By: ABP Desam | Updated at : 16 Aug 2023 08:32 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం
వరంగల్ జిల్లాలో ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఆటోను ఎదురు నుంచి లారీ ఢీకొట్టింది. వరంగల్ నుంచి తొర్రూరు వైపు ఆటో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఆటోలో ఉన్న నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలు అయ్యారు. లారీ డ్రైవర్ తాగేసి డ్రైవింగ్ చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.
వర్ధన్నపేట మండలం ఇల్లంద దగ్గర ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మరో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉండడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ ఫూటుగా మద్యం సేవించి, రాంగ్ రూట్లో వచ్చాడని అందుకే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ప్రమాదం ధాటికి ఆటో నుజ్జునుజ్జు అయిపోయింది. మృతదేహాలన్నీ ఆటోలోనే చిక్కుకుపోగా, స్థానికులు బయటకు తీసే ప్రయత్నం చేశారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
Breaking News Live Telugu Updates: హైకోర్టులో లంచ్మోషన్ పిటిషన్లు వేసిన లోకేష్- ఫైబర్ గ్రిడ్, స్కిల్డెవలప్మెంట్ కేసుల్లో బెయిల్కు ప్రయత్నాలు
TS DEECET: డీఎడ్ కౌన్సెలింగ్లో తీవ్ర జాప్యం, ఆందోళనలో అభ్యర్థులు
వరంగల్ ‘నిట్’ నియామకాల్లో నిబంధనలకు తిలోదకాలు, ఆర్టీఐ వివరాలతో బయటపడ్డ అవకతవకలు
పెండింగ్ సీట్లకు అభ్యర్థులను ఫిక్స్ చేసిన కేసీఆర్, త్వరలోనే ప్రకటన
Ganesh Immersion 2023: ఘనంగా ముగిసిన గణేష్ నవరాత్రి ఉత్సవాలు - గంగమ్మ ఒడికి చేరిన లక్షల విగ్రహాలు
Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్ - దానం ఇలా కూడా చేయొచ్చు
Bigg Boss Gala Event: బిగ్ బాస్ గాలా ఈవెంట్, ఫుల్ ఎంటర్ టైన్మెంట్ ఇచ్చిన ఇంటి సభ్యులు- చివర్లో ట్విస్ట్ ఇచ్చిన అమర్
Cyber Crime: గణేష్ ఉత్సవాల లక్కీ డ్రాలో ఐఫోన్ 15-నమ్మితే అకౌంట్ ఖాళీ అయినట్టే
Rs 2000 Notes: సెప్టెంబర్ 30 తర్వాత ఏం జరుగుతుంది, రూ.2000 నోట్లు చెల్లుతాయా, చెత్తబుట్టలోకి వెళ్తాయా?
/body>