అన్వేషించండి

Viral News: సెల్ ఫోన్ చూస్తూ ఆర్టీసీ బస్సు డ్రైవింగ్ - భయాందోళనకు గురైన ప్రయాణికులు, ఆలస్యంగా వెలుగులోకి!

Andhra News: ప్రకాశం జిల్లా పొదిలి ఆర్టీసీ డ్రైవర్ తీరు విమర్శలకు దారితీసింది. భారీ వర్షంలో సెల్ ఫోన్ చూస్తూ బస్సు డ్రైవింగ్ చేయడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.

RTC Bus Driver Driving While Using Mobile Phone In Podili: 'సెల్ ఫోన్ చూస్తూ వాహనం నడపరాదు.' అని ట్రాఫిక్ సిబ్బంది, పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా కొంతమంది తీరు మారడం లేదు. ఏకంగా ఆర్టీసీ బస్సు డ్రైవర్ సైతం నిబంధనలు మీరడం విమర్శలకు తావిస్తోంది. భారీ వర్షంలో రోడ్డు సరిగ్గా కనిపించకపోయినా తదేకంగా సెల్ ఫోన్ చూస్తూ ర్యాష్ డ్రైవింగ్ చేయడంతో బస్సులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ప్రకాశం జిల్లాలో ఆగస్ట్ 31న జరిగిన ఈ ఘటనకు సంబంధించి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా (Prakasam District) పొదిలి డిపో ఆర్టీసీ డ్రైవర్ ఎండి మస్తాన్ సెల్ ఫోన్ చూస్తూ బస్సు ర్యాష్ డ్రైవింగ్ చేశాడు. 

భారీ వర్షం పడుతున్నా రోడ్డు సరిగ్గా కనిపించకపోయినా అలానే సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేశాడని ప్రయాణికులు ఆరోపించారు. ఫోన్ చూస్తూ బస్సు నడపొద్దని కోరినా డ్రైవర్ పట్టించుకోలేదని మండిపడ్డారు. దీంతో అతని చేష్టలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. మరోవైపు, దీనిపై ఆధారాలతో సహా అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. ఈ తరహా డ్రైవింగ్‌తో ప్రమాదాలు జరుగుతున్న దృష్ట్యా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Also Read: Cyber Crime: సైబర్ నేరాలకు సాఫ్ట్ వేర్ అస్త్రంతో చెక్ - మళ్లీ నేరాలకు పాల్పడకుండా పటిష్ట చర్యలు

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget