అన్వేషించండి

Telangana Power : తెలంగాణలో కరెంట్ కోతలు తప్పవా ? ప్రభుత్వం ఏం చేయబోతోంది ?

కేంద్రం తీసుకొచ్చిన కొత్త నిబంధనతో తెలంగాణలో కరెంట్ కోతలు విధించే అవకాశం కనిపిస్తోంది. సీఎం కేసీఆర్ ఈ అంశంపై సమీక్ష నిర్వహించారు.


Telangana Power : "తెలంగాణలో కరెంట్ పోదు..బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కరెంట్ రాదు" అని కేసీఆర్ తరచూ విమర్శలు చేస్తూంటారు.  ఈ విమర్శలకు కౌంటరో లేకపోతే నిజంగానే విధానపరమైన నిర్ణయం తీసుకున్నారో కానీ  తెలంగాణ ప్రభుత్వం కరెంట్ ఎక్సేంజీల నుంచి కరెంట్ కొనకుండా నిషేధం విధించింది.  దేశ వ్యాప్తంగా విద్యుత్ క్రయ, విక్రయాలు జరిగే ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజీ (IEX) నుంచి లావాదేవీలు జరుపకుండా రాష్ట్రాలపై కేంద్రం నిషేధం విధించింది. తెలంగాణ, ఏపీలతో పాటు 13 రాష్ట్రాలకు చెందిన 29 విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు ఈ నిషేధం వర్తిస్తుందని ప్రకటించింది. ఇప్పటి వరకూ కొన్న వాటికి చెల్లింపులు చేయాల్సి ఉండటంతో  అవన్నీ కట్టిన తర్వాతే కరెంట్ కొనాలని తేల్చి చెప్పింది. దీంతో  తెలంగాణ సర్కార్‌లో ఒక్క సారిగా అలర్ట్ అయింది. విద్యుత్ ఎక్సేంజీల్లో కరెంట్ కొనకపోతే ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో అంచనాలు ప్రారంభించింది. 

విద్యుత్ రంగంపై సీఎం కేసీఆర్ సమీక్ష ! 

నోటీస్ ఇవ్వకుండా పవర్ పర్చేస్ జరపకుండా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం కరెక్టు కాదని.. బకాయిలు చెల్లింపు చేసినప్పటికీ ఇలా చేయడం దారుణమని తెలంగాణ ప్రభుత్వం అంటోంది.  రూ. 1, 360 కోట్లు కట్టేశామని విద్యుత్ అధికారులు చెబుతున్నారు.  కేంద్ర ప్రభుత్వం నోటీస్ తో 20 మిలియన్ యూనిట్స్ ఇవాళ డ్రా చేయలేకుండా పోయామని అధికారులు సమీక్షలో సీఎంకు తెలిపారు.  ప్రజలకు, వినియోగదారులకు సాధ్యమైనంత వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఎక్కడైనా విద్యుత్ సరఫరాలో అంతరాయం వస్తే తమకు సహకరించాలని రైతులు, ప్రజలకు విద్యుత్ సంస్థల సీఎండీ ప్రభాకర్ రావు విజ్ఞప్తి చేశారు. 

పూర్తి స్థాయిలో జల విద్యుత్ ఉత్పత్తి !

రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్ సరఫరా  చేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని విద్యుత్ అధికారులు చెబుతున్నారు.  రాష్ట్రంలో వర్షాలు బాగా పడడంతో జల విద్యుత్ ను పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేస్తున్నట్లు, థర్మల్, హైడల్, సోలార్ పవర్ ఉత్పత్తి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఇవాళ 12214 మెగా వాట్ల విద్యుత్ డిమాండ్ వచ్చినా ఎక్కడ కూడా సరఫరాకు అంతరాయం రాకుండా చేస్తున్నామన్నారు.  ఉదయం, సాయంత్రం ఎక్కువగా  రైతులు పంపు సెట్లు ఆన్ చేస్తారని.. ఆ సమయంలో కొంత ఎక్కువ డిమాండ్ వస్తుందని .. ఆ సమయంలో కరెంట్ అందుబాటులో ఉండేలా చూస్తున్నామన్నారు.  త్వరలోనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని.. . అప్పటి వరకు రైతన్నలు సహకరించాలని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. 

అత్యవసరంగా న్యాయపోరాటం !

కేంద్రం ఆదేశాలపై తెలంగాణ సర్కార్ న్యాయపోరాటం చేయాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే ఈ అంశంపై స్టే ఉందని తెలంగాణ చెబుతోంది. విద్యుత్ డిమాండ్ పెరిగినప్పుడల్లా తెలంగాణ సర్కార్ ఎక్కువ కరెంట్ ఎక్సేంజీల నుంచి కొనుగోలు చేసి సర్దుబాటు చేస్తోంది. ఇప్పుడు కొనుగోలు చేసే అవకాశం లేకపోవడం కొరత ఏర్పడటం ఖాయంగా కనిపిస్తోంది. 
 

 

టాప్ హెడ్ లైన్స్

Cheyutha Pensions: తెలంగాణలో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం.. అప్లికేషన్ ఫారం కోసం క్లిక్ చేయండి
తెలంగాణలో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం.. అప్లికేషన్ ఫారం కోసం క్లిక్ చేయండి
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Embed widget