అన్వేషించండి

Jharkhand: వీడియో - హెలికాప్టర్‌పై నుంచి పడిపోయిన బాధితుడు, జార్ఖండ్ రోప్‌వే రెస్క్యూలో అపశృతి

ఆదివారం సాయంత్రం దియోఘర్‌ జిల్లా త్రికూట్ పర్వతాల వద్ద ఉన్న రోప్‌వేలోని కేబుల్ కార్లు ఒకదాన్ని మరొకటి ఢీకొన్న సంగతి తెలిసిందే. ఇక్కడ మరో అపశృతి చోటుచేసుకుంది.

ఝార్ఖండ్ రోప్‌వేలో ప్రమాద స్థలంలో మరో దుర్ఘటన చోటుచేసుకుంది.  భారత వైమానిక దళం(IAF)కు చెందిన రెస్క్యూ హెలికాప్టర్ నుంచి జారిపడి ఓ వ్యక్తి చనిపోయాడు. 

ఆదివారం సాయంత్రం దియోఘర్‌ జిల్లా త్రికూట్ పర్వతాల వద్ద ఉన్న రోప్‌వేలోని కేబుల్ కార్లు ఒకదాన్ని మరొకటి ఢీకొన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు చనిపోయారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. సుమారు 42 మంది ఈ ప్రమాదంలో చిక్కుకున్నారు. వీరిని కాపాడేందుకు భారత సైన్యం, వాయుసేన, ఐటీబీపీ, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. 

రోప్‌వే కార్ కేబిన్లలో చిక్కుకున్న బాధితులను రక్షించేందుకు రెండు ఎమ్ఐ-17 హెలికాప్టర్లను ఉపయోగిస్తున్నారు. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లోని బుర్ద్వాన్‌కు చెందిన ఓ వ్యక్తిని భారత వైమానిక దళం హెలికాప్టర్‌లోకి లాగేందుకు ప్రయత్నించింది. ఆ క్షణంలో ఏమైందో ఏమో.. హెలికాప్టర్ వరకు చేరుకున్న తర్వాత అతడు తాడుకు వేలాడుతూ కనిపించాడు. హెలికాప్టర్‌లో ఉన్న జవాన్లు అతడిని పైకి లాగేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపించింది. కొన్ని సెకన్ల తర్వాత ఆ వ్యక్తి హెలికాప్టర్ పై నుంచి లోయలో పడిపోయాడు. 

అతడు హెలికాప్టర్‌లోకి చేరుకొనే సమయంలో ఛాపర్ బ్లేడ్‌ల నుంచి వేగం వీస్తున్న గాలిని ఎదుర్కోడానికి ఇబ్బందిపడినట్లు కనిపించింది. సరిగ్గా హెలికాప్టర్‌లోకి వెళ్తున్నాడు అని భావించే సమయానికి అతడు అకస్మాత్తుగా అంత ఎత్తు నుంచి కిందకు పడిపోయాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాపం, ప్రాణాలతో బయటపడతాడని భావిస్తే.. ఊహించని విధంగా ప్రాణాలు కోల్పోయాడని నెటిజనులు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. 

సోమవారం సాయంత్రం వరకు సుమారు 25 మందిని రక్షించారు. ఇంకా 23 మందిని కాపాడాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఆదివారం శ్రీరామనవమి పురస్కరించుకుని అధిక సంఖ్యలో పర్యటకులు ఆ ప్రాంతానికి వెళ్లారు. ఆ దగ్గర్లోనే బైధ్యనాథ్ ఆలయం కూడా ఉంది. అయితే రోప్‌వేలో ఆకస్మాత్తుగా ఎదురుగా వస్తున్న కేబుల్​ కారు మరో కారును ఢీకొట్టింది. దీంతో రోప్​వేలో వెళ్తున్న మిగతా కార్లు పరస్పరం ఢీకొన్నాయి. సాంకేతిక లోపం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు.

Also Read: జాగ్రత్త, అంగస్తంభన కోసం ఇలా చేస్తే కళ్లు పోతాయ్! తాజా అధ్యయనం వెల్లడి

ఈ ఘటన జరిగిన సమయంలో రోప్​వేకు సంబంధించిన 19 కేబుల్ కార్లలో 70 మంది పర్యటకులు చిక్కుకుపోయారు. ఇందులో కొంతమందిని  అధికారులు కాపాడారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. చిక్కుకున్న వారిని  వీలైనంత త్వరగా కాపాడాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.

వీడియో: 

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan On Panchadarla Land Issue: పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
Tirumala Anjaneya Swamy Idol Stolen Case: తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
Telangana Schools Bandh On Friday: తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
Bigg Boss 10: బిగ్‌బాస్ 10 కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
బిగ్‌బాస్ కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan On Panchadarla Land Issue: పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
Tirumala Anjaneya Swamy Idol Stolen Case: తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
Telangana Schools Bandh On Friday: తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
Bigg Boss 10: బిగ్‌బాస్ 10 కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
బిగ్‌బాస్ కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
Mee Bhoomi Blockchain Project:ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌!
ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌! "మీ భూమి–బ్లాక్‌ చెయిన్" ప్రాజెక్టు ప్రయోజనమేంటి?
Sonam Wangchuk Letter:సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ! నిరాహార దీక్ విరమణకు షరతులు!
సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ రాశారు! నిరాహార దీక్ విరమణకు షరతులు విధించారు!
Adilabad Latest News:
"ఆదిలాబాద్‌ సీసీఐ కర్మాగార పునరుద్ధరణకు రూ.250 కోట్లు కేటాయించలేరా?" రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ!
Rahul Gandhi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
Embed widget