అన్వేషించండి

Alluri District: చెట్టు నుంచి ఉబికి వచ్చిన నీళ్లు - ఆశ్చర్యపోయిన అటవీ అధికారులు, ఎక్కడంటే?

Andhrapradesh News: చెట్ల నుంచి పాలు కారడం చూశాం. అయితే, విచిత్రంగా చెట్టు నుంచి నీళ్లు ఉబికి వచ్చాయి. దీన్ని చూసిన అధికారులు ఒక్కసారిగా అవాక్కయారు. ఇంతకూ ఆ జలధార వృక్షం ఎక్కడుందో తెలుసా.!

Water Came From The Tree in Alluri District: సాధారణంగా భూగర్భ జలాలు ఎక్కువ ఉంటే బోర్ల నుంచి నీరు ఉబికి రావడం మనం చూసుంటాం. కొన్ని ప్రాంతాల్లో చెట్ల నుంచి పాలు వచ్చిన ఘటనలూ విన్నాం. అయితే, అక్కడ చెట్ల నుంచి నీరు ఉబికి వస్తోంది. దీన్ని చూసిన అటవీ అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఓ చెట్టు మొదలు భాగం నరుకుతుండగా ఒక్కసారిగా నీళ్లు ఉబికి వచ్చాయి. అల్లూరి జిల్లాలో కనిపించిన ఈ అరుదైన దృశ్యం నెట్టింట వైరల్ అవుతోంది. అల్లూరి జిల్లా రంపచోడవరం పాపికొండల నేషనల్ ఫారెస్ట్ పరిధిలోని కింటుకూరు ప్రాంతంలో ఎక్కువగా నల్ల మద్ది చెట్లు ఉన్నాయి. ఆ వృక్షాల నుంచి నీళ్లు చుక్కలుగా రావడాన్ని గుర్తించిన అధికారులు.. వెంటనే బెరడును నరికారు. దీంతో వెంటనే మొదలు భాగం నుంచి నీళ్లు ఉబికి వచ్చాయి. దీన్ని చూసిన వారు ఆశ్చర్యపోయి.. ఆ నీటిని తాగారు. దీన్ని జలధార వృక్షంగా పేర్కొంటున్నారు. ఆ చెట్టు నుంచి దాదాపు 20 లీటర్ల నీరు వస్తుందని చెబుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. అయితే, కింటుకూరు అటవీ ప్రాంతంలో వేలాదిగా నల్లమద్ది చెట్లు ఉన్నాయి. కాగా, కొన్నింటికే నీటిని నిల్వ చేసుకునే వ్యవస్థ ఉంటుందని.. దాదాపు 20 లీటర్ల స్వచ్ఛమైన నీరు నిల్వ చేసుకుంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. వందల్లో ఒక చెట్టుకు మాత్రమే ఇలా నీటిని నిల్వ చేసుకునే వ్యవస్థ ఉంటుందని చెబుతున్నారు.

Also Read: Chandrababu: 'సీమలో ట్రెండ్ మారింది వైసీపీ బెండు తీస్తారు' - ఐదేళ్లలో కడప జిల్లాకు ఏం చేశావంటూ సీఎం జగన్ కు చంద్రబాబు సవాల్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pushpa 2 Ticket Rates: పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
Metro Rail In Vizag and Vijayawada: విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
Tiruvannamalai Landslide: ఇళ్లపై కొండచరియలు విరిగిపడి ఐదుగురు దుర్మరణం, తిరువణ్ణామలైలో విషాదం
ఇళ్లపై కొండచరియలు విరిగిపడి ఐదుగురు దుర్మరణం, తిరువణ్ణామలైలో విషాదం
Sundar Pichai: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కి ముంబై కోర్టు నోటీసులు, అసలేం జరిగింది!
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కి ముంబై కోర్టు నోటీసులు, అసలేం జరిగింది!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

#UITheMovie Warner  Decode | Upendra సినిమా తీస్తే మరి అంత సింపుల్ గా ఉండదుగా.! | ABP DesamUnstoppable With NBK Season 4 Ep 6 Promo |  Sreeleela తో నవీన్ పోలిశెట్టి ఫుల్ కామెడీ | ABP Desamజగన్ కేసుల్లో పురోగతి! సుప్రీం  కీలక ఆదేశాలుఆసిఫాబాద్ జిల్లాలో పులుల దాడిపై ఏబీపీ గ్రౌండ్ రిపోర్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pushpa 2 Ticket Rates: పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
Metro Rail In Vizag and Vijayawada: విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
Tiruvannamalai Landslide: ఇళ్లపై కొండచరియలు విరిగిపడి ఐదుగురు దుర్మరణం, తిరువణ్ణామలైలో విషాదం
ఇళ్లపై కొండచరియలు విరిగిపడి ఐదుగురు దుర్మరణం, తిరువణ్ణామలైలో విషాదం
Sundar Pichai: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కి ముంబై కోర్టు నోటీసులు, అసలేం జరిగింది!
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కి ముంబై కోర్టు నోటీసులు, అసలేం జరిగింది!
Andhra Pradesh News: పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
Most Expensive Android Smartphones: ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఆండ్రాయిడ్ ఫోన్లు - టాప్ మోడల్ రేటెంతో తెలుసా?
ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఆండ్రాయిడ్ ఫోన్లు - టాప్ మోడల్ రేటెంతో తెలుసా?
AP Liquor Fine: మద్యం ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తే భారీ జరిమానా, లైసెన్స్ రద్దు! ఉత్తర్వులు జారీ
మద్యం ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తే భారీ జరిమానా, లైసెన్స్ రద్దు! ఉత్తర్వులు జారీ
Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - చిరు వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ, నలుగురు మృతి
రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - చిరు వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ, నలుగురు మృతి
Embed widget