్రైజర్స్ యాజమాన్యం రూ. 5 కోట్లు ఖర్చు చేసింది. అయితే అప్పటి HCA ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు ఆ క్రెడిట్ అంతా తనకే దక్కుతుందని చెప్పడంతో వివాదం రేగింది. ఈ గొడవ టికెట్ల కుంభకోణం వరకు వెళ్లి, చివరకు సీఎం రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించడంతో జగన్ మోహన్ రావు తన పదవిని కోల్పోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాంటి గందరగోళం లేకుండా సన్ గ్రూప్ నేరుగా రంగంలోకి దిగింది.
ట్రెండింగ్ వార్తలు





















