అన్వేషించండి

కుట్ర చేసి YSRను హత్య చేశారు! నన్నూ చంపాలని చూస్తున్నారు - షర్మిల సంచలనం, కేసీఆర్‌కు ఛాలెంజ్

తన తండ్రి వైఎస్ఆర్ ను కుట్ర చేసి చంపారని వైఎస్ షర్మిల అన్నారు. తనను కూడా అలాగే కుట్ర చేసి చంపాలని చూస్తున్నారని అన్నారు.

YS Sharmila Comments: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపకురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఊహించని రీతిలో ఆమె ఈ తరహా వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. తన తండ్రి వైఎస్ఆర్ ను కుట్ర చేసి చంపారని వైఎస్ షర్మిల అన్నారు. తనను కూడా అలాగే కుట్ర చేసి చంపాలని చూస్తున్నారని అన్నారు. ఆ సందర్భంగా ప్రెస్ మీట్‌లో సంకెళ్లు చూపిస్తూ ఆ సంకెళ్లు తనను ఏమీ చేయలేవని అన్నారు. తనకు బేడీలు అంటే భయం లేదని, చేతనైతే తనను అరెస్టు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు సవాలు విసిరారు. తాను బతికి ఉన్నంత కాలం ప్రజల నుంచి తనను వేరు చేయడం ఎవరి తరమూ కాదని అన్నారు. కేసీఆర్ అవినీతి గురించి మాట్లాడడం ఆపడం, తన గొంత ఆపడం ఎవరి తరమూ కాదని అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలం జిల్లాలగడ్డ తండాలో వైఎస్ షర్మిల మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కావాలంటే మీ పనోళ్లకు (పోలీసులను ఉద్దేశించి) చెప్పి తనను అరెస్టు చేయించుకోవచ్చని షర్మిల షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘‘ఈ రోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ 2 వేల కిలో మీటర్లు పాదయాత్ర చేస్తోంది. రోడ్లు మీదనే బతుకుతూ ఉంది. ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసి, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతిని బయటపెడితే నా పైనే కేసులు పెడతారా?’’ అంటూ వైఎస్ షర్మిల ప్రశ్నించారు.

" నాకు బేడీలంటే భయం లేదు. మీకు దమ్ముంటే, చేతనైతే నన్ను అరెస్టు చెయ్యండి. గుర్తు పెట్టుకో కేసీఆర్.. నా పేరు వైఎస్ షర్మిల. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డను. పులి బిడ్డను. ఈ బేడీలు నన్ను ఆపుతాయా? రాజశేఖర్ రెడ్డిని కుట్ర చేసి చంపారు. నన్ను కూడా చంపగలరు. కానీ, నేను బతికున్నంత కాలం ప్రజల నుంచి నన్ను వేరు చేయడం ఎవరి తరమూ కాదు. నా గొంతు నొక్కు నొక్కడం నీ తరం కాదు. నీ పోలీసులు అయిన నీ పనోళ్లను పంపండి. నన్ను అరెస్టు చేయమనండి. నేను ఇక్కడే ఉంటా.. పాదయాత్రలోనే జనం మధ్యలోనే ఉంటా. జనం కోసం పోరాడుతున్నా. ఎవరిని పంపుతావో పంపు.. దమ్ముంటే నన్ను అరెస్టు చెయ్యండి. "
-

పాదయాత్ర ఆపేందుకు ఎమ్మెల్యేలు కుట్ర చేస్తున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు. మంత్రి నిరంజన్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యల గురించి మాట్లాడుతూ.. ఆయనది నోరా? మోరినా? అని మండిపడ్డారు. మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడిన మాటలకు తాను మాటలతో ఆపానని, చేతల వరకు వెళ్ళలేదంటూ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు.

వివాదం ఇదీ.. 
2021లో నాగర్‌కర్నూల్‌లో మంత్రి నిరంజన్ రెడ్డి ప్రసంగిస్తూ.. షర్మిల మంగళవారం దీక్షలను.. మంగళవారం మరదలు అంటూ కామెంట్ చేశారు. గతంలో దీనిపై స్పందించిన షర్మిల.. చందమామను చూసి కుక్కలు మొరగడం సహజం. కుక్క బుద్ధి ఎక్కడికి పోతుంది? సంస్కారం లేని వాళ్లు మంత్రులుగా ఉన్నారని వ్యాఖ్యానించారు. తీవ్ర విమర్శలు రావడంతో మంత్రి నిరంజన్ రెడ్డి తన వ్యాఖ్యలపై అప్పట్లోనే వెనక్కితగ్గుతూ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.

గత సెప్టెంబరు 10న వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థాన పాదయాత్ర ద్వారా వనపర్తి నియోజకవర్గంలో అడుగుపెట్టారు. ఆ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డిపై మరోసారి విరుచుకుపడ్డారు. నిరుద్యోగుల కోసం తాను ప్రతి మంగళవారం నాడు నిరాహార దీక్షలు చేస్తుంటే.. నిరంజన్  మంగళవారం మరదలు అని కామెంట్ చేశాడని గుర్తుచేశారు. నిరుద్యోగులకు నోటిఫికేషన్లు వదిలి, వారికి ఉద్యోగావకాశాలు కల్పించాలని వైఎస్సార్ టీపీ పోరాడుతోందన్నారు. కానీ మంత్రి అధికార మదంతో మాట్లాడుతున్నారని, ఎవర్రా మరదలు.. సిగ్గుండాలి కదా అంటూ తీవ్రమైన పదజాలంతో వ్యాఖ్యలు చేశారు. మరోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే మెట్టు దెబ్బలు తింటారు జాగ్రత్త అని హెచ్చరించారు. పరాయి స్త్రీలో తల్లిని, చెల్లిని చూడలేని సంస్కారహీనుడు అంటూ మంత్రిపై మండిపడ్డారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Prisoners in Telangana: 213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
Kasthuri Shankar: ‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prisoners in Telangana: 213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
Kasthuri Shankar: ‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Revanth Reddy: చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
KCR News: కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
Modi Speech: రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
Embed widget