Vizag RK Beach: విశాఖ ఆర్కే బీచ్ లో ముందుకొచ్చిన సముద్రం... పర్యాటకులకు నో ఎంట్రీ
విశాఖ నగరంలోని ఆర్కే బీచ్లో సముద్రం కొంత మేర ముందుకొచ్చింది. దీంతో బీచ్ లోని చిల్డ్రన్ పార్కు 10 అడుగుల మేర కోతకు గురై దెబ్బతింది. ఈ పార్కులో ప్రహరీ గోడ కూడా కూలిపోయింది. పార్కులోని బల్లలు ధ్వంసమయ్యాయి. సముద్రం ముందుకు రావడంతో బీచ్ లో పలుచోట్ల భూమి కుంగిపోయి పగుళ్లు వచ్చాయి. దీంతో ఆర్కే బీచ్లో పర్యాటకులను అనుమతించడంలేదు. సందర్శకులు అక్కడికి రాకుండా అధికారులు బారికేడ్లు ఏర్పాటుచేశారు. నోవాటెల్ హోటల్ దగ్గర బారికేడ్లు పెట్టారు. జవాద్ తుపాను ప్రభావంతోనే సముద్రం ముందుకొచ్చి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు ఆర్కే బీచ్ నుంచి దుర్గాలమ్మ గుడి వరకు సుమారు 200 మీటర్ల మేర సముద్రం ముందుకొచ్చి భూమి కోతకు గురైంది.





















