అన్వేషించండి

Sajjanar Encounter Enquiry : సజ్జనార్ బదిలీకి.. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణకు సంబంధం ఉందా..!?

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు నియమించిన కమిటీ విచారణకు రావడం.. సజ్జనార్‌ను బదిలీ చేయడం ఒకే సారి జరిగాయి. రెండింటికి సంబంధం ఉందన్న అభిప్రాయం అధికారవర్గాల్లో, రాజకీయవర్గాల్లో ఏర్పడుతోంది.


సైబరాబాద్ పోలీస్ కమిషన్ వీసీ సజ్జనార్‌ను హుటాహుటిన ఎందుకు బదిలీ చేశారు..?  ఉదయం ఉత్తర్వులిచ్చి మధ్యాహ్నం కల్లా ఎందుకు రిలీవ్ చేశారు..? అంత హడావుడిగా ఎందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది..?. ఈ అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. ఏదో బలమైన కారణం ఉండి ఉంటుందని లేకపోతే ఉరుము లేని పిడుగులా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. ఇప్పుడిప్పుడే ఈ అంశానికి సంబంధించి కొంత సమాచారం వెలుగులోకి వస్తోంది. ఏ ఘటన అయితే సజ్జనార్‌కు ప్రశంసలు తెచ్చి పెట్టిందో అదే ఘటన ఆయన  బదిలీకి కారణం అన్న ప్రచారం జరుగుతోంది. అదే దిశ నిందితుల ఎన్ కౌంటర్. 

"దిశ" అనే యువతిని అత్యాచారం చేసి హత్య చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు చటాన్ పల్లి వద్ద ఎన్‌కౌంటర్ అయ్యారు. ఈ ఘటనపై అప్పట్లో మీడియాలో జరిగిన ప్రచారం మేరకు పోలీసులకు ప్రశంసలు లభించాయి. సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్‌కు అందరూ శల్యూట్ చేశారు. కానీ ఉద్దేశపూర్వక ఎన్‌కౌంటర్ నేరం. అయితే పోలీసులు నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేశారని అందుకే ఎన్‌కౌంటర్ చేశామని ప్రకటించారు. ఇందులోని నిజానిజాలను తేల్చాలని సుప్రీంకోర్టు .. మాజీ న్యాయమూర్తి జస్టిస్  సిర్పూర్కర్ నేతృత్వంలో త్రిసభ్య కమిషన్‌ను నియమించింది. కరోనా కారణంగా సిర్పూర్కర్ కమిషన్ విచారణ ఆలస్యమయింది. ఆ కమిషన్ ఇప్పుడు హైదరాబాద్‌లో విచారణ చేపడుతోంది.

మూడు రోజులుగా హైదరాబాద్‌లోనే ఉండి ఎన్‌కౌంటర్‌కు సంబంధం ఉన్న వారిని ప్రశ్నిస్తోంది. ముందుగా దిశ కేసును కేసును దర్యాప్తు చేసిన సిట్‌ ఇన్‌ఛార్జి సురేందర్‌రెడ్డిని వివిధ అంశాలపై ప్రశ్నించింది. ఎన్‌కౌంటర్‌ జరిగిన తీరు? ఎంత మంది పోలీసులు పాల్గొన్నారు? ఎదురుకాల్పులకు ముందు హెచ్చరికలు జారీ చేశారా? మొత్తం ఎన్ని రౌండ్లు కాల్పులు జరిపారు? తదితర విషయాలు ఆరా తీశారు.  అయితే కొన్ని సమాధానాలకు కమిషన్ సభ్యులు సంతృప్తి చెందలేదన్న ప్రచారం జరుగుతోంది. కమిషన్ హోంశాఖ కార్యదర్శి నుంచి కూడా నివేదికను తీసుకుంది. క్రాస్ ఎగ్జామిన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన సాక్ష్యధారాలతో పాటు అందుకు దారితీసిన కారణాలను వెల్లడించాల్సిందిగా కమిషన్ హోంశాఖ కార్యదర్శిని గట్టిగా ప్రశ్నించినట్లుగా అధికారవర్గాల్లో ప్రచార ంజరుగుతోంది.  పోలీసు కస్టడీలో ఉన్న యువకులు ఎన్‌కౌంటర్‌లో ఎలా చనిపోతారన్న అంశంపై హోంశాఖ కార్యదర్శి స్పష్టమైన సమాచారం చెప్పలేకపోయారని చెబుతున్నారు. 

మరోవైపు ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన నలుగురు యువకుల కుటుంబ సభ్యులు, వారికి చదువు చెప్పిన టీచర్లు.. ఇతరుల నుంచి వివరాలను సేకరించనుంది. శుక్రవారం నుంచి వారితో కమిషన్ మాట్లాడుతుంది.  దిశపై జరిగిన అత్యాచారం, హత్య సంఘటనల్లో వారే నిందితులనడానికి అవసరమైన సాక్ష్యాలను కూడా కమిషన్ పరిశీలించనుంది. ఈ పరిస్థితుల్లో సజ్జనార్‌ను ఆర్టీసీ ఎండీగా బదిలీ చేశారు. అందుకే దిశ ఎన్ కౌంటర్ ఘటన విచరాణకు... సజ్జనార్ బదిలీకి సంబంధం ఉందన్న అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Petrol mess: పెట్రోల్ కొరతే లేదు - 2 నెలలకు సరిపడా నిల్వలు -ఆందోళనే వద్దంటున్న ప్రభుత్వం
పెట్రోల్ కొరతే లేదు - 2 నెలలకు సరిపడా నిల్వలు -ఆందోళనే వద్దంటున్న ప్రభుత్వం
Jeevan Reddy Quits Congress: కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గుడ్‌బై.. రాజీనామా లేఖలో తీవ్ర ఆరోపణలు
కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గుడ్‌బై.. రాజీనామా లేఖలో తీవ్ర ఆరోపణలు
Srinu Vaitla: మోసపోయిన శ్రీను వైట్ల... ఏడు కోట్ల భూ కుంభకోణం - పోలీస్ స్టేషన్‌కు చేరిన కేసు, అసలు ఏమైందంటే?
మోసపోయిన శ్రీను వైట్ల... ఏడు కోట్ల భూ కుంభకోణం - పోలీస్ స్టేషన్‌కు చేరిన కేసు, అసలు ఏమైందంటే?
Vijayawada Terror Links Case: విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు

వీడియోలు

Women Reservations 2029 | లోక్ సభ, అసెంబ్లీలో 50 శాతం స్థానాల పెంపు | ABP Desam
RCB KSCA Tributes Stampede Victims | విషాధ ఘటనను జ్ఞాపకంగా మార్చిన ఆర్సీబీ | ABP Desam
Petro Effect on PSL 2026 | పాపం పాకిస్తాన్ సూపర్ లీగ్ కాస్తా పెట్రోల్ షార్టేజ్ లీగ్ అయ్యిందే | ABP Desam
BCCI IPL 2026 New Rules | ఐపీఎల్ లో స్ట్రిక్ట్ రూల్స్...బీసీసీఐ సంచలన నిర్ణయం | ABP Desam
Jasprit Bumrah Injured IPL 2026 | ప్రాక్టీస్ మ్యాచ్ లకు హాజరుకాని జస్సీ భాయ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
New Corona: ఉన్నవి సరిపోనట్లుగా మళ్లీ కరోనా కొత్త రకం వచ్చేస్తోందట - వ్యాక్సిన్ కూడా పని చేయదని తేల్చిన శాస్త్రవేత్తలు
ఉన్నవి సరిపోనట్లుగా మళ్లీ కరోనా కొత్త రకం వచ్చేస్తోందట - వ్యాక్సిన్ కూడా పని చేయదని తేల్చిన శాస్త్రవేత్తలు
AP Assembly special meeting: 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం - అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ తీర్మానం !
28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం - అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ తీర్మానం !
Vijayawada Terror Links Case: విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
Eluru MP Putta Mahesh Yadav: నేను ఏ తప్పు చేయలేదు.. ఆ డ్రగ్స్ రిపోర్టులే సాక్ష్యం - TDP అధిష్టానానికి ఎంపీ పుట్టా మహేష్ నివేదిక
నేను ఏ తప్పు చేయలేదు.. ఆ డ్రగ్స్ రిపోర్టులే సాక్ష్యం - TDP అధిష్టానానికి ఎంపీ పుట్టా మహేష్ నివేదిక
Kichcha Sudeep : కన్నడ స్టార్‌కు గుడి కట్టిన అభిమాని - ఆ రోజుల్లో స్పెషల్ పూజలు... టెంపుల్ చూశారా!
కన్నడ స్టార్‌కు గుడి కట్టిన అభిమాని - ఆ రోజుల్లో స్పెషల్ పూజలు... టెంపుల్ చూశారా!
Shane Warne: షేన్ వార్న్ ఒక్క నిర్ణయంతో కుటుంబం చేతికి రూ.460 కోట్లు.. లెజెండ్ డిసిషన్ ఇదీ
షేన్ వార్న్ ఒక్క నిర్ణయంతో కుటుంబం చేతికి రూ.460 కోట్లు.. లెజెండ్ డిసిషన్ ఇదీ
PM Modi Trump Phone Call: పశ్చిమాసియా యుద్ధంపై ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్.. ఇరు దేశాల ఉమ్మడి యాక్షన్ ప్లాన్ ఏంటీ?
పశ్చిమాసియా యుద్ధంపై ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్.. ఇరు దేశాల ఉమ్మడి యాక్షన్ ప్లాన్ ఏంటీ?
Harish Rana Biopic: హరీష్ రాణా బయోపిక్... ఇండియాలో ఫస్ట్ పాసివ్‌ యుథనేసియా మరణంపై సినిమా
హరీష్ రాణా బయోపిక్... ఇండియాలో ఫస్ట్ పాసివ్‌ యుథనేసియా మరణంపై సినిమా
Embed widget