(Source: ECI/ABP News)
Payyavula Kesav on Botsa | జగన్ విషయంలో బొత్స అన్నమాటలనే కదా మేం చెప్పాం
వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ప్రెస్మీట్లో కన్నీళ్లు పెట్టుకోవడాన్ని తాము హర్షించకపోయినా.. ఆయనెందుకు బాధపడ్డారో తెలీడం లేదని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. బొత్స ఆనాడు మంత్రి హోదాలో చెప్పిన దాన్నే అచ్చెన్నాయుడు గుర్తు చేశారన్నారు. తాము ఎలాంటి కొత్త ఆరోపణలు చేయలేదని కేవలం చరిత్రలో జరిగిన విషయాన్నే గుర్తు చేస్తున్నామన్నారు. ఆయన అన్న మాటలనే ప్రస్తావిస్తే.. బొత్స ఎందుకు బాధపడుతున్నారని ప్రశ్నించారు. బహుశా జగన్ గురించే ఆయన భయపుడుతున్నట్లుందని పయ్యావుల అనుమానం వ్యక్తం చేశారు. పరిటాల హత్య కేసు నుంచి అక్రమాస్తుల కేసుల వరకూ జగన్తో ఉన్న వాళ్లకి ఏం జరిగిందో అందరికీ తెలిసిందేనన్నారు. కుటుబంలో వాళ్లని కూడా బయటకు పంపించారని.. గుండెపోటు నుంచి గొడ్డలిపోటు వరకూ.. బాబాయి నుంచి తల్లీ చెల్లివరకూ జగన్ నైజం ఏంటన్నది రాష్ట్ర ప్రజలకు కనబడుతోందన్నారు. బహుశా జగన్ నైజం గురించి బాగా తెలియడం వల్లే బొత్స... జగన్ గురించే భయపడి ఉంటారని అన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















