సింగిరెడ్డి మీన్ రెడ్డి దమ్మాయిగూడ నివాసిగా పోలీసులు గుర్తించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో అతనికి బ్రీత్ అనలైజర్లో 120 రీడింగ్ వచ్చినట్లు కుషాయిగూడ ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. అయితే, పోలీసులు వ్యవహరించిన తీరుపై మనస్తాపం చెంది అతను ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడని ప్రచారం జరుగుతోంది.
పోలీసులు మీన్ రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన వ్యక్తి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుటే ఆత్మహత్య చేసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.























